India vs Sri lanka
-
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్వాష్కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రత్యర్థి చేతిలో క్లీన్స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో ఓ మ్యాచ్ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
U19 Asia Cup 2024: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్కు చోటు -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది. -
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్పై శ్రీలంక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్గా కొనసాగించండి: హర్భజన్ -
T20 World Cup 2024: రాణించిన మంధన, హర్మన్.. శ్రీలంక టార్గెట్ 173
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 9) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. స్మృతి మంధన (50), హర్మన్ప్రీత్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. షఫాలీ వర్మ 43 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో జెమీమా 16, రిచా ఘోష్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కాంచన తలో వికెట్ పడగొట్టగా.. మంధన రనౌటైంది. సెమీస్ రేస్లో ముందుండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో గెలవాల్సి ఉంది. -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొంది. పాక్పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్లో (పాక్పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్కు ఈ మ్యాచ్కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్కప్ తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ తన హెడ్కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్కోచ్గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్గానూ పనిచేశాడు. ఇక ఫుల్టైమ్ హెడ్కోచ్గా వెస్టిండీస్తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
రోహిత్ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024 -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
'అదొక విచిత్రమైన పిచ్.. అక్కడ ఆడటం కోహ్లి, రోహిత్కైనా కష్టమే'
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్ల్లోనూ స్పిన్నర్కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.తమ సొంతపిచ్లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు."ఈ సిరీస్లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.అన్ని పిచ్లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్కు ఎంపికైన సంజూ శాంసన్ను.. వన్డే సిరీస్కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
'భారత్లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'
స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భారత్పై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న లంకేయులు తమ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించారు. ఈ సిరీస్లో శ్రీలంక జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.ముఖ్యంగా లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. మూడు వన్డేల్లో కలిపి ఆతిథ్య జట్టు స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. తొలి రెండు వన్డేల్లో కాస్త పర్వాలేదన్పంచిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్లో అన్నీ బ్యాటింగ్ పిచ్లే ఉంటాయని, తమ దేశంలో అలా ఉండవని తీక్షణ తెలిపాడు."భారత్లో దాదాపుగా అన్ని పిచ్లు ప్లాట్గా ఉండి బ్యాటింగ్కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి వికెట్పై భారత బ్యాటర్లు బాగా అలవాటు పడి ఉంటారు. అందుకే ఇక్కడ(శ్రీలంక)కు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు.కొలంబోలోని ప్రేమదాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడాము. కొంచెం టర్న్ ఉంటే చాలు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నందున ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. దేశీవాళీ క్రికెట్లో కూడా మాకు ఇటువంటి పిచ్లే ఉంటాయి. కాబట్టి మా బ్యాటర్లకు ఇటువంటి వికెట్లపై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్లతో సిరీస్ల నేపథ్యంలో తాను కోచ్గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్తో రాణించినా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించింది. -
అతడు లేకపోతే.. టీమిండియా బౌలింగ్ జీరో: పాక్ మాజీ క్రికెటర్
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్లో సత్తాచాటిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టై ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఘోర ఓటమి చవిచూసింది.తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. కాగా ఈ సిరీస్లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్ల తీయడంలో సిరాజ్, అర్ష్దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు.ఈ మొత్తం సిరీస్లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్తో పొలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు. స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసను వెల్లగక్కాడు. "బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని జునైద్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.కాగా టీ20 వరల్డ్కప్ తర్వాత టీమిండియా పేస్ గుర్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్కప్ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. -
ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ
బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవి చూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది. కాగా శ్రీలంకపై వన్డే సిరీస్లో టీమిండియా ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.మొదటి వన్డేను డ్రాగా ముగించిన భారత్.. వరసుగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. మరోసారి స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. లంక స్పిన్నర్ల దాటికి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో సత్తాచాటగా.. థీక్షణ, జెఫ్రీ వాండర్సే తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భాతర కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్లో శ్రీలంక తమ కంటే బాగా ఆడిందని హిట్మ్యాన్ కొనియాడాడు."స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్ల తడబాటుపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్నీ మేము తీవ్రంగా పరిగణిస్తాము. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ సరైన గేమ్ ప్లాన్తో ఆడాల్సిన అవసరముంది. సిరీస్లో మేము ఒత్తిడికి గురయ్యాము.తప్పు ఎక్కడ జరిగిందా అన్నది మేము చర్చించి తర్వాత మ్యాచ్ల్లో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. రాబోయే మ్యాచ్ల్లో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతే తప్ప టీ20 వరల్డ్కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. భారత్ తరుపన ఆడుతున్నంత కాలం మేము రిలాక్స్ అవ్వము. ముఖ్యంగా నేను కెప్టెన్గా ఉన్నప్పుడు అటుంటి ఆంశాలకు అస్సలు చోటివ్వను.ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ ఈ సిరీస్ మొత్తం మేము చెత్తగా ఆడాం. కానీ శ్రీలంకకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. వారు మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. అందుకే శ్రీలంక సిరీస్లో విజయం సాధించింది. మేము ఇక్కడి కండిషన్స్కు తగ్గట్లు మా జట్టు కాంబినేషన్ను మార్చాము. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లకు ఇటువంటి కండిషన్స్కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేశాం. ఈ సిరీస్లో మాకు సానుకూల అంశాల కంటే ప్రతికూల ఆంశాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై కచ్చితంగా దృష్టి పెడతాము. ఎందుకంటే మరోసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైతే బాగా ఆడాలి కాదా. ఇక ఆటలో గెలుపోటములు సహజం. సిరీస్ కోల్పోవడం వల్ల ప్రపంచం ఏమి అంతం కాదు. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
India vs Sri Lanka: భారత్కు షాకిచ్చిన శ్రీలంక.. 27 ఏళ్ల తర్వాత (ఫోటోలు)
-
శ్రీలంకతో మూడో వన్డే.. చిత్తుగా ఓడిన టీమిండియా
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించడం విశేషం. -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో శుభ్మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కుసాల్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
లంకతో మూడో వన్డే.. రాహల్పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు'
టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ తన ప్రయణాన్ని విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే లంకతో టీ20 సిరీస్లో అదరగొట్టిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం తడబడుతోంది.తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపడాన్ని చాలా మంది మాజీలు తప్పబడుతున్నారు.గంభీర్కు అహంకారం ఎక్కువని, తను అనుకున్నదే చేస్తాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ను ఉద్దేశించి తన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఇప్పటకి చిన్నపిల్లవాడేనని, అందరని అభిమానిస్తాడని భరద్వాజ్ తెలిపాడు."గంభీర్ ఒక అహంకారి, దూకుడెక్కువని అందరూ అనుకుంటారు. నిజానికి గంభీర్ చాలా మంచివాడు. అందరని గౌరవిస్తాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడు. ఎంతో మంది యువ క్రికెటర్ల కెరీర్ను తీర్చిదిద్దాడు. పేసర్ నవదీప్ సైనీ వంటి వాళ్లు గంభీర్ సాయంతోనే క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. అతడు గెలవడం కోసమే కొన్నిసార్లు దూకుడుగా, సీరియస్గా ఉంటాడు. ఎందుకంటే అతడికి ఓడిపోవడం ఇష్టముండదు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అతడు రాణించలేకపోయినా ఏడ్చేవాడు. ఎవరైనా సీరియస్గా ఉన్నంత మాత్రాన వారు మంచి వారు కాదని అనుకోకూడదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారా?ఎలా గెలవాలో అర్థం చేసుకున్న వారు.. ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకోవాలి. గంభీర్ ఆటగాళ్ల టెక్నికల్ అంశాల జోలికి వెళ్లడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి.. వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడమే గంభీర్ పని. కోచ్గా గంభీర్ విజయవంతమవుతాడని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ నా దృష్టిలో గంభీర్ ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడని" భారత మాజీ క్రికెటర్ మంజోత్ కల్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ భరద్వాజ్ పేర్కొన్నాడు. -
'హార్దిక్, రాహుల్ కాదు.. రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్'
టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ను కాదని మరి గిల్ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది."యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా? -
రోహిత్- కోహ్లి విషయంలో గంభీర్ నిర్ణయం సరికాదు: మాజీ బౌలర్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ల దగ్గరకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను గంభీర్ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. రోహిత్ సేన చెత్త రికార్డు
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్లో దుమ్ములేపిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే టై గా ముగియగా.. రెండో వన్డేల్లో భారత జట్టు పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినప్పటికీ అనూహ్య రీతిలో లంక చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓ చెత్త రికార్డు ముంగిట నిలిచింది. హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత క్రికెట్ జట్టు తొలిసారి లంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది.అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మాత్రం తడబడుతోంది. తొలి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసిపోగా.. రెండో వన్డేలో రోహిత్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది.ఆరంభంలోనే సిరాజ్.. ఓపెనర్ పాతుమ్ నిసాంక వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. 40 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ను గాడినపెట్టగా.. మిగతా వాళ్లు కూడా ఫర్వాలేదనిపించారు. కమిందు మెండిస్ సైతం 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(64), శుబ్మన్ గిల్(35) అదిరిపోయే ఆరంభం అందించారు. కానీ.. ఆ తర్వాత సీన్పూర్తిగా మారిపోయింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వాండర్సె తన మాయాజాలంతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు.10 ఓవర్లలో బౌలింగ్ కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో కాసేపు పోరాడినా.. వాండర్సె స్పిన్ దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక సిరీస్ 1-0తో ముందంజ వేసింది.ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత.. తొలిసారిగా శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవలేని స్థితిలో టీమిండియా నిలిచింది. మూడో వన్డేలో గెలిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతుంది. లేదంటే 2-0తో సిరీస్ కోల్పోయి 27 ఏళ్ల తర్వాత లంకకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా టీమిండియా నిలుస్తుంది. -
విరాట్ కోహ్లిది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఆదివారం కొలంబో వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. భారత ఇన్నింగ్స్ 15ఓవర్ వేసిన స్పిన్నర్ అకిల దనంజయ బౌలింగ్లో ఆఖరి బంతిని విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్తూ విరాట్కు ఫ్రంట్ ప్యాడ్కు తాకింది. వెంటనే లంక ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అంపైర్ కూడా వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ కోహ్లి మాత్రం నాన్స్ట్రైక్లో ఉన్న శుబ్మన్ గిల్తో చర్చించి డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే ఈ రివ్యూ థర్డ్ అంపైర్కు బిగ్ ఛాలెంజ్గా మారింది. రిప్లేలో బంతి విరాట్ బ్యాట్ను దాటి వెళ్లి ప్యాడ్ను తాకేముందు అల్ట్రాఎడ్జ్లో స్పైక్ చూపించింది. కానీ బిగ్ స్క్రీన్లో మాత్రం బ్యాట్కు, బంతికి క్లియర్ గ్యాప్ ఉన్నట్లు కన్పించింది. ఆఖరికి థర్డ్ అంపైర్ కోహ్లికి ఫేవర్గా నాటౌట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇది చూసిన శ్రీలంక ఫీల్డర్లు కోపంతో ఊగిపోయారు. లంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సైతం ఆసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అయితే తన హెల్మెట్ను నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SL: వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్ pic.twitter.com/tNx33xlkmR— hiri_azam (@HiriAzam) August 4, 2024 pic.twitter.com/sIQVG7B2TC— hiri_azam (@HiriAzam) August 4, 2024 -
వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చర్యతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలేం జరిగిందంటే?శ్రీలంక ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసేందుకు భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎటాక్లో వచ్చాడు. అయితే తొలి బంతిని డెలివరీ చేసే క్రమంలో వాషింగ్టన్ తన రన్ఆప్ను కోల్పోయి వికెట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయాడు. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఇది చూసి నవ్వుకున్నాడు. కాగా రెండో సారి కూడా సుందర్ బంతిని డెలివరీ చేసే క్రమంలో వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయితే ఈసారి మాత్రం హిట్మ్యాన్ తనదైన స్టైల్లో స్పందించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. వాషింగ్టన్ సుందర్ను కొట్టేందుకు పరిగెత్తుకుంటా ముందుకు వచ్చాడు. నిన్ను కొట్టేస్తా అన్నట్లు సరదగా రోహిత్ సైగలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. దీంతో వాషీతో పాటు సహచర ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో శ్రీలంక చేతిలో 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. Rohit Sharma is a complete entertainer in the field. 💥👌 pic.twitter.com/cqjlkFxGP3— Johns. (@CricCrazyJohns) August 4, 2024 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో హిట్మ్యాన్ 64 పరుగులు చేశాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు 121 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో భారత ఓపెనర్గా 120 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్మ్యాన్ ఆరో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు 1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్లు)2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్లు)3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్లు)4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్లు)5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్లు)6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్లు)ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఈ ముంబైకర్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా.. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 10,831 చేరాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి హిట్మ్యాన్ చేరుకున్నాడు. -
అతడే మా కొంపముంచాడు.. మేము అనుకున్నది జరగలేదు: రోహిత్ శర్మ
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమి చవిచూసింది. మరోసారి స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది.ఈ మ్యాచ్లో ఏకంగా 9 మంది భారత బ్యాటర్లు స్పిన్నర్లకే తమ వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభమిచ్చినప్పటకి.. మిడిలార్డర్ మాత్రం పేక మేడలా కుప్పకూలింది. 241 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో 208 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. లంక బౌలర్లలో స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక ఈ ఓటమి పై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పేలవ బ్యాటింగ్ కారణంగా తాము ఓడిపోయామని రోహిత్ శర్మ అంగీకరించాడు.అతడి వల్లే ఓడిపోయాం: రోహిత్"మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది మనల్ని భాదిస్తుంది. నేను చెబుతున్నది కేవలం ఆఖరి 10 ఓవర్లకు సంబంధించి మాత్రమే కాదు. ప్రతీ మ్యాచ్లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. గత కొన్ని మ్యాచ్ల్లో ఆలానే ఆడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్లో మేము సమిష్టగా విఫలమయ్యాం. ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ క్రికెట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. మనముందు సవాళ్లను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి. స్పిన్నర్లకు లెఫ్ట్-రైట్ కాంబనేషన్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం ఈజీగా ఉంటుందని భావించాము. అందుకే దూబేను ముందుగా బ్యాటింగ్ పంపించాము. కానీ జెఫ్రీ మాత్రం మా వ్యూహాలను దెబ్బతీశాడు. 6 వికెట్ల పడగొట్టి మ్యాచ్ను మా నుంచి లాగేసాడు. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నేను దూకుడుగా ఆడటం వల్లే 65 పరుగులు చేయగలిగాను. నా బ్యాటింగ్లో చాలా రిస్క్ షాట్లు ఉంటాయి. ఆ ప్రయత్నంలో తొందరగా వికెట్ కోల్పోతే నిరాశకు లోనవతాను. ఏదమైనప్పటకి పవర్ప్లేలో దాటిగా ఆడి పరుగులు రాబట్టడమే నా ఉద్దేశ్యం. ఈ పిచ్ స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈ రోజు మేము అది చేయలేకపోయాం. అయితే ఈ ఓటమిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ తీరుపై చర్చించాల్సిన అవసరముందని" పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. -
6 వికెట్లతో భారత్కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?
కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విల్లవిల్లాడందో. సేమ్ టూ సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు.జెఫ్రీ ఓంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఓవరాల్గా 6 వికెట్ల పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన వాండర్సే.. తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ వాండర్సే అని నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.ఎవరీ వాండర్సే...?భారత్తో మూడు వన్డేల సిరీస్కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని వాండర్సే అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే 2015లో న్యూజిలాండ్పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్లో వాండర్సే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.ఆ తర్వాత అతడి వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్ల లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు.దేశీవాళీ క్రికెట్లో మూర్స్ ఎసీ, సీదువ రద్దోలువ సీసీ క్లబ్స్కు వాండర్సే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వాండర్సే ఇప్పటివరకు ఓవరాల్గా 37 మ్యాచ్ల్లో శ్రీలంక తరపున ఆడాడు. అందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఉన్నాయి.అదే విధంగా వాండర్సే తన కెరీర్లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లఘించినందుకు వాండర్సే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వార్షిక కాంట్రాక్ట్ ఫీజులో 20% జరిమానా కూడా శ్రీలంక క్రికెట్ విధించింది. -
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. దీన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్లో రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్ల సిరీస్లో1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
IND VS SL 2nd ODI: శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో.. నమ్మశక్యంకాని రీతిలో రనౌట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్.. క్రీజ్లో కుదురుకున్న కమిందు మెండిస్ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. -
IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్మ్యాన్.. వైరల్ వీడియో
ప్రస్తుత శ్రీలంక పర్యటనలో టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా అవతారమెత్తుతున్నారు. టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ బంతితో మ్యాజిక్ చేయగా.. తొలి వన్డేలో శుభ్మన్ గిల్, రెండో వన్డేలో రోహిత్ శర్మ బంతితో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ రెండు ఓవర్లు వేసి పర్వాలేదనిపించాడు. క్రీజ్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో హిట్మ్యాన్ తనలోని ఆఫ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాన్ని వెలికితీశాడు. రోహిత్ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. రోహిత్ అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ.. ఐపీఎల్ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో హిట్మ్యాన్ పేరిట హ్యాట్రిక్ కూడా ఉంది.Rohit Sharma this series:Batting ✅Bowling ✅Captaincy ✅Watch #SLvIND 2nd ODI LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/qBIl1vNwsU— Sony LIV (@SonyLIV) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. All-rounders in India's limited-overs set up after T20 World Cup 2024 💹📸: Sony LIV pic.twitter.com/oorO7IJdIR— CricTracker (@Cricketracker) August 4, 2024 -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. -
IND VS SL 2nd ODI: మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్పై (రిడ్లే జాకబ్స్)జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్పై (మాథ్యూ సింక్లెయిర్)జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్లో రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఓటమి దిశగా టీమిండియా190 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసలంక అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్ను (44) పెవిలియన్కు పంపాడు. వాండర్సే మాయాజాలంజెఫ్రీ వాండర్సే తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో టీమిండియాను ఇరుకున పడేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతను.. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కూల్చాడు. శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) 14 పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/6గా ఉంది. అక్షర్ పటేల్ (27), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్123 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (7), శ్రేయస్ (7) క్రీజ్లో ఉన్నారు. వాండర్సేకు ఇది నాలుగో వికెట్. 116 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్116 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ (35), శివమ్ దూబేను (0) వాండర్సే ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.A six over extra cover to bring up his fifty. 🔥- Rohit Sharma in a crazy touch! pic.twitter.com/hI57R7T7Ik— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా97 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో నిస్సంక సూపర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 102/1గా ఉంది. శుభ్మన్ గిల్ (31), విరాట్ కోహ్లి (5) క్రీజ్లో ఉన్నారు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 76/0గా ఉంది. రోహిత్కు (51) జతగా శుభ్మన్ గిల్ (23) క్రీజ్లో ఉన్నాడు.టీమిండియా టార్గెట్ 241కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక136 పరుగుల వద్ద శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అసలంక (25) ఔటయ్యాడు.136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక 136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (12) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ (14) ఔటయ్యాడు.వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సుందర్వాషింగ్టన్ తన స్పెల్ రెండో ఓవర్ చివరి బంతికి, మూడో ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి ఆవిష్క ఫెర్నాండో (40).. 19వ ఓవర్ తొలి బంతికి కుశాల్ మెండిస్ (30) ఔటయ్యారు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3గా ఉంది. చరిత్ అసలంక (1), సమరవిక్రమ (0) క్రీజ్లో ఉన్నారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంకతొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పథుమ్ నిస్సంక ఔటయ్యాడు. WICKET ON THE FIRST BALL BY MOHAMMAD SIRAJ. 🔥- Siraj, a beast against Sri Lanka!pic.twitter.com/7i7IeWcsGr— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్లు ఇవే
కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ జట్లు రెండో వన్డేలో తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా దూరం కాగా.. పేసర్ షిరాజ్ను శ్రీలంక మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. వీరిద్దరి స్ధానాల్లో జెఫ్రీ వాండర్సే, కమిందు మెండీస్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా ఇదే వేదికలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టై గా ముగిసింది.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. 2 పరుగుల దూరంలో
కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 2 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో రోహిత్ 10,767 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(10,768) పేరిట ఉంది. ఇప్పుడు కొలంబో వన్డేలో హిట్మ్యాన్ కేవలం రెండు పరుగులు చేస్తే ద్రవిడ్ను అధిగమిస్తాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(18,426) అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో విరాట్ కోహ్లి(13,872), సౌరవ్ గంగూలీ(11, 221) ఉన్నారు. ఇక తొలి వన్డేను టైగా ముగించిన భారత్.. రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్? -
టీమిండియాతో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్
కొలంబో వేదికగా ఆదివారం టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా భారత్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో హసరంగా మోకాలికి గాయమైంది. అయినప్పటకి మ్యాచ్ మొత్తానికి వనిందు అందుబాటులో ఉన్నాడు. కానీ ఆ తర్వాత స్కానింగ్లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే హసరంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. కాగా భారత్తో తొలి వన్డే టైగా ముగియడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక కూడా దూరమయ్యారు. ఇప్పుడు హసరంగా కూడా తప్పుకోవడం ఆతిథ్య జట్టుకు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. హసరంగా స్ధానాన్ని జెఫ్రీ వాండర్సేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.చదవండి: ‘టై’ని బ్రేక్ చేసేదెవరో? -
శ్రీలంకతో రెండో వన్డే.. భారత తుది జట్టు ఇదే! పరాగ్ అరంగేట్రం?
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్రౌండర్ రియాన్ పరాగ్కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రిషబ్ పంత్కు మరోసారి నో ఛాన్స్..?ఇక ఈ మ్యాచ్కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.వన్డేల్లో రాహుల్కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్తో గెలవాల్సిన మ్యాచ్ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్కోచ్గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్లో భారీ స్లాగ్స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ షాట్ సెలక్షన్పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
IND vs SL 1st ODI : 'టై'గా ముగిసిన భారత్ - శ్రీలంక తొలి వన్డే (ఫొటోలు)
-
భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
-
చరిత్ర సృష్టించిన రోహిత్.. సెహ్వాగ్, సచిన్ సరసన హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన కెప్టెన్గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. మోర్గాన్ కెప్టెన్గా 180 ఇన్నింగ్స్లలో 233 సిక్స్లు బాదగా.. రోహిత్ కేవలం 134 ఇన్నింగ్స్లలోనే 233 సిక్స్లు కొట్టేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఓపెనర్గా 352 ఇన్నింగ్స్లలో15,035 పరుగులు చేశాడు.ఈ జాబితాలో భారత లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(16,119) తొలి స్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,335) ఉన్నారు. -
మొహ్మద్ షిరాజ్ను ఉతికారేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
కొలంబో వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . 231 పరుగుల ఛేదనలో శ్రీలంక బౌలర్లను రోహిత్ ఉతికారేశాడు. హిట్మ్యాన్ తన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా శ్రీలంక అరంగేట్ర ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు.4 ఓవర్ వేసిన షిరాజ్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో ఏకంగా 15 పరుగులు రాబట్టాడు. అందులో ఓ సింగిల్ ఉంది. రోహిత్ దెబ్బకు సిరాజ్ను మరి బౌలింగ్ ఎటాక్లోకి లంక కెప్టెన్ తీసుకురాలేదు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 47 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టీ20 వరల్డ్కప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే. Rohit Sharma retired from T20Is and now he has started treating ODIs like T20Is. 🙇🏻♂️🔥#RohitSharma𓃵 | #INDvsSL pic.twitter.com/W5Ek39y0DO— 𝐒𝐚𝐧𝐠𝐫𝐚𝐦 ⚚ (@shinewid_SAM) August 2, 2024 -
నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్ ‘ఫైర్’!
దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్ సందర్భంగా మైదానంలో దిగాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో భారత జట్టు బౌలింగ్కు దిగగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్ తీశాడు. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1) రూపంలో టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అనంతరం.. శివం దూబే కుశాల్ మెండిస్(14), అక్షర్ పటేల్ సమరవిక్రమ(8) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ చరిత్ అసలంక(14)ను పెవిలియన్కు పంపాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 27వ ఓవర్ మూడో బంతికి.. హాఫ్ సెంచరీ వీరుడు పాతుమ్ నిసాంక(56)ను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే, 29వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ చేసిన పనికి.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్గా నిలిచింది. దునిత్ వెల్లలగే క్రీజులో ఉన్న సమయంలో(28.5) సుందర్ గంటకు 91 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.ఈ క్రమంలో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వెల్లలగే విఫలమయ్యాడు. అయితే, బాల్ బ్యాట్ కంటే ప్యాడ్కు ముందు తాకిందని భావించిన వాషీ.. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ) కోసం అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.దీంతో..స్లిప్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూసిన వాషీ.. అతడి గైడెన్స్ కావాలన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఏంటి? నువ్వే చెప్పాలి కదా!... అయినా నాకేం కనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా? ’’ అంటూ సరదాగా కసురుకున్నాడు. స్టంప్ మైకులో ఈ వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శివం దూబే, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Vintage stump mic banter from @ImRo45 😆 Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 🤩 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/HYEM5LxVus— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2024 -
శ్రీలంక తరపున అరంగేట్రం.. ఎవరీ మహ్మద్ సిరాజ్?
శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కల ఎట్టకేలకు నేరవేరింది. కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జట్టులో సిరాజ్కు చోటు దక్కడంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.కాగా భారత్తో వన్డేలకు తొలుత ప్రకటించిన లంక ప్రధాన జట్టులో సిరాజ్కు ఛాన్స్ లభించలేదు. అయితే తొలి వన్డేకు ముందు గాయపడిన యువ పేసర్ మతీషా పతిరాన స్ధానంలో షిరాజ్ లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షిరాజ్ గరుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ మహ్మద్ సిరాజ్?29 ఏళ్ల షిరాజ్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం కాండీ క్రికెట్ క్లబ్కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం కురునెగల జట్టు తరపున షిరాజ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన సిరాజ్.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సిరాజ్ 49 మ్యాచ్లలో 125 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు కూడా 3.65గా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్తో వన్డే సిరీస్కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్కు బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించే సత్తా ఉంది. -
IND vs SL: 4 ఏళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ..! ఎవరంటే?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో పునరాగమనం చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. తన మొదటి మ్యాచ్లో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్లో 6 బంతులు ఎదుర్కొన్న శివమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2024తో పాటు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత టీ20 జట్టులోకి వచ్చిన దూబే.. ఇప్పుడు వన్డేల్లో కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో దూబేకు రీఎంట్రీ సుగమమైంది. తొలి వన్డేకు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్కప్-2024లో కూడా దూబే పర్వాలేదన్పించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసిన దూబే.. భారత్ ఛాంపియన్స్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్-ఎ కెరీర్లో ఇప్పటివరకు 54 మ్యాచ్లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. నల్ల బ్యాండ్లతో భారత జట్టు! ఎందుకంటే?
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం(జూలై 31) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. క్యాన్సర్తో పోరాడుతూ గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్తో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టుతో చేరారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
ఉత్కంఠ పోరు.. భారత్-శ్రీలంక తొలి వన్డే టై
Sri Lanka vs India, 1st ODI Updates: తొలి వన్డే అప్డేట్స్ఉత్కంఠ పోరు.. భారత్-శ్రీలంక తొలి వన్డే టైకొలంబో వేదికగా శ్రీలంక-భారత్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డే టైగా ముగిసింది. విజయానికి ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను భారత్ టైగా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఆల్రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(58) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(31), శివమ్ దూబే(25), అక్షర్ పటేల్(33) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా, అసలంక తలా మూడువ వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే రెండు ,అకిలా దనుంజయ, ఫెర్నాండో చెరో వికెట్ సాధించారు.అక్షర్ పటేల్ ఔట్..అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అసలంక బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 48 బంతుల్లో 27 పరుగులు కావాలి.కేఎల్ రాహుల్ ఔట్.. కేఎల్ రాహుల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన రాహుల్.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 58 బంతుల్లో 35 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(33), శివమ్ దూబే(3) పరుగులతో ఉన్నారు.37 ఓవర్లకు భారత స్కోర్: 175/537 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(20), అక్షర్ పటేల్(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి 56 పరుగులు కావాలి.ఐదో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన అయ్యర్.. అషితా ఫెర్నాండో బౌలింగ్లో ఔటయ్యాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 149/5. క్రీజులో అక్షర్ పటేల్(11), కెఎల్ రాహుల్(8) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్130 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన కోహ్లి.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు.23 ఓవర్లకు భారత్ స్కోర్: 130/323 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(22), విరాట్ కోహ్లి(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 101 పరుగులు కావాలి.భారత్ మూడో వికెట్ డౌన్.. టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. దనుంజయ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2రోహిత్ శర్మ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. వెల్లగెలె బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2తొలి వికెట్ కోల్పోయిన భారత్శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన గిల్.. వెల్లగలే బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్: 76/1రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 71/0దూకుడుగా ఆడుతున్న భారత్231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(29), శుబ్మన్ గిల్(10) పరుగులతో ఉన్నారు. రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఆల్రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్42.6: క్రీజులో కుదురుకున్న వనిందు హసరంగ(24)ను భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ పెవిలియన్కు పంపాడు. అర్ష్ వేసిన బంతిని తప్పుగా అంచనావేసిన హసరంగ.. అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక స్కోరు: 178-7(43). వనిందు స్థానంలో లెఫ్టాండ్ బ్యాటర్ అకిల ధనంజయ క్రీజులోకి వచ్చాడు. దునిత్ వెల్లలగే 39 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన లంకఅక్షర్ పటేల్ బౌలింగ్లో జనిత్ లియనగే(20) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 35వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రీలంక ఐదో వికెట్ డౌన్.. నిస్సాంక రూపంలో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన నిస్సాంక.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 27 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 101/5నిస్సాంక హాఫ్ సెంచరీ.. శ్రీలంక ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ సాధించాడు. 68 బంతుల్లో 9 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక..శ్రీలంక పేలవ ఫామ్ వన్డేల్లో కూడా కొనసాగుతోంది. తొలి వన్డేలో 91 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది. నాలుగో వికెట్గా కెప్టన్ అసలంక పెవిలియన్కు చేరాడు.శ్రీలంక మూడో వికెట్ డౌన్.. శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సమరవిక్రమ.. అక్షర్ పటేల్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లకు శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. శ్రీలంక రెండో వికెట్ డౌన్..శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. శివమ్ దూబే బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 13.1 ఓవర్లకు శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 37/110 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(25), కుశాల్ మెండిస్(7) ఉన్నారు.లంక తొలి వికెట్ డౌన్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1).. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 7/1భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో యువ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో చేరారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
శ్రీలంకతో తొలి వన్డే.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ మ్యాచ్తో బరిలోకి దిగనున్నారు. వన్డే స్పెషలిస్ట్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నారు. అందరూ ఊహించినట్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూడే తుది జట్టుకు ఎంపికయ్యారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ షిరాజ్ -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? భారత్ తరఫున మళ్లీ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతాడా? టీ20 సిక్సర్ల కింగ్గా తన పేరును పదిలం చేసుకుంటూ మరిన్ని భారీ షాట్లు బాదుతాడా? అంటూ హిట్మ్యాన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇందుకు కారణం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్లో అనూహ్య విజయాలతో మూడు ఫార్మాట్లలోనూ భారత్ను వరల్డ్ నంబర్ వన్గా నిలిపాడు. అయితే, ప్రపంచకప్ గెలవాలన్న కల మాత్రం టీ20 ప్రపంచకప్-2024తో తీరింది. అంతకు ముందు.. రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే టీమిండియా నిష్క్రమించగా.. వన్డే వరల్డ్కప్-2023లోనూ రన్నరప్తోనే సరిపెట్టుకుంది.లంకతో వన్డే సిరీస్తో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఐసీసీ టైటిల్ గెలిచి విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు. వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడగానే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న హిట్మ్యాన్.. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అని విలేకరులు అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా నేను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఇక ఏదైనా కీలక టోర్నీ వస్తోందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తోంది.పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదుఇప్పటికీ నేను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. ఏదో కొన్నాళ్లు సెలవు తీసుకుని మళ్లీ ఆడాలి కదా అన్న ఫీలింగ్లోనే ఉన్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల.. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్బై చెప్పినా.. వన్డే వరల్డ్కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చాలాసార్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ బరిలోకి దిగాడు.ఆ అవకాశం లేదు.. కానీకాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాట్ కోహ్లితో పాటు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. వరల్డ్కప్-2024కు ముందే రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసిన హిట్మ్యాన్.. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో టీ20 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్గా నిలిచాడు. ఇక 2026లో మరోసారి టీ20 వరల్డ్కప్నకు రంగం సిద్దం కాగా.. రోహిత్ శర్మ వయసు అప్పటికి 39 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక రోహిత్ స్థానంలో టీమిండియా టీ20 నూతన కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్ శ్రీలంక తాజా పర్యటనలో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది.చదవండి: లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్పైనే..!Even we are not over your T20I retirement, @ImRo45 🥹What's your take? 💬#SonySportsNetwork #SLvIND #RohitSharma pic.twitter.com/AMt7HXLR6U— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2024 -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
భారీ సిక్సర్లు బాదిన కోహ్లి- రోహిత్.. గంభీర్ రియాక్షన్ వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియా సన్నద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నారు. వీరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అదే విధంగా.. ఐపీఎల్-2024 తర్వాత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వీరంతా ఇప్పటికే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి వన్డే పూర్తి స్థాయిలో సిద్దమయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. నెట్స్లో శ్రమిస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వారి ప్రాక్టీస్ను గమనించాడు. ఇక ఈ ఇద్దరు స్టార్లు భారీ సిక్సర్లతో చెలరేగగా.. గంభీర్ నవ్వుతూ వారెవ్వా అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీమిండియా అభిమానులను ఆకర్షిస్తోంది.వీడియోపై స్పందిస్తూ.. ముగ్గురు లెజెండ్స్ని ఇలా చూస్తూ ఉంటే కళ్లు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ హెడ్కోచ్గా నియమితుడు కాగానే సీనియర్లకు షాకివ్వడం ఖాయమని.. ముఖ్యంగా కోహ్లికి కష్టాలు మొదలైనట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తన తొలి ప్రెస్ మీట్లోనే గంభీర్ వీటిని కొట్టిపారేశాడు. రోహిత్, కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్లని.. ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్కప్-2027 దాకా ఆడగలరంటూ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు జట్టుకు బలం అని.. వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న సమయంలో గంభీర్- కోహ్లి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇద్దరు ఆలింగనం చేసుకోవడంతో ఆ వివాదం సమసిపోయినట్లయింది. ఇక ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా ఉన్న గంభీర్ ఆ జట్టును విజేతగా నిలిపి.. ఆపై భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. T20I Series ✅It's now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG— BCCI (@BCCI) August 1, 2024 -
లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్పైనే..!
కొలొంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆడనున్నప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల కళ్లు మాత్రం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్పైనే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్కు శ్రీలంకపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి పిచ్లపై సిరాజ్ చెలరేగిపోతాడు. ముఖ్యంగా కొలంబోలో సిరాజ్కు పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ చివరిగా ఆడిన మ్యాచ్లో (ఆసియా కప్ 2023 ఫైనల్లో) మియా నిప్పులు చెరిగాడు. ఆ మ్యాచ్లో అతను కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరాజ్ శ్రీలంకతో ఇప్పటిదాకా ఆడిన 6 వన్డేల్లో 7.7 సగటున, 3.5 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్లోనూ భారత అభిమానులు సిరాజ్ నుంచి మెరుపు ప్రదర్శనను ఆశిస్తున్నారు. సిరాజ్ కొలొంబోలో మరోసారి చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు.ఇదిలా ఉంటే, లంకతో ఇవాల్టి మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టీమిండియా.. తాజాగా ముగిసిన టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి మాంచి జోష్లో ఉండగా.. లంకేయులు.. భారత్కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారగా.. శ్రీలంకను గాయాల బెడద వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికే దూరమయ్యారు.తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
భారత్ వర్సెస్ శ్రీలంక..రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?
కొలొంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఉత్సాహంతో ఉన్న భారత్ వన్డే సిరీస్ను సైతం గెలుపుతో ప్రారంభించాలని భావిస్తుంది. మరోవైపు శ్రీలంక.. భారత్ను ఎలాగైనా మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఈ ఫార్మాట్లో ఇరు జట్లు 168 మ్యాచ్ల్లో తలపడగా.. భారత్ 99, శ్రీలంక 57 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. 11 మ్యాచ్ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్ల విషయానికొస్తే.. ఇక్కడ ఇరు జట్లు 38 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. 19 మ్యాచ్ల్లో భారత్, 16 మ్యాచ్ల్లో శ్రీలంక విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్ల విషయానికొస్తే.. భారత్ ఐదు మ్యాచ్ల్లోనూ విజయాలు నమోదు చేసింది. జట్ల విషయానికొస్తే.. రోహిత్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ల రాకతో భారత్ మరింత పటిష్టంగా మారింది. హర్షిత్ రాణా, రియాన్ పరాగ్ తొలి మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేయవచ్చు. శ్రీలంక విషయానికొస్తే.. ఆ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. కీలకమైన పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
Ind vs SL: ఆ విషయం గంభీర్తో చర్చిస్తా: రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్.. ఈ కర్ణాటక బ్యాటర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 వన్డేల్లో వికెట్ కీపర్గా వ్యవహరించాడు. సగటు 58.91తో మొత్తంగా 1355 పరుగులు సాధించాడు ఈ కుడిచేతివాటం బ్యాటర్. ఇందులో రెండు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. 48 స్టంపింగ్స్లోనూ భాగమయ్యాడు 32 ఏళ్ల కేఎల్ రాహుల్. ఓవరాల్గా ఇప్పటి వరకు 75 వన్డేలు ఆడిన రాహుల్ ఖాతాలో 2820 పరుగులు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడే వికెట్ కీపర్గా వ్యవహరించాడు.సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరంమరోవైపు.. రిషభ్ పంత్.. 26 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 30 వన్డేలు ఆడి 865 పరుగులు సాధించాడు. టెస్టులు(సగటు 43.67- 2271 రన్స్), టీ20(1209 రన్స్)లతో పోలిస్తే వన్డేల్లో ఈ ఉత్తరాఖండ్ ప్లేయర్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. 2022 డిసెంబరులో ఘోర కారు ప్రమాదం తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు.రీ ఎంట్రీలో అదుర్స్ ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నాటికి పునరాగమనం చేసిన రిషభ్ పంత్ కారణంగా.. వరల్డ్కప్ జట్టులో కేఎల్ రాహుల్కు చోటు కరువైంది. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వన్డే సిరీస్లో భాగంగా తుదిజట్టులో స్థానానికై వీరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.పంత్.. రాహుల్.. ఇద్దరిలో ఎవరు?ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్ వైపు మొగ్గుచూపుతారా.. లేదంటే పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశం చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడగా.. ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్ కీపర్ బ్యాటర్లు రాహుల్- పంత్ల మధ్య ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. ఇద్దరు సమర్థులే. మ్యాచ్ విన్నర్లు కూడా!హెడ్కోచ్తో చర్చిస్తానుగతంలో ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. అలాంటివాళ్లలో ఒకరినే ఎంచుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటివి సమస్యలుగా పరిణమిస్తాయి. అయితే, ఒకందుకు ఇది కూడా మంచిదే. కెప్టెన్గా నాకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండటం మంచి విషయమే.రాహుల్- పంత్ల గురించి హెడ్కోచ్తో చర్చిస్తాను. మేము రేపు మ్యాచ్ ఆడేటపుడు మీకు ఈ విషయంపై స్పష్టత వస్తుంది. భారత క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం ముఖ్యం. ప్రయోగాలు సహజమే అయినా అందుకు ఓటమి రూపంలో మూల్యం చెల్లించాల్సి వస్తే మా ప్రయత్నం విరమించుకోవడమే ఉత్తమమని భావిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగనుంది. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సిరీస్తోనే టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టాడు. తాజాగా వన్డేల్లోనూ తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: వన్డే వరల్డ్కప్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్! -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం! పంత్కు నో ఛాన్స్
శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేలకు సిద్దమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి(ఆగస్టు 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం ఆరు వన్డేల్లో మాత్రమే పాల్గోనుంది. దీంతో ఈ సిరీస్ను ప్రాక్టీస్గా ఉపయోగించుకోవాలని హెడ్కోచ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.హర్షిత్ రానా అరంగేట్రం.. ఇక తొలి వన్డే విషయానికి వస్తే భారత తరపున యువ పేసర్ హర్షిత్ రానా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డేకు భారత తుది జట్టులో రానాకు చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మరోవైపు అతడితో పాటు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రౌండ్ స్కిల్స్ను పరిగణలోకి తీసుకుని పరాగ్కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మరోవైపు తొలి మ్యాచ్కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.శ్రీలంకతో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్. -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్! యార్కర్ల కింగ్ ఔట్
టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా భారత్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20లో పతిరాన గాయపడ్డాడు. పల్లెకెలె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంతిని ఆపే క్రమంలో పతిరాన భుజానికి గాయమైంది.వెంటనే అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ఈ క్రమంలో పతిరాన భారత్తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్ధానాన్ని యువ పేసర్ మహ్మద్ షిరాజ్తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా టీ20 సిరీస్ను శ్రీలంక కోల్పోయినప్పటకి పతిరాన మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లతో శ్రీలంక తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇక మహ్మద్ సిరాజ్ విషయానికి వస్తే.. డిమాస్టిక్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన షిరాజ్.. 80 వికెట్లు పడగొట్టాడు. కాగా ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత్తో వన్డే సిరీస్కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్, అసిత ఫెర్నాండో -
Ind vs SL: గంభీర్ గైడెన్స్.. కోహ్లి- రోహిత్ ప్రాక్టీస్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు లంకతో వన్డేలకు ఎంపికైన కుల్దీప్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్లు ఇప్పటికే కొలంబో చేరుకొని సోమవారం నుంచి నెట్స్లో చెమటోడ్చుతున్నారు. గత నెల వెస్టిండీస్ గడ్డపై భారత్ రెండో టీ20 ప్రపంచకప్ గెలిచిన రోజే భారత స్టార్లు రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు.ఇప్పుడు మళ్లీ.. దాదాపు నెలరోజుల తర్వాత అంతర్జాతీయ వన్డేలు ఆడేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొలంబోలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రెయినింగ్లో వీళ్లంతా ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. తాజాగా.. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.కోహ్లితో చర్చరోహిత్- కోహ్లి కలిసి నెట్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వీక్షించాడు. ఈ క్రమంలో కోహ్లితో చాలా సేపు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ వన్డే సిరీస్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా మిగిలిన ఆటగాళ్ల సన్నద్ధతపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.కాగా జూలై 27, 28, 30 తేదీల్లో పల్లెకెలె వేదికగా టీమిండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో ఆతిథ్య శ్రీలంక జట్టును క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. మూడు వన్డేలు(ఆగస్టు 2, 4, 7) కొలంబోలని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి. శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Great to see two old Delhi teammates connecting over a long chat after a batting session in Colombo. pic.twitter.com/VfjdjANkxa— Vimal कुमार (@Vimalwa) July 31, 2024 -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్కు వస్తున్నారు.వరల్డ్కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్లా రైట్హ్యాండ్ బ్యాటర్. -
టీ20 సిరీస్ క్లీన్స్వీప్: ఇది చాలదు.. ఇంకా కావాలి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్కు ఘనమైన ఆరంభం లభించింది. అతడి మార్గదర్శనంలోని టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా మూడు టీ20లలోనూ గెలుపొంది మరోసారి తమ స్థాయిని చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి గంభీర్ ప్రసంగించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభినందనలు. అత్యద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయం అందించిన సూర్యకు శుభాకాంక్షలు. బ్యాటర్గానూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకుంటున్నానో మీకు చెప్పాను.అయితే, మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే, ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పిచ్ స్వభావం, ఎంత మేర స్కోరు చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నాం. అయితే, కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనమెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇదే గొప్ప విషయం’’ అని గౌతం గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం నాటి మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది.నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టిపోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే, భారత బౌలర్ల కారణంగా మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా.. శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది.𝗧𝗵𝗶𝘀 𝗧𝗲𝗮𝗺 💙 Head Coach Gautam Gambhir 🤝 Hardik Pandya address the dressing room as the action now shifts to the ODIs in Colombo #TeamIndia | #SLvIND | @GautamGambhir | @hardikpandya7 pic.twitter.com/PFrTEVzdvd— BCCI (@BCCI) July 31, 2024 -
సూపర్ ఓవర్లో "అజేయ" భారత
శ్రీలంకతో నిన్న (జులై 30) జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. టీ20ల్లో సూపర్ ఓవర్లో విజయం సాధించడం భారత్కు ఇది నాలుగో సారి. బౌల్ ఔట్తో కలుపుకుని ఐదో సారి. భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి సూపర్ ఓవర్లో విజయం సాధించింది. న్యూజిలాండ్పై రెండు సార్లు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకపై చెరో సారి టీమిండియా సూపర్ విక్టరీలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయగలిగింది.భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేయగా.. లంక ఇన్నింగ్స్లో నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్డౌన్ బ్యాటర్ (46) పర్వాలేదనిపించారు.లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. వాషింగ్టన్ సుందర్ దెబ్బకు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు (3 బంతుల్లో) కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
వార్నర్ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో స్కై 3 మ్యాచ్ల్లో 92 పరుగులే చేసినప్పటికీ.. చాలా కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో టీ20లో అతను బంతితోనూ (1-0-5-2) మ్యాజిక్ చేశాడు. ఫుల్ టైమ్ కెప్టెన్గా స్కైకు ఇది తొలి సిరీస్. తొలి సిరీస్లోనే స్కై.. ప్రత్యర్ది జట్టును క్లీన్ స్వీప్ చేశాడు.టీ20ల్లో స్కైకు ఇది ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో అతను అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. స్కై.. బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్లతో సమంగా ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (7) టాప్లో ఉన్నాడు.మూడో టీ20 విషయానికొస్తే.. లంకపై భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ మ్యాచ్లో 2 వికెట్లు, 25 పరుగులు.. సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
భారత్ చేతిలో ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక
మూడో టీ20లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 2006 నుంచి ఇప్పటివరకు 195 టీ20లు ఆడిన శ్రీలంక 105 మ్యాచ్ల్లో (సూపర్ ఓవర్లతో కలుపుకుని) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్కు ముందు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్ (104) పేరిట ఉండేది. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ ఓటములు చవి చూసిన మరో జట్టు వెస్టిండీస్. వెస్టిండీస్ ఇప్పటివరకు ఆడిన 202 మ్యాచ్ల్లో 101 పరాజయాలు ఎదుర్కొంది.కాగా, శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.రెగ్యులర్ మ్యాచ్లో 2 వికెట్లు, 25 పరుగులు, సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఆవార్డు సొంతం చేసుకున్నాడు. -
రింకూ, సూర్యకుమార్ అద్భుత బౌలింగ్.. సూపర్ ఓవర్లో లంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్లో గెలిచింది. పార్ట్ టైమ్ బౌలర్ల అయిన రింకూ సింగ్, సూర్యకుమార్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను 'టై' చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన రింకూ సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్ బౌలింగ్తో చెలరేగడంతో మ్యాచ్ 'టై'గా మారి సూపర్ ఓవర్కు దారి తీసింది.GG & SURYA 🤝 DOING INNOVATION. 😄- A 20th over of the match was bowled by Suryakumar Yadav and he defended 6 runs. 🤯pic.twitter.com/dBIT8XdqX0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj— Johns. (@CricCrazyJohns) July 30, 2024నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్లో రెండు, సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్గా తొలి సిరీస్లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్డౌన్ బ్యాటర్ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్మన్ గిల్(39) టాప్ స్కోరర్గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న సంజూ.. మళ్లీ డకౌట్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో రెండో టీ20లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన శాంసన్.. ఇప్పుడు మూడో టీ20లో కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో నాలుగు బంతులు ఎదుర్కొన్న శాంసన్.. డకౌట్గా పెవిలియన్కు చేరాడు. శ్రీలంక అరంగేట్ర బౌలర్ చమిందు విక్రమసింఘే బౌలింగ్లో హసరంగాకు క్యాచ్కు ఇచ్చి సంజూ ఔటయ్యాడు. Back To Back Ducks By Sanju Samson 🦆🦆#INDvsSL pic.twitter.com/benObvbY2q— Ankit (@revengeseeker07) July 30, 2024ఈ క్రమంలో నెటిజన్లు శాంసన్ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అవకాశాలు ఇవ్వడం లేదని అందరూ అంటున్నారు.. ఇస్తే ఇదేనా ఆడే తీరు అని ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇలా అయితే జట్టులో చోటు కష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా వరుసగా రెండు మ్యాచ్ల్లో సంజూ డకౌట్ కావడంతో ఇకపై అతడిని టీ20లకు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. Thank you Sanju Samson pic.twitter.com/AeKCtoEPje— YBJ stan #Hallabol (@jaisballenjoyer) July 30, 2024 -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్
భారత్తో మూడు వన్డేల సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్ను తప్పించి తమ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది. టీమిండియాతో టీ20 సిరీస్కు దూరమైన సదీర సమరవిక్రమ, కరుణరత్నే వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా కప్ 2023లో భారత్పై అద్భుతమైన ప్రదర్శన కనబరిరిచిన స్పిన్ ఆల్రౌండర్ దునిత్ వెల్లలగేకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.అయితే వన్డే సిరీస్కు సీనియర్ ఆల్రౌండర్లు దసున్ షనక, మథ్యూస్కు మాత్రం సెలక్టర్లు చోటివ్వలేదు. అదేవిధంగా టీ20 సిరీస్కు దూరమైన స్టార్ పేసర్ల దుష్మాంత చమీరా, నువాన్ తుషారా ఇప్పుడు వన్డేలకు కూడా దూరమయ్యారు. ఇక ఆగస్టు 2న కొలంబో వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్తో వన్డే సిరీస్కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, అసిత ఫెర్నాండో -
IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. గిల్ వచ్చేశాడు! ఆ నలుగురికి రెస్ట్
పల్లెకెలె వేదికగా మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టీ20కు భారత జట్టు మెనెజ్మెంట్ ఏకంగా నలుగురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఈ మ్యాచ్కు దూరమమయ్యారు. వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్, శుబ్మన్ గిల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్రౌండర్ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.తుది జట్లుభారత్: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో -
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్గా తొలి సిరీస్లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్కు- భవిష్య కెప్టెన్కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్కు 2-0తో సిరీస్ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
క్లీన్ స్వీప్పై కన్నేసిన టీమిండియా.. నేడు (జులై 30) శ్రీలంకతో మూడో టీ20
శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 ఇవాళ (జులై 30) జరుగనుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. తొలి రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.సిరీస్ ఫలితం తేలిపోవడంతో నేటి మ్యాచ్లో భారత్ ప్రయోగాల బాట పట్టవచ్చు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇప్పటివరకు అవకాశాలు రాని వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు. తొలి రెండు మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో టీ20కి ముందు మెడ కండరాలు పట్టేయడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శుభ్మన్ గిల్ నేటి మ్యాచ్కు కూడా బెంచ్కే పరిమితం కావచ్చు. మేనేజ్మెంట్ సంజూ శాంసన్కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దూబే.. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు శ్రీలంక నేటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించవచ్చు. ఆ జట్టు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్ల్లో శ్రీలంకకు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయింది. రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ స్వల్ప వ్యవధిలో పేకమేడలా కూలింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచాలని భావిస్తుంది. ఈ సిరీస్ అనంతరం కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 2, 4 , 7 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత వన్డే ప్లేయర్లు ఇప్పటికే కొలొంబోకు చేరుకున్నారు. నిన్న వర్షం కారణంగా భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ చేయలేకపోయారు.తుది జట్లు (అంచనా)..టీమిండియా: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్ -
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
Ind vs SL 3rd T20: క్లీన్స్వీప్ లక్ష్యంగా...
పల్లెకెలె: భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు గెలిచింది. టి20 సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు దీన్ని 3–0గా వైట్వాష్ చేసేందుకు భారత్ ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య శ్రీలంకపై ముచ్చటగా మూడో విజయం సాధించేందుకు సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది. మంగళవారం జరిగే మూడో టి20 బరిలోకి టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్లో ఉండటంతో ‘హ్యాట్రిక్’ గెలుపుపై ఎవరికి అనుమానాల్లేవ్! మరోవైపు లంక సొంతగడ్డపై పరువు కోసం పాకులాడుతోంది. కనీసం ఆఖరి పోరులో గెలిచి క్లీన్స్వీప్ కాకుండా బయటపడాలని ఆరాటపడుతోంది. టీమిండియాకు ఎదురుందా... ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. గిల్ స్థానంలో రెండో టి20 ఆడిన సంజూ సామ్సన్ డకౌట్ను మరిచేలా మెరిపిస్తే ఇన్నింగ్స్కు ఢోకా ఉండదు. సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు మిగతా పని కానిచ్చేస్తారు. బౌలర్లు అర్‡్షదీప్, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. తొలి మ్యాచ్లో దూసుకెళ్తున్న లంక ఇన్నింగ్స్ను 30 పరుగుల వ్యవధిలో 9 వికెట్లను కూల్చారు. రెండో మ్యాచ్లో 32 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను తీసిన టీమిండియా బౌలింగ్ దళం సత్తాచాటుకుంది. ఈ ఒక్కటైనా గెలవాలని... సిరీస్ను చేజార్చుకున్న శ్రీలంక ఆఖరి పోరులో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. వచ్చే నెల 2 నుంచి జరిగే వన్డే సిరీస్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలని ఆశిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ ఆతిథ్య జట్టుకు తలనొప్పిగా మారింది. భారత్ నుంచి వైట్వాష్ తప్పించుకోవాలంటే మాత్రం వ్యూహాలకు పదును పెట్టాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఓపెనర్ నిసాంక మాత్రమే రెండు మ్యాచ్ల్లో కుదురుగా ఆడాడు. మిగతా వారంతా భారత బౌలింగ్ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇకపై లోపాలను అధిగమించి విజయాన్నందుకోవాలని లంక సేన పట్టుదలతో ఉంది.పిచ్, వాతావరణం వేదిక మారలేదు కానీ గత రెండు మ్యాచ్లు ఆడిన పిచ్పై కాకుండా వేరే పిచ్పై ఈ మ్యాచ్ జరుగుతుంది. బ్యాటింగ్కు అనుకూలమే అలాగే స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్. వర్ష సూచన ఉన్నప్పటికీ మ్యాచ్ జరుగుతుంది. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, సంజూ సామ్సన్, రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, పరాగ్, అక్షర్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, సిరాజ్. శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, కమిండు మెండీస్, షనక, హసరంగ, తీక్షణ, పతిరణ, మదుషంక, ఫెర్నాండో. -
శ్రీలంకతో మూడో టీ20.. సంజూకు మరో ఛాన్స్! భారత తుది జట్టు ఇదే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం(జూలై 30) సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్పై కన్నేసింది. మరోవైపు శ్రీలంక కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఈ మ్యాచ్కు కూడా టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్నగిల్కు విశ్రాంతిని పొడగించాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో సంజూ శాంసన్ కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్కు కూడా ఆఖరి మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరిముగ్గరి స్ధానంలో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్ తుది జట్టులో రానున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, అర్ష్దీప్ సింగ్ -
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్ల్లో గెలిచిన భారత్ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది. -
'సంజూకు కాదు.. ఆ కుర్రాడికే టీమిండియాలో ఛాన్స్లు ఎక్కువ'
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్గా గౌతం గంభీర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బెంచ్కే పరిమితమైన శాంసన్కు.. రెండో టీ20లో ఆడే ఛాన్స్ లభించింది. గిల్ స్ధానంలో ఓపెనర్గా వచ్చిన శాంసన్.. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో శాంసన్ కంటే యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా లంకతో జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ రియాన్ భారత జట్టులో భాగమయ్యాడు. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమై పరాగ్.. బౌలింగ్లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. రెండో మ్యాచ్లోనూ తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాను ఈ అస్సాం ఆల్రౌండర్ పూర్తి చేశాడు."భారత జట్టులో రియాన్ పరాగ్కు ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అతడికి బాగా కలిసిస్తోందని" ఎక్స్లో పఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పరాగ్కు భారత జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరాగ్ను ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. -
కొలొంబోకు చేరుకున్న భారత వన్డే ప్లేయర్లు
శ్రీలంకతో వన్డే సిరీస్కు మాత్రమే ఎంపికైన భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా ఆదివారం రాత్రి కొలొంబోకు చేరుకున్నారు. వీరికి కొలొంబోలోని ఐటీసీ రత్నదీప హోటల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ఇవాళ (జులై 29) సాయంత్రం నుంచి భారత క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటారు. నెట్స్లో ప్రాక్టీస్ బాధ్యతలను భారత టీమ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు అప్పజెప్పింది. ఇవాళ ఉదయం నాయర్ కొలొంబోలో భారత వన్డే జట్టుతో కలిశాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు పల్లెకెలెలో ఉంది. లంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నెల 30న జరిగే మూడో టీ20 అనంతరం టీ20 జట్టులో ఉన్న వన్డే జట్టు సభ్యులు రోహిత్ అండ్ కోను కలుస్తారు. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో టీమిండియా.. శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా -
గిల్ కంటే అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి?
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. శుబ్మన్ గిల్ జట్టులో ఉన్నాడనే కారణంతో రుతును పక్కనపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గిల్తో పోలిస్తే రుతురాజ్ ఆటలో నిలకడ ఎక్కువని పేర్కొన్నాడు. కాబట్టి అతడిపై కూడా సెలక్టర్లు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు.ఇద్దరికీ ఆ అర్హతస్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వారసులు కాగల అర్హత ఈ ఇద్దరికీ ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టుకు గిల్ సారథ్యం వహించాడు. కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు.ఈ క్రమంలో టీమిండియా భవిష్య కెప్టెన్గా ప్రశంసలు అందుకుంటున్న గిల్కు శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్గా అవకాశమిచ్చింది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించింది. ఇక టీ20లలో గిల్ యశస్వి జైస్వాల్తో పాటు ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓపెనర్లుగా టీ20లలో ఈ జోడీ ఫిక్సయిపోయినట్లే!.. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ ప్రమాదంలో పడింది. రుతు కూడా ఓపెనరే కావడంతో ఇప్పటికే జట్టులో పాతుకుపోయిన గిల్- యశస్వితో పోటీలో అతడు వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ రుతురాజ్కు అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు.ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే‘‘గిల్, రుతు.. ఇద్దరూ మంచి ప్లేయర్లే. టీ20 క్రికెట్లో తమకు తామే సాటి. వారి బ్యాటింగ్ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. వీరిద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. అయితే, ఆటలో నిలకడ పరంగా చూస్తే గిల్ కంటే రుతురాజే ముందున్నాడని చెప్పవచ్చు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే బదులు ఇద్దరినీ జట్టులో ఆడిస్తే తప్పేంటి. ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే. అలాంటపుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఊతప్పతో పాటు ఈ షోలో పాల్గొన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ మాత్రం.. తాను ఈ విషయంలో గిల్కే ఓటు వేస్తానని చెప్పడం విశేషం.గిల్, రుతు కెరీర్ ఇలాకాగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 44 వన్డేలు, 20 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1492, 2271, 539 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 6 వన్డే, 23 టీ20 మ్యాచ్లు ఆడి.. 115, 633 పరుగులు సాధించాడు. టీ20లలో రుతు కూడా శతకం బాదడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. రుతును ఈ టూర్కు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.చదవండి: భీకర ఫామ్ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్గా రికార్డుManu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం.. -
భీకర ఫామ్ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్గా రికార్డు
2024లో టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. యశస్వి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు దాటిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 13 మ్యాచ్ల్లోనే యశస్వి ఈ మైలురాయిని చేరుకున్నాడు.ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఆ సిరీస్లో 79.91 సగటున 712 పరుగులు చేశాడు. అనంతరం జింబాబ్వే టీ20 సిరీస్లో మూడు మ్యాచ్ల్లో 165.88 స్ట్రయిక్రేట్తో 141 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో 70 పరుగులు చేసి (40, 30) ఆకట్టుకున్నాడు. యశస్వి ఈ ఏడాది రెండు డబుల్ సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1023 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో లంక ఆటగాడు కుశాల్ మెండిస్ ఉన్నారు. మెండిస్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 888 పరుగులు చేశాడు. మెండిస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇబ్రహం జద్రాన్ (844), టీమిండియా రోహిత శర్మ (833), శ్రీలంక పథుమ్ నిస్సంక (791), ఆఫ్ఘనిస్తాన్ రహ్మానుల్లా గుర్భాజ్ (773), టీమిండియా శుభ్మన్ గిల్ (725) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు.లంకతో రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలు కావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. -
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శాంసన్
టీమిండియాలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్గా సంజూ శాంసన్కు పేరుంది. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు. శుభ్మన్ గిల్కు మెడ పట్టేయడంతో శ్రీలంకతో రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ.. ఈ మ్యాచ్లో తానెదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డై అందరినీ నిరాశపరిచాడు. సంజూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నెటిజన్లు అతన్ని ఘోరంగా ఆడుకుంటున్నారు. pic.twitter.com/t5KrrijCqt— hiri_azam (@HiriAzam) July 28, 2024అవకాశాలు రాకపోతే ఇవ్వలేదంటారు.. వస్తే ఇలా చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ గోల్డెన్ డకౌటైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మ్యాచ్లో సంజూ మహీశ్ తీక్షణ బౌలింగ్లో ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు.అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్తో మ్యాచ్ను గెలిపించాడు. బంతితో రాణించిన హార్దిక్ బ్యాట్తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. -
శివాలెత్తిపోయిన హార్దిక్.. టీమిండియా ఖాతాలో రికార్డు విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో నిన్న (జులై 29) జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు. అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు.శివాలెత్తిపోయిన హార్దిక్ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్తో మ్యాచ్ను గెలిపించాడు. బంతితో (2 వికెట్లు) రాణించిన హార్దిక్ బ్యాట్తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది.టీమిండియా ఖాతాలో రికార్డు విజయంఈ మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్ రికార్డు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు (శ్రీలంకపై 21 విజయాలు) సాధించిన జట్టుగా తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్కు పరిమితమైన శ్రీలంక
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. శ్రీలంకను 161 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంకకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ మూడు, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో కుశాల్ పెరీరా (53) టాప్ స్కోరర్గా నిలువగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26), చరిత్ అసలంక (14), రమేశ్ మెండిస్ (12), కుశాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. నిన్న జరిగిన తొలి టీ20లోనూ శ్రీలంక ఈ మ్యాచ్లోలాగే చివరి వికెట్లు స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. నిన్నటి మ్యాచ్లో ఆ జట్టు చివరి 9 వికెట్లు 30 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
లంకతో రెండో టీ20.. టాస్ గెలిచిన భారత్.. సంజూ శాంసన్ ఎంట్రీ
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లంక తరఫున దిల్షన్ మధుషంక స్థానంలో రమేశ్ మెండిస్.. భారత్ తరఫున శుభ్మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చారు. గిల్ మెడ పట్టేయడంతో ఈ మ్యాచ్లో ఆడటం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 ఇదే వేదికగా జులై 30న జరుగనుంది. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో -
టీమిండియాకు షాకిచ్చిన శ్రీలంక.. ఆసియా కప్ ఫైనల్లో జయకేతనం
ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక టీమిండియాకు షాకిచ్చింది. ఇవాళ (జులై 28) జరిగిన ఫైనల్లో భారత్పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారీ అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కవిష దిల్హరి (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (2 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఏకైక వికెట్ లభించింది. ఈ టోర్నీలో ఆది నుంచి ఆజేయంగా నిలిచిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
శ్రీలంకతో రెండో టీ20.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరికి రెస్ట్?
శ్రీలంకతో టీ20 సిరీస్పై టీమిండియా కన్నేసింది. 24 గంటలు తిరగకముందే మరో మ్యాచ్కు భారత్ సిద్దమైంది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. లంక మాత్రం ఎలాగైనా కమ్బ్యాక్ ఇచ్చి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.అయితే సెకెండ్ టీ20లో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో గాయపడిన స్పిన్నర్ రవి బిష్ణోయ్కు రెండో మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిటర్న్ క్యాచ్ను అందుకునే క్రమంలో బిష్ణోయ్ ముఖానికి గాయమైంది. రక్తం రావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.ఆ తర్వాత తన బౌలింగ్ను బిష్ణోయ్ కంటిన్యూ చేశాడు. కానీ ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు మహ్మద్ సిరాజ్ను కూడా ఈ మ్యాచ్కు రెస్ట్ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో పేసర్ ఖాలీల్ ఆహ్మద్ జట్టులో రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ మధుషంక స్ధానంలో ఆల్రౌండర్ చమిందు విక్రమసింఘేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు లంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.తుది జట్లు(అంచనా)భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ఖాలీల్ ఆహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే -
షాకింగ్.. ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్! రూల్స్ ఏం చెబుతున్నాయి?
శ్రీలంక పర్యటనను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ బౌలింగ్ చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెండిస్ ఒకే ఓవర్లో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.స్పిన్నర్లకు భారత్ కాస్త తడబడుతుండంతో లంక కెప్టెన్ అసలంక పార్ట్ టైమ్ స్పిన్నర్ మెండిస్ మెండిస్ను ఎటాక్లో తీసుకువచ్చాడు. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన మెండిస్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు. కానీ వాస్తవానికి రైట్ ఆర్మ్ బౌలర్ అయిన కమిందు మెండిస్.. సూర్యకు మాత్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఆ బంతికి ఫోర్ కొట్టిన సూర్య తర్వాత బంతికి సింగిల్ తీసి రిషబ్ పంత్కు స్ట్రైక్ ఇచ్చాడు. అప్పుడు అనూహ్యంగా మెండిస్ మళ్లీ తన రైట్ఆర్మ్ శైలిలోనే బౌలింగ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో చేతులు మార్చి బౌలింగ్ చేయడంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ లుక్కేద్దాంఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?రూల్స్ ప్రకారం.. బౌలర్కు ఏ చేతితోనైనా బంతిని వేసే అవకాశం ఉంటుంది. అయితే బంతి వేసే ముందు సదరు బౌలర్ తన శైలిని కచ్చితంగా అంపైర్కు తెలియజేయాలి. అప్పుడే వారు బౌలింగ్ చేసే చేతిని మార్చుకోవడానికి అంపైర్ అనుమతి ఇస్తాడు.ఆ విషయాన్ని బ్యాటర్కు సైతం అంపైర్ తెలియజేస్తాడు. ఒక వేళ బౌలర్ చేతిని మార్చుకున్న విషయాన్ని అంపైర్గా తెలియజేయకపోతే అది నో బాల్గా పరిగణించబడుతోంది. ఇప్పుడు భారత్-శ్రీలంక తొలి మ్యాచ్లో మాత్రం మెండిస్ తన నిర్ణయాన్ని అంపైర్కు తెలిపాడు. అందుకే, దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన ఐదో బౌలర్గా మెండిస్ నిలిచాడు.ఈ జాబితాలో భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అక్షయ్ కర్నేవార్, పాకిస్తాన్ లెజెండ్ హనీఫ్ మహ్మద్, ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం గ్రాహం గూచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ హషన్ తిలకరత్న ఉన్నారు.చదవండి: IND vs SL: అతడెందుకు దండగ అన్నారు.. కట్చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్ -
అతడెందుకు దండగ అన్నారు.. కట్చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్కు గురయ్యారు. అందుకు కారణం.. జింబాబ్వే సిరీస్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే.ఫామ్లో ఉన్న ఆల్రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లను పక్కన పెట్టి మరి పరాగ్కు ఛాన్స్ ఇచ్చిన జట్టు మెనెజ్మెంట్ చాలా మంది అగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్కోచ్ గౌతం గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ ఆఖరిలో అందరికి ఆర్దమైంది.ఈ మ్యాచ్లో రియాన్ను పార్ట్టైమ్ బౌలర్గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడంట. అందుకే పరాగ్కే తొలి ప్రాధన్యతను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. వికెట్ కాస్త స్పిన్కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు పరాగ్ను కెప్టెన్ సూర్యకుమార్ తీసుకువచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లో కీలకమైన వికెట్ను భారత్కు అందించాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్రౌండర్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతీ మార్క్ అంటే పోస్ట్లు పెడుతున్నారు. Riyan Parag can Bowl Off Spin + Leg Spin just like Great Sachin Tendulkar used to Bowl 👏🏻That's a Great News for Team India 🇮🇳 #INDvSL #RiyanParagpic.twitter.com/P0VjcDKEkf— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024 -
మెరిసిన సూర్య.. అదరగొట్టిన బౌలర్లు! తొలి టీ20 భారత్దే (ఫోటోలు)
-
దటీజ్ సూర్యకుమార్.. విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు సమం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. పల్లెకెల్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన సూర్య.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 125 టీ20లు ఆడిన కోహ్లి 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా.. సూర్య కూడా సరిగ్గా 16 సార్లు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అయితే సూర్య ఈ ఘనతను కేవలం 69 మ్యాచ్లల్లోఅందుకోవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పల్లెకెలె వేదికగా ఆదివారం జరగనుంది. -
మేము నిజంగా అదృష్టవంతులం.. అలా జరిగింటేనా: సూర్యకుమార్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత బ్యాటర్లపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."కెప్టెన్గా తొలి మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే మా దూకుడైన స్టైల్లో బ్యాటింగ్ చేశాము. ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారు కూడా ఛేజింగ్లో అద్భుతంగా ఆడారు. మేము ఇదే పిచ్పై దాదాపు మూడు రోజుల ప్రాక్టీస్ చేశాము. ఇక్కడ వికెట్ ఇలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా రాత్రి పూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్కు ఈజీగా ఉంటుంది. కానీ ఆదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసొచ్చింది.వరల్డ్కప్లో కనబరిచిన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ను కొనసాగించాలా లేదా అన్నది జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి జట్టు అవసరం తగ్గటు ఏ నిర్ణమైనా తీసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. -
కెప్టెన్గా అదుర్స్.. తొలి మ్యాచ్లోనే సూర్య ఊచకోత
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటాడు. టీమిండియా ఫుల్టైమ్ కెప్టెన్గా మొదటి మ్యాచ్లోనే సూర్యకుమార్ తన విశ్వరూపాన్ని చూపించాడు. శుబ్మన్ గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ఈ ఇండియన్ మిస్టర్ 360 ఊచకోత కోశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను సూర్య అలరించాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్.. 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (58 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు. Captain's knock by Surya Dada 🌞SKY leading from the front with a quickfire 50 🤩Watch #SLvIND LIVE NOW on #SonyLIV 🍿 #MaamlaGambhirHai pic.twitter.com/BsUmTkm5oH— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
మరోసారి నో ఛాన్స్.. పాపం శాంసన్! వరల్డ్ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్
సంజూ శాంసన్.. ఎప్పుడు జట్టులో ఉంటాడో? ఎప్పుడు డగౌట్లో కూర్చుంటాడో ఎవరికి తెలియదు. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికి శాంసన్ను మాత్రం దురుదృష్టం వెంటాడుతూనే ఉంది. జింబాబ్వే సిరీస్లో సత్తాచాటి శ్రీలంకకు పయనమైన సంజూకు మరోసారి నిరాశే ఎదురైంది. లంకతో తొలి టీ20కు భారత తుది జట్టులో శాంసన్కు చోటు దక్కలేదు.అతడి స్ధానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు జట్టు మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. కనీసం టాప్ ఆర్డర్ బ్యాటర్గానూ సంజూను పరిగణలోకి తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్లో విఫలమైన పరాగ్కు ఈ మ్యాచ్కు అవకాశమిచ్చి.. సంజూను పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. శాంసన్ వరల్డ్లోనే మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ జట్టులో సంజూతో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు సైతం చోటు దక్కలేదు.శ్రీలంకతో తొలి టీ20కు భారత తుది జట్టు ఇదే..శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
India vs sri lanka 1st t20: తొలి టీ20లో భారత్ ఘనవిజయం..
తొలి టీ20లో భారత్ ఘనవిజయం..పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.కమ్బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో కుశాల్ పెరీరా(20) ఔట్ కాగా.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో అసలంక ఔటయ్యాడు. లంక విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 158/4శ్రీలంక రెండో వికెట్ డౌన్..140 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులతో దూకుడుగా ఆడుతున్న నిస్సాంక.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14.1 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 140/113 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(71), కుశాల్ పెరీరా(12) పరుగులతో ఉన్నారు. లంక విజయానికి 42 బంతుల్లో 83 పరుగులు కావాలి.11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(49), కుశాల్ పెరీరా(10) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..84 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. అర్ష్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 55/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(31), కుశాల్ మెండిస్(23) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 25/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(18), కుశాల్ మెండిస్(5) పరుగులతో ఉన్నారు.శ్రీలంక ముందు భారీ టార్గెట్పల్లెకెలె వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.నాలుగో వికెట్ డౌన్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. అతడితో పాటు రిషబ్ పంత్(41) కూడా క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 192/4సూర్య ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన సూర్య.. పతిరానా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 153/3సూర్య హాప్ సెంచరీ..కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో సూర్యకుమార్ హాప్ సెంచరీతో చెలరేగాడు. 54 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(54), రిషబ్ పంత్(16) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్ 111/210 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(28), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన జైశ్వాల్.. వనిందు హసరంగా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ శుబ్మన్ గిల్.. మధుశంక బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో యశస్వీ జైశ్వాల్ 40 పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న భారత్.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్(9), యశస్వీ జైశ్వాల్(27) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.పల్లెకలె వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్లకు చోటు దక్కలేదు. అయితే జింబాబ్వే సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన రియాన్ పరాగ్కు మాత్రం భారత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లభించింది.ఈ మ్యాచ్లో భారత్ కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ఇక ఈ సిరీస్లో ఇరు జట్లకు కొత్త సారథిలే కావడం విశేషం. భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తుండగా.. చరిత్ అసలంక లంక కెప్టెన్గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంకభారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
రింకూ కాదు!.. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతడే: సూర్య
శ్రీలంకతో సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్ను నంబర్ వన్గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్ కెప్టెన్ హోదాలో తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జట్టులో అతడే కీలకంఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యువ క్రికెటర్పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్ ఫ్యాక్టర్) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్ మరెవరో కాదు అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్. దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్లో మూడు మ్యాచ్లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడే ఎందుకంటూ విమర్శలుఅంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్ను సెలక్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్రౌండర్ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా మారిపోయాడుఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్ అనేది కామన్. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్ పరాగ్ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్ ఫ్యాక్టర్ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా రియాన్ పరాగ్ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు! -
మరి కొన్ని గంట్లలో భారత్తో మ్యాచ్.. శ్రీలంకకు బిగ్ షాక్
భారత్-శ్రీలంక టీ20 సిరీస్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం(జూలై 27)న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ బినుర ఫెర్నాండో అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమయ్యాడు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఫెర్నాండో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. . అతడి స్ధానంలో ఆల్రౌండర్ రమేష్ మెండిస్ను స్టాండ్బై ప్లేయర్గా శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. ఇప్పటికే భారత్తో టీ20 సిరీస్కు స్టార్ ఫాస్ట్ బౌలర్లు నువాన్ తుషారా, చమీరా గాయాల కారణంగా దూరమయ్యారు. ఇప్పుడు ఫెర్నాండో కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలికాగా ఫెర్నాండో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమీయర్ లీగ్లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక ఈ సిరీస్లో శ్రీలంక కెప్టెన్గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. వనిందు హసరంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అసలంకకు జట్టు పగ్గాలను లంక క్రికెట్ అప్పగించింది. మరోవైపు భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ను బీసీసీఐ నియమించింది. -
ఐపీఎల్ ఫ్రాంఛైజీకి గుడ్బై.. టీమిండియా బౌలింగ్ కోచ్గా!
టీమిండియా బౌలింగ్ కొత్త కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. నూతన హెడ్కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో చేరేందుకు మోర్కెల్ మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రొటిస్ పేస్ దళంలో కీలక బౌలర్గా సేవలు అందించిన మోర్నీ మోర్కెల్.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్తో బంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా గౌతం గంభీర్ వ్యవహరించిన సమయంలో ఆ జట్టు కీలక పేసర్లలో మోర్కెల్ ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్లో కలిసి పనిచేశారు. లక్నో మెంటార్గా గంభీర్ వ్యవహరించగా.. బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఉన్నాడు.అనంతరం గంభీర్ కేకేఆర్ మెంటార్గా మారగా.. మోర్కెల్ మాత్రం ఐపీఎల్-2024లోనూ లక్నోతోనే కొనసాగాడు. తాజాగా ఫ్రాంఛైజీతో బంధం తెంచుకునేందుకు మోర్నీ మోర్కెల్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యే క్రమంలోనే 39 ఏళ్ల మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్గా పనిచేయాలంటే.. ఇతర బాధ్యత(క్రికెట్కు సంబంధించిన)ల నుంచి సదరు వ్యక్తులు వైదొలగాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గంభీర్ కేకేఆర్ను వీడగా.. ఇప్పుడు మోర్నీ మోర్కెల్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్సైడ్స్పోర్ట్ వెల్లడించింది. టీమిండియా శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నె మోర్కెల్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా మోర్కెల్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇరు జట్ల మధ్య తొలుత మూడు టీ20లు.. తర్వాత మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం ఆరంభం కానుంది. ఇక ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్ తాత్కాలిక కోచ్ సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. కేకేఆర్లో గౌతీ సహచరులు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనుండగా.. ఫీల్డింగ్ కోచ్గా టి.దిలీప్ రీఎంట్రీ ఇచ్చాడు. -
కోహ్లి కాదు!.. నాకిష్టమైన కెప్టెన్ అతడే: సూర్య కుమార్
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్షకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనుంది.తొలి టీ20కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశం పాల్గోన్నాడు. ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ తనకు ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు. కాగా రోహిత్ పొట్టి ఫార్మాట్ విడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టు పగ్గాలు సూర్య చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది."2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను. అతడితో నా జర్నీ దాదాపుగా పదేళ్లు పూర్తయింది. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో రోహిత్ను చూసే నేర్చుకున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. రోహిత్లాంటి కెప్టెన్ను నేను ఇప్పటివరకు చూడలేదు. అతడి కెప్టెన్సీ నాలాంటి ఎంతో మందికి ఆదర్శం. ప్రస్తుత జట్టులో పెద్దగా ఏ మార్పు లేదు. కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది. రోహిత్ అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటకి అతడి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్గా మారిన హార్దిక్ పాండ్యా!
భారత్-శ్రీలంక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురూతున్నాయి. తొలి టీ20 కోసం తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్లో చెమటోడ్చారు. అయితే నెట్ ప్రాక్టీస్లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్గా అవతరెమెత్తాడు. సాధరణంగా మీడియం పేసర్ బౌలర్ అయిన పాండ్యా.. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది భారత జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్ట్లు పెడుతున్నారు.కాగా పాండ్యా కేవలం టీ20 సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. లంకతో వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండ్యాను కాదని భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక పర్యటలో భాగంగా భారత్ లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.Hardik pandya bowling practice in net session at Colombo!!!!!New lege spinner in team india 🥰♥️#SLvIND #Cricket #IndianCricketTeam#hardikpandya pic.twitter.com/D2d21J8prh— Ashok BANA (@AshokBana_11) July 25, 2024 -
'గౌతీతో నా బంధం చాలా స్పెషల్.. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్'
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, నూతన హెడ్ కోచ్గా గౌతం గంభీర్ తమ ప్రయణాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. జూలై 27న పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో వీరిద్దరి ప్రస్ధానం మొదలు కానుంది.రోహిత్ శర్మ స్ధానంలో భారత టీ20 కెప్టెన్గా సూర్య బాధ్యతలు చేపట్టగా.. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్కోచ్ గంభీర్ను ఉద్దేశించి సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సూర్య తెలిపాడు."గౌతం గంభీర్తో నా బంధం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా ఐపీఎల్ అరంగేట్రంలో కేకేఆర్ తరపున గంభీర్ కెప్టెన్సీలోనే ఆడాను. కేకేఆర్ ఫ్రాంచైజీలో నాకు ఆడే అవకాశం రావడం నిజంగా చాలా గొప్పవిషయం. అక్కడ నుంచే నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు లభించింది. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. నా మైండ్సెట్, పనితీరు ఎలా ఉంటుందో గంభీర్కు బాగా తెలుసు. అతడు కోచ్గా ఎలా పనిచేస్తాడో నాకు కూడా తెలుసు.గంభీర్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మా మా ఇద్దరి కాంబినేషన్లో అన్ని మంచి ఫలితాలే రావాలని ఆశిస్తున్నట్లు" బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. -
శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత జట్టుతో చేరిన గంభీర్ ఫ్రెండ్
శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు భారత జట్టు అన్ని విధాల సన్నద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చేట్ జట్టుతో చేరాడు.టీ20 వరల్డ్కప్-2024తో కోచింగ్ స్టాప్ రాహుల్ ద్రవిడ్ అండ్ కో పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఒక్క ఫీల్డింగ్ కోచ్ టి. దిలిప్ మినహా మిగితా ఎవరూ కాంట్రాక్ట్లను బీసీసీఐ పొడగించలేదు. ఈక్రమంలో భారత జట్టు హెడ్కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికయ్యాడు. అయితే సపోర్ట్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్కు బీసీసీఐ పూర్తి స్వేఛ్చ ఇచ్చింది. దీంతో ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ డోస్చేట్, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్లను అసిస్టెంట్ కోచ్లగా గంభీర్ సెలక్ట్ చేశాడు.కాగా ఈ త్రయం ఆధ్వర్యంలోనే ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ టీ20 సిరీస్తో భారత హెడ్కోచ్గా గౌతం గంభీర్, కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
లంకతో తొలి టీ20.. భారత తుది జట్టులో ఎవరెవరు..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 పల్లెకెలె వేదికగా రేపు (జులై 27) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా సర్వ శక్తులు ఒడ్డనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఫుల్ మెంబర్ జట్టును ఎంపిక చేశారు. టీ20 వరల్డ్కప్ విజయానంతరం భారత్ ఫుల్ మెంబర్ జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఈ సిరీస్కు ముందు భారత్ జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడినా అందులో సీనియర్లు ఆడలేదు. సీనియర్లు రాకతో భారత తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు పెద్ద సవాల్గా మారింది. తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్కు ఓపెనర్లుగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ సిరీస్కు వారిద్దరే స్పెషలిస్ట్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. వన్డౌన్లో ఎవరిని పంపుతారనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ భారత్ సంజూ శాంసన్, రిషబ్ పంత్ ఇద్దరూ బరిలోకి దించితే సంజూ వన్డౌన్లో రావచ్చు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన మార్కు చూపించుకునే క్రమంలో అక్షర్ పటేల్ను వన్డౌన్లో పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నాలుగో స్థానంలో నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరో స్థానంలో రింకూ సింగ్, ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి భిష్ణోయ్, పేసర్లుగా అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తే.. శివమ్ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపిక కావచ్చు.శ్రీలంకతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్/రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ -
Ind Vs SL 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 వరల్డ్కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమైంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడేందుకు లంక పర్యటనకు వెళ్లింది. భారత టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. వన్డేలకు రోహిత్ శర్మ సారథిగా కొనసాగనున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. మరి ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, జట్లు తదితర వివరాలు గమనిద్దాం.టీ20 సిరీస్- మూడు మ్యాచ్లు🏏తొలి టీ20- జూలై 27, శనివారం🏏రెండో టీ20- జూలై 28- ఆదివారం🏏మూడో టీ20- జూలై 30- మంగళవారం👉ఈ మూడు మ్యాచ్లకు వేదిక: పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం, పల్లెకెలె👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటల నుంచి టీ20 మ్యాచ్లు ఆరంభంశ్రీలంకతో టీ20 సిరీస్కు భారత జట్టు👉సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.ఆతిథ్య శ్రీలంక జట్టు👉చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, అసిత ఫెర్నాండో, బినురా ఫెర్నాండో.వన్డే సిరీస్- మూడు మ్యాచ్లు🏏తొలి వన్డే- ఆగష్టు 2- శుక్రవారం🏏రెండో వన్డే- ఆగష్టు 4- ఆదివారం🏏మూడో వన్డే- ఆగష్టు 7- బుధవారం👉శ్రీలంక- టీమిండియా మధ్య వన్డే మ్యాచ్ల వేదిక: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు మొదలు.శ్రీలంకతో వన్డే సిరీస్కు భారత జట్టు👉రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్( వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. కాగా భారత్తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించాల్సి ఉంది.లైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో శ్రీలంక- టీమిండియా మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.👉డిజిటల్: సోనీలివ్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్. -
Ind vs SL: సిరాజ్కు గాయం?.. యువ పేసర్కు ఛాన్స్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు శ్రీలంకతో మొదటి టీ20కి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే యువ పేసర్లతోనే భారత జట్టు బరిలో దిగాల్సి వస్తుంది.మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడే నిమిత్తం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య జూలై 27న తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా చెమడోస్తున్నాయి.ఈ క్రమంలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి కుడికాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. నొప్పితో సిరాజ్ విలవిల్లాడగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో తొలి టీ20కి అతడు అందుబాటులో ఉండే అంశంపై సందిగ్దం నెలకొంది. కాగా శ్రీలంక టూర్కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండగా.. టీమిండియా పేస్ దళాన్ని ముందుకు నడిపించే బాధ్యత సిరాజ్పై పడింది. అతడితో పాటు అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ ఫాస్ట్బౌలింగ్ విభాగంలో టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.ఒకవేళ సిరాజ్ గనుక గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమైతే అర్ష్దీప్ సింగ్తో పాటు ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ గాయం మానక టీ20, వన్డే సిరీస్ల నుంచి సిరాజ్ తప్పుకొంటే ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి రావచ్చు. లేదంటే.. వన్డే జట్టులో ఉన్న హర్షిత్ రాణాను సిరాజ్ స్థానంలో ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత శుబ్మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది యువ భారత్.అనంతరం పూర్తిస్థాయి జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంంది. హెడ్కోచ్గా గౌతం గంభీర్, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. మరోవైపు.. శ్రీలంక కొత్త కెప్టెన్గా చరిత్ అసలంక నియమితుడు కాగా.. సనత్ జయసూర్య ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. -
'అతడెప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు'.. ద్రవిడ్పై ప్రశంసల వర్షం
టీ20 వరల్డ్కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ను భారత్కు అందించి హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.ద్రవిడ్ కెప్టెన్గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్కప్తో ముగిసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు."రాహుల్ ద్రవిడ్తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్కు వరల్డ్కప్ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు. -
చేసింది 25 పరుగులే.. అయినా టీమిండియాలో ఛాన్స్! అస్సలు కారణమిదే?
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు టీమిండియా సిద్దమైంది. లంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. జూలై 27 జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్గా గౌతం గంభీర్ల ప్రస్ధానం మొదలు కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భారత జట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.జింబాబ్వే టీ20 సిరీస్తో అరంగేట్రం చేసిన పరాగ్.. తన మార్క్ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్బాల్ సిరీస్లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం."పరాగ్ చాలా టాలెంటడ్. అతడికి అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కంటే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
Ind vs SL: భారత్ చేరుకున్న రోహిత్ శర్మ.. వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్లో అడుగుపెట్టాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక కెప్టెన్గా ఐసీసీ టైటిల్ గెలవాలన్న తన చిరకాల కోరిక తీరిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ క్రమంలో జట్టుతో కలిసి ట్రోఫీతో భారత్కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ విజయోత్సవాల్లో పాల్గొన్నాడు. ముంబైలో సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం సెలవు తీసుకున్న హిట్మ్యాన్.. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు. అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా అతడు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.అయితే, కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ చొరవతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు శ్రీలంక, ఇంగ్లండ్లతో మాత్రమే వన్డే సిరీస్లు ఉన్న నేపథ్యంలో బరిలోకి దిగేందుకు రోహిత్ మొగ్గుచూపినట్లు తెలిసింది.అందుకు అనుగుణంగానే శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడని ప్రకటించింది. ఇక జూలై 27 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుండగా.. ఇప్పటికే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా వన్డే జట్టులోని పలువురు ఆటగాళ్లు లంకకు చేరుకున్నారు. గంభీర్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.అయితే, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి మాత్రం ఇంకా శ్రీలంకలో అడుగుపెట్టలేదు. తాజాగా రోహిత్ తిరిగి రాగా.. కోహ్లి సైతం లండన్ నుంచి త్వరలోనే భారత్కు రానున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి శ్రీలంకకు వెళ్లి అక్కడి భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.Cutiessss Back 💕🥹🤌✨..!!#RohitSharma𓃵 #RitikaSajdeh pic.twitter.com/IHLJWh6daN— Neha_love._.45💌 (@NehaDubey187150) July 25, 2024 -
టీమిండియాతో టీ20 సిరీస్.. శ్రీలంకకు మరో ఊహించని షాక్
స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ నువాన్ తుషార గాయం కారణంగా భారత్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుషార చేతి వేలికి గాయమైంది. అనంతరం స్కానింగ్ తరలించగా చేతి వేలు విరిగినట్లు నిర్ధారణైంది.ఈ క్రమంలోనే సిరీస్కు తుషార దూరమయ్యాడు. ఈ విషయాన్ని లంక టీమ్ మేనేజర్ మహింద హలంగోడ పైతం ధ్రువీకరించాడు. తుషార ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు హలంగోడ తెలిపాడు. ఈ క్రమంలో తుషార స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా ఇప్పటికే స్టార్ పేసర్ దష్మంత చమీర సైతం భారత్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు తుషార కూడా గాయం కారణంగా తప్పుకోవడంతో లంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఈ సిరీస్ జూలై 27న పల్లెకలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు ఇప్పటికే లంకగడ్డపై అడుగుపెట్టింది.భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరన, మధుశంక, బినుర ఫెర్నాండో -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టం: సనత్ జయసూర్య
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై శ్రీలంక క్రికెట్ జట్టు కొత్త కోచ్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఈ ఇద్దరూ తప్పక ఉంటారని కొనియాడాడు. జట్టులో వీరులేని లోటు ఎవరూ పూడ్చలేరని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.గుడ్బై చెప్పేశారుఫలితంగా కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరగా.. వన్డే వరల్డ్కప్-2011 జట్టులో భాగమైన కోహ్లి మరోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లి ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ‘విరాహిత్’ ద్వయం బాటలోనే నడిచాడు. టీ20 వరల్డ్కప్-2024 సందర్భంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో భాగంగా టీమిండియా తరఫున తన చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని పేర్కొన్నాడు.ఆరోజే ఆరంభంఈ క్రమంలో రోహిత్, కోహ్లి, జడ్డూ లేకుండా టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా హెడ్ కోచ్గా గౌతం గంభీర్, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలుకానుంది. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య జూలై 27న ఈ సిరీస్ ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టంఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య మీడియాతో మాట్లాడాడు. రోహిత్, కోహ్లి, జడ్డూ టీమిండియా జట్టుతో లేకపోవడం తమకు అనుకూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటారు.వాళ్ల ప్రతిభాపాటవాలు, క్రికెట్ ఆడే తీరు అమోఘం. ఈ ఇద్దరితో పాటు జడేజా కూడా జట్టులో కీలక సభ్యుడే. అయితే, ప్రస్తుతం ఈ ముగ్గురు భారత టీ20 జట్టులో లేరు. వారి గైర్హాజరీ తప్పకుండా మాకు లాభిస్తుంది’’ అని సనత్ జయసూర్య పేర్కొన్నాడు.అప్పటిదాకా కోచ్గాకాగా శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్గా మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను నియమిస్తున్నట్లు లంక బోర్డు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడి పదవీకాలం ముగుస్తుందని వెల్లడించింది. ఇక కోచ్గా సనత్ జయసూర్యకు ఇదే తొలి సిరీస్ కాగా.. టీమిండియా శిక్షకుడిగా గౌతం గంభీర్ రూపంలో అతడికి గట్టి సవాల్ ఎదురుకానుంది.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత మూడు టీ20.. అనంతరం మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టుతో పాటు వన్డే జట్టులోనూ ఉన్న ఆటగాళ్లు లంకకు చేరుకోగా.. రోహిత్, కోహ్లి కొన్నాళ్ల తర్వాత వారితో కలవనున్నారు.చదవండి: టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
Ind vs SL: టీ20 సిరీస్ నుంచి లంక పేసర్ అవుట్!
