ఆలయాలపై కుట్రలను ఛేదిద్దాం | Vellampalli Srinivas Comments About Conspiracies against temples | Sakshi
Sakshi News home page

ఆలయాలపై కుట్రలను ఛేదిద్దాం

Published Sat, Sep 19 2020 5:41 AM | Last Updated on Sat, Sep 19 2020 5:41 AM

Vellampalli Srinivas Comments About Conspiracies against temples - Sakshi

సాక్షి, అమరావతి: దేవాలయాలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఈ కుట్రలను ఛేదిద్దామని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన ఆ శాఖ కమిషనర్‌ పి. అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. 

► కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై కుట్రలు చేస్తున్నారు. జిల్లాలో పనిచేసే అసిస్టెంట్‌ కమిషనర్‌లతో పాటు రీజనల్‌ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్, తమ పరిధిలోని గ్రామల్లో తరచూ పర్యటించి.. అక్కడ గ్రామ కమిటీలతో పాటు స్థానికులతో సమావేశమై వారి సూచనలను తెలుసుకుంటూ ఉండాలి.  
► దేవాలయాలు, రథాల భద్రత కోసం ఏర్పాటుచేసే సీసీ కెమెరాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు.  అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement