Telangana BJP Chief Bandi Sanjay Comments On CM KCR - Sakshi
Sakshi News home page

Bandi Sanjay: గాల్లోకి మంత్రి కాల్పులు.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Aug 14 2022 1:39 PM | Updated on Aug 14 2022 2:59 PM

Telangana BJP Chief Bandi Sanjay Comments On CM KCR - Sakshi

కేసీఆర్‌ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామన్నారు.

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,మంత్రులు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మోత్కూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడు అన్నారు.
చదవండి: వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైరింగ్‌

కేసీఆర్‌ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్‌లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని.. ఆయన  చాలా మంచి పొలిటికల్ లీడర్ బండి సంజయ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement