వ్యర్థాలకు కొత్త అర్థం | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాలకు కొత్త అర్థం

Published Mon, Feb 24 2025 12:45 AM | Last Updated on Mon, Feb 24 2025 12:45 AM

-

భువనేశ్వర్‌:

పూరీ శ్రీ జగన్నాథ దేవాలయం స్వామి సేవాదుల్లో నిత్యం వినియోగించే వ్యర్థాల పునర్వినియోగం కోసం సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ వ్యాప్తంగా సేకరించే చెత్తతో దేవస్థానం వ్యర్థాల్ని కలపకుండా దేవస్థానం ఆధ్వర్యంలో వ్యర్థాల పునర్వినియోగ ఉత్పత్తులు చేయాలని శ్రీ జగన్నాథ ఆలయం అధికార వర్గం నిర్ణయించింది. శ్రీ మందిరం నుంచి అందుబాటులోకి వచ్చే హరిత వ్యర్థాలను త్వరలో సేంద్రీయ కంపోస్ట్‌, బయోగ్యాస్‌ ఉత్పత్తికి ఉపయోగించనున్నారు. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్జేటీఏ) పూరీ శివార్లలోని మాలతిపట్‌పూర్‌లో వ్యర్థాలను ఉత్పత్తి చేయడానికి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ మరియు ఓబీసీసీ మద్దతుతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. సాధారణ రోజులో శ్రీ మందిరం నుంచి దాదాపు 3 టన్నుల వ్యర్థం అందుబాటులో ఉంటుంది. దీన్ని పట్టణంలో పోగయ్యే సాధారణ చెత్తతో కలపకూడదనే సంకల్పంతో దేవస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సేంద్రీయ కంపోస్టు, బయో గ్యాసు ఉత్పత్తి చేయాలని నడుం బిగించింది. స్వామి సేవలో నిత్యం వినియోగించే పువ్వులు, పత్రం వంటి హరిత వ్యర్థాల్ని పునర్వినియోగ ఉత్పత్తులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి చేసే సేంద్రీయ కంపోస్టుని స్వామి సేవ కోసం అవసరమైన పువ్వులు, తులసి తోటల్లో ఉపయోగించనున్నట్లు ఆలయ ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్‌ పాఽఢి తెలిపారు. మిగులు ఉత్పత్తితో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసేందుకు యోచిస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీ మందిరంలో పువ్వులు, ’తులసి’, ఆనంద బజార్‌, మహాప్రసాద అవశేషాలు వంటి దాదాపు మూడు టన్నుల హరిత వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో సహా పోటు నుంచి వ్యర్థాలు దాదాపు 15 క్వింటాళ్లు, ఆనంద బజార్‌లో 5 క్వింటాళ్ల మహాప్రసాద అవశేషాలు, ఆకు వ్యర్థాలు రోజుకు 8 క్వింటాళ్లు ఉత్పత్తి అవుతాయి. ’తులసి’, పూల వ్యర్థాలు 1 క్వింటాల్‌, ఇతర సేంద్రీయ వ్యర్థాలు కూడా 1 క్వింటాల్‌ హరిత వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. కార్తీక పూర్ణి మ వంటి ప్రత్యేక సందర్భాలలో అదనంగా వ్యర్థాలు మరో 4 టన్నుల వరకు పెరుగుతాయి.

వ్యర్థాలను దేవాలయంలో వేరు చేసి క్రమపద్ధతిలో సేకరించి మాలతీపట్టపూర్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ ప్రాంగణంలో రసాయన రహిత కంపోస్ట్‌, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి వాటిని శుద్ధి చేస్తారని సీఏఓ తెలిపారు. ఈ కంపోస్ట్‌ను నీలాచల ఉద్యానం, కోయిలి వైకుంఠం, ఆలయ ప్రాకారం నలు వైపులా పెరిగిన మొక్కలను సారవంతం చేయడానికి సేంద్రీయ ఎరువు ఉపయోగిస్తారు. మిగులు ఉత్పత్తి జరిగితే ప్లాంట్‌ను నడపడానికి బయోగ్యాస్‌ ఉపయోగిస్తారు. మేము దానిని డిస్కమ్‌లకు విక్రయించాలని ప్లాన్‌ చేస్తున్నాము‘ అని ఆయన అన్నారు.

పూరీ జగన్నాథ దేవాలయం వ్యర్థాలతో సేంద్రీయ కంపోస్ట్‌, బయోగ్యాస్‌ తయారీ

ఈ ఏడాది అక్షయ తృతీయ నుంచి

ఆరంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement