Ministers
-
Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత ప్రవేశ్ వర్మ హర్షం వ్యక్తి చేశారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
పవన్ ను తొక్కేయడానికే బాబు కుట్రలు
-
ర్యాంకుల వెనుక కుట్రలు
-
నాలుగు పథకాలపై.. నేడు కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించాలన్న దానిపై కీలకభేటీ జరగనుంది. దావోస్ పర్యటన ము గించుకొని శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. ఈ నాలుగు పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఆ సమావేశంలోనే స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామసభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. మంత్రులతో సమావేశానంతరం పథకాల ప్రారంభానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. నాలుగు రోజుల గ్రామసభలు పూర్తి: ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర మూడు పథకాలకు సంబంధించి గ్రామస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు మరికొన్ని రోజులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్లీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు.ప్రధానంగా రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతే పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గత సంవత్సరంలో నిర్వహించిన ప్రజాపాలన సమావేశాల్లో 83 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 30 లక్షల మంది అర్హులుగా తేల్చారని, అందులోనూ తొలి విడతలో భాగంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్ల, గిరిజనులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ⇒ రేషన్కార్డులకు సంబంధించి 6.85లక్షల మంది లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించనున్నారు. ఆ తర్వాతే కొత్త రేషన్కార్డుల లబ్ధిదారుల తుది జాబితా తయారు చేయనున్నారు. ⇒ రైతు భరోసా కోసం ఈనెల 16 నుంచి 20వ తేదీవరకు గ్రామస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 10–15 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కావని తేల్చినట్టు తెలిసింది. ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలో భాగంగా అవసరమయ్యే నిధుల చెక్కును కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.సీఎం రేవంత్కు ఘన స్వాగతంశంషాబాద్: దావోస్లో మూడురోజుల పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్లో ఎమ్మెల్యేలు శాలువాలతో సీఎంను సత్కరించారు. -
నేను మారాను.. మీరూ మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ‘‘మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను.. మీరూ మారండి’’ అంటూ సీఎం సూచించారు.కొందరు ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అతి చేస్తే సహించేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని రేవంత్ చెప్పారు.సీఎం రేవంత్రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సు జరగనుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. -
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
-
మీకు చేతనైతే.. ప్రభుత్వానికి బొత్స సవాల్
-
శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్ మందలింపు
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..ఇవాళ నాలుగో రోజు సెషన్లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు. అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్లో కూర్చున్నారు. ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు. -
AP: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, విజయవాడ: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది.జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీరే..శ్రీకాకుళం జిల్లా- కొండపల్లి శ్రీనివాస్పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు- కింజరాపు అచ్చెన్నాయుడువిజయనగరం జిల్లా- వంగలపూడి అనితవిశాఖ జిల్లా- డోలా బాలవీరాంజనేయస్వామిఅల్లూరి సీతారామరాజు జిల్లా- గుమ్మడి సంధ్యారాణిఅనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్రకాకినాడ జిల్లా- పొంగూరు నారాయణతూర్పుగోదావరి జిల్లా- నిమ్మల రామానాయుడుఏలూరు జిల్లా- నాదెండ్ల మనోహర్పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు- గొట్టిపాటి రవికుమార్ఎన్టీఆర్ జిల్లా- సత్యకుమార్ యాదవ్కృష్ణా జిల్లా- వాసంశెట్టి సుభాష్గుంటూరు జిల్లా- కందుల దుర్గేష్బాపట్ల జిల్లా- కొలుసు పార్థసారథిప్రకాశం జిల్లా- ఆనం రామనారాయణరెడ్డినెల్లూరు జిల్లా- ఎన్ఎండీ ఫరూఖ్నంద్యాల జిల్లా- పయ్యావుల కేశవ్అనంతపురం జిల్లా- టీజీ భరత్శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు- అనగాని సత్యప్రసాద్వైఎస్సార్ జిల్లా- ఎస్.సవితఅన్నమయ్య జిల్లా- బీసీ జనార్దన్రెడ్డిచిత్తూరు జిల్లా- మండిపల్లి రాంప్రసాద్రెడ్డి -
సీఎం అతిషీతో పాటు ప్రమాణం.. ఐదుగురు మంత్రుల వివరాలివే..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.మంత్రుల వివరాలుగోపాల్ రాయ్..ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్లో ఆనంద్ కుమార్ ఆప్కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
విజయవాడ వరదలకు టీడీపీ మంత్రులు జంప్.. వీళ్లా మన మంత్రులు..
-
మాకు జీతాలేం వద్దు.. సీఎం, మంత్రుల తీర్మానం
రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు. -
‘మహిళల్ని అవమానించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై మంత్రులు పొన్నం, సీతక్కలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటున్నారు వాళ్లు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.‘‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా?. మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం ఈ వ్యాఖ్యలు. గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం.గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు?. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. మేం చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. కేటీఆర్, ఆయన బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాల్సిందే అని సీతక్క అన్నారు.మరోవైపు రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని కేటీఆర్ అవమానపరుస్తున్నారు. అల్లం, ఉల్లి పొట్టు తీసుకుంటున్నట్లు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ డాన్స్లు చేసుమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్లు తక్షణమే కేటీఆర్పై కేసు నమోదు చేయాలి అని మంత్రి పొన్నం అన్నారు. -
ఆయేషా.. వారెవ్వా..!
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీలో చేరింది.సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.ఐదు రోజుల సదస్సు.. ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది. -
మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్
-
ఆ మంత్రులిద్దరికీ చంద్రబాబు వార్నింగ్?!
అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్ తీసుకున్నారు.నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే.. నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. -
విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యలపై లోతుగా చర్చించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై చర్చించామని.. రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ మంత్రులు ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. సీఎంల భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎస్లతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.‘‘మంత్రులతో కూడిన మరో కమిటీ వేయాలని నిర్ణయించాం. 2 వారాల్లోగా త్రీమెన్ కమిటీ కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తాం. డ్రగ్స్ను నియంత్రించడానికి రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. -
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి పై క్లారిటీ ?
-
క్షీణిస్తున్న మంత్రి ‘ఆతిషి’ ఆరోగ్యం
న్యూఢిల్లీ: తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం మరింత నీటిని విడుదల చేయాలన్న డియాండ్తో ఢిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం(జూన్24) ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా ఆతిశీ మీడియాతో మాట్లాడారు. తన రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని చెప్పారు. బరువు తగ్గానని తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అయినా తాను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతానన్నారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి మరింత నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా ఢిల్లీకి విడుదల చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఢిల్లీలో 28 లక్షల మంది ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఆతిశీ దీక్షకు మద్దతుగా క్యాండిల్లైట్ మార్చ్ నిర్వహిస్తామని ఆప్ తెలిపింది. -
ఏపీ కొత్త మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు ఇవే
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్కు ఎట్టకేలకు తెర పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలను ఆయనకే ఇచ్చారు. అలాగే.. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్కే దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతిభదత్రల శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు.మిగతా వాళ్లలో మంత్రుల శాఖల వివరాలివే..వంగలపూడి అనిత-హోంశాఖనారా లోకేష్- మానవ వనరులు,ఐటీ కమ్యూనికేషన్స్ఆనం రాంనారాయణరెడ్డి-దేవాదాయ శాఖనిమ్మల రామానాయుడు- జల వనరుల శాఖనాదెండ్ల మనోహర్- పౌర సరఫరాల శాఖపొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి శాఖకింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయశాఖడోలా శ్రీబాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖఎన్ఎండీ ఫరూక్- మైనార్టీ వెల్ఫేర్, న్యాయ శాఖకొలుసు పార్థసారధి-హౌసింగ్, సమాచార శాఖగొట్టిపాటి రవికుమార్- విద్యుత్శాఖపయ్యావుల కేశవ్- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలుకందుల దుర్గేష్- పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖవాసంశెట్టి సుభాష్-కార్మిక శాఖఅనగాని సత్యప్రసాద్-రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లుమండిపల్లి రాంప్రసాద్రెడ్డి- రవాణా, యువజన,క్రీడల శాఖటీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యశాఖసత్యకుమార్- వైద్య, ఆరోగ్యశాఖకొల్లు రవీంద్ర-ఎక్సైజ్, గనుల శాఖబీసీ జనార్థన్రెడ్డి- రోడ్లు, భవనాలు, లిక వసతులు, పెట్టుబడుల శాఖగుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖఎస్.సవిత- బీసీ సంక్షేమం, చేనేత, ఔళి శాఖకొండపల్లి శ్రీనివాస్- ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు -
ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం
-
తెలంగాణ మంత్రులకు లగ్జరీ కార్లు
-
ముఖ్యమైన శాఖలు ఎవరెవరికి..?
-
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
సమస్తిపూర్ కుస్తీ.. మంత్రుల వారసుల ఫైట్
పాట్నా: బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్పై ఎన్డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది. -
ఆ టెక్నాలజీతో జాగ్రత్త!.. మంత్రులను హెచ్చరించిన మోదీ
భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' నిన్న ఢిల్లీలో జరిగిన మంత్రి మండలి చివరి అధికారిక సమావేశానికి అధ్యక్షత వహించి సుమారు గంటసేపు ప్రసంగిస్తూ.. కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వివాదాలకు దూరంగా ఉండాలని, డీప్ఫేక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రులకు సూచించారు. ఏదైనా ప్రకటనలు చేసే ముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డీప్ఫేక్ టెక్నాలజీతో ప్రత్యర్థులు ఎంత దారుణానికైనా ఒడిగడతారని మోదీ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాబోయే లోక్సభ 2024 ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ మళ్లీ యూపీలోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ బరిలోకి దిగారు. వాస్తవాలను వక్రీకరించే దిశలో కొందరు డీప్ఫేక్ టెక్నాలజీ వాడతారని డీప్ఫేక్ల సమస్యను గురించి మోదీ వివరించారు. గతంలో కూడా దీని గురించి వెల్లడిస్తూ.. ఏఐ రూపొందించిన ఫోటోలు, వీడియోలు నిజమైనవిగా కనిపిస్తాయని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ తాను గార్బా చేస్తున్నట్లు చూపించిన వీడియో అని వెల్లడించారు. ఇదీ చదవండి: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. భవిష్యత్ వెల్లడించిన మోదీ -
షర్మిల, చంద్రబాబుకు ఏపీ మంత్రులు కౌంటర్
-
బాబుపై ఏపీ మంత్రుల ఫైర్..
-
సీఎం జగన్ విజన్ కు ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే..
-
YS Jagan: జనాల గుండెతడి తెలిసిన వ్యక్తే నాయకుడైతే..!
గత ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ (ఆఖరికి పాలనా సంబంధిత) నిర్వీర్యం చేశాయి. స్వలాభం చూసుకుని కార్పొరేట్ సెక్టార్లను విపరీతంగా ప్రమోట్ చేశాయి. ఫలితం.. పేదల బతుకులు మారలేదు. కానీ, 2019 నుంచి స్పష్టమైన మార్పు చూస్తున్నాం. ఆర్థికంగా బలోపేతం అయితేనే అన్నివర్గాలు సమాజంలో గౌరవంగా బతుకుతాయని వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశ్వసించారు. సంక్షేమ పథకాలతో ఆసరాగా నిలిచారు. అదే సమయంలో నాలుగు ప్రధాన అంశాల్లో సమాన న్యాయం కల్పించడం ద్వారా సామాజిక సాధికారత సాధించారు. అందుకే మరోసారి విజయ దుందుభికి ‘సిద్ధం’ అవుతున్నారు! అమ్మ ఒడి.. దేశంలో ఎవరూ ఊహించని పథకం. ఓ పేద తల్లి ద్వారా ఆమె బిడ్డలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం. కానీ, ఈ పథకం ఉద్దేశం వేరు. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చనే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చారనడానికి ఇదొక నిదర్శనం. నాడు నేడు కళ్లెదుటే కనిపిస్తున్న మరో ఉదాహరణ. విద్య రంగం ఒక్కటే కాదు.. వైద్యం, ఆరోగ్యం, అవకాశం(ఉపాధి కల్పన) రంగాల్ని గత ప్రభుత్వం విస్మరిస్తే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయా రంగాల్లో ప్రక్షాళన చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చారు. నవరత్నాల రూపంలో ఈ 57 నెలల పాలనలో డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నేరుగా బటన్ నొక్కి జమ చేసిన సొమ్ము రూ.2లక్షల 50 వేల కోట్లపైనే. ఆ ఖర్చుల్లో 80 శాతం లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే. 2 లక్షల10 వేల ఉద్యోగాలు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన పాలన నుంచి.. ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చి దిద్దుతున్న క్రమం ఇప్పుడు చూస్తున్నాం. జనాల గుండెతడి తెలిసిన నాయకుడు కాబట్టే ఇదంతా సాధ్యమవుతోంది. ‘‘జగన్ పాలన అంబేద్కర్ ఆకాంక్షలకు ప్రతిబింబం. సామాజిక సమతుల్యానికి గీటురాయి. అలాంటి పాలనకు.. దళిత, గిరిజన బహుజన వర్గాల వ్యతిరేకి అయిన చంద్రబాబు మధ్య ఎన్నికల సమరం జరగబోతోంది. పెత్తందారుల పాచికలతో కుట్రలు, మోసాలతో.. డబ్బు వరదలై ప్రవహించినా జగన్ వెంట పేదకులాలన్నీ నిలవబోతున్నాయి’’ పొలిటికల్ ఎంపవర్మెంట్.. సామాజిక సమతుల్యత కోసం ఉద్యమాలు జరిగిన చరిత్ర మనది. అయితే అప్పటిదాకా నిమ్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లేని ఏపీలో జగన్ రాకతో మార్పు వచ్చింది. సోషల్ జస్టిస్ ఒక నినాదం కాదు.. తమ ప్రభుత్వ విధానమని నిరూపించారు జగన్. ఓ మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి.. అది గిరిజనుడు, అలాగే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇవాళ మంత్రి పదవులు కాగలిగారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ పాలన అందించడమే కాదు.. వాళ్లకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన నాయకుడు దేశంలో వైఎస్ జగన్ తప్ప ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. నామినేటెడ్ పోస్టుల మొదలు వివిధ పదవుల్లో చోటు, మంత్రివర్గంలో స్థానం.. జాతీయస్థాయిలో పెద్దల సభ(రాజ్యసభ)లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత నిరూపించారు. ఎందుకంటే.. పొలిటికల్ ఎంపవర్మెంట్ లేకుండా ఏ సమాజం కూడా ముందుకు పోదని.. తమ తరఫున ప్రతినిధులు ఉండాలని ప్రతీ వర్గం కోరుకుంటుందనేది ఆయన గ్రహించారు. కాబట్టే అలాంటి వర్గాలకు సాధికారత కల్పించి బాసటగా నిలిచారు సీఎం జగన్. అంబేద్కర్ ఆదర్శాలను, ఆశయాల్ని, భారత రాజ్యాంగాన్ని ఆవలింపు చేసుకున్నారు కాబట్టే.. తాము ఇవాళ ఈ స్థానంలో ఉన్నామని పలువురు మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఏం చెప్పారో మాటా మంత్రీ పూర్తి ఇంటర్వ్యూలో చూసేయండి .. -
సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయానికి సోమవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసుకు వచ్చిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, నారాయణస్వామి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ కుమార్ అప్పారావు, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల గురించి నేతలు సంబంధిత అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. -
ప్రధాని మోడీపై పిచ్చి కామెంట్స్..ముగ్గురు మంత్రులు సస్పెండ్
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Updates: ఈఎన్సీ చీఫ్ మురళీధర్ కామెంట్లు.. ► మేడిగడ్డ బ్యారేజ్లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి ► 20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది ► మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది ► ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది ► ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► కిందికి పోయినా వాటర్ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్ ► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి ► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు ► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు ► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది ► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు ► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా ► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యేవి కాదు. ► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్లు దెబ్బతిన్నాయి. ► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్ల నిర్మాణం ఎలా చేసారు ► బ్యారేజ్లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు ► మునిగిపోయిన పంప్ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్ను ఫైనాన్స్ డిపార్టుమెంట్లో పెట్టారు ► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు ► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే ► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది ► కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది ► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు ► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు. ► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం ► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది ► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు ► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు ► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం ► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది ► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం ► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది. ► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది. ► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి ► మూడు బ్యారేజీల రిపేర్కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది ► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా ► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి ► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం ► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది ► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి ► ENC మరోసారి రిటన్గా నివేదిక ఇవ్వాలి ► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం ► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్లే కాళేశ్వరంకు కీలకం ► అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యాయి ► బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు ► అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు ► ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ► గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండే కీలక అంశాలు ► గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది ► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి? ► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది ► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత? ► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి? మేడిగడ్డకు మంత్రుల బృందం ► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది ► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ► మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి. ► మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది. ►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు ►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన ►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం ►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి ►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది ► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది. జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. అనంతరం E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్కు సీతక్క, నిజామాబాద్కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
టీడీపీ బిగ్ షాక్..కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ మంత్రులు
-
మా లాంటి సీనియర్లకు మీరు కేటాయించడం బాగుంది సార్!
మా లాంటి సీనియర్లకు మీరు కేటాయించడం బాగుంది సార్! -
కాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
-
కేసుల్లేని మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలోని 12 మంది అమాత్యుల్లో సీఎం రేవంత్రెడ్డి సహా తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో తీవ్రమైన క్రిమినల్ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి సహా 12 మంది మంత్రుల అఫిడవిట్ల «ఆధారంగా వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్ సంస్థ శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. రేవంత్ తర్వాత ఉత్తమ్, పొన్నం పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎౖMð్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సీతక్క మినహా అందరూ కోటేశ్వరులే మంత్రివర్గంలోని సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఏడీఆర్ విశ్లేíÙంచిన 12 మంది మంత్రుల ఆస్తుల లెక్క చూస్తే.. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా....అప్పుల జాబితా లోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్లో ఉన్నారు. ఆస్తుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తర్వాత రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రూ.30.04 కోట్లతో సీఎం రేవంత్రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు. -
Telangana: మంత్రులకు శాఖల కేటాయింపు.. ఐటీ మంత్రి ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్ వద్దే ఉంది. మంత్రులు, వారి శాఖలు ఇవే.. రేవంత్ రెడ్డి.. హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ, విద్యుత్ దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్తమ్కుమార్ రెడ్డి: సివిల్ సప్లై, నీటి పారుదల, సీతక్క: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫర్ శ్రీధర్బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు కొండా సురేఖ: అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ పొంగులేటి శ్రీనివాస్: సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ జూపల్లి: ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు పొన్నం ప్రభాకర్: రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ -
మంత్రుల శాఖలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వంలోని 11 మంది మంత్రులు ప్రమాణం చేసినప్పటికీ వారికి గురువారం ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ అభీష్టం మేరకు జరిగే శాఖల కేటాయింపు అధికారికంగా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి, మంత్రులు ప్రమాణం చేసిన రోజునే సాయంత్రానికి సాధారణ పరిపాలన శాఖ ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ నూతన ప్రభుత్వంలో అలా జరగలేదు. మధ్యాహ్నం 2 గంటల లోపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసినప్పటికీ రాత్రి వరకు ఇలాంటి ఉత్తర్వులేవీ రాలేదు. ఈలోపే ఫలానా మంత్రికి ఫలానా శాఖ కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆధారంగా పలువురు మంత్రుల అనుచరులు, సన్నిహితులు తమ నేతకు ఫలానా శాఖ కేటాయించారనే నిర్ధారణకు వచ్చారు. కానీ అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపాయి. ‘ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపు వార్తలను ప్రజలు నమ్మొద్దు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆదేశాలిస్తుంది. ఆ ఆదేశాలు జారీ చేసేంతవరకు శాఖల కేటాయింపుపై ప్రచారాలు నమ్మవద్దు.’ అని గాం«దీభవన్ నుంచి ప్రకటన వెలువడింది. కాగా కొత్త మంత్రులకు శుక్రవారం శాఖల కేటాయింపు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్రాజ్ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్భవన్కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్భవన్ దర్బార్హాల్లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్భవన్కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
17 మంది రాజస్తాన్ మంత్రుల ఓటమి
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుగాలులకు పలువురు మంత్రులు ఓటమి దిశలో కొట్టుకుపోయారు. రాజస్తాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయిన గోవింద్ రామ్ మేఘ్వాల్ సహా 17 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. ఓడిన మంత్రుల్లో రమేశ్ చంద్ మీనా, షాలే మొహమ్మద్, భన్వర్ సింగ్ భటి, శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్లాల్ అంజనా, బీడీ కల్లా, జహిదా ఖాన్, ప్రతాప్సింగ్ కచరియావాస్, భజన్లాల్ జాతవ్, మమతా భూపేశ్, పర్సాదీ లాల్ మీనా, సుఖ్రామ్ విష్ణోయ్, రామ్లాల్ జాట్, ప్రమోద్ జైన్ భయ్యా, రాజేంద్ర యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు సలహాదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు సన్యమ్ లోధా, రాజ్కుమార్ శర్మ, బాబులాల్ నగార్, దానిష్ అబ్రార్సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య సైతం విజయం సాధించలేకపోయారు. ముఖ్యమంత్రి గెహ్లోత్ 25 మంది మంత్రులతో కలిసి ఈసారి తమ గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకోగా కొద్దిమంది మాత్రమే గెలుపు తలుపు తట్టారు. సర్దార్పుర స్థానంలో గెహ్లోత్ గెలిచారు. నలుగురు బీజేపీ ఎంపీల గెలుపు బీజేపీ ఏడుగురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. వీరిలో నలుగురు విజయం సాధించారు. విద్యాధర్ నగర్ బీజేపీ మహిళా ఎంపీ దియా కుమారీ, ఝోట్వారా ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్, తిజారా ఎంపీ బాబా బాలక్ నాథ్, రాజ్యసభ సభ్యుడు కిరోడిలాల్ మీనాలు గెలిచారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్యాదవ్ కార్పొరేటర్గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్లో 2014లో గోపాల్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్అలీ, మాజిద్ హుస్సేన్లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
చైతన్య ఖిలా.. భువనగిరి నుంచి గెలిచి మంత్రులయ్యారు ఇలా..!
సూర్యపేట్: నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు భువనగిరికి ఎంతో విశిష్టత ఉంది. ఆంధ్ర మహాసభ, తొలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరి కేంద్రంగా ప్రారంభమయ్యాయి. కాలానుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులతో ప్రగతి వైపు పయనిస్తోంది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం మూడోంతులు హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజనలో జిల్లా కేంద్రంగా మారింది. భువనగిరిలో ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ రెండు సార్లు, సీపీఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐలు కలిపి ఐదు సార్లు, టీడీపీ ఏడు సార్లు, టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) రెండుసార్లు విజయం సాధించాయి. భువనగిరి నేతలు జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు. నియోజకవర్గం భౌగోళిక చరిత్ర.. భువనగిరి నియోజకవర్గంలో భూదాన్పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, వలిగొండతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న మత్య్సాద్రి వేములకొండ అర్రూరు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం 257 పోలింగ్ కేంద్రాల్లో 2,11,362 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,05,404 మంది పురుషులు, 1,05,968 మంది మహిళా ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. ఈ నియోజకవర్గం సెమీ అర్బన్గా ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో భువనగిరి పట్టణం, మండలం, బీబీనగర్, పోచంపల్లి మండలాలు చేరాయి. నియోకవర్గంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అన్ని మండలాలకు మూసీ జలాలు అందుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి టై అండ్ డై చీరల తయారీ, భువనగిరి, బీబీనగర్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుతో ఎందరికో ఉపాధి కలుగుతోంది. ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి పట్టు చీరలు పుట్టింది ఇక్కడే. ఆచార్య వినోభాబావే భూదా నోద్యమం ప్రారంభించింది పోచంపల్లిలోనే. ఈ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్– భూపాలపట్నం జాతీయ రహదారి 163 ఉంది. సంగారెడ్డి– భువనగిరి– చౌటుప్పల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కాబోతుంది. దాని వెంట రీజినల్ రైల్ లైన్ మంజూరైంది. ఓఆర్ఆర్ నుంచి కొత్తగూడెం వరకు నూతన జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్– కాజీపేట, బీబీనగర్– నడికుడి రైలు మార్గాలున్నాయి. బీబీనగర్లో ఎయిమ్స్ వైద్య సేవలు అందిస్తోంది. సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మంజూరు కానున్నాయి. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ‘రావి’ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పోరుబాట నడిపారు రావి నారాయణరెడ్డి. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రావినారాయణరెడ్డి రెండు చోట్లా విజయం సాధించారు. ఎంపీగా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. భువనగిరి నుంచి గెలిచి మంత్రులయ్యారు.. భువనగిరి నియోజవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు మంత్రులయ్యారు. వారిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలుపొంది ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రిగా.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో భుగర్భ వనరుల శాఖ మంత్రి అయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడి నుంచి గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య మంత్రి వర్గాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలిదశ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. -
సీఎం జగన్కు ఘనస్వాగతం (ఫొటోలు)
-
‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం
సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్ ఉన్నారు. -
పవన్ కళ్యాణ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..!
-
ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
ఢిల్లీ: భారత్- ఇండియా పేరు మార్పు వివాదానికి దూరంగా ఉండాలని మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జీ20తో సహా పలు అంశాలపై జరిపిన చర్చలో ప్రధాని మోదీ.. ఈ మేరకు కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చారు. దేశం పేరు మార్పు అంశంపై ఎలాంటి కామెంట్ చేయకూడదని చెప్పారట. గత రెండు రోజులుగా పేరుమార్పుపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుండగా.. ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జమిలీ ఎన్నికలు, ఇండియా-భారత్ పేరు మార్పు, ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు బీజేపీ గేమ్ ప్లాన్లో భాగంగా ప్రతిపక్షాలు భావించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను పేర్కొనాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను పేర్కొంటూ వాటిపై చర్చలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ.. సమావేశాల ముందు అజెండాను తెలపడం సాంప్రదాయానికి విరుద్ధమని చెప్పారు. సభకు అన్ని పార్టీలకు ఆహ్వానం ఉంటుంది. ప్రజల సమస్యలను అక్కడే చర్చించుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జీ20 డిన్నర్ మీటింగ్కి పంపిన ఆహ్వాన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలను ఎక్కుపెట్టాయి. సాంప్రదాయం ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటామని, దేశం పేరును మార్చబోతున్నారని ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. దేశంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
బాబుకు అరెస్ట్ భయం
-
విశాఖలో ఘనంగా గురుపూజోత్సవం, పాల్గొన్న మంత్రులు
-
డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు. అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు... డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జస్టిస్ ఆనంద్ వెంటకేషన్ కన్నెర్ర కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ అప్పీల్ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్ వెంకటేషన్ టార్గెట్ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్ఎస్ఆర్లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు. న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు. సుమోటోగా కేసులు అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మెగా బ్రదర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్
-
రైతు రుణమాఫీపై కేసీఆర్కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ను పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్ను కలిసేందుకు సీఎం చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, ఆంజనేయ గౌడ్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు. -
ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తీరుస్తున్న మంత్రులు, నేతలు
-
18 దేశాల్లో పేదల ఆకలి తీర్చిన భారత్
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. -
పేదలకిచ్చే స్థలాలను సమాధులతో పోలుస్తారా?
-
చంద్రబాబు మేనిఫెస్టో పై వైఎస్సార్సీపీ ఫైర్
-
వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ సింగల్ గానే వస్తుంది
-
ఆ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ లా చింపి పారేశారు
-
ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం 20 మందికి బెర్తులు ?
కర్ణాటక: మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ హైకమాండ్తో కొత్త మంత్రుల ఎంపికపై చర్చించి విస్తరణకు ముహుర్తం నిర్ణయించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈసారి సుమారు 20 మంది మంత్రులను చేర్చుకోవాలని సీఎం తీర్మానించారు. ఇటీవల సీఎం, డీసీఎం, మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేదానిపై హైకమాండ్తో చర్చిస్తారు. మంత్రి పదవుల కోసం తీవ్ర పైపోటీ నెలకొనడం ఒకెత్తయితే, ఇప్పుడు ఉన్న మంత్రులు ప్రధాన శాఖల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. హైకమాండ్పై ఒత్తిడి పోటీ ఎక్కువగా ఉన్నందున ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అనేది హైకమాండ్కు తలనొప్పిగా మారింది. కుల, ప్రాంతాలవారీగా అనేక అంశాల దృష్టిలో పెట్టుకుని మంత్రుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఉభయులూ సమావేశమవుతారు. మంత్రుల జాబితా గురువారం సాయంత్రంలోగా ఫైనల్ కానుండగా, 27 లేదా 28వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని అంచనా. ఢిల్లీలో ఔత్సాహికుల మకాం పదవుల రేసులో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దినేశ్ గుండూరావ్, కృష్ణబైరేగౌడ, విజయానంద కాశప్పనవర్ తో పాటు పలువురు బుధవారమే ఢిల్లీకి బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టినా మరో నాలుగైదు స్థానాలు ఖాళీగానే ఉంచాలని హైకమాండ్ నిర్ణయించినట్లు వచ్చినట్లు సమాచారం. పదవుల కోసం మరీ గట్టిగా ఒత్తిడి చేస్తే వాటిలో నుంచి కేటాయించడానికి వీలుంటుంది. అవకాశం అధికంగా ఉన్నవారు వీరే శివానందపాటిల్, లక్ష్మణ సవది, గణేశ్ హుక్కేరి, ప్రకాష్ హుక్కేరి, ఎస్ఎస్ మల్లికార్జున్, ఈశ్వరఖండ్రే, కృష్ణభైరేగౌడ, ఎం.కృష్ణప్ప, దినేశ్ గుండూరావ్, తన్వీన్సేఠ్, బైరతి సురేశ్, రాఘవేంద్ర హిట్నాళ్, టీబీ.జయచంద్ర, కేఎన్.రాజణ్ణ, హంపనగౌడ బాదర్లి, సంతోష్లాడ్, వినయ్ కులకర్ణి, బసవరాజ శివణ్ణనవర్, ఆర్బీ.తిమ్మాపుర, బీకే.సంగమేశ్, మధు బంగారప్ప, చెలువరాయస్వామి, నరేంద్రస్వామి, ఎన్ఏ హ్యారిస్, లక్ష్మీ హెబ్బాళ్కర్, శరణప్రకాష్ పాటిల్. -
తలసాని తకిడతకిడత..
-
దమ్ముంటే తమ మద్దతు లేకుండా గెలవాలంటూ గంగులకు చాలెంజ్
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
టీడీపి అక్రమాలపై సుప్రీం కోర్ట్ ఆర్డర్...
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యత్తు
-
టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రులు ఆగ్రహం
-
ప్రజారోగ్యం, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం, మహిళా భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మంత్రులు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమాధానాలు చెప్పనివ్వకుండా మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రులు వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేక సభను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలిలా ఉన్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 1142 పీహెచ్సీలలో 1125 పీహెచ్సీలను రూ.670 కోట్లతో ఆధునికీకరించాం. టీడీపీ హయాంలో 5 పీహెచ్సీలనే కొత్తగా ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం 88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టాం. ప్రతి పీహెచ్సీలో కచ్చితంగా 14 మంది వైద్య సిబ్బంది ఉండేలా నియామకాలు చేపట్టాం. 175 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నాం. దీంతో ఓపీల సంఖ్య పెరిగింది. పీహెచ్సీల్లోనే స్క్రీనింగ్, లేబొరేటరీ సదుపాయాలు తీసుకొచ్చాం. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ తీసుకొచ్చాం. గ్రామాల్లోని చిన్నారుల ఆరోగ్య రక్షణ మా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఉంది. సింగరాయకొండలో పీహెచ్సీని రూ.50 లక్షలతో ఆధునికీకరించాం. ఇక్కడ 60 వేల మంది ప్రజలకు ఒకే పీహెచ్సీ ఉంటే దానిని వికేంద్రీకరించాం. పక్కనే పాకాలలో రూ.2.53 కోట్లతో కొత్తది నిర్మిస్తున్నాం. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గంజాయి సాగు నుంచి గిరిజనులకు విముక్తి ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్తో అమాయక గిరిజనులను గంజాయి సాగు ఉచ్చు నుంచి కాపాడుతున్నాం. ఆపరేషన్ పరివర్తన్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. శాటిలైట్ ఫొటోల సాయంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని 8,554 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశాం. మాపై విమర్శిస్తున్న ప్రతిపక్షాలు శాటిలైట్ చిత్రాలు చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 ఏజెన్సీ మండలాల్లో గంజాయి సాగు లేకుండా చేశాం. ఆరు మండలాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా సాగును వదిలేశారు. వీరందరికీ స్వయం ఉపాధితో పాటు ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్నాం. టీడీపీ హయాంలో 200 ఎకరాల్లో మాత్రమే గంజాయిని ధ్వంసం చేశారు. సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికడుతున్నాం. మా ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు చేపట్టింది. 18 దిశ పోలీసు స్టేషన్లు, 13 ప్రత్యేక న్యాయ స్థానాలను తెచ్చింది. లోకేశ్ ఆధ్వర్యంలో దిశ బిల్లు ప్రతులను తగలబెట్టిన టీడీపీ నాయకులకు మహిళా రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదు. దిశ యాప్తో ఆపదలో ఉన్న మహిళలను క్షణాల్లోనే రక్షిస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చదవడం మానేస్తే తప్ప టీడీపీ నాయకులకు వాస్తవాలు బోధపడవు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షం బాధితులనే రోడ్డున పడేస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. – తానేటి వనిత, హోంశాఖ మంత్రి రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్క రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్కగా మారింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ సత్ఫలితాలను ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతోంది. – అబ్బయ్య చౌదరి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వైద్య రంగంలో సిబ్బందిని పెంచాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగినట్టుగా సిబ్బందిని పెంచాలి. అన్ని పీహెచ్సీలకు సమానంగా రోగులు రారు. రేషనలైజేషన్ పేరుతో పీహెచ్సీల్లో సిబ్బందిని తగ్గిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. నాడు–నేడులో పీహెచ్సీల అభివృద్ధితో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. – కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే దిశ బిల్లు చట్టంగా మారేలా చూడాలి దిశ బిల్లు చట్టంగా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దిశ బిల్లుకు సవరణలు కోరుతూనే ఉంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టాలి. – ఆదిరెడ్డి భవాని, టీడీపీ ఎమ్మెల్యే -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
‘తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’
గత కొంత కాలంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది పాక్. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా తమ మంత్రులు ఇకపై 5-స్టార్ హోటళ్లలో బస, బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవద్దని స్పష్టం చేసింది. కీలక నిర్ణయం.. అవి బంద్ ఇస్లామాబాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘మనం సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం మన నుంచి ఏమి కోరుతుందో వాటిని ఇవ్వాల్సి ఉంటుందని’ షరీఫ్ అన్నారు. పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గతంలో ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు సమాఖ్య మంత్రుల సంఖ్యను మరింత తగ్గించింది. వీటితో పాటు మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను చాలా వరకు అరికట్టింది. దీంతోపాటు లగ్జరీ వస్తువులు, కార్ల కొనుగోలుపై కూడా వచ్చే ఏడాది వరకు పాక్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలలో $764 మిలియన్ల ప్రణాళికను కూడా పాటిస్తోంది. తద్వారా ఐఎంఎఫ్ నుంచి నిధులు పొందాలనే ఆలోచనలో ఉంది. సబ్సిడీలను తొలగించాలని ఐఎంఎఫ్ చేసిన అభ్యర్థనను అనుసరించి, పాకిస్తాన్ లగ్జరీ దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇంధన ధరలను పెంచడంతో పాటు ఈ వారం ప్రారంభంలో కరెన్సీని తగ్గించింది. అదనంగా, ఐఎంఎఫ్ మార్కెట్ నిర్ణయించిన కరెన్సీ రేటును అనుమతించాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దెబ్బకు అటు సామాన్యులను మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్లలో ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంటోంది. చదవండి : 'పుతిన్కు నెక్ట్స్ బర్త్డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు
-
ఛీ..ధర్రెడ్డి దరిద్రం వదిలింది
నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి, రూరల్ ప్రజలకు పట్టిన ఛీ.. ధర్రెడ్డి అనే దరిద్రం వదిలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆదాల ప్రభాకర్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్, మేకపాటి విక్రమ్రెడ్డితో కలిసి ఆదాల ప్రభాకర్రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచి అదే పార్టీపై నిందలు వేయడం సిగ్గు చేటుగా లేదా అన్నా రు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ అధినేత డైరెక్షన్లో శ్రీధర్రెడ్డి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రనా రూరల్లో మేమంతా వైఎస్సార్సీపీలో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉంటామని ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న ప్రజాభిమానమే నిదర్శమన్నారు. పార్టీ నుంచి దరిద్రం పోయిందనుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి జిల్లా మొత్తం కంచుకోటగా ఉంటుందన్నారు. ఓటు బ్యాంకు చెదరదు పార్టీ నుంచి ఎవరు పోయినా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలిచామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదాల ప్రభాకర్రెడ్డి రూరల్లోనే కాకుండా జిల్లాలో అందరికీ సుపరిచితుడన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా తన రాజకీయ భవిష్యత్ను తేల్చుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేస్తూ వ్యాపారుల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారు ల వద్ద డబ్బులు వసూలు చేసే పద్ధతులు మానుకోవాలని ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఎక్కడైనా అటువంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉక్కుపాదంతో అణిచేస్తానని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆయా వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ఎవరైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎక్కడైనా సమస్య ఉందంటే తమ దృష్టికి తెస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాగా ఉందన్నారు. ఈ ర్యాలీనే ఉదాహరణ నెల్లూరురూరల్లో వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో స్వాగత ర్యాలీనే ఉదాహరణ అని నగర ఎమ్మెల్యే పి అనిల్కుమార్ అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ రూరల్లో అందరం కష్టపడ్డాం కాబట్టే ఆయన గెలిచారని, ఈ రోజు పారీ్టపై విమర్శలు చేయడం ద్రోహం అన్నారు. కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో సైనికుల మాదిరి పని చేస్తామని, తిరిగి ఆదాలను గెలిపించుకుంటామన్నారు. బొబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఈ రోజు నుంచి బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందామన్నారు. రూరల్ ఎమ్మెల్యే వద్ద బానిస బతుకు బతికామన్నారు. ఆదాల ప్రభాకర్రెడ్డి వద్ద ఎంతో స్వేచ్ఛగా, హుందాగా ఉంటామన్నారు. -
ఇక క్రమశిక్షణా సంఘంతో ఏం పనిలేదు.. అవి వారి
ఇక క్రమశిక్షణా సంఘంతో ఏం పనిలేదు.. అవి వారి వ్యక్తిగతం అంటే సరిపోతుంది! -
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
స్టేడియంలో క్రికెట్ ఆడిన తెలంగాణ మంత్రులు
-
బీజేపీ మంత్రులపై మంత్రి హరీష్ రావు ఫైర్
-
తథాస్తు...బాబు