కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ | Priyanka Gandhi Fires On Central Government | Sakshi
Sakshi News home page

కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ

Published Sun, Aug 1 2021 2:03 AM | Last Updated on Sun, Aug 1 2021 2:03 AM

Priyanka Gandhi Fires On Central Government  - Sakshi

న్యూఢిల్లీ: ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ శనివారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘మామిడి కాయలు ఎలా తినాలి ? వంటి సులువైన ప్రశ్నలకే వారు అలవాటు పడ్డారు. అందుకే ప్రజలకు సంబంధించిన పెగసస్‌ వివాదం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగదల వంటి విషయాలపై చర్చకు వారు భయపడుతున్నారు’ అని ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఏ విషయంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రతిపక్షాలు అనవసరమైన, సీరియస్‌ కాని విషయాల మీద నిరసనలు చేస్తున్నారని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement