ప్రజలిచ్చిన తీర్పును సవాలుగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి | kishan reddy slams on congress in padadhikari meeting hyderabad | Sakshi
Sakshi News home page

ప్రజలిచ్చిన తీర్పును సవాలుగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి

Published Tue, Aug 6 2024 8:12 PM | Last Updated on Tue, Aug 6 2024 8:21 PM

kishan reddy slams on congress in padadhikari meeting hyderabad

సాక్షి, హైదరాబాద్: ఢిల్లోని ఎర్రకోటపై ప్రధాని నరేం‍ద్ర మోదీ 11వ సారి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని  కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అన్నారు. ఆయన మం‍గళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  

‘ఆగస్టు 15న తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి.   రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీపై రైతులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం. దానికి రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు. రుణమాఫీ కాలేదని.. ఎవరు సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరినీ పెట్టాం.. పెరిగిన కాల్స్ చూసి ఇప్పుడు ఆరుగురిని పెట్టినా సరిపోట్లేదు. ప్రజలు బీజేపీపై ఆశతో తెలంగాణలో 36 శాతం ఓటు షేర్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దాం’అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement