ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 22,975 మందికి గాను 21,584 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1391 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 20,728 మంది విద్యార్థులకుగాను 19,654 మంది హాజరవగా, 1074 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2247 మందికి గాను 1930 మంది విద్యార్థులు హాజరవగా, 317 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్ఐఓలు ఆరుగురు, 12 మంది డీఈసీ, డీఐఈఓ లు, 34 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment