‘టీడీపీ ఉద్దండులు.. దద్దమ్మల్లా మాట్లాడారు’ | YSRCP MLA Gudivada Amarnath Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఉద్దండులు.. దద్దమ్మల్లా మాట్లాడారు’

Published Tue, Aug 31 2021 12:31 PM | Last Updated on Tue, Aug 31 2021 1:27 PM

YSRCP MLA Gudivada Amarnath Comments On Chandrababu - Sakshi

ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదన్నారు.

‘‘విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. విశాఖ అభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చూస్తే టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయలేదా. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను ఎల్లో మీడియాతో కలిసి దెబ్బ తీస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ సముద్రంలో కలిసి పోతుందని తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకుండా టీడీపీ ఎంపీలు లేఖలు రాశారు.  విశాఖకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నోరు మెదపలేదని’’ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

‘‘ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు.. చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు. చంద్రబాబు భజన చేసేందుకే టీడీపీ నేతలు సమావేశం పెట్టినట్లు ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నారా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేసింది దివంగత మహానేత వైఎస్సార్‌. టీడీపీ ఉద్దండులు దద్దమ్మల్లా మాట్లాడారు. అభివృద్ధి చేస్తే ప్రజలు ఓడించారని అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని’’  ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు
విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement