కాంగ్రెస్‌: ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌: తెలంగాణ, ఏపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్‌

Published Thu, Apr 25 2024 4:52 PM

Telangana Andhrapradesh Final Congress Mp List Released

సాక్షి,ఢిల్లీ: నామినేషన్‌లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్‌ బుధవారం(ఏప్రిల్‌24) ప్రకటించింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. 

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి, కరీంగనర్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా సమీర్‌ ఉల్లాఖాన్‌ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేయడం గమనార్హం. 

అటు ఏపీలోనూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జాబితాను విడుదల చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement