గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం | Gayatri and Tresa Jodi is off to a good start | Sakshi
Sakshi News home page

గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం

Published Wed, Sep 25 2024 4:00 AM | Last Updated on Wed, Sep 25 2024 4:00 AM

Gayatri and Tresa Jodi is off to a good start

మెయిన్‌ ‘డ్రా’కు రుత్విక–సిక్కి జంట

మకావ్‌: మకావ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ గాయత్రి–ట్రెసా ద్వయం 15–21, 21–16, 21–14తో అకారి సాటో–మాయా టగూచి (జపాన్‌) జోడీపై గెలిచింది. గద్దె రుత్విక శివాని–సిక్కి రెడ్డి ద్వయం మహిళల డబుల్స్‌లో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందింది. 

క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రుతి్వక–సిక్కి జంట 21–15, 21–10తో చెయుంగ్‌ యాన్‌ యు–చు వింగ్‌ చి (హాంకాంగ్‌) ద్వయంపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ లో భారత ప్లేయర్‌ ఆలాప్‌ మిశ్రా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆలాప్‌ 21–10, 24–22తో భారత్‌కే చెందిన ఆర్యమాన్‌ టాండన్‌ను ఓడించాడు. 

పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి శ్రీకాంత్, మిథున్, సమీర్‌ వర్మ, ఆయూశ్, శంకర్‌ ముత్తుస్వామి, చిరాగ్‌ సేన్‌ పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో అనుపమ, తాన్యా హేమంత్, తస్నిమ్‌ మీర్, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా బరిలో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement