
విలేకర్లతో మాట్లాడుతున్న జేసీ హరీందర ప్రసాద్, ఇన్చార్జ్ ఆర్డీవో బాపిరెడ్డి
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీందర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులో ఇన్చార్జ్ ఆర్డీవో బాపిరెడ్డితో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని.. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు.
చదవండి: 12న కావలికి సీఎం వైఎస్ జగన్
స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులున్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment