జమ్ము కశ్మీర్‌: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’ | NC leader Farooq Abdullah big message to Mehbooba Mufti | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’: ఫరూఖ్ అబ్దుల్లా

Published Mon, Oct 7 2024 4:16 PM | Last Updated on Mon, Oct 7 2024 5:01 PM

NC leader Farooq Abdullah big message to Mehbooba Mufti

శ్రీనగర్‌:  జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఫలితాలు హంగ్‌ దిశగా వెలువడతాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. 

ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తు​న్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.

‘‘జమ్ము కశ్మీర్‌లో  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్‌ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

 

..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్‌ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్‌- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement