దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు

Published Fri, Mar 7 2025 9:24 AM | Last Updated on Fri, Mar 7 2025 9:20 AM

దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు

దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు

కొడంగల్‌ రూరల్‌: బాటసారుల దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలని తహసీల్దార్‌ విజయకుమార్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండలకు బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ విజయకుమార్‌ తెలిపారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బందితో కలిసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బాటసారులకు చలివేంద్రాలు కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. వడ దెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ విజయకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement