Priyanka Gandhi Vadra
-
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరం-2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లోనే 2024 ముగియనుంది. తరువాత జనం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చోటుచేసుకోబోతున్నప్పటికీ, భారత రాజకీయాలకు 2024 ప్రధానమైనదిగా నిలిచింది. 2024లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం, 24 ఏళ్లు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఘటనలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచాయి.లోక్సభ ఎన్నికలు- 20242024 సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు పలు రాజకీయ పార్టీలకు షాకింగ్గా నిలిచాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన ఘనత ప్రధాని మోదీ దక్కించుకున్నారు.అయోధ్యలో బీజేపీ ఓటమి2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 400 ఫిగర్ దాటుతుందనే నినాదం అందుకున్న బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు గాను బీజేపీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి రెండు సీట్లు, అప్నాదళ్కి ఒక సీటు లభించాయి. దేశంలోనే అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్య లోక్సభ స్థానంలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.జైలుకెళ్లిన కేజ్రీవాల్ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించిన అవినీతి కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో 2024, మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ, సీబీఐ రెండూ విచారించాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్కు జూలై 12న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.హేమంత్ సోరెన్ జైలు జీవితం2024లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి కుంభకోణంలో జనవరిలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత బెయిల్ పొందిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈఘటనల దరిమిలా చంపై సోరెన్ జెంఎంఎంను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.నవీన్ పట్నాయక్ ఓటమిఈ ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరొందిన నవీన్ పట్నాయక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51 సీట్లకు తగ్గగా, బీజేపీకి 78 సీట్లు రావడంతో పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంనెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ ఏడాది రాజకీయాల్లో క్రియాశీలక అరంగేట్రం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్ లోక్సభ స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదిలి రాయ్బరేలీ స్థానానికి ఎంపీగా కొనసాగారు. వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీని వయనాడ్ స్థానం నుండి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 64.99శాతం ఓట్లతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో విజయం సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, శివసేన 57 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఎంవీఏ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం విశేషం.ఢిల్లీ సీఎంగా అతిశీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనేదానిపైనే చర్చ జరిగింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఇవ్వవచ్చని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎం పదవికి అతిశీ పేరును ప్రతిపాదించారు. అందరి అంగీకారంతో అతిశీ ఢిల్లీ సీఎం అయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: 180 ఐఏఎస్లు, 200 ఐపీఎస్ల ఎంపిక.. టాప్లో ఏ రాష్ట్రం? -
ఈసారి బంగ్లాదేశ్ బ్యాగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్ స్టాండ్ విత్ ది హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆఫ్ బంగ్లాదేశ్) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది. प्रियंका के आने से विपक्ष में, कांग्रेस में एक जोश तो आया है, अंततः कोई तो बांग्लादेश के अल्पसंख्यकों के हितों की बात कर रहा है #PriyankaGandhi pic.twitter.com/awMqbrEVbe— Pooja Tiwari (@Irony_Pooja) December 17, 2024 -
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
ఆమె పైనే అందరి దృష్టి
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారబోతున్నారు. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ఇందిరాగాంధీ ఆహార్యంతో భవిష్యత్తు భారత రాజకీయాలపై ఆమె చూపించబోయే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.2004 లోక్సభ ఎన్నికలలో రాయబరేలి నుండి పోటీ చేసిన తల్లి సోనియాగాంధీ, అమేథీ నుండి పోటీ చేసిన అన్న రాహుల్ గాంధీల తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అడపా దడపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా – ఉత్తరప్రదేశ్ ఇన్చార్జిగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తీవ్ర ప్రచారం చేసినా తన పార్టీని ఘోర పరాజయం నుండి కాపాడలేక పోయారు. కానీ 2022లో జరిగిన హిమాచల్ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో అన్నీ తానై అధికార బీజేపీని ఓడించడానికి దోహద పడ్డారు. ఈ విజయం... ఆ తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవటానికి స్ఫూర్తినిచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మహిళల మెడలో మంగళ సూత్రాలు మాయం చేస్తారనే మోదీ విమర్శలకు ధీటుగా స్పందించారామె. ‘ఈ దేశ ప్రజల కోసం నా తల్లి సోనియా గాంధీ తన మంగళ సూత్రాన్ని త్యాగం చేసింద’ని మోదీ విమర్శలను తిప్పి కొట్టిన తీరు ఓటర్లను ఆకర్షించినట్లుంది. మరి 4లక్షల మెజారిటీని ఓటర్లు కట్టబెట్టారంటే మామూలు సంగతి కాదు.లోక్సభలో విపక్షం నుండి ప్రభుత్వంపై బలమైన విమర్శలతో విరుచుకుపడే సుప్రియా సూలే, మహువా మొయిత్రాకి తోడుగాప్రియాంక గాంధీ చేరడం విపక్ష ‘ఇండియా’ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే. రాహుల్ గాంధీ ఉత్తర భారత్ నుండి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతం నుండి ప్రాతినిధ్యం వహించటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చూడాలి. ఇంతకు ముందు దక్షిణాదికి చెందిన తెలంగాణలోని మెదక్ నుండి ఇందిరా గాంధీ, కర్ణాటకలోని బళ్లారి నుండి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. – డా‘‘ తిరునహరి శేషు ‘ రాజకీయ విశ్లేషకులు, వరంగల్ -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
వయనాడ్లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. -
ఎన్నికల్లో పోటీ చేయడమే కొత్త.. ప్రజా పోరాటాలు కొత్త కాదు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు. ఈ మేరకు వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రియాంక నామినేషన్
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు. తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు. వయనాడ్కు ఇద్దరు ఎంపీలు: రాహుల్ తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్లో వయనాడ్కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు. ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్తో ప్రస్తావించారు. నామినేషన్తోపాటు అఫిడవిట్ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు. అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్గా నిలిచింది. బ్యాక్రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్కు టాలిస్ మాన్గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్లో పోలింగ్ జరగనుంది. -
Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెల్ తదితరుల సమక్షంలో రాహుల్ కేక్ కట్చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘ కాంగ్రెస్ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్చేశారు. ‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
వయనాడ్ నుంచి ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఇకపై రాయ్బరేలీ నుంచే కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రెండింటా గెలిస్తే చట్టం ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్బరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగుతారని స్పష్టంచేశారు. ఎంతో అంతర్మథనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్కు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. రాయ్బరేలీ స్థానంతో రాహుల్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా రాయ్బరేలీ నుంచే రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వయనాడ్ ప్రజల ప్రేమాభినాలు రాహుల్కు లభించాయన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంకా గాంధీ ఎంతో సహకరించారని ఖర్గే అభినందించారు. రాహుల్ ఏ స్థానం వదులుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంకా గాం«దీ, కె.సి.వేణుగోపాల్ తదితరులు సోమవారం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే, రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాయ్బరేలీతోపాటు వయనాడ్తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ను వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమేనని వెల్లడించారు. గత ఐదేళ్లపాటు వయనాడ్ ఎంపీగా కొనసాగడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు. వయనాడ్ ప్రజలు తనకు అండగా నిలిచారని, సంక్షోభ సమయాల్లో తనకు కొత్త శక్తిని ఇచ్చారని కొనియాడారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వయనాడ్ను సందర్శిస్తూనే ఉంటానని, అక్కడి ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ఐదేళ్లపాటు ఎంతో ప్రేమాభిమానాలు పంచిన వయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేశారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని తెలిపారు. తమకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా భావించాలని వయనాడ్ ప్రజలకు రాహుల్ సూచించారు. సంతోషంగా ఉంది: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి తాను పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రియాంకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా రాయ్బరేలీ, అమేథీలో పనిచేశానని, ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదని అన్నారు. ఆ బంధాన్ని కొనసాగించేందుకు తాను, రాహుల్ ఉన్నామని చెప్పారు. రాయ్బరేలీ, వాయనాడ్లో తనతోపాటు రాహుల్ ఉంటూ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ అందుబాటులో లేరన్న అభిప్రాయం వయనాడ్ ప్రజల్లో కలగకుండా చూస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు. తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రియాంక ప్రియాంకా గాంధీ 2019లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతిత్వరలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీ లేదా ఆమేథీ లేదా వారణాసిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్బరేలీ, ఆమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయ నాడ్ రాడ్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగనుంది. 52 ఏళ్ల ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
వయనాడ్ బరిలో ఆమె.. కాంగ్రెస్ పరిశీలన?!
న్యూఢిల్లీ: వయనాడా? రాయ్బరేలీనా?.. మరో మూడు రోజుల్లో ఏ ఎంపీ సీటు వదులుకుంటారో రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే.. ఆ రెండు స్థానాలకు ఆయన కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో తానూ డైలమాలో ఉన్నట్లు స్వయంగా రాహుల్ గాంధీనే ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రాయ్బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఒక్కపక్క.. తమ దగ్గరి నుంచే ఎంపీగా కొనసాగాలంటూ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ను కోరుతుండడం గమనార్హం. మరోవైపు.. తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని రాహుల్ తాజాగా స్పష్టం చేశారు. ఇరు చోట్లా పర్యటించిన అనంతరం వయనాడ్నే ఆయన వదులుకోవడం దాదాపు ఖరారు కాగా.. ఈలోపు ఆ స్థానంలో పోటీ కోసం తెరపైకి కొత్త పేరు వచ్చింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగడం దాదాపుగా ఖరారైందని.. ఆయన వదిలేసే వయనాడ్ నుంచి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే రాయ్బరేలీ సీటును వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ ఇప్పటికే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అదే టైంలో రాహుల్ వయనాడ్ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ కూడా సంకేతాలిచ్చారు. రాహుల్ గనుక ఆ నిర్ణయం తీసుకుంటే.. కేరళ నుంచి పార్టీ సీనియర్ను బరిలో దించురతాని సీడబ్ల్యూసీ వర్గాలు తొలుత చెప్పాయి. అయితే.. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ఆరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఇక ఇప్పుడు రాయ్బరేలీ, వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల ఆరంగేట్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోదీ 2 - 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు:::తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య గతంలోనూ..ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారనే టాపిక్ ఈనాటి కాదు. 2019 లోక్సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు. ఇక ఈసారి ఎన్నికల ముందు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. ఇక.. రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతీ ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయమై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వారిని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచిన నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారట. అయితే, తాను బరిలో దిగబోనని ప్రియాంక మరోసారి స్పష్టం చేస్తూ ఊహాగానాలకు ముగింపు పలికారు. తనూ బరిలోకి దిగి గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో కాలుపెట్టినట్టు అవుతుందని, కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి ఇది మరో ఆయుధంగా మారుతుందని ఆమె భావించారట. దీంతో ఇప్పుడు వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? లేదా అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు!
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్ర పక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అంటూ నినదించిన బీజేపీకి భారీ షాకిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్వేదికపై స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.You kept standing, no matter what they said and did to you…you never backed down whatever the odds, never stopped believing however much they doubted your conviction, you never stopped fighting for the truth despite the overwhelming propaganda of lies they spread, and you never… pic.twitter.com/ev7QYFI1PR— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 5, 2024 ‘వారు (బీజేపీ నేతలు) ఎంతఅవమానించినా, అవహేళన చేసినా, దూషించినా చాలా దృఢంగా నిలబడ్డావు. అవహేళనలు, కష్టాలను చూసి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అనుమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంతగా నీపై అవాస్తవాలు, అబద్ధాలతో విపరీతమైన ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరు ఆగలేదు. కోపం ద్వేసం, నీ దరి చేరనీయలేదు. సంయమనం కోల్పోలేదు. ప్రతిరోజూ నీపై ద్వేషాన్ని కుమ్మరించినా నీ గుండెల్లోని ప్రేమ, దయతోనే, నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇపుడు అర్థం అవుతుంది. కానీ నువ్వెంత ధీశాలివో ఎల్లపుడూ మాలో కొందరికి తెలుసు. నేను సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈసందర్భంగా ఒక కార్టూన్ను కూడా షేర్ చేశారు. కాగా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఇప్పటికీ సగం సీట్లతో సరిపెట్టుకోవచ్చు, కానీ రాహుల్, ప్రియాంకా ద్వయం మాత్రం స్టార్ క్యాంపెయినర్లుగా నిలిచి బీజేపీ ఆశలకు భారీగా గండి కొట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ తమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని యావద్దేశానికి చాటి చెప్పారు రాహుల్గాంధీ. అంతేకాదు తల్లి, చెల్లి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే ప్రియాంకా 2024 ఎన్నికలలో ప్రసంగాల్లో బాగా రాణించారు. తన తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలాతో ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటలైన, అమేథీ ,రాయ్బరేలీలలో కాంగ్రెస్ ప్రచారాన్ని లీడ్ చేశారు. అంతేకాదు గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ విజయం కోసం శ్రమించారు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. -
Lok Sabha Election 2024: ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
రాయ్బరేలీ: కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సమస్యలు, రైతన్నలు వెతలు, నిరుద్యోగుల దుర్భర బతుకుల గురించి మాట్లాడకుండా, కేవలం అనవసర విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన పరిణామాలపై వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం సొంత ఊహాలపై ఆధారపడి ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలంటే ఆయనకు గౌరవం లేదని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గంలో తన సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం శ్రమిస్తూ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీకి నిజంగా ధైర్యం ఉంటే దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగం కష్టాలపై మాట్లాడాలని సవాలు విసిరారు. ప్రియాంక ఇంకా ఏం చెప్పారంటే.. బీజేపీ అంచనాలు తల్లకిందులే.. మీడియాలో గానీ, రాజకీయ ప్రచార వేదికలపై గానీ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. తమ కష్టనష్టాలపై చర్చ జరగాలని, పరిష్కార మార్గాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ధరలు తగ్గించడానికి, రైతులు, కారి్మకుల సంక్షేమానికి, తమ కష్టాలు కడతేర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దేశంలో ‘మార్పు’ గాలులు బలంగా వీస్తున్నాయి. ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీకి సొంతంగా 370 వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చివరకు వారి అంచనాలన్నీ తల్లకిందులవుతాయి. మోదీ సమాధానం చెప్పగలరా? దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ఈ సమస్యను పట్టించుకోకుండా, కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే సంస్థలను నిర్మించిందో, ఏయే పథకాలను సొంతంగా ప్రారంభించిందో నరేంద్ర మోదీ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచి్చన పథకాల పేర్లు మార్చడం తప్ప ఆయన చేసిందేముంది? రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.. ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటాం. మనకు ఓటు హక్కు రాజ్యాంగమే ఇచి్చంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగమే ఇచి్చంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగమే బలోపేతం చేసింది. రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజల హక్కులు కాలరాస్తామంటే మేము సహించబోము. ప్రధానమంత్రి కాబట్టి నవ్వలేకపోతున్నాంకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, బంగారం, భూములు, గేదెలు దోచుకుంటారని ప్రధానమంత్రి అంటున్నారు. నిజంగా ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే బిగ్గరగా నవ్వుకునేవాళ్లం. ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి దురదృష్టవశాత్తూ నవ్వుకోలేకపోతున్నాం. అబద్ధాలను కూడా నిజాలుగా ప్రజలను నమ్మించడంలో నరేంద్ర మోదీ ఆరితేరిపోయారు. -
Lok sabha elections 2024: కాంగ్రెస్లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్కు ట్రబుల్ షూటర్గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్తో పాటు ఢిల్లీలోని డే స్కూల్కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
మానవత్వం మేల్కొనేదెప్పుడు?
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్స్టాప్ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు గురువారం కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగానూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన ఈసీఐకి ఫిర్యాదు వెళ్లింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. తన ప్రసంగం ద్వారా రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడరని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ.. అక్టోబర్ 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. నవంబర్ 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 20వ తేదీన దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. ‘‘మోదీ ఓ ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్ను తెరిస్తే.. అందులో కేవలం 21రూ. మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ లాంటివే. అందులో ఏమీ ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన వీడియోను సైతం ఫిర్యాదుకు జత పరిచింది బీజేపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైరల్గా వీడియో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్ భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఈ ఆలయం హుండీ ప్రత్యేక సందర్భాల్లోనే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సెప్టెంబర్ 25వ తేదీన హుండీ తెరిచి.. విరాళాలు లెక్కించారు. అయితే అందులో ప్రధాని మోదీ పేరుతో ఉన్న కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్ను తెరచి చూడగా ఇందులో కేవలం రూ. 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్పష్టమైన విజన్ లేదు.. మోదీ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల: ప్రియాంక గాంధీ
జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే లేకుండాపోయాడని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆమె బుధవారం రాజస్తాన్లోని ఝన్ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుల గణనపై బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ‘ఖాళీ లిఫాఫా' మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మోదీ ఖాళీ లిఫాఫా (కవరు) అంటూ మోదీని ఎద్దేశా చేశారు. 10 ఏళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. . ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ మతాలు, కులాల గురించి మాట్లాడుతోందని ఆక్షేపించారు. అధికారం కాపాడుకోవడానికి ప్రజలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సొంత లాభం కోసం పాకులాడే నాయకులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ అంద జేస్తామని చెప్పారు. అలాగే అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున గౌరవ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇంటి పెద్ద అయిన మహిళలకు ఈ గౌరవ భృతి అందుతుందని పేర్కొన్నారు. -
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్ 06:55PM ములుగు సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ►రామప్ప ఆలయం అద్భుతంగా ఉంది ►ఇంత అందమైన ఆలయాన్ని ఎప్పుడు చూడలేదు ►దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి ►కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది ►రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోవు ►కానీ, కాంగ్రెస్ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించింది ►కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు ►అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేశారు ►ధరణి పోర్టల్లో అవినీతి జరిగింది ►రూ.లక్ష రుణమాపీ అన్నారు.. గుర్తుందా? చేశారా? ►కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తన జేబులో వేసుకున్నారు ►దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు ►బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ►తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీలను ప్రకటిస్తున్నాం ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ.2,500 ►రూ.500కే గ్యాస్ సిలిండర్ ►ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం ►తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములకు 250 గజాల జాగా ►నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారు ►సీఎం ఇస్తామన్న మూడెకరాల భూమి వచ్చిందా? ►కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చెప్పామో.. అదే చేశాం ►రాజస్థాన్లో ఉచిత వైద్యం అన్నాం .. ఇస్తున్నాం, అదీ దేశంలోనే అత్యుత్తమ సేవలతో! ►ఛత్తీస్గడ్లో రైతులకు రుణమాఫీ చేశాం ►రూ.2,500 మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తున్నాం ►కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం ►ప్రతీనెలా మహిళలు, రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►జల్, జమీన్, జంగల్ హామీలను కాంగ్రెస్ నెరవేర్చింది ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తాం ►అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ►తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 06:26PM ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం ►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు ►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు ►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్ఎస్కి ఓటేశారు ►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు ►బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ►తెలంగాణ కలను బీఆర్ఎస్ నాశనం చేసింది ►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు ►మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది ►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం ►కాంగ్రెస్ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి ►తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు ►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు ►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు ►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు ►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు ►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది ►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం ►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది ►అమరులను కాంగ్రెస్ గౌరవిస్తుంది.. శ్రీకాంత్ చారికి నా నివాళి ►బీఆర్ఎస్ కేబినెట్లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు ►గల్ఫ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం ►ఆదివాసీల హక్కుల్ని బీఆర్ఎస్ పెద్దలు లాక్కుంటున్నారు ►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు ►మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ను మళ్లిస్తున్నారు ►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు ►గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది ►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం ►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు ►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది ►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తెచ్చింది ►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం 06:10PM ములుగు సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు ►అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు ►ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెస్తాం ►ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం ►అధికారంలోకి వస్తే రూ.500 కే సిలిండర్ఇస్తాం ►రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15వేలు జమ చేస్తాం ►ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఫ్రీ ►మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ►కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడబిడ్డలకు తులం బంగారం ►ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్ గడ్డ నుంచి సోనియా గాంధీ ప్రకటించారు ►ఇచ్చిన మాటకు సోనియా తెలంగాణ ప్రకటించారు ►తెలంగాణలో ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి అధిపత్యం రాజ్యమేలుతోంది ►అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి ►తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం వచ్చింది ►ఆరు గ్యారంటీ స్కీమ్ లతో ప్రజల ముందుకు వచ్చారు ►మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు ►ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు ►500 రూ.లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు ►రైతులకు మద్దతు ధర తో పాటు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►షాదీముబారక్ కళ్యాణ లక్ష్మీ సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం 06:05PM ►రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలనే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం: భట్టి ►ప్రతీ గ్యారెంటీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి: భట్టి ►గిరిజనులకు పోడు భూములు పంచాలన్న చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: భట్టి ►ఆరు గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తాం: భట్టి 06:00PM ►ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ►మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంక ►తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రాహుల్ ఫేస్బుక్ రీల్ ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►ఈ విజయయాత్ర రాబోయే మార్పుకి సంకేతమంటూ పోస్ట్ ►రాహుల్ మాటిస్తే కట్టుబడి ఉంటారు: ఎమ్మెల్యే సీతక్క ►కాంగ్రెస్ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాం ►అధికారంలోకి వచ్చాక ఆరుగ్యారంటీలు అమలు చేస్తాం 05:20PM ►రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్, ప్రియాంక ►ములుగు రామానుజాపురం బహిరంగ సభా స్థలికి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలు ►కాసేపట్లో బహిరంగ సభ ►బహిరంగ సభ నుంచే మహిళా డిక్లరేషన్ ప్రకటన 05:10PM ►ప్రత్యేక పూజల అనంతరం.. రామప్ప ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంకలు ►ఆలయ చరిత్రను వివరిస్తున్న అధికారులు 04:52PM ►రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ కీలక నేతల ప్రత్యేక పూజలు ►కాసేపట్లో కాంగ్రెస్ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం 04:42PM ►ములుగు జిల్లా రామప్ప కు చేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ►స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు. 04:30PM ►మరి కాసేపట్లో రామప్పకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. ►రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ►అనంతరం విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం ►ఆదివాసీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో రాహుల్, ప్రియాంక గాంధీ లకు స్వాగతం ►కోయ కళాకారులు లంబాడీలు డప్పు నృత్యాలతో స్వాగతం 04:15PM ►రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ►రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క ►కాసేపట్లో రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు ► రామప్ప ఆలయం నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ► బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ►బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ► ములుగు జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు నేటి నుంచి కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం సాయంత్రం జరిగే రామానుజాపురంలో బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంకలు. మూడు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ. బస్సు యాత్రతో పాటు పాదయాత్రలో కూడా పాల్గొనున్న రాహుల్. -
తెలంగాణకు రాహుల్ గాంధీ.. బస్సు యాత్ర సాగేది ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగబోతోంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. బస్సు యాత్రని ఆరంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఈ యాత్రలో నిరుద్యోగులు , సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతుల, మహిళలతో భేటీ ఆయన అవుతారు. పూర్తి షెడ్యూల్.. ►బుధవారం మధ్యాహ్నాంకల్లా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రాహుల్, ప్రియాంక ►బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామప్ప టెంపుల్కు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ►రామప్ప టెంపుల్లో అన్నాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు ►సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక ►రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర ►ములుగులో బహిరంగ సభలో మహిళలతో రాహుల్ ,ప్రియాంకా ప్రత్యేక సమావేశం ►ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ ►ములుగు బహిరంగ సభ తర్వాత.. భూపాలపల్లి చేరుకొనున్న బస్సు యాత్ర ►భూపాలపల్లి లో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ ►రాత్రికి.. భూపాలపల్లి లోనే బస చేయనున్న రాహుల్ గాంధీ 19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర ►మంథని లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు ►మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర ►పెద్దపల్లి నుంచి కరీంనగర్కు బస్సు యాత్ర ►కరీంనగర్లో రాహుల్ గాంధీ రాత్రి బస 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్కు కాంగ్రెస్ బస్సు యాత్ర ►బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ ►ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ ►పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం ►నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ►20వ తేదీ సాయంత్రం తో ముగియనున్న టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర -
ఎన్నికల హామీలపై... మధ్యప్రదేశ్లో నేతల మాటల యుద్ధం
భోపాల్: మధ్యప్రదేశ్లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ కమల్నాథ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది. తాజాగా గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్ కమల్నాథ్ మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు’అని ఆరోపణలు చేశారు. మాండ్లాలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం ఆ తర్వాత దానిని పలు మార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం విమర్శలపై కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై సీఎం చౌహాన్ అనుచిత భాషను వాడారని ఆరోపించారు. తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్ను ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ విద్య, చిన్నారులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చౌహాన్ ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకి ఉపకారవేతనం అందజేస్తుందని హామీ ఇచ్చారు.నవంబర్ 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రజల్ని ప్రశ్నించకుండా చేసేందుకు.. విభేదాలు సృష్టిస్తున్నారు
దుర్గ్: ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ వారిని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కులం, మతం ఆధారంగా ప్రజల్లో విభేదాలు కల్పించి, వారిని ప్రశ్నించకుండా చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని విమర్శించారు. గురువారం ఆమె చత్తీస్గఢ్లోని దుర్గ్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘మహిళా సమృద్ధి సమ్మేళన్’లో ప్రసంగించారు. ఒకవైపు ప్రధాని మోదీ సన్నిహితులైన పారిశ్రామిక వేత్తలు రోజుకు రూ.1,600 కోట్లు పోగేసుకుంటుండగా మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలతో జనం పడుతున్న ఇబ్బందులపై కేంద్రం మాట్లాడటం లేదన్నారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తన సొంత నియోజకవర్గంలో పర్యటనలో ఉండగా జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘నాన్న వైపు చూస్తూ ఓ మహిళ కేకలు వేస్తోంది. అక్కడ రోడ్లు బాగోలేవని ఆమె ఆరోపిస్తోంది. నాన్న వాహనం దిగి ఆమె వద్దకు వెళ్లి సమాధానం చెప్పారు. వాహనంలోకి వచ్చాక ఆ మహిళ తీరు చూసి మీరేమైనా బాధపడ్డారా?అని అడిగా. ‘లేదు, ప్రశ్నించడం వాళ్ల పని. సమాధానం ఇవ్వడం నా కర్తవ్యం అని ఆయన అన్నారు’అని ప్రియాంక చెప్పారు. ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉండాలని అప్పట్లో ప్రధానమంత్రి సైతం భావించేవారని ఆమె వ్యాఖ్యానించారు. -
హుషారుగా.. సోనియా గాంధీ చిందులు
ఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(76) చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు. హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి భోజనం చేసిన ఆమె.. ఆపై సరదాగా గడిపి చిందులేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ హర్యానా సోనిపాట్లో పర్యటించి.. అక్కడి రైతులతో కలిసి జన్కీ బాత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన ట్రాక్టర్ నడిపి.. నాట్లు సైతం వేశారు. ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళా రైతులు.. ఢిల్లీలోని రాహుల్ ఇంటిని చూడాలని ఉందని కోరారట. దీంతో.. వాళ్లను ఆదివారం ఇంటికి భోజనానికి ఆహ్వానించింది సోనియా కుటుంబం. కాంగ్రెస్ నేత రుచిరా చతుర్వేది తన ట్విటర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఎలా ఉన్నారంటూ?..’ వాళ్లను రాహుల్ పలకరించడం.. సోనియా, రాహుల్, ప్రియాంక.. ముగ్గురూ వాళ్లతో భోజనం చేయడం, ప్రియాంకను వాళ్లు హత్తుకోవడం, ఇద్దరు మహిళా రైతులు ఆమె చేతుల్ని పట్టుకుని నృత్యం చేయాలని ముందుకు తేవడం, ఆమె సంతోషంగా చిందులేయడం అందులో చూడొచ్చు. స్వచ్ఛమైన ఆనందం అంటూ ఆ వీడియోను రుచిర పోస్ట్ చేశారు. Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house. But just see what happened next. This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg — Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023 Women farmers who met Raga a few days ago in sonepat Haryana were welcomed at 10 Janpath Delhi They had lunch with Sonia Gandhi ji, @priyankagandhi & @RahulGandhiiFan No one sat down all sat on the chairs & had food on the dining table and everyone had the same food pic.twitter.com/P8UHsA2LxP — Shamila Siddiqui (@rebelioushamila) July 16, 2023 धान की रोपाई, मंजी पर रोटी - किसान हैं भारत की ताकत 🇮🇳🚜 सोनीपत, हरियाणा में मेरी मुलाकात दो किसान भाइयों, संजय मलिक और तसबीर कुमार से हुई। वो बचपन के जिगरी दोस्त हैं, जो कई सालों से एक साथ किसानी कर रहे हैं। उनके साथ मिल कर खेतों में हाथ बटाया, धान बोया, ट्रैक्टर चलाया, और… pic.twitter.com/tUP6TARrJm — Rahul Gandhi (@RahulGandhi) July 16, 2023 ఇదిలా ఉంటే.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావాతో జైలుశిక్ష.. ఆపై లోక్సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయారు రాహుల్ గాంధీ. దీంతో తన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నేత షీలా దీక్షిత్ పాత ఇంటికి రాహుల్ గాంధీ తన మకాం మార్చారు. తన శిక్షను రద్దు లేదా స్టే విధించాలని అభ్యర్థిస్తూ తాజాగా సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో.. బెంగళూరులో జరగబోయే విపక్షాల ఐక్యతా సమావేశానికి సోనియా గాంధీ సైతం హాజరు కానున్నారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్ను ఖుష్ చేసిన కాంగ్రెస్ -
కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రక విజయంపై ప్రియాంక గాంధీ రియాక్షన్..
కాంగ్రెస్కు చారిత్రక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని కొనియాడారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేందుకు ఈ తీర్పు నిదర్శమన్నారు. ఈ ఫలితం దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్పై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. कांग्रेस पार्टी को ऐतिहासिक जनादेश देने के लिए कर्नाटका की जनता को तहे दिल से धन्यवाद। ये आपके मुद्दों की जीत है। ये कर्नाटका की प्रगति के विचार को प्राथमिकता देने की जीत है। ये देश को जोड़ने वाली राजनीति की जीत है। कर्नाटका कांग्रेस के तमाम मेहनती कार्यकर्ताओं व नेताओं को मेरी… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 13, 2023 కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. బలవంతులకు, పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే గెలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Rahul Gandhi: సోదరితో పాటు సూరత్ కోర్టుకు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు(సోమవారం) సూరత్(గుజరాత్) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్కు వెళ్లనున్నారు. సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ రాహుల్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్లో కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా. -
అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..: ప్రియాంక గాంధీ
లోక్ సభ ఎన్నికలకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని ఆయా పార్టీలోని నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ అంచనాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ చత్తీస్గఢ్లో జరుగుతున్న కాంగ్రెస్ 85 ప్లీనరీ సెషన్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు ప్రతిపక్షాలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మన పార్టీ సందేశాన్ని ప్రభుత్వా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పోరాడుతున్న పార్టీ కార్యకర్తలను ప్రియాంక ప్రశంసించారు. ఈమేరకు ఆమె కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ..మీకు బీజేపీతో పోరాడే ధైర్యం ఉందని తెలుసు. దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది. మండల స్ఘాయి నుంచే కాంగ్రెస్ను బలోపేతం చేయాలని చెప్పారు. కాగా, లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ తమ నేతలకు దిశా నిర్దేశం చేసి కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది. (చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం) -
అమ్మ వాటిని నేర్చుకోవడానికి చాలా కష్టపడింది! :ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా కేంద్రీకృత సదరస్సులో మాట్లాడుతూ..తన తల్లి భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడిందని అన్నారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండవంటూ చెప్పుకొచ్చారు. తాను ఇద్దరు ధైర్యవంతులైన, బలమైన మహిళల వద్ద పెరిగానని చెప్పారు. తన నానమ్మ ఇందిరా గాంధీ 33 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడూ తన వయసు ఎనిమిదేళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ పోయిన మరుసటి రోజే తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లిపోయారని చెప్పారు. ఆమె చనిపోయే వరకు కూడా తన కర్తవ్యం పట్ల ఆమె అంతర్గత శక్తి అలానే ఉందని, చనిపోయేంత వరకు దేశ సేవ చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేగాదు తన తల్లి సోనియా 21 ఏళ్ల వయసులో రాజీవ్గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి భారత్కు వచ్చారని అన్నారు. ఇక్కడకు వచ్చాక భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడిందని, ఆ తర్వాత తన నానమ్మమ ఇందిరా గాంధీ నుంచి ప్రతీది నేర్చుకున్నారని చెప్పారు. ఆమె సరిగ్గా 44 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిందని, రాజకీయాలంటే ఇష్టం లేకున్నప్పటకీ వచ్చి దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని జీవితమంతా సేవ చేసిందని అన్నారు. అంతేగాదు తన తల్లి తన నానమ్మ నుంచి నేర్చుకున్న ముఖ్య విషయం గురించి చెబుతూ.."మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా లేదా ఎంత పెద్ద విషాదం లేదా సమస్యలో ఉన్నా అది ఇంట్లో లేదా పనిలోనైనా సరే నిలబడి సమర్ధవంతంగా ఎదుర్కొని మీ కోసం మీరు పోరాడగలగలిగే సామర్థ్యం కలిగి ఉండటం" అని చెప్పారు. (చదవండి: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్గా మేనిఫెస్టో!) -
Karnataka: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్గా మేనిఫెస్టో!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై వరాలజల్లు కురిపించింది. ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెడతానంటూ పలు హామీలు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఒక కార్యక్రమంలో తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2000 ఇస్తామని ప్రకటించారు. గృహలక్ష్మీ యోజన కింద ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపకరించే బేసిక్ ఆదాయం కింద ఏడాదికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తామని హామి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాదు ఈ గృహలక్ష్మీ యోజన అనేది కాంగ్రెస్ పార్టీ అధికమైన ఎల్పీజీ గ్యాస్ ధరల తోపాటు తమ రోజు వారీ ఖర్చుల నిమిత్తం మహిళలకు ఉపకరించేలా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతి మహిళ సాధికారిత తోపాటు తన కాళ్లపై తాను నిలబడి తన పిల్లలను చూసుకునే సామర్థ్యాంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామని చెప్పింది. ఈ మేరకు ప్రియాంక గాంధీ " నేను నాయకురాలిని(నా నాయకి) " అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ... కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందంటూ విమర్శించారు. పైగా మంత్రులు ఉద్యోగాల్లో సుమారు 40% కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు. అంతేగాదు కర్ణాటకలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అలాగే పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ స్కామ్ గురించి మాట్లాడుతూ..కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏది జరగదన్నారు. పోలీసుల పోస్టులనే అమ్ముకునే సిగ్గుమాలిన మోసాలు జరుగుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అయినా మీరు అధికారుల నుంచి ఆశించేది ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ముందుగా పిల్లలను, బాలికలను ఉద్యోగాలు వచ్చేలా చదివించండి అని చెప్పారు. అలాగే బెంగుళూరులో జరగాల్సిన సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులు గురించి ఆలోచించండి అని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్!) -
అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..
-
Rahul Gandhi: అన్నాచెల్లెలి అనురాగం
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. తన జీవితంలో తన అన్న రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, 2023 వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్లో చివరి దశకు చేరుకోనుంది. -
కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయి.. రాహుల్ ఆసక్తికర ట్వీట్
భోపాల్: భారత్ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ''మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ'' పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్తో కలిసి నడిశారు. रास्तों से लड़कर हमने कई मुक़ाम बनाए हैं। साथ हैं तो यकीन है, मंज़िल ज़रूर पाएंगे। pic.twitter.com/hDuIdsVoNr — Rahul Gandhi (@RahulGandhi) November 24, 2022 సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. చదవండి: (కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య) -
‘పాత పింఛను’ హామీ ఎన్నికల స్టంట్ కాదు
సిర్మౌర్: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. తమ హామీ ఎన్నికల స్టంట్ కాదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న వేల కోట్ల రుణాలను రద్దు చేయడంపై ముందుగా సమాధానం చెప్పాలని కాషాయ పార్టీని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన గురువారం ప్రియాంక హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదంటూ ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రియాంక కొట్టిపారేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నదెవరు?అని ఆమె బీజేపీని నిలదీశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుగ్యోగ యువత ఉండగా ఖాళీగా ఉన్న 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు లక్ష ఉద్యోగాలను కల్పించడంతోపాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తుందని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. బీజేపీ హామీలను నమ్మవద్దని చెప్పారు. ధరల తగ్గింపు గురించి, ఉద్యోగ ఖాళీల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదని వివరించారు. ఇదీ చదవండి: నిర్మలా సీతారామన్తో కాంగ్రెస్ కార్యకర్తల సెల్ఫీలు -
ప్రియాంక గాంధీల కుటుంబానికి చెందినది కాదు! కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక వాద్ర ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేఖ్. హిందు సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఆమె వాద్రా కుంటుంబానికి చెందిన ఇంటి కోడలే గానీ గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు కదా అని ఖలేఖ్ అన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్ చీఫ్గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా అని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండమని పలుమార్లు కోరారు. ఐతే రాహుల్ గాంధీ కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల గాంధీ కుటుంబంలోని వారెవ్వరూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండకూడదని నిర్ణయించకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం శశిథరూర్ పోటీ చేస్తున్నట్లు తేలింది గానీ ఇంకా రాజస్తాన్ సంక్షోభం విషయమై అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 1 చివరి తేది కాగా, నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 8 . అంతేగాక అదే రోజు(అక్టోబర్ 8న) సాయంత్రం 5 గంటల ఫైనల్ లిస్ట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది పార్టీ. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్?) -
భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సాగే భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు కేరళ సరిహద్దులోని గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా వేర్వేరుగా పాల్గొంటారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ శుక్రవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టే బాధ్యతలను నాయకులకు అప్పగించామని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో కలిసి సమీక్షించామన్నారు. ఇలా ఉండగా, కేరళలోని చలకుడి వద్ద భారత్ జోడో యాత్ర శుక్రవారం విశ్రాంతి కోసం నిలిచిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. యాత్రికుల కోసం కేటాయించిన కంటెయినర్లో రాహుల్గాంధీ విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అక్కడే వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. రాహుల్ ఢిల్లీ వెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. -
అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి వెంకట్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా లేదంటే ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్ నుంచి కోమటిరెడ్డికి ఫోన్ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో భట్టి విక్రమార్క్, శ్రీధర్బాబు ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాత్రం నిన్న రాత్రే హైదరాబాద్కు వచ్చేశారు. దీంతో వీళ్లిద్దరి సమక్షంలోనే ప్రియాంక లేదంటే ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుజ్జగింపా? సాగనంపడమా? కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రియాంక సమక్షంలోనే ఆయన పంచాయితీ తేలనుందని కొందరు అంటుంటే.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్లతో చర్చలు జరిపించే అవకాశాలు ఉన్నాయని మరో సమాచారం. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెంకట్రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తననూ విమర్శిస్తున్నారని, అది పార్టీకి చేటు చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ప్రియాంక గాంధీ వద్ద ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇంకా ఉపేక్షించకుండా.. వెంకట్రెడ్డిని సాగనంపడమే మేలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంశంపై చర్చ జరగ్గా.. ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాస్పోర్టు వాడినంత మాత్రాన చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడు కాలేడు -
Munugode Politics: తెలంగాణ కాంగ్రెస్లో మును‘గోడు’.. రంగంలోకి ప్రియాంక?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పార్టీ కేడర్ బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రా ల్లో నేతలను ముందుకు నడిపించే బాధ్యతను ప్రియాంకా గాంధీకి అప్పగించే అవ కాశం ఉందని చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. ఆమెకు నేరుగా ఇన్చార్జి బాధ్యతలు ఇస్తారని కొందరు చెబుతుంటే.. మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంకకు నమ్మకమైన ఉత్తరప్రదేశ్కు చెందిన మరో నేతను ఇన్చార్జిగా నియమించి, ఆమె పర్యవేక్షిస్తారని మరికొందరు అంటున్నారు. అవసరమైనప్పుడు ప్రియాంక నేరుగా రంగంలోకి దిగుతారని చెప్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా ఆమెకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. మరింత వేడెక్కుతున్న ‘ఉప ఎన్నిక’! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా తదనంతర పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వేడి మరింతగా మండుతోంది. తనపై చేసిన కామెంట్ల విషయంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టుపట్టడంతో టీపీసీసీ చీఫ్ ఓ మెట్టు దిగి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మనస్పర్థలు ఉండొద్దన్న అధిష్టానం సూచన మేరకు.. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుష పదజాలాన్ని వాడటంతో వెంకటరెడ్డి ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణలు చెప్పాలని నన్ను డిమాండ్ చేశారు. బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్తున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వెంకటరెడ్డిని అవమానించేలా ఎవరు మాట్లాడినా సరికాదు. ఈ అంశాలను తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోను ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు. తర్వాత అద్దంకి దయాకర్ కూడా వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్తూ వీడియో పెట్టారు. తాను ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పానని, మరోమారు క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని, వెంకటరెడ్డి సోదర భావంతో క్షమించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కోరారు. సంతోషమే.. కానీ.. రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పినా ఎంపీ వెంకటరెడ్డి తన పట్టు వీడలేదు. ‘‘రేవంత్ క్షమాపణలు చెప్పడం సంతోషమే, కానీ మాట్లాడలేని పదాలు ఉపయోగించిన దయాకర్ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు..’’ అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. కనీసం దయాకర్ను సస్పెండ్ చేస్తే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడంపై ఆలోచిద్దామన్న ధోరణిలో మాట్లాడారు. అయితే.. వెంకటరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో.. తాను హోంగార్డునేనని, 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని పేర్కొంటూ చేసిన పోస్టు మరోసారి చర్చకు దారితీసింది. కరోనా వచ్చిందంటూ..! షెడ్యూల్ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి శనివారం మునుగోడు నియోజకవర్గంలో నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు జరిగిన పార్టీ పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ రేవంత్ హాజరుకాలేదు. ఆయనకు జ్వరం, కరోనా లక్షణాలు ఉన్నాయని, అందువల్ల హోం ఐసోలేషన్లో ఉన్నారని రేవంత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనలేకపోయారని పేర్కొన్నాయి. అయితే రేవంత్ పాదయాత్రకు వెళ్లకపోవడం అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమన్వయం కోసమే ప్రియాంకకు బాధ్యతలు ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉందని, కేడర్ క్రియాశీలకంగా పనిచేస్తోందని.. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉందనే ఆలోచనలో అధిష్టానం పెద్దలున్నట్టు సమాచారం. తెలంగాణలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అనే కోణంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుండగా.. కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల మధ్య కూడా విభేదాలు పెరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలను నేరుగా ప్రియాంకకు అప్పజెప్తారనే చర్చ జరుగుతోంది. చదవండి: తెలంగాణపై పూర్తి పేటెంట్ టీఆర్ఎస్దే.. -
Agnipath Scheme: కాంగ్రెస్ సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ... నకిలీ జాతీయవాదులను, నకిలీ దేశభక్తులను గుర్తించాలని యువతకు పిలుపునిచ్చారు. అసలైన దేశభక్తిని ప్రదర్శించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్, రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, వంశీచంద్రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలు అగ్నిపథ్ కార్యక్రమంతోపాటు, తమ నేత రాహుల్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాదిగా తమ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే విషయమైన పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిహార్లో 804 మంది అరెస్ట్ అగ్నిపథ్పై హింసాత్మక నిరసనలకు పాల్పడిన 804 మందిని అరెస్ట్ చేసినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. 145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో 34 కేసులు నమోదు చేసి, 387 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్లు గుర్తించిన 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా 483 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. -
Prashant Kishor: పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు
ఢిల్లీ: జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ.. కథనాలు జాతీయ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వం గురించి ప్రతిపాదనేం చేయలేదని చిదంబరం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. చాలా నెలలు కష్టపడి ఆయన(పీకేను ఉద్దేశిస్తూ) డాటా సేకరించారు. దానిపై ఆయన విశ్లేషణ.. ఆకట్టుకునేలా ఉంది. ఆ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా ఆచరించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కూడా’ ఆయన చిదంబరం స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై పీకే తన ప్రజెంటేషన్లో ప్రస్తావించలేదు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రియాంక పేరు ప్రతిపాదించిన విషయం నేను వినలేదు. అది నిజం కాదు కూడా. ఓ వర్గం మీడియా దానిని తెర పైకి తీసుకొచ్చింది. నాయకత్వ సమస్య పార్టీ అంతర్గత విషయం. ఏఐసీసీనే దానిని పరిష్కరిస్తుంది. ఆగష్టు చివరినాటికి ఎన్నికలతో ఆ సమస్య పరిష్కారం కావొచ్చు అని చెప్పారు. ఇక పార్టీ చేసిన ప్రతిపాదనను నిరాకరించిన విషయంపై పీకేను మళ్లీ వివరణ ఏమీ కోరలేదని, బహుశా ఆయన రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాడేమోనని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఐ-పీఏసీ(Indian Political Action Committee)(ప్రశాంత్ కిషోర్ స్థాపించిన కన్సల్టెన్సీ) చేసుకున్న ఒప్పందం వల్లే పీకే, కాంగ్రెస్లో చేరలేదన్న వాదనలో అర్థం లేదని చిదంబరం పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్లో చేరకపోవడానికి కారణం ఇదే- ప్రశాంత్ కిషోర్ -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్సోనియాగాంధీకి న్యూయార్క్లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిశోర్ సమావేశం
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో 5 గంటలపాటు సమావేశమయ్యారు. ప్రియాంకా గాంధీ, అంబికా సోనీ, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో పీకే భేటీ కావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఏడాడి ఆఖర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీకే త్వరలో కాంగ్రెస్లో చేరుతారంటున్నారు. ఆయన శనివారం సోనియా గాంధీ సమక్షంలో పూర్తిస్థాయి ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 370 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. సోనియాతో మెహబూబా ముఫ్తీ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోమవారం సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశం ఇప్పటిదాకా భద్రంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతేనని మెహబూబా ముఫ్తీ కితాబిచ్చారు. మరిన్ని పాకిస్తాన్లను సృష్టించాలని అధికార బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. -
'ఇది పురుషుల రాష్ట్రం'... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి
జైపూర్: రాజస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయంన అసెంబ్లీలో మాట్లాడుతూ..."రేప్ కేసుల్లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే రాజస్తాన్ పురుషుల రాష్ట్రం." అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు సతీష్ పూనియా శాంతి ధరివాల్ మహిళలను అవమానించడమే కాక పురుషుల గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఈమేరకు షెహజాద్ ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేగాక కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉద్దేశించి ప్రియాంక జీ ఇప్పుడు ఏం చెబుతారు, ఏం చేస్తారు అని గట్టిగా కౌంటరిస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. SHOCKING DISGUSTING BUT NOT SURPRISING Rajasthan's cabinet minister laughs & says in the assembly that Rajasthan is number 1 in rape because it is a “state of men” (mardon ka pradesh). LEGITIMISING RAPE AFTER KARNATAKA CONGRESS MLA NOW THIS PRIYANKA VADRA SILENT pic.twitter.com/dBY8f7MBSy — Shehzad Jai Hind (@Shehzad_Ind) March 9, 2022 (చదవండి: జమ్మూలో పేలుడు) -
Ukraini Russia War: జై హింద్.. జై భారత్.. ప్లీజ్ హెల్ప్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. తమను కాపాడమంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. సహాయం చేయాలంటూ ఓ విద్యార్థిని వేడకుంటున్న వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్లో షేర్ చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దయచేసి తమను రక్షించాలని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన గరిమా మిశ్రా అనే యువతి వీడియోలో వేడుకున్నారు. ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని వాపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని కన్నీటి పర్యంతమైంది. తమకు ఎవరూ సహాయం చేయడం లేదని, రాయబార కార్యాలయానికి ఫోన్ చేసినా స్పందన లేదని వాపోయింది. …@narendramodi जी, @DrSJaishankar जी यूक्रेन से आ रहे भारतीय छात्र-छात्राओं के वीडियो मन को बहुत ही ज्यादा व्यथित करने वाले हैं। इन बच्चों को भारत वापस लाने के लिए जो कुछ भी बन पड़ता है , भगवान के लिए, वह करिए। पूरा देश इन छात्र-छात्राओं और इनके परिवारों के साथ है।...1/2 pic.twitter.com/PfmBw8McLY — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 27, 2022 ‘సరిహద్దుకు బస్సులో వెళ్లిన మా స్నేహితులను రష్యా సైనికులు అడ్డుకున్నారని మాతో చెప్పారు. విద్యార్థులపై కాల్పులు జరిపి బాలికలను ఎత్తుకెళ్లారు. అబ్బాయిలు ఏమయ్యారో మాకు తెలియదు. మాకు సాయం చేయడానికి భారత సైన్యాన్ని పంపిండి. దయచేసి మాకు సహాయం చెయ్యండి. జై హింద్! జై భారత్! మాకు సహాయం అందేలా చేసేందుకు ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి’ అంటూ గరిమా మిశ్రా ముకుళిత హస్తాలతో వేడుకున్నారు. (క్లిక్: రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్) కాగా, ప్రత్యేక విమానాల ద్వారా భారత విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. తాజాగా హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మంది భారత పౌరులతో బయలుదేరిన విమానం సోమవారం ఢిల్లీ చేరుకుంది. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. విమానాశ్రయంలో భారతీయులకు స్వాగతం పలికారు. (క్లిక్: ఉక్రెయిన్ ప్రెసిడెంట్పై సమంత పోస్టు.. ఏమందంటే?) -
అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలపై ప్రియాంక.. ‘ఆ మురికిలోకి మా అమ్మను లాగడం ఎందుకు?’
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ గాంధీకే పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్త రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తాజాగా రాజీవ్ గాంధీ తనయ, రాహుల్ సోదరి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. మా అమ్మ గురించి వాళ్ళు అలా అని ఉండకూడదు. దేశం కోసం అమరుడైన ఒక ప్రధాని(రాజీవ్ గాంధీ)కి భార్య ఆమె. తన భర్త చావును, ముక్కలైన భర్త మృతదేహాన్ని ఇంటికి తేవడాన్ని ఆమె తన కళ్లారా చూశారు. అయినా మా అమ్మ తన జీవితాన్ని దేశం కోసమే అంకితమిస్తోంది. అలాంటి ఆవిడ గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆమెను ఈ మురికిలోకి లాగుతారు? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ప్రియాంక గాంధీ. ఎన్నికల్లో విలువలు, సిద్ధాంతాలు, సమస్యలపై పోరాడాలని, ఇతరులను అవమానించడం, ఇలాంటి పనికిమాలిన విషయాలపై కాదని ప్రియాంక గాంధీ, బీజేపీని ఉద్దేశించి హితవు పలికారు. యూపీ మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం రాయ్ బరేలీ ప్రచారంలో పాల్గొన్న ఆమె ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో పైవ్యాఖ్యలు చేశారు. చదవండి: రాహుల్కు మద్దతుగా కేసీఆర్ ఫైర్.. అసోం సీఎం ‘ఎవిడెన్స్’ కౌంటర్ -
నువ్వైనా నా మాట వినూ! భర్త విషం తీసుకోవడం చూసి ఆ భార్య..
కరోనాతో కోట్లాది మంది బతుకులు తలకిందులు అయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ తమ జీవితాలన్ని తలకిందులు చేసిందంటూ బాధపడేవాళ్లూ ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్ తోమర్ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడీ ఉదంతం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరడుగట్టిన బీజేపీ అభిమాని కాస్త విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాజీవ్ భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన ఫేస్బుక్ లైవ్లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోదీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్. భార్య అడ్డుకుంది కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్ వీడియోలో రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. ‘‘ప్రభుత్వం నాలాంటి వాళ్ల మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో షాక్ తిని.. ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు. కాసేపటికి లైవ్ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. బీజేపీ అభిమాని నుంచి.. రాజీవ్ తోమర్ కరడుగట్టిన బీజేపీ అభిమాని. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫొటోలు ఉండడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. భాగ్పట్ ఎంపీ సత్యపాల్ సింగ్(ఎడమ)తో రాజీవ్(కుడి) వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వ్యక్తిగత కారణాలకు.. పార్టీని నిందించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతో మంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజీవ్ వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇక ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరివారు కాదు - నేను మీతో ఉన్నాను అంటూ రాజీవ్ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. बागपत के राजीव तोमर जी व उनकी पत्नी के वीडियो ने छोटे व्यापारियों की लाचारी का दर्दनाक सच दिखाया है। तोमर जी के स्वस्थ होने की कामना व उनकी पत्नी के दुखद देहांत पर मेरी शोक संवेदनाएँ। अन्याय के सामने हम हार नहीं मानेंगे। इस लड़ाई में आप अकेले नहीं हैं- मैं आपके साथ हूँ। — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 बागपत में एक व्यापारी एवं उनकी पत्नी की आत्महत्या के प्रयास और उनकी पत्नी की मृत्यु के बारे में जान कर बेहद दुःख हुआ। परिजनों के प्रति मेरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि श्री राजीव जी को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022 -
అందుకే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: తరచూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల బట్టలను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. మహిళలు బికిని ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. ఆయన మాటలపై విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పారు. స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు. -
ఆ దిగ్గజ గాయని గౌరవార్థం.. సీఎం అభ్యర్థి ప్రకటన పై సంబరాలు చేసుకోవద్దు!
చండీగఢ్: బాలీవుడ్ లెజండరీ గాయని లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే లతా మంగేష్కర్ గౌరవార్థం ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరింది. ఇక పంజాబ్లో జరిగే ప్రచార ర్యాలిలో లత ఆలపించిన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట ప్లే చేయనున్నారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియంక వాద్రా ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ‘ఆమె అనేక దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత ప్రియమైన గాయనిగా కమనీయమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగేష్కర్ బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక వాద్రా కూడా భారత మాజీ ప్రధాని ఇందిగాంధీతో దిగిన లతామంగేష్కర్ ఫోటోని షేర్ చేస్తూ.. "ఆమె మరణం భారతీయ కళా ప్రపంచానికి కోలుకోలేని లోటు కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ బాధను భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..) -
ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పరస్పర అభివాద సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. బులంద్శహర్లో జయంత్ చౌదరితో కలిసి అఖిలేశ్ ప్రచారం నిర్వహిస్తుండగా... ప్రియాంక కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈలలు వేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్.. వీడియోను ప్రియాంక ట్విటర్లో షేర్ చేశారు. एक दुआ-सलाम ~ तहज़ीब के नाम pic.twitter.com/dutvvEkz5W — Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ)తో కలిసి సమాజ్వాదీ పార్టీ బరిలోకి దిగింది. అధికార బీజేపీకి, ఈ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకుని ప్రియాంక గాంధీ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్, ప్రియాంక ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) हमारी भी आपको राम राम @jayantrld @yadavakhilesh pic.twitter.com/RyUmXS4Z8B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 3, 2022 అయితే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 47 సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో అఖిలేశ్ పార్టీ 224 సీట్లు సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని అఖిలేశ్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. (క్లిక్: ఉత్తరప్రదేశ్లో తరతరాలుగా వీరిదే అధికారం!) -
ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ
తన పిల్లలకు హోం వర్క్ చేయడం సహయపడతానని కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు. తాను ఎన్నికలో ప్రచారంలో ఉన్నప్పుడూ కూడా తన పిల్లలకు హోం వర్క్ చేయడంలో సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఒక నెటిజన్ మీ పిల్లలకు హోంవర్క్లో సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ప్రియాంక తన పిల్లలకు హోం వర్క్లో సహయం చేయడమే కాక ఆంటీ అంటూ వచ్చే తన పిల్లల స్నేహితులకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. పైగా ఈ రోజు కూడా తాను తన కుమార్తె అసైన్మెంట్లో సహాయం చేశానని తెలిపింది. ఒక్కోసారి ఎన్నిఇకల ప్రచారం నుండి తిరిగి వచ్చినప్పుడూ తమ పిల్లల హోంవర్క్ పూర్తైయిందో లేదో నిర్ధారించడానికి తెల్లవారుజామున 3 లేక 4 గంటలకు కూర్చోవలసి వచ్చేదని చెప్పారు. అంతేగాక తన చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో తీవ్రంగా గొడవపడేదాన్ని అని అన్నారు. కానీ బయటివాళ్లు ఎవరైన జోక్యం చేసుకుంటే మాత్రం తాము ఒక్కటైపోయే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్షోలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో చాలా పార్టీలు ఓటర్లను కనక్ట్ అవ్వడానికి వినూత్న రీతిలో ఇలా ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను ఆశ్రయించాయి. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) (చదవండి: చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!) -
దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం
అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది. హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు. కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్ కేరళలోని వయనాడ్లో గెలుపొందారు. -
ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్
Priyanka Gandhi Vadra danced with tribal women in Goa: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మొర్పిర్ల గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు. అంతేకాదు ప్రియాంక గాంధీ ఎర్రటి చీరను ధరించి ధోల్ దరువులకు అనుగుణంగా గిరిజన మహిళల మాదిరి తలపై కుండ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్చేశారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు!.... 40కి పైగా ఒంటెలకు అనర్హత వేటు!!) పైగా ఆమె మోర్పిర్ల గ్రామంలోని బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన గిరిజన మహిళలు గోవాలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. అయితే అధికార పార్టీ బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జ్ అమిత్ మాల్వియా యావత్తు దేశం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్ మృతితో శోక సంద్రంలో ఉంటే మీరు గిరిజన మహిళలతో డ్యాన్స్లు చేస్తున్నారా అంటూ ప్రియాంక గాంధీ పై విమర్శలు ఎక్కుపెట్లారు. (చదవండి: పక్షిలా షి‘కారు’) Smt. @priyankagandhi joins the tribal women of Morpirla village during a phenomenal performance of their folk dance.#PriyankaGandhiWithGoa pic.twitter.com/p0ae6mKM9x — Congress (@INCIndia) December 10, 2021 -
తిరిగేది 8వేల కోట్ల విమానంలో..
మహోబా(యూపీ): రూ.8వేల కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణించే ప్రధాని మోదీ..రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ విమర్శించారు. శనివారం ఆమె యూపీలోని బుందేల్ఖండ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిజ్ఞార్యాలీలో ప్రసంగించారు. విమానాలు కొనుగోలు చేసేందుకు ప్రధాని వద్ద డబ్బుంటుంది కానీ, సామాన్యులకు ఇచ్చేందుకు ఉండదన్నారు. ప్రధాని మోదీ స్నేహితులైన బడాపారిశ్రామిక వేత్తల ఆదాయం రోజుకు రూ.10వేల కోట్లు కాగా, సాధారణ వ్యక్తి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమేనని ఆమె అన్నారు. ప్రధాని మోదీ రైతులు, ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. -
మాట నిలబెట్టుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ‘హమ్ వచన్ నిభాయేంగే’ (మాట నిలబెట్టుకుంటాం) అనే నూతన నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఏడు వాగ్దానాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రియాంకాగాంధీ వాద్రా శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా యాత్రలను ఆమె బారాబంకీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీలో తాము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మొత్తం మాఫీ చేస్తామని వెల్ల డించారు. గోధుమలు, ధాన్యానికి క్వింటాల్కు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. చెరుకు పంటను క్వింటాల్కు రూ.400 ధరతో కొంటామన్నారు. అన్ని రకాల విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. అధికారంలోకి వస్తే.. 12వ తరగతి బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థినులకు ఈ–సూ్కటర్లు ఇస్తామని ఇంతకు ముందే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ యాత్ర అవధ్లోని బారాబంకీ, బుందేల్ఖండ్ జిల్లాలను కలుపుతూ ఝాన్సీ వరకు సాగుతుంది. -
యూపీలో కాంగ్రెస్ ప్రతిజ్ఞా యాత్రలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞా యాత్రల పేరుతో శనివారం నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది. మొదటి దశలో జరిగే మూడు ప్రతిజ్ఞా యాత్రలు వారణాసి, బారాబంకీ, శహరాన్పూర్ నుంచి ప్రారంభమవుతాయి. శనివారం బారాబంకీలో బహిరంగ సభ తర్వాత ప్రియాంక గాంధీ ప్రతిజ్ఞా యాత్రలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ యాత్రలు నవంబర్ 1న ముగుస్తాయి. నాలుగో యాత్ర దీపావళి తర్వాత ప్రారంభం కానుందని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా తెలిపారు. ఈ యాత్రల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న హామీలను ప్రియాంక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తాము 40 శాతం టిక్కెట్లు ఇస్తానని ప్రియాంక ఇప్పటికే మొదటి హామీని ప్రకటించారు. 31న గోరఖ్పూర్లో భారీ ర్యాలీ నవరాత్రుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంకా గాంధీ ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా అక్టోబర్ 31న గోరఖ్పూర్లో రెండు లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. మహిళా శక్తితో ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనుకుంటున్న ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. యూపీలోని పూర్వాంచల్లో 125 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. -
ప్రియాంక దూకుడు: అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దూకుడు మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలనే వ్యూహంలో శరవేగంగా కదులుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 12వ తరగతి అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, గ్రాడ్యుయేట్లకుఎలక్ట్రానిక్ స్కూటీలను అందిస్తామని ప్రియాంక గురువారం ప్రకటించారు. వారి చదువుకు, భద్రతకు స్మార్ట్ఫోన్లు అవసరమని పేర్కొన్నారు. ఇందుకు మ్యానిఫెస్టో కమిటీ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లను రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.మహిళల ఓట్లను ఆకర్షించేలామహిళలకు 40 శాతం టిక్కెట్లను కేటాయించనున్నట్టు ప్రియాకం ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకునే మహిళలు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పోటీ చేయాలనుకునే ఏ స్త్రీ అయినా నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.దీనికి రాహుల్గాంధీ కూడా మద్దతుగా నిలిచారు. కాగా దేశంలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూపీలో 1989 నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటోంది. -
పోలీసుల అదుపులో ప్రియాంక, సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
లక్నో: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు.పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆగ్రా వెళుతుండగా బుధవారం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వే వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నో పోలీస్ లైన్స్కు తరలించారు. ప్రియాంకను అడ్డుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినపుడు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, యూపీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రియాంక యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి వెళ్లినా అడ్డుకుంటారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆమె పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో యోగీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రియాంక ట్విటర్లో మండిపడ్డారు. బాధిత కుటుంబం న్యాయం కోరుకుంటోంది.. తాను ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నా. యూపీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది? తనను ఎందుకు ఆపుతున్నారు? ఈ రోజు వాల్మీకి జయంతి బుద్ధుడిపై ప్రధాని మోదీ గొప్పగా మాట్లాడుతారు. కానీ దానికి విరుద్ధంగా తనపై దాడి చేశారంటూ ఆమె హిందీలో ట్వీట్ చేశారు. 25 లక్షలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ వాల్మీకి కుటుంబంతో తమ నేత మాట్లాడకుండా యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. మరోవైపు ప్రియాంక గాంధీని పోలీస్ లైన్కు తరలిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళా పోలీసులు ప్రియాంకతో సెల్ఫీ తీసుకునేందుకు మొహమాట పడుతుండగా, చొరవగా వారితో సెల్ఫీకి ఫోజులివ్వడంతోపాటు, అప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకోవడం విశేషం. #WATCH | Lucknow: Congress' Priyanka Gandhi Vadra & her convoy stopped by Police on their way to Agra. Police say, "You don't have permission, we can't allow you" She was going to meet family of a sanitation worker who was nabbed in connection with a theft&died in Police custody pic.twitter.com/N3s0QAU8n6 — ANI UP (@ANINewsUP) October 20, 2021 -
Rahul Gandhi: సబ్ కా వినాశ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతుండడం పట్ల కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సబ్ కా వికాస్ అనేది ఎక్కడా లేదని, సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోందని, దేశంలో కాదు, కేవలం పెట్రో ఉత్పత్తుల ధరల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు లాక్కుంటోందని ఆరోపించారు. పన్నుల బెడద లేకపోతే ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ.66కు, డీజిల్ రూ.55కే లభిస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీ తన ట్వీట్కు జతచేశారు. మోదీ మిత్రులే సంపన్నులవుతున్నారు: ప్రియాంక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతోందని, ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు కష్టాల పాలవుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ట్వీట్ చేశారు. కేంద్రం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచిందని చెప్పారు. బీజేపీ పాలనలో ధరల మంటతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ మిత్రులు మాత్రం నానాటికీ ధనవంతులవుతున్నారని ప్రియాంక నిప్పులు చెరిగారు. వరుసగా నాలుగో రోజు ధరల వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు సైతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 35 పైసల చొప్పున పెంచినట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. (చదవండి: పంజాబ్కు 13 పాయింట్ల ఎజెండా) -
చీపురుపట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లో ఆదివారం రైతులు చేపట్టిన ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. లఖింపూర్ ఖేరీ నిరసనల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీతాపూర్లో సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గెస్ట్హౌస్లోని గదిని స్వయంగా ప్రియాంక గాంధీ చీపురుతో శుభ్రం చేస్తూ ట్రెండింగ్లో నిలిచారు. ప్రియాంకతోపాటు, పార్టీ శాసనసభ్యుడు దీపేంద్ర సింగ్ హుడా తదితరులనుకూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గాంధీని సీతాపూర్-లఖింపూర్ సరిహద్దులోని హర్గావ్ సమీపంలో ఒక గెస్ట్హౌస్లో ప్రియాంక గాంధీని కస్టడీలో ఉంచారని కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం నేత ట్వీట్ చేశారు. దీంతోపాటు గెస్ట్హౌస్లోని గది ఫ్లోర్ని తుడుచుకుంటున్న వీడియోను ట్వీట్ చేశారు. పోలీసుల నిర్బంధంలోనే తమ నేత ప్రియాంక నిరాహార దీక్ష ప్రారంభించారని, బాధితుల కుటుంబాలు, రైతులను కలవకుండా తిరిగి వెళ్లేది లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీ బాధితులను కలవడానికి తమను అనుమతించలేదని ఆరోపించిన కాంగ్రెస్ న్యాయం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామని ప్రకటించింది. మరోవైపు లఖింపూర్ ఖేరీ వెళ్తానని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడంతో ఆయన నివాసం ముందు భారీఎత్తున పోలీసులను మోహరించారు. ఆ తరువాత అఖిలేష్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమాజ్ వాది పార్టీ మద్దతుదారులు పోలీసు జీప్కు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలు దేరిన పలువురు ప్రతిపక్ష నేతలను సోమవారం యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. दीदी प्रियंका जी ने अस्थायी जेल सीतापुर में सत्याग्रह शुरू किया। किसानों से मिले बगैर पीछे नहीं हटेंगे। न्याय के लिए अंतिम सांस तक लड़ेंगे। #लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/O6KnN3kvuD — Ajay Kumar Lallu (@AjayLalluINC) October 4, 2021 -
Navjot Singh Sidhu: పదవి ఉన్నా, లేకున్నా వారి పక్షాన నిలబడతా
చండీగఢ్: పంజాబ్లో ఇద్దరు కీలక నేతలు నవ జ్యోత్సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరువురు నేతలు తీసుకునే నిర్ణయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ.. తనకు పదవి ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన అండగా నిలబడతానని అన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకారం శనివారం జాతి పిత మహత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. ‘తాను గాంధీ, శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. నాకు కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను. వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీతో భేటీ అయిన సిద్దూ.. తిరిగి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. పంజాబ్లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు తెలుస్తోంది. Will uphold principles of Gandhi Ji & Shastri Ji … Post or No Post will stand by @RahulGandhi & @priyankagandhi ! Let all negative forces try to defeat me, but with every ounce of positive energy will make Punjab win, Punjabiyat (Universal Brotherhood) win & every punjabi win !! pic.twitter.com/6r4pYte06E — Navjot Singh Sidhu (@sherryontopp) October 2, 2021 -
కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం ట్విట్టర్లో మండిపడ్డారు. ‘మామిడి కాయలు ఎలా తినాలి ? వంటి సులువైన ప్రశ్నలకే వారు అలవాటు పడ్డారు. అందుకే ప్రజలకు సంబంధించిన పెగసస్ వివాదం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగదల వంటి విషయాలపై చర్చకు వారు భయపడుతున్నారు’ అని ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఏ విషయంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రతిపక్షాలు అనవసరమైన, సీరియస్ కాని విషయాల మీద నిరసనలు చేస్తున్నారని అన్నారు. -
యూపీలో పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: ప్రియాంక గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. అయితే, ఆ విషయంలో సానుకూలంగానే ఉన్నామని, తమ లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మీరు ఉన్న సమయంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలంగా ఉంటారని, మీరు వెళ్లిన వెంటనే మళ్లీ పార్టీ స్తబ్దుగా మారుతుందని వ్యాఖ్యకు స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ ఉన్నప్పుడు మీ(మీడియా) అటెన్షన్ ఉంటుంది. కనుక క్రియాశీలంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. నేను లేని సమయంలో మాపై మీ దృష్టి ఉండదు. కనుక స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి’ అని వివరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు. యూపీకి ప్రియాంక పొలిటికల్ టూరిస్ట్ అన్న బీజేపీ విమర్శలపై స్పందిస్తూ.. తనను, సోదరుడు రాహుల్ని సీరియస్ రాజకీయవేత్తలు కాదని ప్రచారం చేయడం బీజేపీ ఎజెండా అన్నారు. -
Rajasthan: రౌడీయిజం కనిపించడం లేదా..!
జైపూర్: రాజస్థాన్లో పెరుగుతున్న నేరాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కనిపించడం లేదా అని శనివారం బీజేపీ ప్రశ్నించింది. అశోక్ గెహ్లాత్ డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారంటూ తీవ్ర విమర్షలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నూపూర్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అత్యారాలు, ఇతర నేరాలు జరగడం ‘‘కాంగ్రెస్ సంస్కృతి’’ పర్యాపదాలుగా మారాయని దుయ్యబట్టారు. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందుల పడుతుంటే.. రాజస్థాన్లో మహిళలు గుండాలకు భయపడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందంటూ విమర్షలు గుప్పించారు. -
మోదీకి ప్రజలకన్నా... రాజకీయాలు ముఖ్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయుల క్షేమం కంటే రాజకీయాలే ముఖ్యమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. శనివారం ఆమె కరోనా నియంత్రణపై ప్రధాని మోదీని విమర్శిస్తూ తన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేశారు. ‘బాధ్యులెవరు’ అనే నినాదంతో ఆమె కొంతకాలంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. పిరికివాడిలా వ్యవహరించారు.. కోవిడ్ నియంత్రణ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ పిరికివాడిలా వ్యవహరించారని ప్రియాంక విమర్శించారు. పరిస్థితి చేజారే వరకూ చూసి, దేశాన్ని తలదించుకునేలా చేశారన్నారు. మోదీకి భారతీయులకంటే రాజకీయాలు ముఖ్యమని, సత్యం కంటే ప్రచారమే ముఖ్యమని మండిపడ్డారు. వాస్తవాల్ని దాచి బాధ్యత నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఊహించని స్థాయిలో కరోనా రెండో వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిందన్నారు. మొదటి వేవ్ తర్వాత ఏ చర్యలూ తీసుకోకపోవడంతో మరింత దారుణ పరిస్థితి ఎదురైందన్నారు. భారత్ సహా పలు దేశాల నిపుణులుగానీ, పార్లమెంట్ ఆరోగ్య కమిటీగానీ ఇచ్చిన సూచనలు పాటించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. వారి ఆలోచనలు విని ఉంటే దేశానికి అవసరమైన బెడ్లు, ఆక్సిజన్ వంటివి ముందుగానే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ప్రధాని సొంత ఇమేజ్ కోసం పాకులాడకపోయి ఉంటే ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఉండేదని కాదన్నారు. మోదీ తన గురించి చానెళ్లలో ప్రచారం చేయించుకునే బదులు కోవిడ్ గురించి ప్రచారం చేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవి కాదన్నారు. -
కేంద్రం గాలికొదిలేసింది.. ప్రియాంక భావోద్వేగ పోస్ట్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాయకత్వ, పాలనా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని, ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో తోటి వారికి సాయపడుతూ, తోడుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె ‘మనం అధిగమించగలం’ శీర్షికతో ఫేస్బుక్లో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ‘చాలా భారమైన హృదయంతో మీకు రాయాల్సి వస్తోంది. మీలో చాలా మంది కొద్ది వారాల్లో తమ ఆత్మీయులను కోల్పోయారని నాకు తెలుసు. చాలా మంది కుటుంబసభ్యులు కోవిడ్తో పోరాడుతున్నారు. కొందరు కోవిడ్ భయంతో ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ మహమ్మారితో ప్రభావితం కానీ వారెవరూ లేరు. దేశవ్యాప్తంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సాయం కోసమో, టీకా తదుపరి డోస్ కోసమో ఎదురుచూపులు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఈ నిరాశా సమయంలో మనం బలాన్ని కూడదీసుకుందాం. ఇతరులకు చేతనైనంత మేర సాయ పడదాం. అలుపెరగక, అన్ని ఇబ్బందులను దాటుకుంటూ సంకల్పంతో సాగడం ద్వారా మనం అధిగమించగలం’ అని తెలిపారు. ‘ఈ ప్రభుత్వం మనల్ని గాలికొదిలేసింది. ఇంతటి విధ్వంసకర సమయంలో ప్రభుత్వం నాయకత్వ, అధికార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఎవరూ ఊహించలేనిది. అయినా ప్రజలు నిరాశ చెందకూడదు. ప్రతి కష్ట కాలంలోనూ సాధారణ ప్రజలు నాలాంటి, మీలాంటి వారు ముందుకు వస్తారు. మానవత్వం ఎన్నటికీ ఓడిపోదు’అని ధైర్యం చెప్పారు. -
కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా?
సాక్షి, న్యూఢిల్లీ: పీపీఎఫ్, ఎన్ఎస్సీలాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నిర్టయాన్ని వెనక్కి తీసుకుంది. వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర స్పష్టం చేసింది. ఈ మేరకు వడ్డీరేటు తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. 2020-2021 చివరి త్రైమాసికం రేట్లే యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అయితే పొరబాటున వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులిచ్చామన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భయంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే దేశీయ మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్తో ఆడుకుంటోందంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్లో మండిపడ్డారు. నిజంగానే పొరబాటున తగ్గింపు ఆదేశాలిచ్చారా..లేక ఎన్నికల జిమ్మిక్కా అంటూ సీతారామన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. అటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేక సర్కస్ చేస్తున్నారా అంటూ మరో కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆర్థికమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన కేంద్రం సమీక్షిస్తుంది. ఈనేపథ్యంలోనే వడ్డీ రేట్లను 40-110 బేసిస్ పాయింట్ల మధ్య కోత విధించినట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఈ కోత లేనట్టే. దీని ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతంగా యథాతథంగా అమలుకానుంది. Egg on face again🤪 Because MO-SHA too busy throwing petals from trucks and cracking April Fool jokes of false promises at election rallies. https://t.co/SVb0dWrqQU — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) April 1, 2021 Really @nsitharaman “oversight” in issuing the order to decrease interest rates on GOI schemes or election driven “hindsight” in withdrawing it? https://t.co/Duimt8daZu — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 1, 2021 Madam FM, Are u running a ‘Circus’ or a ‘Govt’? One can imagine the functioning of economy when such duly approved order affecting crores of people can be issued by an ‘oversight’. Who is the competent authority referred in order? You have no moral right to continue as FM. pic.twitter.com/czRv5MY7O8 — Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021 -
‘కేరళ ప్రభుత్వం విదేశీ బంగారంపై కన్నేసింది’
కొల్లాం/కరునగపల్లి: కేరళ ప్రభుత్వం కుంభకోణాలకు, అవినీతికి నిలయంగా మారిందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ తరహా విధానాలనే పినరయి ప్రభుత్వం కూడా పాటిస్తోందని వ్యాఖ్యానించారు. కేరళలో త్వరలో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున చేస్తున్న ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళకు నిజమైన బంగారం ప్రజలేనని, కానీ ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి వస్తున్న బంగారంపై కన్నేసిందంటూ ‘గోల్డ్ స్కామ్’ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. స్థానిక జాలరుల కడుపుకొట్టేలా.. వేరే దేశానికి చెందిన కార్పొరేట్ కంపెనీకి డీప్ ఫిషింగ్కు అనుమతులు ఇచ్చారని అన్నారు. వారి ఉద్దేశం రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్లకు అమ్మడమేనని విమర్శించారు. 2017లో వలయార్లో జరిగిన హత్యాచార ఘటన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇద్దరు అమ్మాయిలపై హత్యాచారం జరిగితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. ప్రభుత్వం వారిని శిక్షించకపోగా, అభినందించిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మహిళలు ఎలా ఎన్నుకుంటారంటూ ప్రశ్నలు సంధించారు. చదవండి: మెహబూబా తల్లికి పాస్పోర్ట్ నిరాకరణ -
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్ను సందర్శించారా?
-
మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్ను సందర్శించారా?
గువహటి: అసోం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అస్సాంలో వరదలు వస్తే , పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సమస్యపై స్పందించని ప్రధాని, 22 ఏళ్ల దిశ రవి ట్విట్పై మాత్రం ఎలా స్పందించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆదివారం అస్సాంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని విమర్శించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతియువకులను , కార్మికులను, రైతులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మోసం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసోంలోని జోర్హాట్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఒక టీ గార్డెన్ను సందర్శించారా..!, అక్కడ మహిళా కార్మికులను కలిశారా? టీ ఎస్టేట్లో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనం 350 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని ఇంకా నెరవెర్చలేనందుకు కార్మికుల పట్ల బాధగా లేదా..! " అని ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అసోంలో అధికారంలో రావడానికి తీవ్రంగా కృషిచేస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. (చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం ) -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం
డిస్పూర్: అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆమె మంగళవారం అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు తేజ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట ప్రజలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా తేయాకు మహిళా కార్మికుల దినసరి వేతనం పెరగటం లేదని మండిపడ్దారు. అయితే తాము అధికారంలోకి వస్తే తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామని ప్రియాంక తెలిపారు. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అసోం మహిళల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని తెలిపారు. మహిళలపై అసోంలో చాలా దాడులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 126 నియోజవర్గాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ -
కథల్లో ఉండే ‘అహంకారి రాజు’ ప్రధాని మోదీ
లక్నో: ప్రధాని మోదీని పురాతన కథల్లో ఉండే ‘అహంకారి రాజు’పాత్ర వంటి వ్యక్తి అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పోల్చారు. దేశాన్ని రక్షించే సైనికుడు కూడా ఒక రైతు కొడుకేనన్న విషయం కూడా ప్రధాని తెలుసుకో లేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ముజఫర్ పూర్లో శనివారం జరిగిన కిసాన్ మహా పంచాయత్కు హాజరై ఆమె ప్రసంగించారు. తన పాలన విస్తరించడంతో రాజ మందిరానిదే పరిమితమయ్యే అహంకారి రాజులా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని దృష్టంతా తన స్వార్థం, కోటీశ్వరులైన తన మిత్రుల గురించే ఉంటుందనీ, అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొత్త సాగు చట్టాలతో రైతుల హక్కుల హరించుకుపోతాయని, మండీలు, కనీస మద్దతు ధర విధానం ఇకపై ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. వంటగ్యాస్, డీజిల్, కరెంటు ధరలు పెంచుతూ పోతున్న ప్రభుత్వం..చెరకు మద్దతు ధరను మాత్రం అలాగే ఉంచిందని తెలిపారు. ‘గత ఏడాది డీజిల్పై విధించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.3.5లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది. దేశం కోసం రేయింబవళ్లు స్వేదం చిందించే రైతులకు ఈ సొమ్ము ఎందుకు అందడం లేదు?’అని అన్నారు. అమెరికా, చైనా, పాకిస్తాన్లలో పర్యటించే ప్రధాని మోదీ.. తన నివాసానికి 5,6 కిలోమీటర్ల దూరంలోనే ఆందోళనలు జరుపుతున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లలేకపోతున్నారని దుయ్యబట్టారు. చదవండి: కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు -
అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఫైర్ అయ్యారు. పంజాబ్లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజకీయ స్వార్థంతోనే రాహుల్, ప్రియాంక గాంధీ అత్యాచార ఘటనలను రాజకీయం చేస్తున్నారన్నారు. ఎంపిక చేసుకున్న ఘటనల పై మాత్రమే వారు మాట్లాడుతున్నారన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ అండగా నిలబడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోదరులపై గతంలో రేప్ కేసులు ఉన్నాయని, అందుకే వారు ఈ ఘటనపై మాట్లాడటం లేదని నిర్మల సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీడియాపై దాడులు జరుగుతున్నాయని, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ,వామపక్ష మేధావులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మేము ఏమి చేస్తామో మేనిఫెస్టోలో చెప్పే హక్కు మాకు ఉంది. కరోనా ఫ్రీ వ్యాక్సిన్ అంశం పై మాట్లాడుతూ, ఇది రాష్ట్ర జాబితాలోని అంశమని తెలిపారు. చదవండి: లాలూకి బెయిల్.. నితీష్కు ఫేర్వల్ -
మహిళల భద్రత మీ బాధ్యతే: ప్రియాంక గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఇప్పటికే తరచు మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంలేదంటూ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా హత్రాస్ సామూహిక అత్యాచార సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించింది. ఈ విషయంపై ట్విట్టర్ వేదిక ప్రియాంక స్పందించారు. "హత్రాస్లోకొందరు మృగాలకు బలై ఒక దళిత మహిళ ఈ రోజు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కన్నుమూసింది. రెండు వారాలుగా ఆమె జీవర్మరణ సమస్యతో పోరాడింది’ అని ప్రియాంక గాంధీ వాద్రా హిందీలో ట్వీట్ చేశారు. హత్రాస్, షాజహన్పూర్, గోరఖ్పూర్లలో ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న హత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని ప్రియాంక అన్నారు. యూపీలో శాంతిభద్రతలు చాలా వరకు క్షీణించాయి. మహిళలకు రాష్ట్రంలో ఏవిధమైన భద్రత లేకుండా పోయింది. నేరస్థులు బహిరంగంగా నేరాలకు పాల్పడుతున్నారు’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దళిత మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. "యూపీలో మహిళల భద్రతకు మీరు జవాబుదారీగా ఉన్నారు" అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ట్వీట్ చేశారు. హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు ఆమె గొంతుకోశారు. దీంతో ఆమెను మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడతో ఆమెను ఢిల్లీలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఆ మహిళ మంగళవారం ఉదయం కన్నుమూసింది. చదవండి: మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లారు.. -
‘ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదు’
లక్నో: నిరుద్యోగుల పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు శనివారం ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. కాగా అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర మనోవేధనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల 12,460 మంది టీచర్ రిక్రూట్మెంట్ నియామకాలలో ఉద్యోగాలు సాధించారని, కాగా వారికి ఖాళీలు లేవంటూ అపాయింట్మెంట్ లెటర్స్ (నియామక పత్రాలు) ఇవ్వడం లేదని విమర్శించారు. అత్యుత్తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం నియమించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆర్థిక సమస్యలు, డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రియాంకా విమర్శలపై యూపీ అధికారులు స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని, ఇటీవల భారీ నియామకాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం యోగి ఆదేశించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. -
గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. తమ ఇంటి సభ్యులు కాకుండా బయట వ్యక్తులకే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలన్న తన సోదరుడు రాహుల్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. పార్టీని నడిపే సత్తా కలిగిన నాయకులు ఎందరో ఉన్నారని తాజాగా విడుదలైన పుస్తకంలో తన మనసులో మాట వెల్లడించారు. అమెరికా విద్యావేత్తలు ప్రదీప్ చిబ్బర్, హర్ష షాలు రచించిన ‘‘ఇండియా టుమారో : కన్వర్జేషన్ విత్ ది నెక్స్›్ట జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’’అన్న పుస్తకంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంపై ఆధారపడకుండా కాంగ్రెస్కు సొంత దారంటూ ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించినట్టుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా విడుదలైన ఆ పుస్తకం వెల్లడించింది. ‘‘రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా లేఖలోనే కాదు, చాలా సార్లు తన మనోగతాన్ని విప్పి చెప్పారు. మన కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదన్నారు. నేను కూడా రాహుల్కి మద్దతుగా ఉంటా’’అని ప్రియాంక చెప్పారు. 15 నెలల క్రితం ఇంటర్వ్యూ అది: కాంగ్రెస్ దేశంలో యువ రాజకీయ నేతల్ని పుస్తక రచయితలు గత ఏడాది ఇంటర్వ్యూ చేశారని, ప్రియాంక వెల్లడించిన అభిప్రాయాలు అప్పటివని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గత ఏడాది మే 25న రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని కూడా సలహా ఇచ్చారు. గత ఏడాది జూలైలో అమెరికాకు చెందిన రచయితలు ప్రియాంక అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని ప్రియాంక వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్ చేసిన కృషిని ప్రియాంక కొనియాడారు. -
‘సహనం, వాస్తవం నీ నుంచే నేర్చుకున్నాను’
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు.. తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు సోదరి ప్రియాంకతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన 40 నిమిషాల్లోనే దాదాపు 18 వేల లైక్లు వచ్చాయి. మరో వైపు ప్రియాంక గాంధీ కూడా రాఖీ సందర్భంగా సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. (ఉన్నాను నీకు తోడుగా) Wishing every one a happy #RakshaBandhan. आप सभी को रक्षाबंधन की शुभकामनाएँ। pic.twitter.com/EJZWPSGO2J — Rahul Gandhi (@RahulGandhi) August 3, 2020 ‘కష్ట, సుఖాల్లో నా సోదరుడితో కలిసి జీవించడం వల్ల నేను తన నుంచి నేను ప్రేమ, ఓర్పు, వాస్తవం వంటి వాటిని అవర్చుకున్నాను. నీ లాంటి సోదరుడు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను. రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. हर सुख-दुख में साथ रहते हुए मैंने अपने भाई से प्रेम, सत्य और धैर्य का साथ सीखा है। मुझे ऐसा भाई मिलने पर गर्व है। समस्त देशवासियों को पावन पर्व #रक्षाबंधन की हार्दिक शुभकामनाएं।#RakshaBandhan pic.twitter.com/KWTGpTZQYy — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2020 -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని లోధీ ఎస్టేట్లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక కొన్ని రోజుల పాటు గురుగ్రామ్లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్ను చేపట్టినట్టు తెలిసింది. (బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం) ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే. -
గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని లోధీ ఎస్టేట్లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. కొద్దినెలల పాటు ఆమె గురుగ్రాంలోని డీఎల్ఎఫ్ అరాలియా నివాసంలో ఉంటారని ప్రియాంక సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఢిల్లీలోని రెండుమూడు ప్రాంతాల్లో వసతి గృహం కోసం పరిశీలిస్తున్న ప్రియాంక త్వరలోనే అద్దె ఇంటిని ఖరారు చేస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని ఆమె ఎంచుకున్నారని మరమ్మతు పనులు పూర్తయినే వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లవచ్చని పేర్కొన్నాయి. అప్పటివరకూ గురుగ్రాంలో ప్రియాంక నివసిస్తారని తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్ను చేపట్టినట్టు తెలిసింది. కాగా ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంతో ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆమెకు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులపై ప్రియాంక స్పందిస్తూ జులై 31లోగా లోధీ ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి : పైలట్తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక -
అది అబద్ధం: ప్రియాంక గాంధీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్లోని ప్రభుత్వ బంగళాను ఆగస్టు లోపు ఖాళీ చేయాలని జూలై1న పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం ప్రియాంక గాంధీ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసత్యపు వార్త. బంగళాలో ఉండేందుకు కాల పరిమితి పెంచాలని నేను ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన పెట్టుకోలేదు. నేను జూలై 1న పొందిన లేఖ ప్రకారం ఆగస్టు 1లోగా లోథీ రోడ్లోని బంగళాను ఖాళీ చేస్తాను’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. (ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి కేటాయింపు) ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా స్పందిస్తూ.. ‘మాపై వస్తున్న వార్తలు నిజం కాదు. బంగళాలో ఉండేందుకు మేము ఎటువంటి పొడగింపు అడగలేదు. నెల రోజుల్లో బంగ్లాను ఖాళీ చేయాలని లేఖ వచ్చింది. ఆ మేరకు మేము ఇంటి సామాన్లను ప్యాక్ చేశాము. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే వారం రోజుల ముందుగానే ఖాళీ చేస్తాము’ అని ఆయన ట్విటర్లో తెలిపారు. (‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’) దీనిపై పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ‘నిజాలు ఎప్పుడూ వాటంతట అవే బయటకు వస్తాయి. కాంగ్రెస్కు చెందిన ఓ నేత జూలై 4న నాకు ఫోన్చేసి 35, లోడీ ఎస్టేట్స్లోని బంగళాను మరో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించాలని కోరారు. దాంతో ప్రియాంక గాంధీ అక్కడే కొనసాగడానికి వీలుంటుందని తెలిపారు. ప్రతి విషయాన్ని సంచలనం చేయొద్దు’ అని ఆయన ట్విటర్లో అన్నారు. ప్రియాంక తనపై వస్తున్న వార్తలను అసత్యమని ఖండించిన తర్వాత మంత్రి స్పందించటం గమనార్హం. -
నేను ఇందిరా గాంధీ మనువరాలిని..
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఉత్తర ప్రదేశ్ ప్రజల బాధ్యత ప్రజా సేవకురాలిగా నా కర్తవ్యం. వాస్తవాలను వారి ముందు ఉంచడం నా విధి. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. నేను కొంతమంది నాయకుల మాదిరి బీజేపీ చెప్పుకోలేని ప్రతినిధిని కాదు. ఇందిరాగాంధీ మనవరాలిని’ అంటూ ట్వీట్ చేశారు. (ప్రియాంకాకు కొత్తపేరు పెట్టిన బీజేపీ నేత) రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితోపాటు పలు అంశాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాన్పూర్లోని ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా పాజిటివ్గా తేలిందని ఆదివారం ప్రియాంక ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు, వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. (కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా పాజిటివ్ ) కరోనాతో ఆగ్రా ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది మరణించినట్లు ఓ వార్త క్లిప్ను జతచేస్తూ జూన్ 22న ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్పై స్పందించిన ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నరైన్ సింగ్ మంగళవారం ట్వీట్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని కోరారు. అయితే దీనిని పట్టించుకోని ప్రియాంక ఆగ్రాలో కోవిడ్ -19 మరణాల రేటు 6.8 శాతంగా ఉందని, ఇది ఢిల్లీ, ముంబై కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. (28 కోవిడ్ మరణాలు.. విచారణకు సీఎం ఆదేశం) -
రైల్వేల నిర్వాకంతోనే..
సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల దుస్థితికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వాకమే కారణమని కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా మండిపడ్డారు. ‘శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారు..40 శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి..ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నా’యని ప్రియాంక ఆరోపించారు. పరిస్ధితులు ఇలా ఉంటే బలహీనంగా ఉన్నవారు రైళ్లలో ప్రయాణానికి దూరంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొనడం దిగ్ర్భాంతికరమని ఆమె అన్నారు. కరోనా కట్టడికి ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్తో వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో వేలాది వలస కార్మికులు స్వస్థలాలకు తరలివెళుతూ పలువురు మార్గమధ్యలో తనువు చాలించిన ఘటనలు నివ్వెరపరిచాయి. చదవండి : ‘నాన్న నాకు ఇచ్చిన బహుమతులు ఇవే’ -
వలస కార్మికులపై రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కూడు, గూడు లేకుండా కాలి నడకన బయల్దేరిన యూపీ వలస కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. వారిని తీసుకొచ్చేందుకు వెయ్యి బస్సులను ఏర్పాటు చేస్తామని, వాటికయ్యే ఖర్చును పార్టీయే భరిస్తుందని, అందుకు అవసరమైన అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మే 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఓ లేఖ రాశారు. అందుకు సంతోషంగా అనుమతి మంజూరు చేయాల్సిన యోగి ప్రభుత్వం ఆ వెయ్యి బస్సుల నెంబర్లు, వివరాలు తెలియజేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి లేఖ రాసింది. తీరా ఆ బస్సుల వివరాలు వచ్చాక, వాటిలో వంద బస్సులను అస్సలు బస్సులే అనలేమంటూ, మరో 290 బస్సులకు సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్లతోపాటు అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేవంటూ కేసు పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ లల్లూపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టింది. పైగా బస్సుల జాబితాలో తప్పులున్నాయంటూ ప్రియాంక గాంధీ కార్యదర్శిపై కేసు బనాయించింది. (ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?) యోగి వలస కార్మికులను ఆదుకోకపోగా, ఆదుకునేందుకు ప్రయత్నించిన తమపై అనవసరంగా కేసులు పెట్టిందంటూ కాంగ్రెస్ పార్టీకి కూడా కోర్టు కెక్కింది. కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రచారమో, పలుకుబడి కోసమో వలసకార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందనడంలో సందేహం లేదు. అనుమతించి ఉన్నట్టయితే దాదాపు 30 వేల మంది కార్మికులైన సురక్షితంగా యూపీ చేరుకునే అవకాశం ఉండింది. యూపీ లాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ బస్సులను ఏర్పాటు చేసి ఉండాల్సిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికుల రైలు చార్జీలను భరించేందుకు తమ పార్టీ ముందుకొచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. (లాక్డౌన్: ఆగని విషాదాలు) -
‘నాన్న నాకు ఇచ్చిన బహుమతులు ఇవే’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. ‘నాన్నతో నా చివరి ఫోటో’ అంటూ తండ్రితో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. తన 19వ ఏట రాజీవ్ గాంధీతో కలిసి ఈ ఫోటో దిగారు ప్రియాంక. ‘మీ మీద దయ లేని వారి పట్ల కూడా మీరు దయతో ఉండండి. జీవితం అన్యాయంగా ఉంటుందని మీరు ఊహించుకున్నప్పటికి.. అది చాలా న్యాయంగానే ఉంటుంది. కటిక చీకటిలో, ఉరములు మెరుపులలో కూడా మీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండండి. ఎంతటి కష్టం అయినా రానివ్వండి.. మీ హృదయాన్ని మాత్రం ప్రేమతో బలంగా తయారు చేసుకొండి. నా తండ్రి జీవితం నాకిచ్చిన బహుమతులు ఇవే’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. To be kind to those who are unkind to you; to know that life is fair, no matter how unfair you imagine it to be; to keep walking, no matter how dark the skies or fearsome the storm; .. 1/2 pic.twitter.com/pQpwFfTqIE — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 21, 2020 కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించింది. రాజీవ్కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. ‘యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి’ అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. (‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం) -
‘ఆ విషయం కాదు ముందు దీని సంగతి చూడండి’
లక్నో: ఉత్తరప్రదేశ్లో నకిలీ పీపీఈ కిట్ల పంపిణీ కలకలం రేపుతోంది. యూపీలోని మెడికల్ కాలేజీలకు, డాక్టర్లకు పంపిన పీపీఈ కిట్లు నకిలివి అంటూ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర జనరల్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తరువాత ఆ విషయం బహిర్గతమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం యోగీ ఆదిత్యనాధ్ సర్కార్ను నిలదీశారు. నకిలీ పీపీఈ కిట్ల స్కామ్ వ్యవహారంలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని కోరారు. కరోనా యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లని, వారికి నకిలీ కిట్లను సరఫరా చేస్తూ వైద్యుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. వైద్యుల భద్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు. (చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్) यूपी के कई सारे मेडिकल कालेजों में खराब PPE किट दी गई थीं। ये तो अच्छा हुआ सही समय पर वो पकड़ में आ गईं तो वापस हो गईं और हमारे योद्धा डाक्टरों की सुरक्षा से खिलवाड़ नहीं हुआ। लेकिन हैरानी की बात ये है कि यूपी सरकार को ये घोटाला परेशान नहीं कर रहा है बल्कि .. 1/2 pic.twitter.com/ef4PHpE1lb — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 యోగి సర్కారు మాత్రం నకిలీ కిట్ల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం తెలుసుకోవడం కంటే ముఖ్యంగా ఈ విషయం ఎవరి వల్ల బయటకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. మొదటి అసలు విషయం ఎలా బయటకి వచ్చి అని తెలుసుకోవడం పక్కన పెట్టి నకిలీ కిట్ల స్కామ్ వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని కోరారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడం ద్వారా మంచి జరిగిందని లేకపోతే దీనిని మరుగున పడేసేవారని ప్రియాంక ఆరోపించింది. దీనికి సంబంధించిన విషయాలను ప్రియాంక తన ట్విటర్ ఖాతాలో హిందీలో పేర్కొన్నారు. (ల్యాబ్లు పెరిగినా టెస్ట్ల సంఖ్య పరిమితం..) ..ये परेशान कर रहा है कि खराब किट की खबर बाहर कैसे आ गई। ये तो अच्छा हुआ कि खबर बाहर आ गई वरना खराब किट का मामला पकड़ा ही नहीं जाता और ऐसे ही रफा-दफा हो जाता। क्या दोषियों पर कार्यवाही होगी? 2/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 -
కరోనా యోధుడు.. ఈ రాముడు
న్యూఢిల్లీ/లక్నో: కరోనా మహమ్మారిపై ఒక్కొక్కరు ఒక్కో రీతితో యుద్ధం చేస్తున్నారు.. రామకృష్ణ అనే యువకుడు కూడా అదే కోవలోకి చెందుతారు.. కరోనాపై పోరాడేందుకు రావాల్సిందిగా పిలుపు రాగానే వెంటనే అన్నీ వదిలేసి వెంటనే 1,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇందుకోసం హైదరాబాద్ వెళతానని తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామకృష్ణ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో ఆరు నెలల కిందే పీహెచ్డీ పూర్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయాల్సిందిగా తన డిపార్ట్ మెంట్ హెడ్ అమితా జైన్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆ వెంటనే తన బ్యాగ్ సర్దుకుని లక్నోకు బయల్దేరారు. ఈ విషయం చెబితే తల్లిదండ్రులు భయపడతారేమోనని.. హైదరాబాద్ లోని తన స్నేహితుల రూంలో ఉండి థీసిస్ రాసుకుంటానని చెప్పాడు. అయితే కరోనా భయంతో హైదరాబాద్ కూడా వెళ్లేందుకు నిరాకరించారు. కానీ ఎలాగోలా వారిని ఒప్పించి మార్చి 21న బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున లక్నోకు వెళ్లాల్సిన అన్ని దారులు మూసుకుపోవడంతో మరుసటి రోజున ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అయితే పోలీసులు మార్గమధ్యలో ఆపి ప్రశ్నించగా.. ఈ విషయం చెప్పడంతో వారు కూడా ఆయనకు సహకరించారు. దీంతో విమానంలో లక్నోకు వెళ్లి కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కరోనాపై యుద్ధానికి రామకృష్ణ చేస్తున్న కృషి గురించి కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. -
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్గాంధీ పెయింటింగ్కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
రాజ్యసభకు ప్రియాంక గాంధీ?
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ వాద్రాను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ యోచిస్తోందా? కాంగ్రెస్ దళాన్ని లోక్సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ నడపాలని కోరుకుంటోందా? అన్న ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం వల్ల, కుటుంబ రాజకీయాల విమర్శకు ఊతమిచ్చినట్లు అవుతుందని పార్టీలోని పలువురు నేతలు భావిస్తున్నారు. అలాగే, రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే.. యూపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ప్రియాంక దృష్టి పెట్టలేకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు, రాజ్యసభలో ప్రియాంక కీలకంగా వ్యవహరించడం దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుందనే వర్గం కూడా కాంగ్రెస్లో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం కార్యకర్తలను ఉత్తేజపర్చాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. రాజ్యసభ సభ్యులుగా సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ ఖాళీలను ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్తాన్ల కోటాతో పూరించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ ఖాళీల్లో నుంచి ఒక స్థానాన్ని ప్రియాంకకు కేటాయించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పదవీకాలం ముగుస్తున్న నేతల్లో గులాం నబీ ఆజాద్కు మళ్లీ అవకాశం తథ్యమని తెలుస్తోంది. -
పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక
-
నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు : సదాఫ్ జాఫర్
-
నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు : సదాఫ్ జాఫర్
లక్నో : లక్నోలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నసమయంలో అక్కడే ఉన్న యుపీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ను పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె అరెస్టుకు ముందు అక్కడ ఘర్ణణకు సంబంధించిన వీడియోలనూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ డిసెంబర్ 19 న లక్నోలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీస్స్టేషన్ బయట పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాదాపు 200 మంది ఆందోళనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి తమ నిరసనను తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ కూడా ఉన్నారు. నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సదాఫ్ జాఫర్తో పాటు మరో 34మందిపై లక్నోలోని హజ్రత్ఘంజ్ పోలీస్స్టేషన్లో ఐఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆమె అరెస్టుకు ముందు తీసిన వీడియోలో సదాఫ్ జాఫర్ మాట్లాడుతూ.. అల్లరి ముకలు రాళ్లతో దాడి చేస్తున్నా వాళ్లను ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని, వారిని పట్టుకోవాల్సింది పోయి అలాగే చూస్తు నిలబడడమేంటని ప్రశ్నించారు. మీకు రక్షణగా ఇచ్చిన హెల్మెట్ల వల్ల ఉపయోగం ఉపయోగం ఏంటని విమర్శించారు.దీంతో పాటు ఇంకో వీడియోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సదాఫ్ జాఫర్ ఆందోళన జరుగుతున్న ప్రదేశంలో ఉండగా ఆమెను అరెస్టు చేయడానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ను ఉద్దేశించి .. రాళ్లతో దాడి చేస్తున్న వారిని వదిలేసి నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు. ఇది అన్యాయమని అడిగారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్లో స్పందిస్తూ 'మా కార్యకర్త సదాఫ్ జాఫర్ను అన్యాయంగా అరెస్టు చేశారు. యూపీ పోలీసులు అసలు దోషులను వదిలేసి సదాఫ్ జాఫర్ను అరెస్టు చేసి తీసుకెళ్లారని, ఆమెను తీవ్రంగా కొట్టారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఒక మహిళపై అణచివేత ధోరణి తగదని, వెంటనే ఆమెను రిలీజ్ చేయాలని' డిమాండ్ చేశారు. हमारी महिला कार्यकर्ता सदफ ज़फ़र पुलिस को बता रही थीं कि उपद्रवियों को पकड़ो और उन्हें यूपी पुलिस ने बुरी तरह से मारा पीटा व गिरफ्तार कर लिया। वह दो छोटे-छोटे बच्चों की मां हैं। ये सरासर ज्यादती है। इस तरह का दमन एकदम नहीं चलेगा।https://t.co/ydS8uYuosM — Priyanka Gandhi Vadra (@priyankagandhi) 22 December 2019 -
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ లీలా శాంసన్పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్పర్సన్గా కూడా పనిచేసిన లీలా శాంసన్తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు ఛైర్మన్గా లీలా శాంసన్ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. -
‘న్యూ ఇండియాలో.. వాటినలాగే పిలుస్తారు’
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం.. భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గొంతునొక్కిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్ల మాటున నల్లధనంతో బీజేపీ ఖజానా నింపుకుంటోందని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ‘కొత్త భారత దేశంలో లంచాలు, చట్టవిరుద్ధ కమిషన్లను ఎలక్టోరల్ బాండ్లగా పిలుస్తార’ని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్లపై ‘హఫింగ్టన్పోస్ట్’లో వచ్చిన కథనం లింక్ను షేర్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఆర్బీఐను, జాతీయ భద్రతను బీజేపీ ప్రభుత్వం పక్కనబెట్టిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దుయ్యబట్టారు. నల్లధనాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. తన ఖజానాను ఆ నల్లధనంతోనే నింపుకుంటోందని ట్విటర్లో పేర్కొన్నారు. ఇది క్విడ్ ప్రొ కో కదా? మనీ ల్యాండరింగ్ను ప్రోత్సహించేలా ఈ విధానం ఉందని, ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలను బహిరంగ పరచాలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా విమర్శించారు. మోదీ సర్కారు జవాబు చెప్పాలంటూ పలు ప్రశ్నలు సంధించారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు? బీజేపీ ఎన్ని వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకుంది? ఇది క్విడ్ ప్రొ కో కదా? అంటూ ప్రశ్నించారు. -
వాట్సాప్ స్పైవేర్తో ప్రియాంక ఫోన్ హ్యాక్..
సాక్షి, న్యూఢిల్లీ : విపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. వాట్సాప్ స్పైవేర్ ద్వారా ప్రియాంక గాంధీ ఫోన్ను హ్యాక్ చేశారని ధ్వజమెత్తింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కాగా ఇజ్రాయిల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ వాట్సాప్ సర్వర్ల ద్వారా స్పైవేర్తో 20 దేశాలకు చెందిన1400 మంది యూజర్లను టార్గెట్ చేసిందని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ గతవారం ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. భారత్లో లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా టార్గెట్ చేసిన వారిలో జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు సహా ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్బుక్ పేర్కొంది. ఎన్ఎస్ఓపై ఫేస్బుక్ దావా వేయడం ద్వారా న్యాయపోరాటానికి దిగింది. -
ఆయన ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి: ప్రియాంక
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న నాయకుడు లేడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. భారత మాజీ హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. పటేల్ జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాలను గౌరవించేవాడని పేర్కొన్నారు. కాగా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను బీజేపీ పాటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పటేల్కు సన్నిహితుడైన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించేవారని తెలిపింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పటేల్ను కాంగ్రెస్ విస్మరించిందంటూ బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. -
విపక్ష బృందం పర్యటన: వీడియో షేర్ చేసిన ప్రియాంక!
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా కేంద్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం కంటే రాజకీయ, దేశ ద్రోహం మరొకటి ఉండదు’ అని తన ట్విటర్లో ఖాతాలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు విమానంలో తిరిగి వస్తున్న సమయంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రియాంక ట్వీట్ చేశారు. ఆ వీడియోలలో విమానంలో ప్రయాణించే ఓ జర్నలిస్టు.. విషాదంతో శ్రీనగర్లో తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్ గాంధీకి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. కశ్మీర్ పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయంటూ.. కావాలంటే రాహుల్ గాంధీ కశ్మీర్ పరిస్థితులను తెలుకోవడానికి వస్తే, తాను ప్రత్యేక విమానం పంపిస్తానని ట్విటర్ వేదికగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన రాహుల్.. గవర్నర్ పంపే విమానం తనకు ఏమాత్రం అవసరం లేదంటూ.. ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కశ్మీర్ను పర్యటించిన కొద్దిగంటల్లో అక్కడి సమాచార, ప్రజా సంబంధ శాఖ..కశ్మీర్ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే ఎటువంటి రాజకీయ నాయకులు శ్రీనగర్ పర్యటనకు రావద్దు. దేశ సరిహద్దు ఉగ్రవాదం నుంచి కశ్మీర్ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది’ అని ట్విటర్లో పోస్ట్ చేసింది. అయినప్పటికీ విపక్ష బృందం కశ్మీర్ పర్యటనకు వెళ్లగా వారిని వెనక్కి పంపారు. How long is this going to continue?This is one out of millions of people who are being silenced and crushed in the name of “Nationalism”. For those who accuse the opposition of ‘politicising’ this issue: https://t.co/IMLmnTtbLb — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2019 -
రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..
లక్నో : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సోన్భద్ర పర్యటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ విమర్శలు ఎక్కుపెట్టారు. సోన్భద్ర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, రాజకీయాలు చేయడానికే ప్రియాంక అక్కడకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయడం సరికాదని దినేశ్ శర్మ సూచించారు. శాంతి భద్రతలకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విమర్శలను దినేశ్ శర్మ తీవ్రంగా ఖండించారు. కాగా ఈ నెల 17న ఉత్తరప్రదేశ్ సోన్భద్ర జిల్లా గోరేవాల్ ప్రాంతంలో ఓ భూవివాదం విషయమై కాల్పులు చోటుచేసుకొని గోండీ తెగకు చెందిన 10మంది మరణించగా, బాధిత కుటుంబాల పరామర్శకు బయల్దేరిన ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేసి మీర్జాపూర్లోని చునార్ గెస్ట్హౌస్కు తరలించారు. అయితే ప్రియాంక అరెస్ట్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు చునార్ గెస్ట్హౌస్ ప్రియాంకా గాంధీ ధర్నా కొనసాగుతోంది. సోన్భద్ర బాధితుల్ని పరామర్శించేంతవరకూ తాను ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రియాంకా గాంధీని కలిసేందుకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే సోన్భద్రకు వెళ్లేందుకు వచ్చిన టీఎంసీ ప్రతినిధులను వారణాసి విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. -
యూపీలో నేరగాళ్ల ఇష్టారాజ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న పోలీసుల నివేదికను తప్పుపట్టిన ఆమె.. యూపీలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర గణాంకాలను తారుమారు చేసిన పోలీసులు నేరాల సంఖ్య తగ్గిందంటూ చెబుతున్నారని అఖిలేశ్ విమర్శించారు. శనివారం ప్రియాంక ట్విట్టర్లో..ఉత్తరప్రదేశ్లో నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. నేర ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నేరగాళ్లకు సర్కారు లొంగిపోయిందా?’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో నేరాలపై పలు నివేదికలను జత చేశారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ స్పందించారు. ‘మా ప్రభుత్వం నేరగాళ్ల నెట్వర్క్ను నిర్వీర్యం చేసింది. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలు తగ్గాయి’ అని పేర్కొన్నారు. -
మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్ చెల్లెలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్ కూడా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన కొడుక్కి టికెట్ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం. చిదంబరం, కమల్నాథ్ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్ కొడుకు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాజా లోక్సభ ఎన్నికల్లో భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు.. సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్ మినహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘మరో 24 గంటలు అప్రమత్తం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై తమ అభ్యర్ధనను సుప్రీం కోర్టు, ఈసీ తోసిపుచ్చిన నేపథ్యంలో మరో 24 గంటల పాటు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. రానున్న 24 గంటలు అత్యంత కీలకమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలు భయానికి లోనుకావాల్సిన అవసరం లేదని, మీరు సత్యం కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మరాదని, నకిలీ ఎగ్జిట్ పోల్స్ ప్రచారంతో నిరాశపడరాదని, కాంగ్రెస్ పట్ల, మీ పట్ల విశ్వాసం ఉంచాలని, మీ శ్రమ వృధా కాబోదని పార్టీ శ్రేణుల్లో రాహుల్ ధైర్యాన్ని నూరిపోశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్తో నిరుత్సాహానికి గురికావద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఆడియో సందేశంలో పార్టీ శ్రేణులను కోరారు. స్ర్టాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, మన కృషి ఫలితాలను ఇస్తుందని తాను నమ్ముతున్నానని ప్రియాంక పేర్కొన్నారు. -
మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక
మిర్జాపూర్/గోరఖ్పూర్(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్ బచ్చన్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. అమితాబ్ నటించిన షోలే సినిమాలోని ‘అస్రానీ’ పాత్ర మోదీకి సరిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం మిర్జాపూర్, గోరఖ్పూర్లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. ‘ప్రధాని మోదీ నాయకుడు కాదు, ఒక నటుడు. అమితాబ్ బచ్చన్ను ప్రధానిగా చేస్తే బాగుంటుంది. ‘బ్రిటిష్ వారి కాలంలో...’ అంటూ కనిపించిన ప్రతిసారీ ఒకే డైలాగ్ చెప్పే షోలే సినిమాలో అస్రానీ పాత్ర లాంటివాడు మోదీ. నెహ్రూ, ఇందిర, రాజీవ్గాంధీ ఏం చేశారో ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. గత ఐదేళ్లలో తను ఏం చేసింది మాత్రం ఎన్నడూ చెప్పరు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల్లో ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ‘నోట్లరద్దుతో నల్లధనం వెనక్కివస్తుందని చెప్పారు. నల్లధనం తీసుకురాలేకపోయారు. దానివల్ల కష్టాలు మాత్రం వచ్చాయి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం బలహీనం చేసిందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము పారిశ్రామికవేత్తలకు, బీమా కంపెనీలకు చేరిందని విమర్శించారు. -
‘మోదీ గొప్ప నటుడు’
లక్నో : సార్వత్రిక ఎన్నికల తుది పోరులో ప్రచార పర్వం ముగింపు నేపథ్యంలో శుక్రవారం మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపూర్లో జరిగిన రోడ్షోలో మాట్లాడిన ప్రియాంక ప్రధాని మోదీ గొప్ప నటుడని ఎద్దేవా చేశారు. ‘మీరు గొప్ప నటుడిని ప్రధానిగా ఎంచుకున్నారు..అమితాబ్ బచ్చన్ను మీరు ప్రధానిగా ఎన్నుకున్నా బాగుండే’దని అన్నారు. ఏమైనా వారిద్దరూ మీకు ఏమీ చేసేవారు కాదని చెప్పుకొచ్చారు. మోదీ హయాంలో యువత నిరుద్యోగులుగా బాధపడుతున్నారు..రైతులూ సమస్యలతో సతమతమవుతున్నారు..12,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకుడు కాదని, ఆయన కేవలం నటుడేనని తాను నమ్ముతానని చెప్పారు. యూపీలోని 13 లోక్సభ నియోజకవర్గాల్లో ఈనెల 19న తుదివిడతలో పోలింగ్ జరగనుంది. ఇక ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. -
అభిమానుల కోసం బారికేడ్ దూకిన ప్రియాంక గాంధీ
-
అమ్మ మనసు చాటుకున్న ప్రియాంక
అలహాబాద్ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అమ్మ మనసును చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోరులో ప్రధాన ప్రత్యర్థి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్టీ తరపును గట్టి కౌంటర్లు ఇస్తూ.. రాజకీయ విశ్లేషకుల ప్రశంసలందుకుంటున్న ప్రియాంక తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల మనసును దోచుకోవడంలో మరో మెట్టు పైకి ఎదిగారు. యూపీలోని ఒక చిన్నారికి అందాల్సిన వైద్యం పట్ల చురుకుగా స్పందించిన వైనం కాంగ్రెస్ శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తీవ్ర అనారోగ్యంతో (ట్యూమర్) బాధపడుతున్న తమ పాప వైద్య ఖర్చులను భరించే స్తోమత తమకు లేదని ఆదుకోవాలంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక పేద తల్లిందండ్రులు ప్రియాంకను ఆశ్రయించారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె సీనియర్ పార్టీ నాయకుడు రాజీవ్ శుక్లా, హార్ధిక్ పటేల్, మహ్మద్ అజారుద్దీన్లను సంప్రదించారు. మెరుగైన వైద్యం కోసం పాపను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వారు ఆరు సీట్లు చార్టర్ విమానంలో మైనర్ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. పాపకు అందించే వైద్య సేవలను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ప్రియాంక చెప్పారని స్థానిక కాంగ్రెస్ నేత జితేంద్ర తివారి తెలిపారు. -
‘అందుకే బలహీన అభ్యర్ధులను దింపాం’
లక్నో : యూపీలో బీజేపీ ఓటు బ్యాంక్కు గండికొట్టి ఎస్పీ-బీఎస్పీ కూటమికి మేలు చేసేందుకు పలు స్ధానాల్లో బలహీన అభ్యర్ధులను బరిలో దింపామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారు. బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి కాంగ్రెస్ లోపాయికారీగా సహకరిస్తుందనే వార్తలను ప్రియాంక నిర్ధారించడం గమనార్హం. యూపీలో ప్రచారం సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకొచ్చారు. తాము బలంగా ఉన్న స్ధానాల్లో గట్టిపోటీని ఇస్తూ బీజేపీని ఓడిస్తామని, తాము బలహీనంగా ఉన్న స్ధానాల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అభ్యర్ధులను ఎంపిక చేశామని చెప్పారు. కాగా బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో కలిసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రాహుల్, సోనియా పోటీచేస్తున్న అమేథి, రాయ్బరేలి స్ధానాల్లో ఎస్పీ-బీఎస్పీ తమ అభ్యర్ధులను బరిలో దింపలేదు. లోక్సభ ఎన్నికలు చరమాంకానికి చేరుకోవడంతో ఇక ఎన్నికల అనంతర పొత్తులపైనే ఆయా పార్టీలు దృష్టిసారించనున్నాయి. -
వారణాసి బరిలో ప్రియాంక గాంధీ ఉన్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ ఇక్కడనుంచి పోటీచేయనున్నారనే వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంచనాలకు తెరదించుతూ అజయ్ రాయ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుపుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అజయ్ రాయ్నే పోటీకి నిలిపిన కాంగ్రెస్ ఈసారి కూడా ఆయననే ఎంచుకోవడం గమానార్హం. మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని రెండోసారి కూడా వారణాసినుంచే పోటీ చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వారణాసిలో గురువారం రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం గంగా హారతిలో పాల్గోనున్నారు. కాగా ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ మోదీపై పోటీ చేస్తారన్న ఊహాగానాలు భారీగా వినిపించాయి. ప్రస్తుతం ఈస్ట్ యూపీ ఇంచార్జ్గా బాధ్యతలను చేపట్టిన ప్రియాంక ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
బలహీన ప్రభుత్వం, బలహీన ప్రధాని
పుల్పల్లి/మనంత్వాడే (కేరళ): ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని, ఇంతటి బలహీనమైన ప్రధానిని గతంలో ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ బీజేపీపై మండిపడ్డారు. వయనాడ్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తరఫున ఆమె కేరళలో ప్రచారంచేశారు. ‘వేలాది మంది రైతులు కాళ్లకు చెప్పులు లేకుండా ఢిల్లీకి నడిచివచ్చి, తమ సమస్యలపై ఉద్యమించినప్పుడు జాతీయవాదులం అని చెప్పుకునే నాయకులు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. కనీసం వారి సమస్యలను వినడానికి కూడా ఈ ప్రభుత్వం ఇష్టపడలేదని మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలు వినే ప్రధానిని కోరుకుంటారని, స్వయంగా తను ఇచ్చిన హామీలను కూడా మరిచిపోయే ప్రధానిని ఎవరూ కోరుకోరని అన్నారు. ‘గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వాన్ని, ప్రధానిని చూశాక చెబుతున్నాను. ఇంతటి బలహీనమైన ప్రభుత్వాన్ని, ప్రధానిని నేను ఎప్పుడూ చూడలేదు’అని ప్రజలనుద్దేశించి చెప్పారు. ‘వాళ్లు దేశభక్తి గురించి మాట్లాడతారు, పొరుగుదేశం గురించి మాట్లాడతారు కానీ.. దేశంలోని ప్రజలకోసం ఏం చేశారో మాత్రం ఎప్పుడూ చెప్పరు’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
పప్పులో కాలేసిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పప్పులో కాలేశారు. నిజమైన పప్పులో కాదండోయ్. కశ్మీరీ పండిట్లకు నూతన సంవత్సర (నవ్రే) శుభాకాంక్షలను తెలపాలనే ఉద్దేశంతో ప్రియాంక చేసిన ట్వీటు హాస్యాస్పదం అవుతోంది. కశ్మీరీల పండుగ నర్మేకు బదులు నౌరోజ్ ముబారక్ అని ప్రియాంక తప్పుగా ట్వీటారు. దీంతో ప్రియాంక ట్వీటును విమర్శిస్తూ, ఆమె మీద జోకులు పేలుస్తూ చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తన్నారు. ‘మేడమ్ ప్రియాంక గారు, నౌరోజ్ను మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు ఏప్రిల్ 5. మీరు చాలా ఆలస్యంగా విష్ చేశారు. కానీ, మీకు తెలియని విషయమేంటంటే.. ఇవాళ నవ్రే పండుగ. నవ్రే శుభాకాంక్షలు తెలిపితే బాగుండేది’ అని ఓ నెటిజన్ చురకలంటించారు. ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ నౌరుజ్ అనేది పార్సీల కొత్త సంవత్సరం పేరు. కశ్మీరీ బ్రాహ్మణుల పండుగను నవ్రే అని పిలుస్తారు. నవ్రే అనే పదం, సంస్కృత పదమైన నవ వర్ష నుంచి పుట్టింది. క్రియాశీల రాజకీయాల్లోకి ఈ మధ్యే అడుగిడిన ప్రియాంక.. గాయాలపాలైన విలేకరులకు సహాయం చేయడం, ప్రముఖ ఆలయాల సందర్శన, లోక్సభ ఎన్నికల ర్యాలీల్లో జోరుగా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, ఈ ట్వీట్ ఆమెను అభాసుపాలు చేస్తోంది. -
‘యూపీఏ హయాంలో ఆ నీళ్లు తాగగలిగావా?’
ముంబై : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా(యూపీ తూర్పు విభాగం) బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె విమర్శలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రియాంక గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర యూపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. అలానే బీజేపీపై ప్రియాంక ప్రభావం గురించి ప్రశ్నించగా.. ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచరం చేయడం వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఒక వేళ నేను గనక అలహాబాద్ - వారణాశిల మధ్య వాటర్ వే మార్గాన్ని పూర్తి చేయకపోతే.. ఈ రోజు ఆమె ఈ గంగాయాత్ర చేయగలిగేదా. ప్రియాంక గంగా జలాన్ని కూడా తాగారు. అదే ఒక వేళ యూపీఏ హాయాంలో ఆమె గంగా నదిలో పర్యటిస్తే.. ఆ నీటిని తాగగలిగే వారా? ప్రస్తుతం మా ప్రభుత్వం గంగా నదిని శుద్ది చేసే కార్యక్రమాన్ని పార్రంభించింది. 2020 నాటికి గంగా నది నూటికి నూరు శాతం స్వచ్ఛంగా మారుతుంద’ని గడ్కరీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇటీవల ప్రయాగ్రాజ్ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్ వరకు గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రియాంక ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు చేసి గంగా నదికి హారతి ఇచ్చారు. అనంతరం గంగా జలాన్ని తాగారు. -
‘ప్రియాంక’ గంగాయాత్ర
అలహాబాద్: లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రాభవాన్ని తిరిగి తెచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నడుం బిగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సోమవారం ‘గంగా యాత్ర’ ప్రారంభించారు. ‘మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా సోదరుడు ఏం చెబుతాడో.. అదే చేసి చూపిస్తాడు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ప్రయాగరాజ్ జిల్లాలోని కఛ్నర్ తెహ్సీల్లో ఉన్న మనయ్య ఘాట్ నుంచి గంగానదిలో మోటారు బోటులో ప్రయాణం ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో బోటు ద్వారా 100 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణిస్తారు. బోటు ప్రయాణం ప్రారంభించడానికి ముందు సంగం వద్ద ఉన్న బడే హనుమాన్ మందిర్లో పూజలు నిర్వహించారు. ప్రసంగాలు ఇవ్వడం కంటే ప్రజల కష్టాలు, సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలు గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటిదని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘వారు వస్తారు. బస చేస్తారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఎన్నికలు అయిపోగానే ఏ స్విట్జర్లాండ్కో, ఇటలీకో వెళ్తారు’అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ విమర్శించారు. ‘పప్పు కీ పప్పీ వచ్చారు’ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను ‘పప్పు’అని, ఆయన సోదరి ప్రియాంకను ‘పప్పీ’ అని కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని కావాలని పప్పు అంటుంటారు. ఇప్పుడు కొత్తగా ‘పప్పు కీ పప్పీ’ వచ్చారు’’అని శర్మ అన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ‘ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో.. మాటలూ అలాగే ఉన్నాయి. కేంద్రమంత్రి స్థానంలో ఉండి ఓ మహిళ పట్ల అలా ఎలా మాట్లాడతారు’ అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ధీరజ్ గుర్జర్ మండిపడ్డారు. -
యూపీలో కాంగ్రెస్ ‘జ్యోతి’.. వెలిగేనా!
భోపాల్: మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు రుచి చూపించడంలో తీవ్రంగా కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లోనూ పార్టీకి మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తోంది. ఈ మధ్యే పశ్చిమ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా సింధియాను రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో తనను కాకుండా కమల్నాథ్ను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినప్పుడు సంయమనం కోల్పోకుండా పార్టీ కోసం అందరం కలసి కష్టపడతామని అనడం సింధియాను రాహుల్కు దగ్గర చేసింది. అందుకే ప్రియాంక గాంధీని తూర్పు యూపీకి కార్యదర్శిగా నియమించిన రాహుల్.. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పార్టీని గెలిపించే బాధ్యతను సింధియాకు అప్పగించారు. 48 సంవత్సరాల జ్యోతిరాదిత్య సింధియా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదివారు. స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించిన సింధియా, ప్రస్తుతం పార్లమెంట్లో కాంగ్రెస్ చీఫ్ విప్గా వ్యవహరిస్తున్నారు. సింధియాకు సవాల్ విసురుతున్న యూపీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను గెలుపుబాట పట్టించిన జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వ పటిమకు ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలు పరీక్షగా మారాయి. యూపీ పగ్గాలు ప్రియాంక, సింధియాకు అప్పగించిన రాహుల్ అక్కడ మెజార్టీ సీట్లు గెలిపిస్తారని ఇద్దరిపై నమ్మకం ఉంచారు. ‘‘కాంగ్రెస్ భావజాలాన్ని యూపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరు నేతలు విజయవంతమవుతారని తాను విశ్వసిస్తున్నా’’నని రాహుల్ గాంధీ ఈ మధ్యే మీడియాతో ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాన కాంగ్రెస్ మెరిసేనా...? రాహుల్ పశ్చిమ యూపీలోని 39 పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతను సింధియాకు అప్పగించడానికి ప్రధాన కారణం ఉంది. 2009, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ యూపీతో పోలిస్తే తూర్పు యూపీలో హస్తం పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. 2014 ఎన్నికల్లో పశ్చిమాన కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి సింధియాను సరైన నాయకుడిగా నమ్ముతూ గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు రాహుల్. తనపై కాంగ్రెస్ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే దిశగా సింధియా అడుగులు వేస్తున్నారు. అక్కడి నాయకులు, శ్రేణుల్లో ధైర్యం నింపే చర్యలను ప్రారంభించారు. -
28న గుజరాత్లో ప్రియాంక సంకల్ప్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ ఈనెల 28న తొలిసారిగా గుజరాత్లో భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మూడు దశాబ్ధాల నుంచి అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్లో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీతో కలిసి ఆమె ఈ ర్యాలీలో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీకి గట్టిపట్టు ఉండటం గమనార్హం. కాగా, అహ్మదాబాద్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశానంతరం ఈ ర్యాలీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, అదే రోజు జరిగే ర్యాలీలో ప్రియాంక గాంధీ తొలిసారిగా పాల్గొననుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. -
పాలిటిక్స్లోకి ప్రియంకాగాంధీ భర్త!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా జీవితంలోకి రావాలని ఉందంటూ రాజకీయ ప్రవేశంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్ ద్వారా సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆయనను రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సోమవారం యూపీలోని మొరాదాబాద్లో పోస్టర్లు వెలిశాయి. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి నెల తిరక్కుండానే ఆమె భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లో తాను చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నటు ఇటీవల సంకేతాలు పంపారు. తాను దేశ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే తాను రాజకీయాల్లోకి వస్తే భారీ వ్యత్యాసం ఉంటుందంటే ఎందుకు రాకూడదని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక మొరాదాబాద్లో వాద్రా పేరిట వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. ‘రాబర్ట్ వాద్రాజీ మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని స్వాగతిస్తు’న్నామని ఆ పోస్టర్లలో పొందుపరిచారు. -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ రోడ్షో
-
నిమిషాల్లో ప్రియాంకకు వేలమంది ఫాలోయర్లు
-
వారసత్వ రాజకీయాలతో ఎంత ముప్పు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు ‘ఫ్యామిలీ ఈజ్ ది పార్టీ’ కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ‘పార్టీ ఈజ్ ది ఫ్యామిలీ’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీల వారసత్వ రాజకీయాలను ఘాటుగా విమర్శించారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఎండగుడుతున్న ఆయన, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే తన దాడిని ముమ్మరం చేశారు. అయితే ఈ వారసత్వ రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సహా అనేక పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయాలు నేటికి కొనసాగుతున్నాయి. అలా అని ఈ రాజకీయాలు ఒక్క భారత దేశాన్ని మాత్రమే వేధిస్తోన్న సమస్య కాదు. జపాన్ నుంచి పిలిప్పీన్స్ వరకు ఈ వారసత్వ రాజకీయాల బెడద ఉంది. ఈ దేశాల్లో వారసత్వ రాజకీయాలపై 17వ శతాబ్దం నుంచే పోరాటం చేస్తున్నా ఏ ఒక్క దేశం కూడా ఇంతవరకు విజయం సాధించలేక పోయింది. అందుకు కారణం పలు రాజకీయ పార్టీలు కూడా వారసత్వ రాజకీయాల్లో కూరుకుపోవడమే. ఇంతకు ఎందుకు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలి? అన్న అంశంపై స్పష్టత ఉంటే ఎందుకు వారసత్వ రాజకీయాలను వదులుకోలేక పోతున్నామో సులభంగానే గ్రహించవచ్చు. వారసత్వ రాజకీయాల వల్ల అధికారం కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. అది ప్రజాస్వామిక మౌలిక సూత్రానికే విరుద్ధం. అందుకని వ్యతిరేకించాలి. మరి ఒక్క వారసత్వ రాజకీయాల వల్లనే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఉంటుందా? ఓ వ్యక్తి వద్దనే అధికారం కేంద్రీకతమైనా, ఆ వ్యక్తి ప్రజాస్వామ్య సంస్థల ప్రతిపత్తిని లేదా స్వేచ్ఛను హరించినా, పాలకపక్షంపై రాజ్యాంగేతర శక్తుల ప్రాబల్యం కొనసాగినా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లినట్లే. రాజకీయ శాస్త్రవేత్త కాంచన్ ఛంద్రన్ అధ్యయనం ప్రకారం నేడు దేశంలోని 36 రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో 64 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 2014లో ముఖ్యమంత్రులైన వారిలో 50 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 2014లో 23 శాతం మంది ఎంపీలు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు 2009లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 36 శాతం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారసత్వ రాజకీయాల కారణంగా వచ్చిన వారే. 39 మంది కేబినెట్ మంత్రులు అలా వచ్చిన వారే. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన ఎంపీల శాతం 15. 2009లో అలాంటి వారి శాతం 20 శాతం ఉండింది. నరేంద్ర మోదీ ప్రస్తుత కేబినెట్లో 24 శాతం మంది మంత్రులది వారసత్వ రాజకీయ చరిత్రే. ఎంపీలు, ఎమ్మెల్యేలకన్నా వారసత్వ రాజకీయాల కారణంగా ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారి వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. వారసత్వ రాజకీయాలకన్నా అధికార కేంద్రీకృతం వల్ల ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టం. నాడు వారసత్వ రాజకీయాల కారణంగానే ప్రధాని అయినప్పటికీ ఇందిరాగాంధీ వద్దనే అధికారం కేంద్రీకృతం అవడం ఎమర్జెన్సీకి దారితీసింది. మోదీ వద్దనే అధికార కేంద్రీకరణ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఆయన ముందు ఓ స్కూలు విద్యార్థిలా అటెన్షన్లో నిలబడడం, ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్లో జనర ల్ బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ‘మోదీ మోదీ’ అంటూ పాలకపక్ష సభ్యులు ఆయన నామస్మరణతో బల్లలు చర్చడం అధికార కేంద్రం ఆయన్నే అనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కేంద్ర కేబినెట్తో సంబంధం లేకుండా ఆయన ఏకపక్షంగా ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం తీసుకోవడం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. రాజ్యాంగేతర శక్తిగా ఆరెస్సెస్ ఇరాన్ ప్రభుత్వంలో ఉలేమాల (ఇస్లాం మతాధికారులు) పెత్తనం లాగా దేశంలోని బీజేపీ పాలకపక్షంపై ఆరెస్సెస్ పెత్తనం కొనసాగుతోంది. కాకపోతే ఇరాన్ ప్రభుత్వంలో ఉలేమాల ప్రస్థావన ఉండగా, మన రాజ్యాంగంలో ఆరెస్సెస్ ప్రస్థావన లేదు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల ఎంపిక వరకు, రాష్ట్రపతి నుంచి రాష్ట్ర గవర్నర్ల నియామకం వరకు ఆరెస్సెస్ ప్రభావం కనిపిస్తోంది. 2015లో కేంద్ర మంత్రులు ఆరెస్సెస్ అధిష్టానం ముందు ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా తమ పనితీరును నిరూపించుకున్న పరిస్థితి ఆరెస్సెస్ పెత్తనానికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? డెమోక్రటిక్ సంస్థల నిర్వీర్యం బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. అర్బీఐ అభిప్రాయానికి భిన్నంగా పెద్ద నోట్లను రద్దు చేయడం, ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ చైర్మన్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం, ఏకపక్షంగా సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మపై చర్యతీసుకోవడం, సుప్రీం కోర్టు తీర్పులను ఛాలెంజ్ చేయడం, ప్రజా కంఠాలను అణచివేయడం దేన్ని సూచిస్తున్నాయి ? దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు వారసత్వ రాజకీయాల వల్ల ఎక్కువ ముప్పు ఉందా ? నియంతత్వ లేదా అధికార కేంద్రీకత రాజకీయాల వల్ల ఎక్కువ ముప్పు ఉందా!? -
నిమిషాల్లో ఆమెకు వేలమంది ఫాలోయర్లు
సాక్షి, లక్నో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా , తూర్పు యూపీ ప్రచార ఇన్ఛార్జ్గా నియమితులైన అనంతరం పూర్తిగా కార్యాచరణ ప్రణాళికలో దిగిపోయారు. లక్నోలో నిర్వహించనున్న మెగా రోడ్ షో కంటే ముందుగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు పార్టీ సన్నాహకాల్లో భాగంగా లక్నోలో నాలుగు రోజుల పర్యటన మొదలుకానున్న నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లోతన అధికారిక ట్విటర్ ఖాతాను ఆమె ఓపెన్ చేశారు. అంతే నిమిషాల్లో 22వేల మందికి పైగా పాలోవర్లు ఆమె ఖాతాలో చేరిపోయారు. కాగా ప్రియాంక గాంధీ రాజకీయ రంగప్రవేశంపై రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు రెండు వారాల క్రితం తెరపడిన సంగతి తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పర్యటిస్తున్నారు. దీనిపై అటు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతోపాటు, ఇతర వర్గాల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. -
ప్రియాంక, రాహుల్ పోస్టర్ల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఏఐసీసీ కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలతో కూడిన పోస్టర్లను 24 గంటల్లోనే దుండగులు తొలగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఈ పనికి పాల్పడిందని, చౌకబారు రాజకీయాలతో దిగజారిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తోంది. గత రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లను తెల్లారేసరికి తొలగించా’రని కాంగ్రెస్ నేత జగదీష్ శర్మ ఆరోపించారు. కాగా, ఏఐసీసీ కార్యాలయం ఎదుట వెలిసిన ఈ పోస్టర్లపై రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రాల ఫోటోలతో పాటు దేశ ప్రజలు రాహుల్, ప్రియాంక నాయకత్వాలను కోరుతున్నారని, తమది అతివాద సిద్ధాంతం కాదని, నవ్య ధోరణులతో కూడిన ఆలోచనా విధానమనే నినాదాలను పొందుపరిచారు. మరోవైపు విదేశీ ఆస్తులను అక్రమంగా కలిగిఉన్నారనే మనీల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. వాద్రాకు ఈడీ సమన్లకు సంబంధించి కాంగ్రెస్పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ఆరోపించారు. -
రాహుల్ ఆఫీస్ పక్కనే ప్రియాంకకు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు అక్బర్ రోడ్లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఉన్న ఈ చాంబర్ను ఆమెకు ఇవ్వడం విశేషం. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ సైతం ఇదే కార్యాలయం నుంచి పనిచేశారు. అంతకుముందు ఇది కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, జనార్దన్ ద్వివేది, సుశీల్ కుమార్ షిండేల కార్యాలయంగా ఉండేది. గత నెలలోనే ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతోపాటు, ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, యూపీ సీఎం ఆదిత్యనాథ్కు గట్టి పట్టున్న గోరఖ్పూర్ ఉన్న ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఇన్చార్జిగా రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారమే అమెరికా నుంచి వచ్చిన ప్రియాంక వెంటనే రాహుల్తో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ యూపీ తూర్పు ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. మంగళవారం ఆమె యూపీ సీనియర్ నేతలతో అనధికారికంగా సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె వారితో చర్చించారన్నాయి. గురువారం రాష్రా ్టల ఇన్చార్జులు, ప్రధాన కార్యదర్శులతో జరిగే సమావేశంలో ప్రియాంక పాల్గొననున్నారు. -
4న కుంభమేళాలో పుణ్యస్నానం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4వ తేదీన రాహుల్, ప్రియాంక కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజు ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సోదరుడు రాహుల్తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఫిబ్రవరి 4వ తేదీన వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి రోజు కుంభమేళాకు వెళతారని సమాచారం. తోబుట్టువులిద్దరూ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయనుండటం ఇదే ప్రథమం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కీలకంగా వ్యవహరించేందుకు ఇటీవల సోదరి ప్రియాంకకు రాహుల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ భావనపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ఆవలంబిస్తోందనే అపవాదును తొలగించుకునేందుకే రాహుల్, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2001లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ కుంభమేళాలో పాల్గొన్నారు. గోవాలో రాహుల్, సోనియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం శనివారం గోవాకు చేరుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాబోయే మూడు రోజులు వీరు గోవాలోనే ఉంటారన్నారు. వీరు దక్షిణగోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బసచేస్తున్నారన్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమనీ, రాహుల్, సోనియా పార్టీ నేతలను కలుసుకోబోరని స్పష్టం చేశారు. -
‘రెండు జీరోలు కలిస్తే జీరోనే.. 100 కాదు’
లక్నో : కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి బీజేపీ పార్టీ ఇప్పటికే పలు విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ.. రెండు సున్నాలు కలిస్తే వచ్చేది సున్నానే.. కానీ 100 కాదంటూ ఎద్దేవా చేశారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో యోగి మాట్లాడుతూ.. ‘ప్రియాంక తొలిసారి రాజకీయ రంగం ప్రవేశం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ బిల్డప్ ఇస్తుంది. కానీ 2014, 2017 ఎన్నికల్లో కూడా ప్రియాంక కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీలో ప్రచారం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రియాంక ప్రచారం వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ లాభపడింది లేదు.. ఇప్పుడు కూడా లాభపడదు. మరీ ముఖ్యంగా ఆమె రాక వల్ల బీజేపీకి ఎటువంటి నష్టం ఉండదు అన్నారు. అంతేకాక రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు యోగి. ‘ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఒకటే సున్నా ఉండేది. ఇప్పుడు మరో సున్న కలిసింది. రెండు సున్నాలు కలిస్తే సున్నానే అవుతుంది కానీ 100 కాదం’టూ యోగి ఎద్దేవా చేశారు. -
‘మా అమ్మలానే.. తను చాలా స్ట్రాంగ్’
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ వాద్రా(47) రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనపడుతోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో కార్యకర్తలతో పాటు అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నతనంలో ప్రియాంక.. తమ నానమ్మ ఇందిరా గాంధీతో ఆడుకుంటున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటు ‘మా అమ్మలానే ప్రియాంక కూడా చాలా స్ట్రాంగ్’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన ఓ మాటను కూడా కోట్ చేశారు. ‘బలమైన మహిళలు.. బలమైన మహిళల్నే పెంచుతారం’టూ పోస్ట్ చేసిన ఈ ఫోటోతో పాటు ‘నానమ్మలానే మనవరాలు కుటుంబం, ప్రేమ’ అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీ వాద్రాను తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. View this post on Instagram Strong women raise strong women. . . #ThrowbackThursday #TBT #LikeGrandmotherLikeGranddaughter #Family #Love #womenempowerment A post shared by Congress (@incindia) on Jan 24, 2019 at 12:49am PST లోక్సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఆమె తన సోదరుడు రాహుల్కు సహాయకారిగా పనిచేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. -
తూర్పు యూపీ బాధ్యతలే ఎందుకు?
లోక్సభ ఎన్నికల ముంగిట ప్రియాంక గాంధీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించడం ద్వారా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు యూపీలోని 30 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యత ఇప్పుడు ప్రియాంకపై ఉంది. ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి, సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంతకుమునుపు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ ఉన్నాయి. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ల నియోజకవర్గాలు రాయ్బరేలీ, అమేథీల్లో ఆమె 1999 నుంచి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. 2007, 2012, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక ఈ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో ప్రియాంకను రాజకీయాల్లోకి దింపి బాధ్యతలు అప్పగిస్తే నాయనమ్మ ఇందిరాగాంధీలా తిరుగులేని విజయాలు సాధిస్తారనే నమ్మకం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. ముఖకవళికలు, నడక, వేష భాషల్లో ఇందిర పోలికలు ప్రియాంకలో ఎక్కువనే భావన సర్వత్రా ఉంది. 20 ఏళ్ల క్రితమే ప్రియాంకకు కాంగ్రెస్లో క్రియాశీల బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వచ్చినా, తన పిల్లలు ఎదిగే వరకూ ఎదురుచూడాలనే ఇంతకాలం ఆగారని పరిశీలకులు భావిస్తున్నారు. అనుకున్నట్లే కొడుకు రేహాన్(18), కూతురు మిరాయా(16)కు టీనేజ్ వయసు వచ్చాకే ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. ► 1999లో సోనియా తరఫున ప్రచారం.. కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా జరిగిన 1999 లోక్సభ ఎన్నికల్లో తల్లి, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మొదటిసారి రాజీవ్ గాంధీ నియోజకవర్గమైన అమేథీ నుంచి పోటీచేసినప్పుడు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు. ఇక, రాయ్బరేలీలో సమీప బంధువు అరుణ్నెహ్రూ బీజేపీ తరఫున పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తన తండ్రి సన్నిహిత మిత్రుడు కెప్టెన్ సతీశ్శర్మ తరఫున ప్రచారం చేసి గెలిపించారు. అరుణ్ నెహ్రూ పేరెత్తకుండా, ‘ఇందిరాజీ కుటుంబానికి ద్రోహం చేసి, నా తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి’ అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించగా, అరుణ్నెహ్రూను సతీశ్శర్మ ఓడించారు. ఇలా ప్రియాంక రాజకీయాల మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2004 లోక్సభ ఎన్నికల తరువాత సోనియా ప్రధాని పదవిని తిరస్కరించడం వెనక రాహుల్తో పాటు ప్రియాంక కూడా ఉన్నట్లు చెబుతారు. 2014 ఎన్నికల్లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీతో తలపడిన రాహుల్గాంధీ స్వల్ప మెజారిటీతోనైనా గెలవడానికి ప్రియాంక ప్రచారమే తోడ్పడిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ► భర్త వ్యాపారాలతో చెడ్డపేరు! యూపీఏ హయాంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించి రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక వాద్రా భూ కుంభకోణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రియాంక క్రియాశీల రాజకీయ రంగ ప్రవేశానికి భర్త వ్యాపార లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు అడ్డంకిగా మారాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తూర్పు యూపీ బాధ్యతలే ఎందుకు? పశ్చిమ యూపీతో పోల్చితే ఆర్థికంగా వెనుకబడిన తూర్పు ప్రాంతం రాజకీయంగా కీలకం కావడంతో నరేంద్రమోదీ వారణాసి నుంచి పోటీచేశారు. బీజేపీ, ఎస్పీ–బీఎస్పీ కూటమికి గట్టి పునాదులున్న తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తేనే ఈ పార్టీ కనీసం 20–25 సీట్ల గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే ప్రియాంకను 30 లోక్సభ సీట్లున్న తూర్పు యూపీ ఇన్చార్జిగా నియమించారని భావిస్తున్నారు. అనారోగ్యం వల్ల తల్లి సోనియా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోతే రాయ్బరేలీలో ప్రియాంక రంగంలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. అమేథీ, రాయ్బరేలీకి ఆనుకుని ఉన్న సుల్తాన్పూర్, ప్రతాప్గఢ్, ఉన్నావ్ స్థానాల్లో ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందిరకు అసలైన వారసురాలు! ఆహార్యంలోనే కాకుండా మాటతీరు, నడవడికలోనూ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియాంకనే ఆమెకు నిజమైన వారసురాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గ కార్యకర్తలతో ఎంతో సులువుగా మమేకమై, వారిని ఒక్కతాటిపైకి తేవడంలో ఆమె విజయవంతమయ్యారు. ప్రియాంకకు ఇందిరా గాంధీ పోలికలు ఉండటం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 1972, జనవరి 12న జన్మించిన ప్రియాంక గాంధీ ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. జీసస్ అండ్ మేరీ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. బౌద్ధధర్మంలో ఎంఏ పాసైన ఆమె బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. 1997లో రాబర్ట్ వాద్రాను వివాహమాడారు. వారికి కొడుకు రేహాన్, కూతురు మిరాయా ఉన్నారు. రాహుల్ వైఫల్యాన్ని అంగీకరించారు: బీజేపీ ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లోపాన్ని అంగీకరించిందని బీజేపీ వ్యాఖ్యానించింది. విపక్ష కూటమిలో పలు పార్టీల చేతిలో తిరస్కరణకు గురవడంతో రాహుల్ గాంధీ ‘కుటుంబ కూటమి’ని ఎంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ మరొకరికి పట్టాభిషేకం చేయడం సహజమేనని, కాంగ్రెస్లో కుటుంబమే పార్టీ అని, కానీ బీజేపీలో పార్టీనే కుటుంబమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బూత్స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం, వ్యక్తి కోరికల ఆధారంగా బీజేపీలో నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. మరింత పెద్ద బాధ్యతకు అర్హురాలు ప్రియాంక స్థాయికి తూర్పు యూపీ ప్రధాన కార్య దర్శి పదవి తక్కువేనని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆమె మరింత విస్తృతమైన పాత్రకు అర్హురాలని పేర్కొన్నారు. ఈ నియామకం కాంగ్రెస్ దృక్కోణాన్ని తెలియజేస్తోందని, ఇది ఒక సోదరుడు(రాహుల్) సోదరిని పార్టీ పదవికి నియమించిన సందర్భమని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీనే ప్రత్యేక ఆకర్షణ అవుతారన్నారు. -
ప్రియాంక రాజకీయ అరంగేట్రం
న్యూఢిల్లీ: చాలా ఏళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు అధికారికంగా రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(47) బుధవారం తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఆమె తన సోదరుడు రాహుల్కు సహాయకారిగా పనిచేస్తారని వెల్లడించాయి. కాంగ్రెస్ను విస్మరించి ఎస్పీ–బీఎస్పీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1980 మధ్యనాళ్ల వరకు ఉత్తరప్రదేశ్ను తన కంచుకోటగా నిలుపుకున్న కాంగ్రెస్ క్రమంగా ప్రభ కోల్పోయింది. ప్రియాంక నియామకంతో అక్కడ పునర్వైభవం సంతరించుకుంటామని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. అలాగే, ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ గాంధీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. హరియాణా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గులాం నబీ ఆజాద్ స్థానాన్ని ప్రియాంక, సింధియా భర్తీ చేయనున్నారు. ప్రియాంక నియామకం పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ పేర్కొనగా, బీజేపీ పెదవి విరిచింది. రాహుల్ నాయకత్వ వైఫల్యాన్ని ఆమె నియామకం సూచిస్తోందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఓటమిని ప్రియాంక గాంధీ కూడా తప్పించలేరని పేర్కొంది. యూపీలో సానుకూల మార్పు:రాహుల్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడం ఉత్తరప్రదేశ్లో కీలక పరిణామంగా మారింది. ప్రియాంక గాంధీ నియామక ప్రకటన వెలువడగానే రాహుల్ గాంధీ అమెథీలో మీడియాతో మాట్లాడుతూ తన సోదరిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియాంక సమర్థురాలని, ఎన్నికల సమయంలో ఆమె తనకు అండగా ఉండబోతుండటం హర్షదాయకం అని పేర్కొన్నారు. ఆమె రాకతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఆలోచనలు, సానుకూల మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిగా ఏర్పడిన ఎస్పీ–బీఎస్పీలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, బీజేపీని ఓడించేందుకు వారితో కలసిపనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గుజరాత్ అయినా యూపీ అయినా ఎన్నికల్లో దూకుడుగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత పునర్వవ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఇటీవల రాజస్తాన్ సీఎంగా ఎన్నికైన అశోక్ గహ్లోత్ స్థానంలో కేసీ వేణుగోపాల్ను ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా నియమిం చింది. ఆయన కర్ణాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగనున్నారు. ఇప్పటికే కీలక నిర్ణయాల్లో పాత్ర.. మాజీ ప్రధాని, నానమ్మ ఇందిరా గాంధీ పోలికల్లో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారని కాంగ్రెస్ నేతలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.ప్రియాంక ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తారని సోనియా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ తరఫున అడపాదడపా ప్రచారం చేసిన ఆమె.. పార్టీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో పాత్ర పోషించారు. ఇటీవల ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంల ఎంపికలో రాహుల్కు సలహాలిచ్చారు. పంజాబ్ కాంగ్రెస్లోకి మాజీ క్రికెటర్ సిద్ధూ, మన్ప్రీత్ బాదల్ను తీసుకురావడంలోచొరవ చూపారు.‘ప్రియాంక.. శుభాకాంక్షలు. జీవితంలో ఏ దశలోనైనా నీకు తోడుగా ఉంటా. నీ శక్తిమేర పనిచేసి ఉత్తమ ఫలితాలు రాబట్టు’ అని భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. భారత రాజకీయాల్లో ఎక్కువ సమయం వేచి చూసింది ప్రియాంక రాక కోసమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. -
ప్రియాంక రావాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమితో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పెద్ద రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోని 22వ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ విస్తుపోయింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ఇక నుంచి పార్టీకి ఓటమి ఉండదని భరోసా ఇచ్చినా, పార్టీ తుదివరకూ పోరాడినా దిగ్భ్రాంతికర ఫలితాలు ఎదురవడం మింగుడుపడటం లేదు. రాహుల్ నాయకత్వంపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉన్నా ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీలో తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు కోరతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రియాంక గాంధీ అవసరం ఉందని కొందరు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. రాహుల్ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలవుతుండటంతో ఆయన నాయకత్వంపై పలువురు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని అభిమానించే కార్యకర్తలు వరుస ఓటములతో డీలాపడుతున్నారు. పార్టీలో ప్రియాంకకు సముచిత స్ధానం ఇవ్వాలని గత కొన్నేళ్లుగా గట్టి డిమాండ్ వినిపిస్తున్నా కర్ణాటకలో పార్టీ ఓటమితో ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రియాంక ఇప్పటివరకూ తన రాజకీయ కార్యకలాపాలను గాంధీ కుటుంబం బరిలో నిలిచే అమేథి, రాయ్బరేలి నియోజకవర్గాలకే పరిమితం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలో చేరిన ప్రియాంక
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడుతోన్న ఆమెను ఆగస్టు 23న ఢిల్లీలోని శ్రీ గంగారాం వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో డెంగీ విజృంభణ: గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 657 మంది డెంగీ బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చేరారు. వారిలో 325 మంది ఒక్క ఢిల్లీ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండటంతో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) పని తీరుపై విమర్శలదాడి పెరిగింది. -
'క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక రావాలి'
న్యూఢిల్లీ: దారుణమైన ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని కేంద్ర మంత్రి కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయపథంలోకి నడిపించడానికి ప్రియాంక సేవలు అవసరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం కావాలని థామస్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలివుండే ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో పదవిని అలంకరించాలని థామస్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని నేతలు, ప్రజలు కోరుకుంటున్నారని థామస్ అన్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కుటుంబ వ్యవహారం కాదని థామస్ అన్నారు. -
'నేను రాజీవ్ గాంధీ కూతుర్ని'
అమేథి: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూతుర్ని మాత్రమేనని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి మరోకరికి పోలికేలేదని ఆమె అన్నారు. నా తండ్రి రాజీవ్ గాంధీ. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. రాజీవ్ తో ఎవ్వరిని పోల్చలేం అని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. ఇటీవల దూరదర్శన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన కూతురులాంటిదని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమేథిలో రాహుల్ కు, రాయ్ బరేలి పార్లమెంట్ స్థానాల్లో సోనియాగాంధీకి ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.