లంకతో రెండో టీ20.. టాస్‌ గెలిచిన భారత్‌.. సంజూ శాంసన్‌ ఎంట్రీ | IND VS SL 2nd T20I: India Won The Toss And Elected To Bowl, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

లంకతో రెండో టీ20.. టాస్‌ గెలిచిన భారత్‌.. సంజూ శాంసన్‌ ఎంట్రీ

Published Sun, Jul 28 2024 7:33 PM | Last Updated on Sun, Jul 28 2024 7:33 PM

IND VS SL 2nd T20I: India Won The Toss And Elected To Bowl, Here Are Playing XI

పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్‌ 45 నిమిషాలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లంక తరఫున దిల్షన్‌ మధుషంక స్థానంలో రమేశ్‌ మెండిస్‌.. భారత్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో సంజూ శాంసన్‌ తుది జట్టులోకి వచ్చారు. గిల్‌ మెడ పట్టేయడంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.  

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 ఇదే వేదికగా జులై 30న జరుగనుంది.  

తుది జట్లు..

భారత్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్‌), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్‌), దసున్ షనక, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement