-
బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునరి్నర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు » రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. » అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచి్చంది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. » ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిoది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. » ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. » ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. » ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధారి్మక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ హిందూ దేవాలయాలు (ఫొటోలు)
-
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
వైభవంగా 7 ఆలయాల్లో విగ్రహ, కలశ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పుష్కరాల పేరుతో 2016లో అప్పటి సీఎం చంద్రబాబు కూల్చివేసిన విజయవాడలోని 7 ఆలయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరి్నర్మించారు. వాటి విగ్రహ, కలశ ప్రతిష్ట వైభవంగా జరిగింది. మంగళవారం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. గురువారం ఉదయం 11.24 గంటలకు ఒకే సుముహూర్తంలో ఏడు ఆలయాల విగ్రహ, కలశ ప్రతిష్ట కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తం గా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. తొలుత సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత మెట్ల మార్గం వద్ద నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. కనకదుర్గ ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ, రఘునాథ శర్మతో పాటు ఇతర ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. విగ్రహ, కలశ ప్రతిష్ట అనంతరం గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ మహోత్సవంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, దుర్గగుడి ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, ఎఈవో ఎన్. రమే‹Ùబాబు, డీఈ వెంకటేశ్వరరావు, ఎఈ కుటుంబరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జగన్ అందించిన ప్రతి సంక్షేమ పథకానికి దేవుడి ఆశీర్వాదం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉందని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలు వెనుక దేవుడి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే దేవుడికి ఎటువంటి అపచారం జరగకూడదన్నది సీఎం జగన్ భావన అని, అందుకే చంద్రబాబు కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించారని తెలిపారు. చంద్రబాబుకు దేవుడిపై విశ్వాసం లేనందునే విజయవాడ నడి»ొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడమే కాకుండా దేవతామూర్తులను చెత్త వాహనాల్లో తరలించారని తెలిపారు. భగవంతుడికి అవమానం చేశాననే విచారం కూడా ఆయనకు లేదన్నారు. ఆయన అకృత్యాల కారణంగానే ఆయన పాలనలో రాష్ట్రంలో దుర్బిక్షం, కరువు రాజ్యమేలాయన్నారు. సీఎం జగన్ పథకాలు అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదని చంద్రబాబు, పవన్ విమర్శించారని, అయినా దేవుడి అండతో ఐదేళ్లూ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు నోరు మూతపడేలా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమం అందించారన్నారు. -
ఏపీలో టెంపుల్ టూరిజం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
-
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్వేస్కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
చంద్రబాబు కూల్చిన ఆలయాల్లో నేడు విగ్రహ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): గత చంద్రబాబు ప్రభుత్వం కూల్చిన ఏడు ఆలయాల్లో గురువారం ప్రాణప్రతిష్టను నిర్వహించనున్నారు. ఉదయం 11.24 గంటలకు దుర్గగుడి ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట, కలశస్థాపన జరగనుంది. ప్రాణ, శిఖర ప్రతిష్టలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడు ఆలయాలను ఏకంగా రూ.2.5 కోట్లతో పునర్నిర్మించింది. 2016లో కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో ఏడు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు. అంతేకాకుండా 2021 జనవరి 8న ఆయా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం శరవేగంగా జరిగేలా నాటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్ప్లాన్తో పాటు పునర్నిర్మించిన ఆలయాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దేవతామూర్తులకు ధాన్య, పూజాధివాసాలు కాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గంలోని వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయాల పున ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా దేవతామూర్తుల విగ్రహాలతోపాటు సీతమ్మ వారి పాదాల సమీపంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి పున:ప్రతిష్ట జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానాచార్య శివప్రసాద్శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయనాధివాసం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రాణప్రతిష్ట జరిగే ఆలయాలివే.. శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం వ్యయం రూ.45 లక్షలు సీతమ్మ వారి పాదాలు వ్యయం రూ.10 లక్షలు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం –కృష్ణలంక వ్యయం రూ.15 లక్షలు వీరబాబు దేవస్థానం (తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద) వ్యయం రూ.15 లక్షలు వేణుగోపాలస్వామి వారి దేవాలయం (విజయవాడ గోశాల వద్ద) వ్యయం రూ.68 లక్షలు బొడ్డు బొమ్మ (రథం సెంటర్) వ్యయం రూ.23 లక్షలు శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం, అమ్మవారి తొలి మెట్లు –ఇంద్రకీలాద్రి వ్యయం రూ.29 లక్షలు -
అనంత్ అంబానీ వివాహ సందడి..మరోవైపు ఏకంగా 14 దేవాలయాల నిర్మాణం!
రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గ్రాండ్గా నిర్వహించేందకు అంబానీ కుటుంబం రెడీ అయిపోయింది. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3 వరకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల ఘనంగా జరగనున్నాయి. అందులో భాగంగా గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో 14 కొత్త ఆలయాలను నిర్మించింది అంబానీ కుటుంబం. ఇక్కడ ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఉన్నాయి. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. జామ్ నగర్లోని మోతీ ఖావ్డి వద్ద ఉన్న ఆలయ సముదాయంలో ప్రముఖ శిల్పులు, స్థానిక కళాకారుల సహకారంతో ఈ దేవాలయాలను సర్వాంగ సుందరంగా రూపొందించారు. ఈ ఆలయాల్లో శిల్పాలను, స్థంభాలను చెక్కిన తీరు భారతదేశ శిల్పకళాకారుల అసామాన్యమైన నైపుణ్యం, అంకితభావాన్ని నిలువెత్తు నిదర్శంగా ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ భారతీయ వారసత్వం, సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం అనే విజన్కు అనుగుణంగా స్థానిక కళాకారులు అద్భుతంగా ఈ ఆలయాలను నిర్మించారని ప్రశంసించారు . అంతేగాదు ఆ ఆలయాలను సందర్శించి అక్కడి కళారూపాలను చూసి ముగ్దులైపోవడమే గాక ఆ శిల్పకారుల పని తీరును కొనియాడారు నీతా అంబానీ. వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వివాహానికి ముందే ఈ ఆలయాలు ఇంత అందంగా రూపుదిద్దుకోవడం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభంమని అన్నారు. ఇంకోవైపు.. జామ్నగర్లో జరగబోయే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. రజినీ కాంత్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి నటులతో పాటు ఫేస్ బుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ బిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, అడ్నోక్ సీఈఓ సుత్లాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ కళాకారులు ఈ వివాహ వేడుకలకు హాజరవనున్నారు. (చదవండి: అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?) -
515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234 వరకు ఉన్నాయి. వీటిలో 678 ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఉన్నాయి. ట్రస్టు బోర్డుల పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556 ఉన్నాయి. వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు. ట్రస్టు బోర్డులో ఆలయం స్థాయినిబట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ ట్రస్టు బోర్డుల నియామకం ద్వారా ఐదు వేల మందికి పైనే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జనరల్ సహా అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకే దక్కనున్నాయి. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలు లేదంటే వంశ పారంపర్య అర్చకులు, లేదా çప్రముఖ హిందూ సంస్థలు వాటి నిర్వహణకు ముందుకొస్తే వారికే అప్పగించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ట్రస్టు బోర్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది సీఎం జగనే.. ఆలయ ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇంతకు ముందే ప్రత్యేకంగా దేవదాయ శాఖ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ప్రతి ట్రస్టు బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, జనరల్ సహా ఆయా రిజర్వు కేటగిరిల్లో సగం పదవులు తప్పనిసరిగా మహిళలకే కేటాయించేలా జగన్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. దీంతోపాటు ఆలయాల కేశ ఖండన శాలల్లో నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రముఖంగా ఉంటే ట్రస్టు బోర్డులోనూ ఆ వర్గం వారిని ఒక సభ్యుడిగా నియమించే వీలు కల్పించారు. అదే సమయంలో ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని వారి పదవీ కాలం కంటే ముందే తొలగించేలా విస్పష్టంగా చట్టాన్ని సవరించారు. ఈ చట్ట సవరణలు అనంతరం ప్రభుత్వం నియమించిన అన్ని ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇప్పుటి వరకు 4,024 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కింది. 3,787 మంది మహిళలూ ఆయా ట్రస్టు బోర్డుల్లో భాగస్వాములయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు నామ మాత్రపు ప్రాధాన్యత కూడ ఉండేది కాదని అధికారవర్గాలు వివరిస్తున్నాయి. -
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
బాబు పలుగుపోట్లు మర్చిపోతే ఎలా?
సాక్షి, అమరావతి: నిత్యం చంద్రబాబు మత్తులో జోగుతున్న ఈనాడు రామోజీరావు ఆ మైకంలో పడి పూర్తి ఉన్మాదిగా మారిపోయారు. ఎందుకంటే.. టీడీపీ హయాంలో కృష్ణానది ఒడ్డున పవిత్ర దేవా లయాలు కూల్చేస్తే సిగ్గులేకుండా కళ్లుమూసుకున్న ఆయన.. ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం గు రించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లి స్తున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు.. ఈనాడులో తరచూ ప్రచురించే కథనాలకు ఎక్కడా పోలిక లేదనేది జగమెరిగిన సత్యం. చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఏపీలో దేవాలయాల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. దేవదాయ శాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మా ణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలు మూలలా 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇదంతా సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’లో ‘జగనన్న పాపాలు–భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు’ అంటూ చేతికొచ్చింది రాసిపారేశారు. చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు రోడ్లకు అడ్డంగా ఉన్నా యనే నెపంతో విజయవాడలో ఒకే రాత్రి పదుల సంఖ్యలో గుళ్లను పలుగుపోట్లతో నేలమట్టం చేసిన విషయం ఆయన మర్చిపోయారు. అలాంటి చంద్రబాబును ‘ఈనాడు’ నిత్యం కీర్తిస్తుంది. కానీ, ఆ కూల్చిన గుళ్లను పునర్నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్ను మాత్రం రాక్షసుడిగా పోల్చడమంటే రామోజీ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ట్రస్టు భూములు అమ్మినోళ్లపై ఎందుకంత ప్రేమ? 2014లో బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవదాయ శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాలకుపైగా మాన్సాస్ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. కానీ, కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ ఐదేళ్లలో 70ఎకరాల వరకు విక్రయించి రూ.వందల కోట్లను పోగేసుకున్నారు. ఇలా దేవదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. సీఎం జగన్ మాత్రం.. భవిష్యత్తులో ఆలయాల భూములను ఎవరూ ఆక్ర మించుకునేందుకు వీల్లేకుండా ఓ ఆర్డినెన్స్ తీసు కొచ్చారు. ఇది దేవదాయ శాఖ చరిత్రలో పెద్ద విప్లవాత్మక నిర్ణయం. దేవుడి భూము లను కాపాడేందుకు ఇలాంటి పటిష్ట చట్టాలు తీసుకురావడం ఈనాడుకు నచ్చడంలేదు. అందుకే సీఎం జగన్ నిర్ణయంపై అక్కసు ప్రదర్శిస్తోంది. బాబు పాలన రామరాజ్యమా? చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని పెద్ద దుమారం చెలరేగింది. బెంజ్సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతి రేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యాసంస్థకు టీడీపీ సర్కార్ కట్ట బెట్టింది. సీఎం జగన్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడు లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70 కోట్లను మంజూరు చేసింది. రామోజీకి చంద్రబాబు ప్రభుత్వం రామ రాజ్యంగానూ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కారు రాక్షస ప్రభుత్వంలా కనిపిస్తుంది. భక్తుల కమిటీలకే ఆలయాల నిర్వహణ.. దేవదాయ శాఖ పరిధిలోని చిన్నా, పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండే వారు. సీఎం జగన్ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆల యాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా.. రూ.5 లక్షలు పైబడి ఆదాయమున్న 1,400 ఆల యాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డులు నియమిస్తోంది. ధార్మిక పరిషత్ కథ ఇంతే.. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్కు వర్తింప జేస్తూ 2009లోనే అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రభుత్వం జోక్యం చాలావరకు తగ్గింది. అయితే, 2014–19 మధ్య చంద్రబాబు దాని ఏర్పాటును నిర్లక్ష్యంచేశారు. ఆలయాల భుములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం ఐదారుగురు అధికారులతో తాత్కాలిక పరిషత్ ఏర్పాటుచేశారు. అదే సీఎం జగన్ ప్రభుత్వం 2022లో ధార్మిక పరిషత్ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. కానీ, దేవదాయ శాఖకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ‘ఈనాడు’ గొప్పగా ఊహించుకుంటూ జగన్ సర్కారును రాక్షస రాజ్యంగా ఈనాడు అభివర్ణిస్తూ పేట్రేగిపోతోంది. -
జ్ఞానవాపి కేసులో హిందువులకు అతిపెద్ద విజయం
-
ఇక టీటీడీ పరిధిలోకి రాజనాలబండ ఆలయాలు..!
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం, సమీపంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో చరిత్రాత్మక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషిచేశారని కొనియాడారు. తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ డిప్యూటీ ఈఓ శాంతి, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కలిసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఆలయానికి చెందిన భూములు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు ఇక నుంచి టీటీడీ ఆధ్వ ర్యంలో జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆలయ ఆదాయ వనరులు, ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఈఓ శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ ఏఈఓ మణి, జనరల్ సెక్షన్ డిప్యూటీ ఈఓ శివప్రసాద్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట్రమణ, ల్యాండ్స్ ఎస్టేట్ విభాగం తహసీల్దార్ లలితాంజలి, టెంపుల్ ఇన్చార్జి భానుప్రకాష్ తదితరులున్నారు. భక్తి శ్రద్ధలతో చండీ హోమం బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాలలో నెలకొల్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అభిషేక పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేయించారు. -
అప్పుడు అపచారం ఇప్పుడు వైభవోజ్వలం
♦ 2015లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రచారార్భాటానికి గోదావరి పుష్కరాలను వాడుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో కాకుండా సాధారణ భక్తులకు కేటాయించిన ఘాట్లో పుష్కర స్నానాలకు వెళ్లారు. ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ప్రజలను నియంత్రించి.. ఒక్కసారిగా వదిలేయడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ♦ 2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలో దాదాపు 30 ఆలయాలు కూల్చి వేశారు. శనైశ్వర స్వామి వారి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, బొడ్డు బొమ్మ, వీరబాబు ఆలయం, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం, వినాయక ఆలయం, గో సంరక్షణ సంఘంలోని కృష్ణ మందిరం, దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయం, పద్మావతి ఘాట్ సమీపంలోని సాయిబాబా మందిరం, మల్లేశ్వర స్వామి ఆలయం మెట్ల మార్గంలోని వీరాంజనేయ స్వామి ఆలయం, పాత మెట్ల మార్గంలోని శృంగేరీ పీఠానికి చెందిన వీరాంజనేయ స్వామి ఆలయం, కొండపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మౌన స్వామి ఆలయం తదితర ఆలయాలు కూల్చివేతకు గురయ్యాయి. ♦ విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ♦ విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో బోడికొండపైనున్న శ్రీ కోదండరాముని ఆలయం 2014 అక్టోబరులో సంభవించిన హుద్హుద్ తుపాను ప్రభావంతో శిథిలమైంది. ప్రహరీ, ధ్వజస్తంభం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్గజపతిరాజే. అప్పుడు సీఎంగా ఉన్నదీ చంద్రబాబే. వీరెవ్వరూ పట్టించుకోక పోవడంతో దుండగులు కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదాయం లేని ఆలయాలలో నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు అమలు చేసే డీడీఎన్ఎస్ పథకం 1,620 ఆలయాల (అందులో 1500 దాకా ఉమ్మడి ఏపీలో మంజూరు చేసినవే)కు మాత్రమే వర్తింపు. శిథిలమైన రామతీర్థం ఆలయం రూ.4 కోట్లతో పునర్నిర్మాణం. నిపుణులైన శిల్పులతో సీతా సమేత కోదండరాముడు, లక్ష్మణ విగ్రహాల తయారీ. ఆకర్షణీయంగా గర్భాలయం తర్వాత అర్ధ, ముఖ మండపాలు. ధ్వజస్తంభాన్ని పునరుద్ధరణ. పటిష్టంగా ప్రహరీ నిర్మాణం. మొత్తంగా 2022 ఏప్రిల్ 15వ తేదీన పునఃప్రతిష్ట. రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కాంక్షిస్తూ ‘అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ నిర్వహణ. – సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ, విజయనగరం ♦ చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన ఆలయాల్లో ప్రధానంగా 8 ఆలయాల పునఃనిర్మాణం. ఈ ఎనిమిది ఆలయాలకు 2021 జనవరి 8న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన. రూ.3.87 కోట్లతో నిర్మాణాలు పూర్తి. డిసెంబరు 8వ తేదీన భక్తులకు అంకితం. మరో ఐదు ఆలయాలలో ప్రధానమైన మౌన స్వామి విగ్రహం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు. పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, మల్లేశ్వర స్వామి మెట్ల మార్గంలోని వీరాంజనేయస్వామి విగ్రహాలకు బ్రాహ్మణ వీధిలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆలయాల్లో పూజా కార్యక్రమాలు. ♦ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు మంజూరు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ను సిద్ధం. రూ.216 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎనర్జీ, వాటర్ వర్క్స్, అన్నప్రసాద భవనం, పోటు భవనం, ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, మహారాజ ద్వారం, నూతన కేశఖండనశాల తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ♦ 757 పురాతన ఆలయాలను కామన్గుడ్ ఫండ్ నిధులతో పునః నిర్మాణం చేయడంతో పాటు టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కొత్తగా 2,872 ఆలయాల నిర్మాణం. ఇప్పుడు నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు డీడీఎన్ఎస్ పథకం 4,834 ఆలయాలకు వర్తింపు -
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్ఫ్రంట్ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
సోమవారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట
-
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్సైట్ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్సైట్ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్సైట్ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
అయోధ్యలో నూతన రామమందిర వైభవం
-
నయా సాల్.. ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్త జనం (ఫొటోలు)
-
హైదరాబాద్ లోని ఆలయాలకు నూతన సంవత్సర శోభ
-
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్సైట్ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్సైట్ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
నేడు వైకుంఠ ఏకాదశి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement