బీఆర్‌ఎస్‌లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి Sabitha Reddy Calrity On Party Change | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి

Published Mon, Jul 1 2024 10:50 AM | Last Updated on Mon, Jul 1 2024 12:12 PM

Sabitha Reddy Calrity On Party Change

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి, సంజయ్‌ కుమార్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్యలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ క్రమంలో.. మరో ఐదుగురు ఉన్నారని, మాజీ మంత్రి సబితా రెడ్డి కూడా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే.. 

సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారామె. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తనకు సముచిత స్థానం కల్పించారన్న సబిత.. ఆయన సారధ్యంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారాల్సిన అవసరంగానీ.. ఆ ఆలోచనగానీ తనకు లేవని అన్నారామె. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement