
భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. రేపు(ఆదివారం) రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరగనుందని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.
చదవండి: ‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’
Comments
Please login to add a commentAdd a comment