Candidates
-
లోకేష్, చంద్రబాబుపై గ్రూప్ 2 స్టూడెంట్ ఫైర్
-
గ్రూప్ 2 అభ్యర్థులపై పోలీసుల జులం
-
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని.. నాలుగు నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్కరు కూడా నామినేషన్ను ఉపసంహరించుకోలేదన్నారు. ఈ నెల 27న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎన్నిక నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేషన్లు(corporations ), మున్సిపాలిటీల(municipalities) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం బెదిరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకుని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు కలిసి వినతి పత్రం అందజేశారు. బెదిరించి లాక్కోవడం దుర్మార్గంమాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్సార్సీపీ తరఫున శేఖర్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆయన ఆస్తులను ధ్వంసం చేశారని, భవనాలను కూల్చేశారని మండిపడ్డారు. పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆయన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మేయర్ శిరీష వెళితే ఆమెనూ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా రాజీనామా చేసి వస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చంద్రబాబు చెబుతున్నారని.. కార్పొరేటర్లకు ఆ నిబంధన వర్తించదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. విప్ను ఉల్లంఘిస్తే డిస్క్వాలిఫై అవుతారని హెచ్చరించారు.నిజాయితీగా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ను కోరామని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నాడని, పవన్కళ్యాణ్ ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం సమంజçÜం కాదన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేని చోట ఎందుకు పోటీకి దిగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా వైఎస్సార్సీపీకే బలం ఉందని చెప్పారు. టీడీపీ గెలిచే అవకాశమే లేదని తెలిసినా.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అడ్డదారుల్లో గెలవడం కోసం ఇంత దారుణంగా ప్రయత్నించడం ఎక్కడా చూడలేదన్నారు. పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
నాడు అర్హులు.. నేడు అనర్హులట!
అనంతపురం : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ నాటికి వారు వయసు రీత్యా అర్హులే. కానీ.. కోర్టు కేసు, ఎన్నికల కారణంగా గతంలో దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం« అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఐదు నెలలపాటు కాలయాపన చేసింది. ఇప్పుడు వయసు మీరిపోయిందంటూ అనేకమందిని ఇళ్లకు పంపేస్తోంది.వారు అర్హులైనప్పటికీ, వారి తప్పేమీ లేకపోయినప్పటికీ నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేమిటని సెలక్షన్ అధికారులను అడిగితే.. తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుకు విన్నవించుకోవాలని సూచిస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ, 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తమ సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) బ్రేక్పడింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.అనంతరం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదునెలల పాటు ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండునెలల క్రితం ప్రకటించింది. అప్పట్నుంచి కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన పలువురు అభ్యర్థులను వయసు మీరిందంటూ అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.అన్యాయమైన నిర్ణయందేహదారుఢ్య పరీక్షలు జనవరి 17న నిర్వహిస్తున్నట్లు హాల్టికెట్ ఇచ్చారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి వెళ్లాక.. ‘మీకు వయసు అయిపోయింది. అర్హతలేద’ని చెప్పారు. నోటిఫికేషన్ జారీ సమయానికి వయసును పరిగణనలోకి తీసుకోవాలిగానీ అందుకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. ఈ పరీక్షలకు నెలన్నర నుంచి సిద్ధమయ్యాను. తీరా ఇప్పుడు అర్హతలేదనడంతో కానిస్టేబుల్ కల చెదిరిపోతోంది. నాలాగ ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 100 మంది వరకు అన్యాయానికి గురయ్యారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మా విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. – ఎన్. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అభ్యర్థి, అనంతపురం -
Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అందరికంటే ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీకాలం ఈ మార్చితో పూర్తి కానుంది. ఈ క్రమంలో.. ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ముసాయిదాను సిద్ధం చేసింది. మరోవైపు.. రెండుసార్లు అవకాశం కల్పించినా ఓటర్ నమోదుకు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో.. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. -
కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ కేలండర్ ప్రకటించింది. పారదర్శకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ప్రతి నెలా ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలుంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి..’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో ఏఈ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు. కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. వారి ఆశలు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం, మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 9న రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ప్రకటన దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల 9న తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని ప్రకటించనున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇందుకోసం అదనంగా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. 2030 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్రి్టసిటీ ఆథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని, ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగో ఆవిష్కరణసింగరేణి సంస్థ రూపొందించిన ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగోను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై కోల్ బెల్ట్ యువతకు అవగాహన కల్పించేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదిర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ పాల్గొన్నారు. -
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడే పర్వేష్సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు పర్వేష్సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు. -
‘కరెంటు’లో కూటమి కాసుల వేట
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో కాసులు దండుకొనే ప్రక్రియలో కూటమి నేతలు మరో అంకాన్ని మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బలవంతంగా రాజీనామా చేయించిన డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇప్పటికే డైరెక్టర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఖరారై పోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూలు మొక్కుబడిగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (డిస్కం)ల డైరెక్టర్ల పోస్టులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, ఓ సాంకేతిక నిపుణుడు (మాజీ డైరెక్టర్) ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొత్తం ముడుపుల కోసమేకూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలో గత ప్రభుత్వంలో నియమితులైన 10 మంది డైరెక్టర్ల చేత జూలై 3న బలవంతంగా రాజీనామా చేయించారు. వీరితో పాటు గత నబంబర్లో పదవీకాలం పూర్తయిన ఐదుగురితో కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్ల పోస్టులపై కన్నేసిన కూటమి పెద్దలు.. తమకు ముడుపులిచ్చే వారిని నియమించేందుకు నిబంధనలను మార్చేసుకున్నారు. గత్యంతరం లేక వారికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వారితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా అర్హులేనంటూ నిబంధనలు సవరించేశారు.పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఓ మహిళా అధికారిని హెచ్ఆర్ డైరెక్టర్గా కూర్చోబెట్టేందుకు ఆమె మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు మార్చారు. జాయింట్ సెక్రటరీ కేటగిరీకి అర్హత ఇచ్చి, చీఫ్ ఇంజినీర్ కేటగిరీని తీసేశారు. మిగతా పోస్టులకు మాత్రం చీఫ్ ఇంజనీర్ అర్హులేనంటూ ఆదేశాలిచ్చారు. తర్వాత కూటమి పెద్దలు కొందరు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘చినబాబు’ ఓ జాబితాను ఖరారు చేశారని, అందులో ఉన్నవారికే ఈ పోస్టులు కట్టబెడతారని సమాచారం.ఆరంభమే గందరగోళంఏపీ ట్రాన్స్కోలో ఫైనాన్స్, టెక్నికల్, ఏపీ జెన్కోలో థర్మల్, ఫైనాన్స్, హెచ్ఆర్, హైడల్, కోల్, ఏపీఈపీడీసీఎల్లో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, ఏపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో ప్రాజెక్ట్స్, టెక్నికల్, ఫైనాన్స్ పోస్టులకు 189 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 167 మందికి రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేశారు. అభ్యర్థులు ఉదయమే సచివాలయానికి చేరుకోగా.. ఇక్కడ కాదు.. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధకు వెళ్లాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ రెండింటికీ మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అంత దూరం ట్రాఫిక్ను దాటుకుని విద్యుత్ సౌధను చేరుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వాళ్లు ఆలస్యంగా చేరుకున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు వర్చ్యువల్గా హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చారని వారిని అనర్హులను చేసి, మెచ్చిన వారికి పోస్టులు ఇవ్వడం కోసమే ఇలా దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను సోమవారం రాత్రికి పూర్తి చేశారు. మంగళవారం జెన్కో, ట్రాన్స్కో, బుధవారం సీపీడీసీఎల్లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.డబ్బులు వసూలు చేస్తే ఫోన్ చేసి చెప్పండిడైరెక్టర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఇంధన శాఖ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ విభాగం మొబైల్ నంబర్ 9490154719కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరింది. -
అభ్యర్థుల ఎంపిక ఆచితూచి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తరఫున బరిలో దిగే అభ్య ర్థుల ఖరారు తర్వాతే కార్యరంగంలోకి దిగాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ (రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్)లో రెండింటిని గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పట్టుదలగా ఉన్నారు. కరీంనగర్–ఆదిలాబాద్ –నిజామాబాద్–మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు (ఒక్కో సీటు), వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉత్తర తెలంగాణలో కమలనాథులు సత్తా చాటిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని పట్టభద్రులు, టీచర్లలోనూ బీజేపీకి ఆదరణ ఉందని రుజువు చేయాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఖరారు విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన పట్టును నిరూపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ముందుకు కదలాలని కాషాయదళం భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పో టీ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..ఆ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ లో ఎలాంటి మార్పులొచ్చే అవకాశాలుంటాయనే దానిపైనా దృష్టి సారించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పోటీకి బీఆర్ఎస్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మూడింటిలో రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ముఖ్యనేతలున్నారు. అన్ని పార్టీల కంటే ముందే అని అనుకున్నా...అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ప్రచారం ముమ్మరం చేయాలని తొలుత బీజేపీ నాయకత్వం భావించింది. అయితే ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేందుకు పార్టీపరంగా ప్రాథమిక కసరత్తు జరిగినా ప్రస్తుతం అది నిలిచిపోయింది. వచ్చే ఏడాది మార్చి 29తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఆ లోగానే ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.బీజేపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. పట్టభద్రుల టికెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీచేసిన సుగుణాకరరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన మామిడి సుధాకర్రెడ్డి, అనంతరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీకి పట్టుండడంతోపాటు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటన మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం–నల్లగొండ–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (శనివారం) వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారుయూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫుల్పూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హల్, ఖైర్ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని రాజకీయ ప్రత్యర్థుల మధ్య నెలకొన్న ఈ పోటీని 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్నారు. उप्र के विधानसभा उपचुनाव में चुनाव आयोग व इंडिया गठबंधन-सपा के सभी 9 सीटों के उम्मीदवारों से ये अपील है कि कल सुबह ये सुनिश्चित करें कि नियमानुसार पोस्टल बैलेट पहले गिने जाएं और फिर ईवीएम मशीनों के वोटों की मतगणना हो। सभी पूरी तरह मुस्तैद रहें और किसी भी तरह की गड़बड़ी होने या…— Akhilesh Yadav (@yadavakhilesh) November 22, 2024ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్లో.. ఎన్నికల కమిషన్కు, ఇండియా అలయన్స్-ఎస్పీకి చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. శనివారం ఉదయం జరిగే పోస్టల్ బ్యాలెట్లను నిబంధనల ప్రకారం మొదట లెక్కించేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఎన్నికల కమిషన్కు, పార్టీకి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకునేవరకూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్పూర్, ఘజియాబాద్, మజ్వాన్, ఖైర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీసామవు, కటేహరి, కర్హల్, కుందర్కిలో ఎస్పీ విజయం సాధించింది. అప్పుడు ఎస్పీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ), మీరాపూర్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎస్పీకి మద్దతు పలికింది. -
ఎప్పుడూ పేరు వినని పార్టీలు సహా మహారాష్ట్ర ఎన్నికల బరిలో 4,136 మంది
దాదర్: హోరాహోరీగా సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రచారం ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 158 ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,050 మంది బరిలో ఉండగా మిగతా 2,086 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐకి చెందిన 31 మంది అభ్యర్థులున్నారు.దీన్ని బట్టి వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే ఇండిపెండెంట్లే అధికంగా బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి మొదటి స్థానంలో మాయావతికి చెందిన బీఎస్పీ, రెండో స్థానంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వం వహిస్తున్న వంచిత్ బహుజన్ అఘాడీ, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఏపీ) తదితర ప్రాంతీయ పారీ్టలున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓట్లు చీలిపోతాయే భయం ప్రధాన రాజకీయ పారీ్టల అభ్యర్థులకు పట్టుకుంది. ఈ సారి జనాలు ఎప్పుడు పేరు వినని పారీ్టలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం. మొత్తం 288 స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరిని అదృష్టం వరిస్తుంది? ఏ పారీ్టకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనేది ఈనెల 23వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది. ఎప్పుడూ పేరు వినని పార్టీలు వికాస్ ఇండియా పార్టీ, ఎల్ఘార్ పార్టీ, వీర్ జనశక్తి పార్టీ, సన్మాన్ రాజకీయ పార్టీ, సర్దార్ వల్లభాయి పార్టీ, సంపూర్ణ భారత్ క్రాంతి పార్టీ, నేతాజీ కాంగ్రెస్ పార్టీ, నిర్భయ్ మహారాష్ట్ర పార్టీ, ఓపెన్ పీపుల్స్ పార్టీ, నేషనల్ వరల్డ్ లీడర్ పార్టీ, జయ్ హింద్ జయ్ భారత్ రా్రïÙ్టయ పార్టీ, ఇండియన్ పాలిటికల్ కాంగ్రెస్ పార్టీ, విందు«థలాయి చిరుతెంగల్ పార్టీ, ఎం పాలిటికల్ పార్టీ, భారత్ జోడో పార్టీ ఉన్నాయి. పది మంది కంటే ఎక్కువ అభ్యర్థుల పోటీ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)–44, మహారాష్ట్ర స్వరాజ్య పార్టీ–32, రైట్ టూ రీకాల్ పార్టీ–18, సంభాజీ బ్రిగేడ్ పార్టీ–19, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇంక్విలాబ్ ఏ మిలాత్–16, జనహిత్ లోక్షాహీపార్టీ–18, బహుజన్ మహాపార్టీ–11, భారతీయ యువ జన్ఏక్తా పార్టీ–12, దేశ్ జనహిత్ పారీ్ట–11, జన్ జనవాదీ పార్టీ–13, రాష్ట్రీయ స్వరాజ్య సేనా–15, వికాస్ ఇండియా పార్టీ–11. అత్యధిక, అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముంబై, ఉప నగర జిల్లాల్లో అత్యధికంగా అంటే 315 మంది, పుణేలో 303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అతి తక్కువ అంటే 17 మంది అభ్యర్థులు సింధుదుర్గ్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం మహిళా అభ్యర్థుల సంఖ్య 363 ఉండగా ఇందులో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. కాగా, మొత్తం 363 మంది మహిళా అభ్యర్థులున్నప్పటికీ ఇందులో ముంబై, ఉప నగరజిల్లాల్లో అత్యధికంగా అంటే 39 మంది బరిలో ఉన్నారు. హింగోళీ, రత్నగిరి జిల్లాలో అతి తక్కువ అంటే ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. జల్గావ్, నాందేడ్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున హిజ్రా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే దానిపై అందరి దృష్టి ఉంది. పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య బీజేపీ–149, కాంగ్రెస్–101, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–86, శివసేన (శిందే వర్గం)–81, యూబీటీ (శివసేన)–95, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)–59, బహుజన్ సమాజ్ పార్టీ–259, వంచిత్ బహుజన్ అఘాడీ–200, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–125, రాష్ట్రీయ సమాజ్ పార్టీ–93, ఆర్పీఐ (అథవలే వర్గం)–31, ప్రహార్ జనశక్తి–38, ఆజాద్ సమాజ్ పార్టీ–28, రిపబ్లికన్ సేనా–21, బహుజన్ రిపబ్లికన్ స్పెషలిస్టు పార్టీ–22,స్వాభిమాన్ పార్టీ–19, పీడబ్ల్యూపీ–18, ఎంఐఎం–17, భీంసేనా–14, లోక్రాజ్య పార్టీ–10, జనసురాజ్య శక్తి–6, సమాజ్వాదీ పార్టీ–9, సమతా పార్టీ–9, రాష్ట్రీయ గోండ్వానా పార్టీ–4, జనతాదళ్ (సెక్యులర్)–4, మార్క్స్వాదీ కమ్యూనిస్టు పార్టీ–3. -
మహారాష్ట్ర ఎన్నికలు.. బరిలో 7,995 మంది
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు... ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్కే మద్దతు -
యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్ను నిలబెట్టింది. కాన్పూర్లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.నవంబర్ 13న ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్నగర్లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
Group-1 Exam: అట్టుడికిన సిటీ
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్నగర్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సికింద్రాబాద్ బంద్లో లాఠీచార్జ్.. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్ బంద్లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు వీహెచ్పీ, భజరంగ్దళ్, హిందూవాహిని, బీజేపీ తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు రాంగోపాల్పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు. -
గ్రూప్ వన్ ఆందోళనలు.. అశోక్నగర్లో హై టెన్షన్ (ఫొటోలు)
-
తెలంగాణలో గ్రూప్ -1 టెన్షన్..టెన్షన్
-
ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి
సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్డీ (ఓట్ ఫర్ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్డీ, ఏడీఆర్ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4న చేపట్టింది. అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్స్ ట్యాంపరింగ్గానీ ఏమైనా మార్పులుగానీ జరిగాయా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్పై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్డీలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.విచారణ నిర్వహించాల్సిందేఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్కు, కౌంటింగ్ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం లోక్సభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్ ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి -
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్లు ట్యాంపరింగ్కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్గా ఐదు శాతం ఈవీఎంలను చెక్చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్గఢ్లోని ఒక లోక్సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్ఖేడ్లో 7 , జహీరాబాద్లో 7, ఆందోల్లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
ప్రతి ఇంటికి మంచి చేశాం.. వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఎన్నికల్లో పోటీకి.. పోటీపడిన పార్టీలు
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. -
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
-
ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడకుండా ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమా లు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు, కొందరు నేతలు గురువారం ఎర్రవల్లి నివా సంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది.వరికి రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు అంశాలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన నిర సన కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, కిందిస్థాయి వరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం తదితరాలకు సంబంధించిన కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ‘స్థానిక’సన్నద్ధత ప్రారంభించాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.పార్టీ కార్యవర్గాల ఏర్పాటులోనూ ఇలాంటి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించేందుకు 113 బీసీ ఉప కులాల గణన చేపట్టాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని ఎన్నికల ఫలితాలు అనుకూలమే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలూ పార్టీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగిన శాసనమండలి మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి గెలుస్తారని పార్టీ నేతలు కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,439 మంది ఓటర్లకు గాను 800 మందికి పైగా పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో సానుకూల ఫలితం వస్తున్నట్లు వివరించారు.ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నివేదిత మంచి మెజారిటీ సాధిస్తారని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 27న జరిగే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా పార్టీ నేతలు, అభ్యర్థులు పార్టీ ఇచ్చే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
-
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.ఈ పిటిషన్ ను పరిశఋలించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. -
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ తరపున ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్లకు టికెట్ ఇచ్చింది.దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్పీ ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం. -
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు!
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్లాల్, సురేష్, ఈశ్వర్లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
పంజాబ్లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
పంజాబ్లో మరో నాలుగు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించింది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్థానాలు ఉండగా ప్రస్తుతం ప్రకటించిన నాలుగు స్థానాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.గురుదాస్పూర్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ సింగ్ రంధవా, లూథియానా నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ అమరీందర్ సింగ్ బ్రార్ (రాజా వారింగ్) బరిలోకి దిగుతున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి కుల్బీర్ సింగ్ జిరా, ఆనంద్పూర్ సాహిబ్ నుంచి విజయ్ ఇందర్ సింగ్లాలను పోటీలోకి దింపింది హస్తం పార్టీ.కొత్త అభ్యర్థులను పేర్లను కాంగ్రెస్పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎట్టకేలకు ఆ మూడూ..
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిపోయిన మూడు స్థానాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేసింది.ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డికి అవకాశం ఇచ్చారు.రఘురాంరెడ్డి తండ్రి సురేందర్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన డోర్నకల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్సభ నుంచి నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. రఘు రాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సినీ హీరో దగ్గుబాటి వెంకటే‹Ùలకు వియ్యంకుడు. కాగా నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు. అగ్రవర్ణాలకు 8 స్థానాలు: రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా, ఇందులో 8 టికెట్లను కాంగ్రెస్ అగ్రవర్ణాలకు కేటాయించింది. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఒకటి ఆదివాసీ, మరోటి లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించగా, ఎస్సీ రిజర్వుడు స్థానాలైన పెద్దపల్లి, నాగర్కర్నూల్లను మాలలకు, వరంగల్ను మాదిగలకు కేటాయించింది.మెదక్, సికింద్రాబాద్, జహీరాబా ద్ స్థానాలను బీసీలకు కేటాయించగా, హైదరాబాద్ సీటును మైనార్టీకి, కరీంనగర్ స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి, నిజామాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడం గమనార్హం. అది బీసీకే..: మూడు లోక్సభ స్థానాలతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారుచేశారు. కరీంనగర్ లోక్సభ రేసులో ఆయన పేరు వినిపించినా.. అక్కడ ఓసీ వర్గానికి టికెట్ కేటాయించారు. దీంతో బీసీ వర్గానికి చెందిన మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం గమనార్హం. -
కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి, కరీంగనర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాఖాన్ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేయడం గమనార్హం. అటు ఏపీలోనూ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్కుమార్రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్పై 2017లో చెన్నై సెండియం పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్స్టేషన్లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
ఆ తాను ముక్కలే..
(కల్వల మల్లికార్జున్రెడ్డి) : మరో నెలరోజుల్లో రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే 17 నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించగా, అధికార కాంగ్రెస్ మాత్రం మరో మూడుచోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఈసారి అన్ని పార్టీలు విచిత్ర పద్ధతులను అనుసరించగా, అభ్యర్థులు కూడా టికెట్ దక్కించుకునేందుకు విచిత్ర విన్యాసాలు చేశారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులుగా పేర్కొంటూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. పార్టీలో సీనియారిటీ, విధేయత వంటి వాటిని పక్కనపెట్టి వలస నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సొంత పార్టీలో సమర్థులైన అభ్యర్థులు లేరనే సాకుతో ఆర్థిక బలం, కుటుంబ నేపథ్యం, సామాజికవర్గాల లెక్కలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేశాయి. మరోవైపు ఇన్నాళ్లూ కొనసాగుతున్న పార్టీలో పోటీ అవకాశం దక్కినా కాలదన్ని మరీ ప్రత్యర్థి పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లోనో.. కాంగ్రెస్లోనో కొనసాగిన వారే కావడం ఆసక్తికరం. అన్ని పార్టీల్లోనూ ‘గులాబీ’ గుబాళింపు రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే ఉన్నారు. బీజేపీలో 12 మంది, కాంగ్రెస్లో ఆరుగురు లేదా వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్లో కొనసాగిన వారే. బీఆర్ఎస్ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లోనూ ఆరుగురు కాంగ్రెస్ జీన్స్ కలిగిన వారున్నారు. పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ (బీజేపీ), పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), వరంగల్లో కడియం కావ్య (కాంగ్రెస్), నాగర్కర్నూలులో పి.భరత్ (బీజేపీ) బరిలో ఉన్నారు. వీరి తండ్రులు గతంలో బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన వారు కావడం గమనార్హం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వినోద్కు మూడు పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. ♦ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో గోడెం నగేశ్ (ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరు రమేశ్ (వరంగల్), సీతారాం నాయక్ (మహబూబాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), పి.భరత్ (నాగర్కర్నూలు), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), ఎం.రఘునందన్రావు (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్) గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారే. ♦ కాంగ్రెస్ తరపున టికెట్లు దక్కిన గడ్డం వంశీ (పెద్దపల్లి), కడియం కావ్య (వరంగల్), పి.రంజిత్రెడ్డి (చేవెళ్ల), నీలం మధు (మెదక్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), పట్నం సునీత మహేందర్రెడ్డి (మల్కాజిగిరి) గతంలో బీఆర్ఎస్తో సంబంధాలు కలిగిన వారే. ♦ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మాలోత్ కవిత (మహబూబాబాద్), క్యామ మల్లేశ్ (భువనగిరి), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి), గాలి అనిల్ కుమార్ (జహీరాబాద్) కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వాసన కలిగిన వారే. సిట్టింగుల్లో 9 మందే తిరిగి బరిలోకి.. 17 మంది సిట్టింగ్ ఎంపీల్లో 9 మంది మాత్రమే తిరిగి బరిలోకి దిగుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 9 మందికిగాను ముగ్గురు, బీజేపీలో నలుగురికిగాను ముగ్గు రు తిరిగి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్లో మాత్రం ముగ్గురు సిట్టింగుల్లో ఒక్కరూ తిరిగి పోటీ చేయడం లేదు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజ య్ (కరీంనగర్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కిషన్రెడ్డి (సికింద్రాబాద్), బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత (మహ బూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), కాంగ్రెస్ నుంచి రంజిత్రెడ్డి (చేవెళ్ల), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం– హైదరా బాద్) తిరిగి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు సోయం బాపూరావు (ఆదిలాబాద్), వెంకటేశ్ నేత (పెద్దపల్లి) పసునూరు దయాకర్ (వరంగల్), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ్కుమార్రెడ్డి (నల్లగొండ), పి.రా ములు (నాగర్కర్నూలు), రేవంత్రెడ్డి (మల్కాజి గిరి), కొత్త ప్రభాకర్రెడ్డి (మెదక్) పోటీకి దూరంగా ఉన్నారు. వెంకటేశ్ నేత, దయాకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినా టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవంత్రెడ్డి సీఎంగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి మంత్రులు గా ఉండగా, కొత్త ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. నాగర్కర్నూలు ఎంపీ పి.రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి తన కుమారుడు పి.భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు. -
మొదటి దశ అభ్యర్థులెందరు? క్రిమినల్స్తో పాటు కోటీశ్వరులెవరు?
2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) లోక్సభ ఎన్నికల మొదటి దశలోపోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలను అందించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం తొలి దశలో మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించగా, ఏడుగురు అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేనందున వాటిని విశ్లేషించలేకపోయినట్లు తేలిపింది. మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన 1,618 మంది అభ్యర్థులలో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ తెలిపింది. 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా, ఈ అభ్యర్థుల సగటు సంపద రూ.4.51 కోట్లు. 1618 మంది అభ్యర్థుల్లో 161 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 15 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉండగా, ఏడుగురు అభ్యర్థులపై హత్యకు సంబంధించిన కేసులు (ఐపీసీ-302) నమోదయ్యాయి. 18 మంది అభ్యర్థులపై మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే ఉద్రేకపూరిత ప్రసంగాలతో ముడిపడిన కేసులలో చిక్కుకున్న 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశలో పోటీ చేసే 1618 మంది అభ్యర్థుల్లో 28 శాతం అంటే 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. 77 మంది బీజేపీ అభ్యర్థుల్లో 69 మంది, 56 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 49 మంది, ఆర్జేడీ అభ్యర్థులు 36 మంది, ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో 35 మంది, డీఎంకే అభ్యర్థులు 22 మందిలో 21 మంది, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో నలుగురు, బీఎస్పీ అభ్యర్థుల్లో 86 మందిలో 18 మంది కోటీశ్వరులు. ఎన్నికల అఫిడవిట్లలో ఈ అభ్యర్థులు తమ ఆస్తుల విలువ కోటికి పైగా ఉన్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.4.51 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. తొలి దశలో అత్యధిక ఆస్తులను ప్రకటించిన అభ్యర్థి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్. చింద్వారా నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన ఇతని మొత్తం ఆస్తుల విలువ రూ.716 కోట్లు. ఈ జాబితాలో ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కుమార్ తన అఫిడవిట్లో రూ.662 కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. మూడవ అత్యంత సంపన్న అభ్యర్థి బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్. తమిళనాడులోని శివగంగై స్థానం నుంచి పోటీ చేస్తున్న దేవనాథన్ ఆస్తుల విలువ రూ.304 కోట్లు. -
టీడీపీలో మరిన్ని మార్పులు?!
మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి.. పందిట్లో అందరూ సందడిగా ఉంటారు.. వధువు సిగ్గుల మొగ్గ అవుతుంది.. ఇటు వియ్యాలవారు కబుర్లు.. పిల్లల ఆటలతో అంతా కోలాహంగామా ఉంటుంది. ముహూర్తం టైం అవుతోంది.. వధువును పీటలమీద కూర్చోబెట్టండి.. అమ్మ నువ్వు జడ ఎత్తి పట్టుకోమ్మా.. బాబూ పెళ్ళికొడుకు నువ్వు తాళి కట్టు బాబు... ఏయ్ భజంత్రీలు మోగించడమ్మా అంటాడు పంతులు.. పెళ్ళికొడుకు లేచి తాళి కట్టబోతుండగా హఠాత్తుగా ఆహూతుల్లోంచి ఒకరు ఆపండీ.. డీ.. డీ... ఈ.. ఈ.. అని అరుస్తారు... అక్కడంతా సైలెన్స్.. నిశ్శబ్దం.. ఏమి జరుగుతుందో తెలీదు.. ఎందుకు ఆపమన్నారో తేలేదు.. వధువు.. తల్లిదండ్రుల కన్ఫ్యూజన్.. అంతలో ఒక పెద్దాయన వచ్చి...అసలు వరుడు వీడు కాదు... వీడు డూప్లికేట్.. అసలైనవాడు ఇప్పుడొచ్చాడు.. వాడే అసలు పెళ్ళికొడుకు... నువ్వెళ్ళి తాళి కట్టుబాబూ అంటాడు.. అప్పుడు ఒరిజినల్ వాడు వెళ్లి తాళి కట్టి.. ఆ పెళ్లి తంతు ముగిస్తాడు.. వాస్తవానికి ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభర్ధులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో ప్రచారం చేయిస్తోంది. అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్లను మార్చేందుకు చంద్రబాబు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టిక్కెట్ ప్రకటించేయగా అయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో మళ్లీ రఘురామకృష్ణం రాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతే కాకుండా జగపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా అయన జనంలోకి వెళ్తున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్యను ఓడించడం శ్రీనివాస్కు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట. అలాగే టీవీల్లో అడ్డం దిడ్డం మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు.. అయితే టీవీల్లో వాగడం వేరు.. జనాల్లో తిరగడం వేరని పార్టీకి ఇప్పటికే అర్థం అయిందని, దీంతో ఆయన్ను పక్కన బెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని అంటున్నారు. పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించారు.. ఈ నెలన్నర తరువాత ఆబ్బె... ఆయన సరిపోవడం లేదని తేలిందట.. దీంతో రెండో కృష్ణుడు రాబోతున్నట్లు రూమర్లున్నాయి. శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల రెండు.. మూడో కృష్ణుడు రాబోతున్నట్లు క్యాడర్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల వరకూ.. బీ ఫారం వచ్చేవరకూ ఎవరూ శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో క్యాడర్ పని చేస్తోంది. -సిమ్మాదిరప్పన్న -
AP MP: ఎంపీ సీట్లలో ఎవరికి ఎవరు పోటీ?
-
రెండు లోక్సభ సీట్లకు 11 మంది పోటీ!
మణిపూర్ హింసాకాండ తరువాత ఇక్కడ జరుగుతున్న లోకసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్లో రెండు లోక్సభ స్థానాలు ఉండగా, పలువురు నేతలు ఈ సీట్లపై దృష్టి పెట్టారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాలను బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకున్నాయి. తాజాగా మణిపూర్లోని ఇన్నర్ స్థానం నుంచి తొంజోమ్ బసంత్ కుమార్ సింగ్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అంగోమ్చా బిమల్ అకోయిజంపై పోటీకి దిగారు. ఈ స్థానం నుంచి మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఔటర్ మణిపూర్ సీటును ఎన్డిఎ మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పిఎఫ్)కి ఇచ్చారు. ఎన్పిఎఫ్కి చెందిన కట్చుయ్ తిమోతీ జిమిక్ కాంగ్రెస్కు చెందిన ఆల్ఫ్రెడ్ కాన్ నగుమ్ ఆర్థర్తో తలపడుతున్నారు. ఇక్కడ మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో పాటు మణిపూర్ పీపుల్స్ పార్టీ, ఆర్పీఐ (అథవాలే), రాష్ట్రీయ జనహిత సంఘర్ష్ పార్టీ, యూనివర్సల్ ఫ్యామిలీ పార్టీ కూడా పోటీకి దిగాయి. మణిపూర్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. మణిపూర్ ఇన్నర్ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. మణిపూర్లోని ఇన్నర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజ్కుమార్ రంజన్సింగ్ 17,775 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఓయినమ్ నబా కిషోర్ సింగ్పై విజయం సాధించారు. ఎన్పీఎఫ్ ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. ఎన్పిఎఫ్కు చెందిన లోహరో ఎస్ పోస్ 73782 ఓట్లతో కాంగ్రెస్కు చెందిన హోలిమ్ సోఖోపావో మేట్పై విజయం సాధించారు. మణిపూర్ హింసాకాండ తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు బీజేపీ కూటమికి అగ్నిపరీక్ష కానున్నాయి. మణిపూర్లోని రెండు లోక్సభ సీట్లకు 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
Jana Sena: పెండింగ్ స్థానాలు ఇక వాళ్లకే!
గుంటూరు, సాక్షి: పొత్తుల ప్రకటన మొదలు, చంద్రబాబు నుంచి సీట్లు దక్కించుకోవడం, అభ్యర్థుల ఎంపిక.. ఇలా అన్నింటా పవన్ కల్యాణ్ ఇంతలా అయోమయానికి గురవుతారని పదేళ్లు ఆయన వెంట నడుస్తున్న నేతలెవరూ ఊహించి ఉండరు. పైగా మునుపెన్నడూ లేనంత కుట్ర పూరిత రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జెండాలు మోసే వారి కంటే, జెండాలు మార్చే వారికే విలువ పవన్ ఇస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. నమ్ముకున్నవాళ్లకు సైతం పవన్ వెన్నుపోటు పొడుస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. కేడర్ బలం కంటే ధనబలానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ తీరును నిరసిస్తూ పలువురు పార్టీని వీడారు. కొందరైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆగాలనుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంకా గుడ్డిగా పవనే నమ్ముకుంటున్నారు. పెండింగ్లో ఉన్న విశాఖ సౌత్, ఆళ్లగడ్డ, పాలకొండలోనూ జనసేన అసలైన నేతలకు మొండిచేయే దక్కనున్నట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ పేరు నుంచి తొలి నుంచి వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ వంశీని ఎమ్మెల్సీని చేస్తే.. పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారాయన. అయితే విశాఖ సౌత్ నియోజకవర్గం హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు తొలి నుంచి ప్రచారం ఉంది. అయితే.. జనసేనలో తామేమీ గొర్రెలం కాదని, వంశీకి సీటు ఇస్తే ఊరుకునేది లేదంటూ జనసేన నేతలు అక్కడ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో వంశీ తన అనుచరులతో వీరమహిళలపై దాడి కూడా చేయించారు. అయినప్పటికీ పవన్ మాత్రం వంశీకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్ను పక్కనపెడితే.. అవనిగడ్డ(కృష్ణా), పాలకొండ(మన్యం) అభ్యర్థుల కోసం జనసేన తీవ్ర కసరత్తులు చేసింది. పవన్ గొంతుతో ఐవీఆర్ఎస్ సర్వేలు సైతం నిర్వహించింది. మరోవైపు.. తాజాగా జనసేనలో చేరికలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కేడర్ను కాదని బయటివాళ్లకే అవకాశం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారనే చర్చ ఊపందుకుంది. పాలకొండలోనూ.. పాలకొండ ( పార్వతీపురం మన్యం జిల్లా) టికెట్ను నిమ్మక జయకృష్ణకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న జయకృష్ణ.. ఇవాళ జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ‘‘ పార్టీ ఏది అయితే నేమి కూటమిలోనే ఉంటాం కదా’’ అని ఆయన అనుచరులు సైతం మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాలకొండలో రాజకీయ కుటుంబంగా ఉన్న జయకృష్ణ.. వరుసగా పోటీ చేస్తున్నారే తప్ప గెలవడం లేదు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. ఇక ఇక్కడ హ్యాట్రిక్పై వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి కన్నేశారు. అవనిగడ్డ బరిలో ఆయన? కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లింది. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పవన్ చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు. మండలి బుద్ధప్రసాద్ ఇవాళ అధికారికంగా జనసేనలో చేరనున్నారు. దీంతో సీటు దాదాపుగా ఆయనకే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అవనిగడ్డ నుంచి మూడు పర్యాయాలు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గానూ పని చేశారు. ఇప్పుడు ఈయన కూడా జనసేన తరఫునే పోటీకి దిగడం దాదాపుగా ఖరారయ్యింది. అవనిగడ్డలోనూ పవన్ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. కృష్ణారావుతో పాటు శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ (టివి9)లాంటి పలువురు అభ్యర్థుల పేర్లనూ పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచే వలస వస్తున్న సీనియర్ నేతకు పవన్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఈ పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రెబల్ పన్నీర్ సెల్వానికి నలుగురు పన్నీర్ సెల్వంలతో పోటీ
1973లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’లో, బ్రూస్ లీ తన ప్రత్యర్థి హాన్తో అద్దాల గదిలో పోరాడుతారు. అప్పుడు పలు ప్రతిబింబాలు బ్రూస్ లీని కలవరపరుస్తాయి. తమిళనాట ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రెబల్గా మారిన ఓ పన్నీర్సెల్వం పరిస్థితి కూడా రామనాథపురంలో బ్రూస్లీ మాదిరిగానే పరిణమించింది. ఓ పన్నీర్సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడనుంది. నిజానికి ఓ పన్నీర్సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ డమ్మీ అభ్యర్థులను అతని ప్రత్యర్థులు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఓ పన్నీర్ సెల్వంను ఎన్నికల్లో దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండటం విశేషం. ఓ పన్నీర్సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో దిగిన ఇతర అభ్యర్థులకు పన్నీర్సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం. -
టూత్పేస్ట్, చెప్పులు, బెలూన్.. స్వతంత్రులకు 190 ఎంపికలు!
దేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా వారి గుర్తులకు అత్యంత ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తుంటాం. అభ్యర్థులు కూడా ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును చూపించి, దానికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతుంటారు. ఓటింగ్ సమయంలోనూ ఓటర్లు అభ్యర్థి పేరు కంటే వారి చిహ్నాన్ని గుర్తు పెట్టుకుంటారు. అన్ని పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆయా ఎన్నికల చిహ్నాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. ప్రాంతీయ పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంటారు. అలాంటి అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 190 గుర్తులను ఖరారు చేసింది. నామినేషన్లు సమర్పించేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కమిషన్ అందించిన జాబితాలోని ఏదో ఒక ఎన్నికల గుర్తును ఎంచుకుని దానిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల గుర్తును కమిషన్ కేటాయిస్తుంది. దేశంలో ఆరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల చిహ్నాలలో పురాతన కాలం నుండి ఆధునిక కాలం నాటి అంశాల వరకు ఉన్నాయి. వీటిలో ఆహారం, రవాణా, దినచర్యలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. మొబైల్, మొబైల్ ఛార్జర్తో పాటు టెలిఫోన్ కూడా ఎన్నికల చిహ్నంగా ఉంది. స్లేట్, ల్యాప్టాప్ కూడా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. -
ఎలక్షన్ మెనూ..ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుకు రేట్లు ఫిక్స్ చేసిన ఈసీ
-
అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది. ఏప్రిల్ 26న రాజస్థాన్లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే పొందగలిగింది. -
‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ.. బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరఫున డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి ఆ మార్క్ను ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వాళ్లను సైతం పక్కనపడేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తోంది. అందులో ఇప్పటిదాకా 18 మంది అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. ఇందులో కేవలం రెండే స్థానాలను(అనకాపల్లి, నరసాపురం) బీసీలకు కేటాయించారాయన. అందులో.. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా, చేనేత కులాలల ప్రస్తావన లేదు. ఇక ఓసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. మైనారిటీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు(నో టికెట్). జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి.. వీర మహిళలెవరూ పోటీకి పనికి రారనే సంకేతాలు పంపించినట్లు ఉంది. ఇక.. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో ఆయన అనుసరించిన తీరును జనసేన నేతలే మరీ దుర్మార్గమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్ . మొత్తంగా.. ధనసేన చేతిలో జనసేన నేతలుగా దగా పడ్డామనే మాట వినిపిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లు, గత ఎన్నికల్లో దారుణ ఓటమిపాలైనా కూడా పక్కపార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరిన కొందరు ఉన్నారు. ఆ లిస్ట్లో బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ నేతల అనుచరులు ఏమాత్రం భరించలేకపోతున్నారు. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
వరంగల్కు అరూరి..
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఆదివారం రాత్రి మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ను వరంగల్ నుంచి, తాండ్ర వినోద్రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చినా, ఆ తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావులలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా జరిగిన పలు పరిణామాలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే అనూహ్యంగా తాండ్ర వినోద్రావు అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 17 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వుడ్ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది. ఆయా లోక్సభ సెగ్మెంట్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే.... ఆదిలాబాద్: గోడం నగేష్ (ఎస్టీ గోండు) పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ (ఎస్సీ మాదిగ) కరీంనగర్: బండి సంజయ్ కుమార్ (మున్నూరు కాపు) నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ (మున్నూరు కాపు) జహీరాబాద్: బీబీ పాటిల్ (లింగాయత్) మెదక్ : రఘునందన్రావు (వెలమ) మల్కాజ్గిరి: ఈటల రాజేందర్ (ముదిరాజ్) సికింద్రాబాద్: జి.కిషన్రెడ్డి (రెడ్డి), హైదరాబాద్: మాధవీలత (బ్రాహ్మణ), చేవెళ్ల: విశ్వేశ్వర్ రెడ్డి (రెడ్డి), మహబూబ్నగర్: డీకే అరుణ (రెడ్డి), నాగర్కర్నూల్: పి.భరత్ (ఎస్సీ మాదిగ), నల్గొండ: సైదిరెడ్డి (రెడ్డి), భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ (గౌడ్), వరంగల్: అరూరి రమేశ్ (ఎస్సీ మాదిగ), మహబూబాబాద్: సీతారాం నాయక్ (ఎస్టీ లంబాడా), ఖమ్మం: తాండ్ర వినోద్ రావు (వెలమ) -
ఏపీలో ‘పార్టీ’ లేదా పుష్పా?
సాక్షి, అమరావతి : ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని దానికోసమే అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతలకు ఊహించినట్లుగానే షాక్ తగిలింది. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్సభ సీట్లలో ఒక్క నరసాపురం మినహా మిగిలిన అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట, తిరుపతి స్థానాలను వలస పక్షులే దక్కించుకున్నాయి. దీంతో బీజేపీకి అసలైన పార్టీ అభ్యర్థులే కరువయ్యారా అన్న అంశం ఇప్పుడు కరడుగట్టిన కమలనాథుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. 2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చవిచూసిన తర్వాత చంద్రబాబు డైరెక్షన్లో హుటాహుటిన బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన నమ్మినబంటు సీఎం రమేశ్కు అనకాపల్లి ఎంపీ స్థానం కేటాయించారు. ఈయన నిజానికి వైఎస్సార్ జిల్లా వ్యక్తి. ఎక్కడో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వలస నేతను దిగుమతి చేయాల్సిన ఖర్మ ఏంటని 20–30 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న వారుప్రశ్నిస్తున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరి కూడా 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పరాజయం పాలయ్యాక బీజేపీలోకి వచ్చిన వ్యక్తే. ఈమెకు రాజమహేంద్రవరం టికెట్ దక్కింది. అలాగే, రాజంపేట టికెట్ దక్కిన మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఈమధ్యే బీజేపీలో చేరారు. అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత అయితే గతంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత ఆమె జనజాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుని అనంతరం దానిని బీజేపీలో విలీనం చేశారు. ఇక గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అయితే బీజేపీ కండువా కప్పుకున్న రోజే పార్టీ ఆయనకు తిరుపతి టికెట్ కేటాయించింది. ఇలా.. ఒక్క నరసాపురం అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మినహా మిగిలిన అందరూ వలస నేతలకే టికెట్లు దక్కాయి. ఎక్కువగా తన మనుషులకే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పొత్తులున్నా.. లేకున్నా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసేందుకు రెండు మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్థన్రెడ్డి వంటి బీజేపీ సీనియర్లు ఎంపీ అభ్యర్థుల జాబితా చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక నిన్నటివరకూ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని తిరుపతి జిల్లా గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు ఒక్కసారిగా తిరుపతి లోక్సభ సీటు దక్కడం వారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాక పార్టీలో ఈ విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. బాబు, పవన్ చుట్టూ వరప్రసాద్ చక్కర్లు.. వాస్తవానికి.. వరప్రసాద్కు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. 20 రోజుల క్రితం బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరక ముందు తిరుపతి లోకసభ సీటును జనసేనకు కేటాయించాలని భావిస్తున్న సమయంలో చంద్రబాబు సూచన మేరకు వరప్రసాద్ నెలరోజుల క్రితమే మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ను కలిశారు. ఆ తర్వాత.. పొత్తులో బీజేపీ కూడా చేరడంతో తిరుపతి లోకసభ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. దీంతో చంద్రబాబు డైరెక్షన్లోనే వరప్రసాద్ మళ్లీ బీజేపీ చుట్టూ తిరగడం మొదలుపెట్టినట్లు కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐదారు రోజులుగా ఢిల్లీలో వరప్రసాద్ను వెంటబెట్టుకుని కొందరు జాతీయ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ప్రతిపాదన మేరకే బీజేపీ జాతీయ నాయకత్వం వరప్రసాద్కు బీజేపీలో చేరక మునుపే తిరుపతి లోకసభ సీటు కేటాయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో చేరేందుకు బద్వేలు అభ్యర్థి ‘నో’.. మరోవైపు.. పొత్తులో బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో బద్వేలు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ స్థానంలో బీజేపీకి సరైన అభ్యర్థి కూడా లేనందున ఆ సీటును బలవంతంగా బీజేపీకి అంటగట్టారని మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ సీటులో బీజేపీ తరఫున పోటీచేసేందుకు పురందేశ్వరి ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారని.. ఆ ముగ్గురూ ఇప్పటిదాకా పార్టీలో చేరని వారేనని వారంటున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరైన రోశన్న పేరుకు ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో రోశన్నను బీజేపీలో చేర్చేందుకు పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లా నాయకులు ఆదివారం ప్రయత్నించగా, ఆయన అందుకు విముఖత చూపారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సీటు వ్యవహారాన్ని కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారు. సీనియర్ల ఆగ్రహావేశాలు.. ఇదిలా ఉంటే.. పొత్తు ఉన్నా, లేకపోయినా పార్టీ తరఫున పోటీచేసేందుకు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న చాలామంది ఆసక్తి వ్యక్తంచేశారని.. అలాంటప్పుడు పార్టీకి మంచి అభ్యర్థులున్న నియోజకవర్గాలే కేటాయించాలని పట్టుబట్టి ఉండొచ్చు కదా అని పలువురు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు ఇస్తామన్న నియోజకవర్గాలను ఒప్పుకుని, ఇప్పుడా స్థానాల్లో పార్టీ సభ్యత్వంలేని వారికి సీట్లు కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకుల పరిస్థితి, పార్టీ పరువు ఏం కావాలని పార్టీ హార్డ్కోర్ సీనియర్లు రగిలిపోతున్నారు. -
జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్(లలన్) సింగ్కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈయన ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు. ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె -
సీఎం జగన్కు హ్యాట్సాఫ్.. బాబుపై రగిలిపోతున్న బీసీ నేతలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఒకప్పుడు.. సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో ఎన్నికలప్పుడు వాడుకోవడం.. అధికారంలోకి వచ్చాక వదిలేయడంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఆ అంశాన్ని ప్రతిపక్ష నేత పూర్తిగా విస్మరించినట్లున్నారు!. తాజాగా.. టీడీపీ ప్రకటించిన మూడు జాబితాలను చూసి బీసీ సంఘాలు చంద్రబాబుపై రగిలిపోతున్నాయి. ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం 4 ఎంపీ, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అదే అధికార వైఎస్సార్సీపీ గత ఎన్నికలకు మించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ, లోక్సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు(ఏకంగా 11 లోక్ సభ.. 48 అసెంబ్లీ) కేటాయించారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్రెడ్డి. దీంతో.. ప్రతిపక్ష నేత తీరుపై బీసీ నేతలు రగిలిపోతున్నారు. బీసీ డిక్లరేషన్ అంటూ బిల్డప్లు ఇచ్చి.. తక్కువ సీట్లు ఇచ్చి బీసీల గొంతు కోశారని మండిపడుతున్నారు. జనరంజకమైన జాబితా అంటూ చంద్రబాబు గప్పాలు కొట్టుకుంటున్నప్పటికీ.. సీట్ల కేటాయింపులో డబ్బుకి ప్రాధాన్యం, కుల పక్షపాతం లాంటివి కనిపిస్తున్నాయని అంటున్నారు వాళ్లు. ఆఖరికి బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్లను కూడా తన సామాజిక వర్గానికి ఇచ్చుకొవడాన్ని బీసీ నేతలు సహించలేకపోతున్నారు. ఇప్పటికే మంగళగిరి విషయంలో బీసీలకు కాకుండా.. మళ్లీ తన తనయుడు నారా లోకేష్కే టికెట్ ఇవ్వడంపై బీసీలు అసంతృప్తితో రగిలిపోతున్న సంగత తెలిసిందే. చంద్రబాబుకి నిరసనగా.. బీసీ సంఘాల నేతలు పలువురు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయిప్పుడు. ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు ఇచ్చిన చంద్రబాబును తిడుతూనే.. సామాజిక న్యాయం పేరిట బీసీలకు పెద్ద పీట వేసిన సీఎం జగన్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: YSRCP.. జయహో బీసీ ‘‘మీ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను మెచ్చుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ గురించి మేము ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పార్టీ గురించి తప్ప మీ మీద ఎప్పుడూ నాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు’’.. చంద్రబాబు చేతిలో మోసపోయిన ఏలూరు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి గోపాల్ యాదవ్ సీఎం జగన్ను మెచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ఏలూరులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పక్కన పెట్టి చంద్రబాబు పుట్ట మహేష్ యాదవ్ కి ఇవ్వడంపై గోపాల్ యాదవ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. -
ఆరు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులు.. ప్రకటించిన అఖిలేష్
లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లోని ఆరు స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సంభాల్ నుంచి ఎస్పీ టికెట్పై జియావుర్ రెహమాన్ బుర్క్ పోటీ చేయనుండగా, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ అవానా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తారని ఎస్పీ విడుదల చేసిన జాబితా పేర్కొంది. అలాగే భగవత్ శరణ్ గంగ్వార్ పిలిభిత్ నుంచి, రాజీవ్ రాయ్ ఘోసీ నుంచి పోటీ చేయనున్నారు. రాజేంద్ర ఎస్ బింద్ మీర్జాపూర్ నుంచి ఎస్పీ టికెట్పై పోటీ చేస్తారని తెలిపింది. మొత్తం ఏడు దశలలో లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఇప్పటివరకూ ఐదు జాబితాలు ప్రకటించగా ఇది ఆరోది. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 47కి చేరింది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఇచ్చింది. ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 17 లోక్సభ స్థానాలను కాంగ్రెస్కు వదిలివేసింది. కాంగ్రెస్ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్బరేలీ, అమేథీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఉన్నాయి. -
బీజేపీ తొలి జాబితాపై నేతల్లో అసంతృప్తి?
2024 లోక్సభ ఎన్నికలకు కర్ణాటక నుంచి పోటీచేసే 20 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదిమొదలు బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారంతా కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. వారం రోజుల క్రితం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన కుమారుడు కేఈ కాంతేష్కు చోటు దక్కకపోవడంతో ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్పపై తీవ్రంగా మండిపడ్డారు. కర్నాటకలో 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ తన కుమారునికి హవేరీ లోక్సభ సీటును కేటాయించాలని కేఎస్ ఈశ్వరప్ప కోరారు. అయితే ఆ పార్టీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని పోటీకి దింపింది. తన కుమారుడికి టికెట్ రాకపోవడంతో కలత చెందిన ఈశ్వరప్ప అందుకు నిరసనగా యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై విజయేంద్రపై శివమొగ్గ నుంచి తాను పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటక బీజేపీ ఒక కుటుంబం ఆధీనంలో ఉందని, దానిని అందరూ వ్యతిరేకించాలన్నారు. ఇదిలావుండగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత విముఖత చూపిన మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ కూడా హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. మరోవైపు కొప్పల్ నుంచి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కారడి సంగన్నకు టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి డాక్టర్ బసవరాజ్ను పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది. తాను కూడా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నానని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంగన్న మీడియాకు తెలిపారు. తుమకూరు నుంచి వి సోమన్నను బీజేపీ పోటీకి దింపడంతో కర్ణాటక మాజీ మంత్రి జేసీ మధుస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన (యడ్యూరప్ప) తనకు అండగా నిలవకపోవడం, తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వకపోవడం బాధగా ఉందని, దీంతో పార్టీలో ఉండాలా వద్దా? అనే ఆలోచనలో పడ్డానని అన్నారు. కాంగ్రెస్లోకి వెళ్లడం కూడా సేఫ్ జోన్ కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
Pawan Kalyan: పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా లేరా?
లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివిన ప్యాకేజీ స్టార్ పవన్కల్యాణ్కు పార్టీ ఎలా నడపాలో తెలియదు. అసలు పార్టీ పెట్టిందే మరో పార్టీ కోసం కదా? అందుకే పదేళ్ళ పార్టీకి గ్రామసీమల్లో కార్యకర్తలే కనిపించరు. బూత్ లెవెల్ నుంచి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో ఆయనకు తెలియదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలాగొలా 21 సీట్లను తీసుకున్నారు. వాటిలో ఇప్పటికి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన సీట్లకు అభ్యర్థులు ఎక్కడున్నారు? వాటిని సరైన నేతలకు ఇస్తారా? లేక బహిరంగ వేలానికి పెడతారా? అసలు పవన్ ఆలోచన ఏంటి?.. జనసేన అధినేత పవన్కు ప్యాకేజీ స్టార్ పేరు బాగా సూటయింది. ఆయన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా..ప్రజల అభిప్రాయం అదే. పార్టీ స్థాపించి పదేళ్ళయినా సంస్థాగత నిర్మాణం అంటే ఏంటో ఆయనకు తెలియడంలేదు. కాని సినిమాల్లో మాదిరిగా స్టేజీ మీద ఊగిపోతూ..గంగవెర్రులెత్తుతున్నట్లుగా ప్రసంగాలు చేసి సభికులకు ఆహ్లాదం పంచుతున్నారు. పార్టీ స్థాపించింది తన కోసం..తన వారి కోసం కాదని అందరికీ తెలుసు. చంద్రబాబును మోయడానికే పార్టీ పెట్టారు. పదేళ్ళ తర్వాత కూడా మోయడం కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన ఎన్ని సీట్లు ఇచ్చిన మహాప్రసాదం అని తీసుకుంటున్నారు. మొత్తానికి 21 సీట్లు పవన్కు విసిరేశారు చంద్రబాబు. మరి సీట్లన్నిటికీ అభ్యర్థులున్నారా? వారిని ఎలా ఎంపిక చేస్తున్నారు?. చదవండి: తేలు కుట్టిన దొంగ రామోజీ పవన్ కల్యాణ్ సభలు నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదిక మీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడు కనిపించరు. ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ ప్రకటించారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి ఇస్తున్నారు. ఒకటీ అరా తప్ప జనసేనకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యేగా పోటీచేయగల నాయకుల కొరత బాగా ఉంది. అందుకే సీట్ల సంఖ్య తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. దీన్ని పార్టీ దుస్థితి అనాలో.. పవన్ కల్యాణ్లోని వ్యాపార మెళకువ అనాలో తెలియడంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్కు ఆయా స్థానాల్లో పోటీ చేయించేందుకు కూడా అభ్యర్థులు లేక..సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి వాటిని అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కింది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు. పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ఆయన గురించి తెలిసినవారు అభిప్రాయపడుతున్నారు. రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్.. కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారనే టాక్ బాగా నడుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన (ఫొటోలు)
-
YSRCP Candidates List: అభ్యర్థుల జాబితా (జిల్లాల వారి లిస్ట్)
-
YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ ప్రకటించింది. (జిల్లా మీద నొక్కండి.. అభ్యర్థుల పేర్లను చూడండి) శ్రీకాకుళం అభ్యర్థుల జాబితా విజయనగరం అభ్యర్థుల జాబితా పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థుల జాబితా విశాఖపట్నం అభ్యర్థుల జాబితా అనకాపల్లి అభ్యర్థుల జాబితా అల్లూరి అభ్యర్థుల జాబితా కాకినాడ అభ్యర్థుల జాబితా తూర్పు గోదావరి అభ్యర్థుల జాబితా కోనసీమ అభ్యర్థుల జాబితా పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా ఏలూరు అభ్యర్థుల జాబితా ఎన్టీఆర్ అభ్యర్థుల జాబితా కృష్ణా అభ్యర్థుల జాబితా గుంటూరు అభ్యర్థుల జాబితా పల్నాడు అభ్యర్థుల జాబితా బాపట్ల అభ్యర్థుల జాబితా ప్రకాశం జిల్లా అభ్యర్థుల జాబితా నెల్లూరు అభ్యర్థుల జాబితా తిరుపతి అభ్యర్థుల జాబితా చిత్తూరు అభ్యర్థుల జాబితా అన్నమయ్య అభ్యర్థుల జాబితా వైఎస్సార్ జిల్లా అభ్యర్థుల జాబితా నంద్యాల అభ్యర్థుల జాబితా కర్నూలు అభ్యర్థుల జాబితా అనంతపురం అభ్యర్థుల జాబితా శ్రీసత్యసాయి అభ్యర్థుల జాబితా ఏపీ 175.. అన్ని పార్టీల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి -
YSRCP ఏలూరు అభ్యర్థులు వీళ్లే
ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP కోనసీమ అభ్యర్థులు వీళ్లే
కోనసీమ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP అనకాపల్లి అభ్యర్థుల జాబితా ఇదే
అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP: అల్లూరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP: విజయనగరం జిల్లా అభ్యర్థులు వీళ్లే
విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP మన్యం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే
పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
YSRCP: శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు వీళ్లే
శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
యూపీ లోక్సభ బరిలో బీజేపీ అభ్యర్థులెవరు? ఎందుకింత జాప్యం?
రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రస్తావన లేదు. దీంతో పార్టీ తన మూడో జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తాజాగా 72 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంకా ఉత్తరప్రదేశ్ జాబితాను విడుదల చేయలేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఒక స్థానం, పూర్వాంచల్, అవధ్లలో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సమస్యగా మారిందని అంటున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు యూపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి సమస్యలేదని ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ సీట్లపై పార్టీ నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 2న విడుదల చేసింది. ఇందులో 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి, హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ఉన్నాయి. కాగా బీజేపీ రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ సహా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయి. -
మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు -
ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే!
సరిపడా నిద్రా అవసరమే... విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్కు గుడ్బై చెప్పాలి కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్ కార్యకలాపాల్లోను మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్ఫోన్లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్స్కు గుడ్బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ టెలీమెడిసన్ కాల్ సెంటర్ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్ కాల్ సెంటర్ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్లకు ఫోన్ చేసి కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్సెంటర్ సేవలు పొందవచ్చు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బిహార్లో మూడు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్లో ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది. బిహార్లో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతానికి మంగళ్ పాండే, డాక్టర్ లాల్ మోహన్ గుప్తా, అనామికా సింగ్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ బహదూర్ పాఠక్, మహేంద్ర కుమార్ సింగ్, మోహిత్ బెనివాల్, అశోక్ కటారియా, ధర్మేంద్ర సింగ్, రాంతీరత్ సింఘాల్, సంతోష్ సింగ్లను రంగంలోకి దింపింది. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 21న జరగనుండగా నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మార్చి 11. మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మాజీ మంత్రి అబ్దుల్బరీ సిద్ధిఖీ, ఊర్మిళా ఠాకూర్, సయ్యద్ ఫైసల్ అలీలను బరిలో నిలిపింది. -
10 తర్వాత ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా!
ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను మార్చి 10 తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండో దశ సమావేశాలను మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనుంది. పోటీదారుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ షార్ట్లిస్ట్ చేసి, 16 మంది పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. ఇందులో ఐదుగురి పేర్లపై కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్ ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, నాగాలాండ్, తెలంగాణ, లక్షద్వీప్, సిక్కిం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరాఖండ్ను చేర్చలేదు. కేంద్ర ఎన్నికల కమిటీ రెండవ సమావేశంలో ఉత్తరాఖండ్లోని ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పౌరీ గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, అల్మోరా, తెహ్రీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కరణ్ మహరా తెలిపారు. మొత్తం 42 మంది పార్టీ నేతలు ఐదు స్థానాల టిక్కెట్ల కోసం పోటీ పడ్డారని సమాచారం. -
యూపీలో బీజేపీని ఢీకొట్టే ఎస్పీ అభ్యర్థులు వీళ్లే..
ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) 2024 లోక్సభ ఎన్నికలకు ప్రస్తుతానికి 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్తోపాటు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుత మైన్పురి ఎంపీగా ఉన్న డింపుల్ యాదవ్ మరోసారి అదే నియోజకవర్గం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లక్నో, అంబేద్కర్ నగర్ స్థానాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు రవిదాస్ మెహ్రోత్రా, లాల్జీ వర్మలను పార్టీ పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి బలమైన పక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో గట్టి పొత్తులో ఉంది. అనేక విడతల సమావేశాల తర్వాత, రెండు పార్టీలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని కీలక రాష్ట్రాల్లో 2024 లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒక అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం యూపీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా మిగిలిన 63 స్థానాలు ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. 2019లో 80 సీట్లలో 62 సీట్లను బీజేపీ గెలుచుకుంది. జనరల్ వీకే సింగ్ తన సమీప ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీకి చెందిన సురేష్ బన్సాల్పై 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో జనరల్ వీకే సింగ్ కాంగ్రెస్కు చెందిన రాజ్ బబ్బర్పై 5,67,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది 2008లో నమోదైన సంచలన రికార్డు. ఇప్పటివరకు ఎస్పీ ప్రకటించిన అభ్యర్థులు వీళ్లే.. అభ్యర్థి: లోక్సభ స్థానం డింపుల్ యాదవ్: మెయిన్పురి కాజల్ నిషాద్: గోరఖ్పూర్ రామ్ ప్రసాద్ చౌదరి: బస్తీ లాల్జీ వర్మ: అంబేద్కర్ నగర్ అవధేష్ ప్రసాద్: ఫైజాబాద్ శివశంకర్ సింగ్ పటేల్: బండా రాజా రామ్ పాల్: అక్బర్పూర్ నావల్ కిషోర్ శాక్య: ఫరూఖాబాద్ అన్నూ టాండన్: ఉన్నావ్ ఆనంద్ భదౌరియా: ధౌరహర ఉత్కర్ష్ వర్మ: ఖిరి ధర్మేంద్ర యాదవ్: బదౌన్ దేవేష్ శక్య: ఏటా అక్షయ్ యాదవ్: ఫిరోజాబాద్ రవిదాస్ మెహ్రోత్రా: లక్నో అఫ్జల్ అన్సారీ: ఘాజీపూర్ రాజేష్ కశ్యప్: షాజహాన్పూర్ ఉషా వర్మ: హర్దోయ్ ఆర్కే చౌదరి: మోహన్లాల్గంజ్ ఎస్పీ సింగ్ పటేల్: ప్రతాప్గఢ్ రమేష్ గౌతమ్: బహ్రైచ్ శ్రేయ వర్మ: గోండా వీరేంద్ర సింగ్: చందౌలీ రాంపాల్ రాజవంశీ: మిస్రిఖ్ -
RLD: అలా ఎన్డీఏలో చేరిక.. ఇలా అభ్యర్థుల ప్రకటన!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా చేరిన రెండు రోజుల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (RLD) లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్ఎల్డీ వెల్లడించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ పార్టీ బిజ్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ నుండి రాజ్కుమార్ సాంగ్వాన్లను పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మలూక్ నగర్ బిజ్నోర్ స్థానాన్ని గెలుచుకుంది. బాగ్పట్ సీటును బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు కూడా ఆర్ఎల్డీ అభ్యర్థిని ప్రకటించింది. యోగేష్ చౌదరిని రంగంలోకి దించింది. ఉత్తరప్రదేశ్లో 51 మందితో సహా దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా 80 సీట్లు ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్ కీలకం . జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు మరణానంతరం గత నెలలో భారతరత్న అవార్డు లభించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో 2019లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుతో పోటీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 స్థానాలను కైవసం చేసుకుంది. -
‘టెట్’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ పేర్కొన్నారు. కేటాయింపు ఇలా.. మ్యాథ్స్, సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406 మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్ వివరించారు. ► సోషల్ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు. ► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. ► ఇంగ్లిష్ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు. ► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు. -
సగం సీట్లపై స్పష్టత వస్తుందా?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు న్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడంటే... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్: కిషన్రెడ్డి కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్ మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్గౌడ్, పొన్నా ల హరీష్రెడ్డి జహీరాబాద్: ఎం.జైపాల్రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి మహబూబ్నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి, శాంతకుమార్ భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్రెడ్డి మెదక్: ఎం.రఘునందన్రావు, జి. అంజిరెడ్డి వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి నాగర్కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం నల్లగొండ: మన్నె రంజిత్యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి మహబుబాబాద్: హుస్సేన్నాయక్ / మరొకరికి ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్రావు, రంగా కిరణ్ -
కాంగ్రెస్లో రేవంత్ కొత్త పోకడలు!
ఆశావహులు దరఖాస్తులు సమర్పించాలి. ఆ అప్లికేషన్లను ఎన్నికల కమిటీలు పరిశీలించాలి. కొన్ని పేర్లను ఫైనలైజ్ చేయాలి. వాటిని అధిష్టానానికి మరోసారి జల్లెడ పట్టాలి. వడపోసిన జాబితాను అధిష్టానం ఓకే చేయాలి. ఆ తర్వాతే పార్టీ పెద్దలు అభ్యర్థుల పేర్లను స్వయంగా ప్రకటించాలి. ఇది ఏ ఎన్నికల సమయంలో అయినా.. అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అవలంభించే విధానం. కానీ, తెలంగాణలో ఆ సిస్టమ్కు బ్రేక్ పడింది!. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రేవంత్రెడ్డి కాంగ్రెస్లో కొత్త పోకడలకు పోతున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా.. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును సీఎం హోదాలో రేవంత్ రెడ్డి(పీసీసీ చీఫ్ కూడా) ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండానే రేవంత్ అభ్యర్థుల జాబితాపై ప్రకటన చేయడం ఏంటని? అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాక మునుపే తెలంగాణ కాంగ్రెస్ తరఫున తొలి అభ్యర్థి ప్రకటన వెలువడింది. బుధవారం కొడంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్.. కోస్గి సభలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించారు. ఒక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 50వేలకు తగ్గకుండా వంశీకి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారాయన. సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ.. ఇలాగేనా చేసేది? .. ఓ బహిరంగసభలో అభ్యర్థిని రేవంత్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధిష్టానం అంటే లెక్కే లేనట్లు వ్యవహరిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణ.. వాటి పరిశీలన.. కమిటీల చర్చోపచర్చలు.. ఇన్ని జరగాల్సి ఉండగా.. అవేం పట్టన్నట్లు ఒక అభ్యర్థిని ప్రకటించడంతో రేవంత్ తీరుపై సీనియర్లు గుర్రుమంటున్నారు. మొన్నీమధ్యే.. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనను చివరి రోజు వరకు కాంగ్రెస్ నాన్చింది. ఇందులోనూ రేవంత్ హస్తం ఉందనే అభిప్రాయానికి ఇప్పుడు సీనియర్లు వచ్చారు. ఎంపీ అభ్యర్థులను కూడా జిల్లా వారీగా రేవంత్రెడ్డి ఇలాగే ప్రకటిస్తారా? అంటూ గుసగుసలాడుకుంటుకున్నారు. అయితే.. ఈ విషయంలో రేవంత్ తొందర పడలేదని.. హైకమాండ్ డైరెక్షన్లోనే అంతా నడుస్తోందని ఢిల్లీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ ప్రకటన వెనుక ఆయన! మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం కాంగ్రెస్లో సీనియర్లు అర్జీలు పెట్టుకున్నారు. అందులో మన్నె జీవన్రెడ్డి, కొత్త కోట సీతాదయాకర్ లాంటివాళ్లు ఉన్నారు. అయినా గానీ.. వంశీచంద్రెడ్డికి ఎలా సీటు ప్రకటించారనే డౌట్లు లేవనెత్తారు కొందరు. అయితే రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం వెనుక.. ఢిల్లీ నుంచి మద్ధతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్కు హైకమాండ్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. రాహుల్ గాంధీ అనే చర్చా పార్టీలో జరుగుతోంది. పార్టీలో యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చాలాకాలంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా బల్మూరీ వెంకట్కు, రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం దక్కినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతగా ఉన్న టైంలో రాహుల్తో వంశీకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికి తోడు.. జోడో యాత్ర సమయంలోనూ రాహుల్ వెంటే వంశీ నడిచారు. ఈ పరిణామాలన్నీ వంశీకి అనుకూలించాయనే చెప్పొచ్చు. ఇక అధిష్టానం సూచనలతోనే రాబోయే రోజుల్లోనూ మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. -
రాజ్యసభ సభ్యత్వానికి.. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం. విజయరాజుకి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితారాణి, అభ్యర్థుల తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్పీపీ నేత వి. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 3 స్థానాల్లో విజయం సాధిస్తాం: వైవీ శాసనసభలో అత్యధిక సంఖ్యా బలం మాకే ఉంది. వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురం విజయం సాధిస్తాం. సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్కి ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. గతంలో బీసీలు నలుగురికి అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశమిచ్చారు. చరిత్రలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని పార్లమెంట్ మెట్లు ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్న, సంక్షేమ–అభివృద్ధి పథకాలు అందాలన్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి. వైఎస్సార్సీపీ ఆశయ సాధనకు పనిచేస్తాం : మేడా రఘునాథరెడ్డి అన్నా.. నువ్వు పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టి ముఖ్యమంత్రి జగన్ నాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి త్వం కేటాయించారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ని. నేను దేశవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇలాంటి మనస్సున్న సీఎంను ఎక్కడా చూడలేదు. ఒకరికి మేలుచేసే విషయంలోనూ, గౌరవించే విషయంలోను ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. ఎంతో పోటీ ఉన్నా నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి పిలిచి మరీ నాకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్సార్సీపీ ఆశయాల సాధనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేడా సోదరులం కలిసి పనిచేస్తాం. పేదలను జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు: గొల్ల బాబురావు అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్న రోజులివి. ఈ కాలంలో మానవీయాన్ని ఒంటినిండా నింపుకున్న ఏకైక రాజకీయ నేతగా ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కన్పింస్తారు. కష్టకాలంలో సీఎం జగన్ వెంట నడిచాను. ఎవరు మన వారు.. ఎవరు పరాయి వారు అనేది ఆయనకు తెలుసు. నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకునే కుటుంబం వైఎస్సార్ది. చంద్రబాబు పార్టీలో దళితులకు రాజ్యసభ సీటు అందని ద్రాక్షే. అదే ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి పదవులైనా అన్ని వర్గాలకు సమంగా పంచుతారు. పేద వర్గాలను ఆయన రాజ్యసభకి పంపిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ రుణం తీర్చుకోలేనిది. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం. బీ–ఫారాలు అందజేసిన సీఎం జగన్ సీఎం జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారికి సీఎం జగన్మోహన్రెడ్డి బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
‘గురుకుల’కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో సంక్షేమ గురకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అదేవిధంగా గురువారం రాత్రి గురుకుల పాఠశాలల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్, పోçస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీఆర్ఈఐఆర్బీ.... వాటిని బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల బోర్డు ఫోన్లలో సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) ద్వారా సమాచారంఇచ్చింది. సాంకేతిక కారణాలతో టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్ మొరాయించడంతో అభ్యర్థులు జాబితాలను పరిశీలించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం తర్వాత వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు అధిగమించడంతో వెబ్సైట్ తిరిగి తెరుచుకుంది. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన... ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్ఈఐఆర్బీ 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన ఉదయం 9గంటల నుంచి చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(ఉమెన్)లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సుపత్రాలు, సెల్ఫ్ అటెస్టేషన్ పత్రంతో హాజరు కావాల్సి ఉంటుంది. చెక్లిస్టును బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని గురుకుల బోర్డు కన్వినర్ అభ్యర్థులకు సూచించారు. 10 నుంచి డెమో పరీక్షలు... ప్రస్తుతం విడుదల చేసిన 1:2 జాబితాల్లో ఎంపికైన అభ్యర్థులకు డెమో పరీక్షలను గురుకుల బోర్డు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు అదేవిధంగా పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుంచి డెమో పరీక్షలు నిర్వహిస్తారు. తుది జాబితాలో అర్హత సాధించిన వారికి ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు సంక్షేమ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. త్వరలోనే ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 స్థానాలకు గానూ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 16వ తేదీ లోపు ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు వీళ్లేనా.. తెలంగాణాలోని కీలక లోక్సభ స్థానాలకు ప్రధానంగా కొన్ని పేర్లను చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి, కరీంనగర్కు బండి సంజయ్, నిజామాబాద్కు ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్నగర్కి డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజిగిరి టికెట్ను మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కాగా మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, మహబూబ్బాద్ లలో కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో బీఆర్ఎస్ నేతలపై కమలం పార్టీ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీదే అని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.