టీమిండియాతో సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్తో టీ20 సిరీస్కు అతడు దూరం కానున్నాడు. శ్రీలంక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సిరీస్ మొత్తానికీమరోవైపు.. మంగళవారం తమ జట్టును ప్రకటించిన శ్రీలంక క్రికెట్కు చమీర గాయం రూపంలో షాక్ తగిలింది. చరిత్ అసలంక కెప్టెన్సీలోని జట్టులో భాగమైన దుష్మంత చమీర టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే, అనుభవజ్ఞుడైన ఈ రైటార్మ్ పేసర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది శ్రీలంక బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు.గాయాల బెడదగత రెండేళ్లుగా దుష్మంత చమీర తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా చివరగా శ్రీలంక జట్టుకు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి స్థానం ఇచ్చినప్పటికీ.. తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, లంక ప్రీమియర్ లీగ్తో రీఎంట్రీ ఇచ్చిన చమీర క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఐదు మ్యాచ్లు ఆడాడు. తన చివరి మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. ఇక 32 ఏళ్ల దుష్మంత చమీర ఇప్పటి వరకు 55 అంతర్జాతీయ టీ20లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు.టీమిండియాతో టీ20 సిరీస్కు శ్రీలంక ప్రకటించిన జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, బినురా ఫెర్నాండో. -
ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. అతడిపై గంభీర్ ఫోకస్!
శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గ నిర్దేశనంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.కోచ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హార్దిక్ పాండ్యా, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తదితర ఆటగాళ్లంతా సోమవారమే కొలంబోకు చేరుకున్నారు. వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తదితరులు కాస్త ఆలస్యంగా లంకకు వెళ్లనున్నారు.కాగా శనివారం(జూలై 27) టీ20 మ్యాచ్తో శ్రీలంక- టీమిండియా సిరీస్కు తెరలేవనుంది. ఇందుకోసం సూర్య సేన మంగళవారం నుంచే నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కాండీలో జరుగుతున్న ఈ సెషన్ను గౌతం గంభీర్ దగ్గరుండి మరీ వీక్షించాడు. వ్యక్తిగతంగా ఒక్కో ఆటగాడి దగ్గరకు వెళ్లి మరీ సూచనలు, సలహాలు ఇచ్చాడు. సంజూ శాంసన్పై ప్రత్యేక దృష్టిపెట్టాడు.𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc— BCCI (@BCCI) July 23, 2024 ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోచ్ అవతారంలో గౌతీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గంభీర్ హయాంలో భారత క్రికెట్ మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని మురిసిపోతున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా శిక్షకుడిగా నియమించింది బీసీసీఐ. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా ఈ ఏడాది ఆ జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతీకి భారత జట్టు బాధ్యతలు అప్పజెప్పింది. Now watching: #TeamIndia's new T20I captain 🇮🇳💙Go well, Surya Dada 👏#SonySportsNetwork #SLvIND | @surya_14kumar pic.twitter.com/aXSic8Z4PS— Sony Sports Network (@SonySportsNetwk) July 23, 2024 -
హార్దిక్, సూర్య కాదు.. ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ భారత కెప్టెన్ అతడే
తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్తో అందరని అకట్టుకున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ను అతడి నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా గిల్ను నియమించింది.స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి టీమిండియా వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్కు బీసీసీఐ అప్పగించింది. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వం వహిస్తాడని రాథోర్ జోస్యం చెప్పాడు."గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్, జింబాబ్వే సిరీస్లో అతడు కెప్టెన్గా విజయవంతమయ్యాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో గిల్ జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తొలిసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించినప్పటకి అతడిలో కొంచెం కూడా ఒత్తడి కన్పించలేదు. తన వ్యూహాలతో ప్రత్యర్దిని కట్టడి చేశాడు. ఇవన్నీ ఒక కెప్టెన్కి ఉండాల్సిన లక్షణాలే. ఇప్పుడు బీసీసీఐ అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్గా కూడా గిల్ మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. గిల్కు వైస్కెప్టెన్సీ బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారంటే అతడు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లే. ఇప్పుడు గిల్కు సీనియర్ జట్టు వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం రావడంతో తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాను. అతి చిన్న వయస్సులోనే గిల్ వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం గొప్ప విషయం. అతడు ఏదో ఒక రోజు కచ్చితంగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోర్ పేర్కొన్నాడు. -
నేనే గనుక హార్దిక్ స్థానంలో ఉంటే?.. ఈపాటికి..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను భారత టీ20 జట్టు కెప్టెన్గా ప్రకటించారు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు జరుగనున్నాయి. -
భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్ ఎంపిక
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జులై 23) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ 2024లో ఘోర ప్రదర్శన (తొలి రౌండ్లోనే నిష్క్రమణ) అనంతరం వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.సీనియర్లు ధనంజయ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. మరో ఇద్దరు సీనియర్లు దినేశ్ చండీమల్, కుశాల్ జనిత్ పెరీరా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముగిసిన లంక ప్రీమియర్ లీగ్లో సత్తా చాటిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. సదీర సమరవిక్రమ, దిల్షన్ మధుషంకలను పక్కకు పెట్టారు సెలెక్టర్లు.కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్ ఈనెల 27 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు ఇదే మొదటి పరీక్ష. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో -
శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు టీమిండియా సిద్దమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. జూలై 26న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టు సోమవారం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టింది. తొలి బ్యాచ్గా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు శ్రీలంకకు చేరుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా జట్టు వెంట ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.వన్డే జట్టులో భాగమైన ఆటగాళ్లు వారం రోజుల తర్వాత లంకకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వేకేషన్లో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నేరుగా శ్రీలంకకు చేరుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక పర్యటనతో భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుండగా.. హెడ్ కోచ్గా గంభీర్ ప్రస్ధానం మొదలు కానుంది. వన్డేల్లో రోహిత్ శర్మనే భారత జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ పర్యటనకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Breaking 🚨@GautamGambhir leads the way as Team India reaches the team hotel in Sri Lanka. @rohitjuglan reports for RevSportz. @tribes_social_ @BCCI #INDvsSL #INDvSL #GautamGambhir pic.twitter.com/kgf12oZVQm— RevSportz Global (@RevSportzGlobal) July 22, 2024 -
హార్దిక్ను ఎందుకలా పిలుస్తారో?: బరోడా మాజీ కోచ్ విమర్శలు
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ విమర్శలు గుప్పించాడు. అతడిని బరోడా ఆటగాడని సంబోంధించడం సరికాదన్నాడు.హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని.. అతడికి ఐపీఎల్ వంటి లీగ్లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. అయినా తన గురించి ప్రస్తావన వచ్చినపుడు బరోడా ఆల్రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్మెన్.కాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్.. 2018 తర్వాత మళ్లీ అక్కడ కనిపించలేదు.అయితే, ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.అంతేకాదు.. శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించినపుడు కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో హార్దిక్ పాండ్యాకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీకి దూరమైన హార్దిక్.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో.. బరోడా జట్టు కోచ్గా పనిచేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ ఓ పాకిస్తానీ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘చాలా మంది దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడరు. నేను రెండేళ్ల పాటు బరోడా జట్టుతో ఉన్న సమయంలో పాండ్యా ఒక్కసారి కూడా ఆడలేదు.అయినప్పటికీ తనను బరోడా ఆల్రౌండర్ అని పిలుచుకోవడం సరికాదనిస్తుంది. చాలా ఏళ్ల పాటు అతడు ఆ జట్టుకు దూరంగా ఉన్నా ఇంకా అక్కడి ఆటగాడిగా గుర్తించడం ఏమిటో?!ఇటీవల బీసీసీఐ తెచ్చిన నిబంధనలు నాకు నచ్చాయి. రంజీ ట్రోఫీలో అందరూ ఆడాలని.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. 4-డే క్రికెట్ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కోచ్గా వ్యవహరించి విజయవంతమైన శిక్షకుడిగా పేరొందాడు వాట్మోర్. 2021-22, 2022- 23 సీజన్లలో బరోడా కోచ్గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్కు హార్దిక్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డేల్లో మొండిచేయి చూపారు. -
పంత్కు నో ఛాన్స్!.. టీమిండియా భవిష్య కెప్టెన్ అతడే
టీమిండియా భవిష్య కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చాడు. యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను పూర్తిస్థాయి కెప్టెన్గా చూసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.అయితే, ఏ విషయంలోనూ గ్యారెంటీ ఇవ్వలేమని.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం గిల్కే తమ ఓటు అని అగార్కర్ పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు.కెప్టెన్గా అలరించిన గిల్కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టు స్వదేశానికి తిరిగి రాగా.. శుబ్మన్ గిల్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.తొలిసారిగా కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన గిల్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాను 4-1తో విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్గా గిల్ పేరును ప్రకటించింది బీసీసీఐ.సీనియర్లను కాదనివన్డేల్లో రోహిత్ శర్మ సారథిగా కొనసాగనుండగా.. టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. వీళ్లిద్దరికి డిప్యూటీగా శుబ్మన్ గిల్కు అవకాశం ఇచ్చింది.అయితే, కెప్టెన్సీ రేసులో ఉన్న సీనియర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలను కాదని బీసీసీఐ గిల్ను వైస్ కెప్టెన్ చేయడం విశేషం.ఈ విషయంపై సోమవారం నాటి మీడియా సమావేశంలో ప్రస్తావనకు రాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘రిషభ్ చాలా కాలంగా ఆటకు దూరమయ్యాడు. వికెట్ కీపర్గా అతడి సేవలు మాకు చాలా అవసరం.అందుకే పంత్కు నో ఛాన్స్దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన ఆటగాడిపై భారం మోపాలని మేము భావించడం లేదు. ఇక కేఎల్ రాహుల్ చాలా కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు.ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. టీ20 కెప్టెన్ విషయంలో గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.రోహిత్ లేనపుడు హార్దిక్ పాండ్యా గాయపడితే పరిస్థితి గందరగోళంగా ఉండేది. అయితే, అదృష్టవశాత్తూ వరల్డ్కప్ నాటికి రోహిత్ తిరిగి రావడం మంచిదైంది. కానీ మరోసారి రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేము.రిస్క్ చేయలేంశుబ్మన్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఏడాది కాలంగా అద్బుతంగా ఆడుతున్నాడు. సూర్య, రోహిత్ ఉన్నపుడే అతడిని నాయకుడిగా నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా గిల్కు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.అకస్మాత్తుగా కొత్త కెప్టెన్ను ట్రై చేయాలంటే రిస్కే. అందుకే ఇప్పటి నుంచే అతడిని భవిష్య కెప్టెన్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కెప్టెన్గా తను అనుభవం గడిస్తే మాకు తలనొప్పులు తగ్గుతాయి.ఇప్పుడే కాదు అయితే, ఇందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏదీ కచ్చితంగా చెప్పలేము. రెండేళ్లపాటు అతడిని గమనిస్తూనే ఉంటాం’’ అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టనుండగా.. హెడ్ కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో గౌతీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫన్స్లో అగార్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు: అగార్కర్ -
జడేజాను ఎంపిక చేయకపోవడంపై వివరణ ఇచ్చిన అగార్కర్
శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లకు సంబంధించి అభిమానుల్లో నెలకొని ఉన్న పలు అనుమానాలను సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇవాళ (జులై 22) నివృత్తి చేశాడు. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అగార్కర్.. లంక పర్యటన కోసం కొందరు ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ఫిట్నెస్ కారణంగా హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ అప్పగించలేదని చెప్పిన అగార్కర్.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని వివరణ ఇచ్చాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జడ్డూకు విశ్రాంతి కల్పించినట్లు తెలిపాడు. ఒకవేళ అక్షర్తో పాటు జడేజాను కూడా ఎంపిక చేసినా.. తుది జట్టులో ఒక్కరికే అవకాశం దక్కుతుందని తెలిపాడు. టీమిండియా సమీప భవిష్యత్తులో చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండటం జడ్డూకు విశ్రాంతినివ్వడానికి మరో కారణమని అన్నాడు. వన్డేల్లో జడ్డూ ఇప్పటికీ కీలక ఆటగాడేనని వివరణ ఇచ్చాడు. అగార్కర్-గంభీర్ ప్రెస్ మీట్లో హార్దిక్, జడ్డూ అంశాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.టీ20 వరల్డ్కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలకు 2027 వన్డే వరల్డ్కప్ ఆడగలే సత్తా ఉందని గంభీర్, అగార్కర్ అభిప్రాయపడ్డారు.కోహ్లితో తన మంచి సత్సంబంధాలు ఉన్నాయని గంభీర్ వివరణ ఇచ్చాడు.శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్ల ప్లేయర్ అని గంభీర్-అగార్కర్ ద్వయం అభిప్రాయపడింది.షమీ స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే సిరీస్తో రీ ఎంట్రీ ఇస్తాడని గంభీర్-అగార్కర్ జోడీ ఆశాభావం వ్యక్తిం చేసింది.రుతురాజ్, అభిషేక్ శర్మలను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. బాగా ఆడినా కొన్ని సార్లు అందరికీ అవకాశం ఇవ్వలేమని అగార్కర్ తెలిపాడు.హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఇప్పటికీ అతను కీలక ఆటగాడని గంభీర్ అన్నాడు.కాగా, గంభీర్-అగార్కర్ ప్రెస్ మీట్ అనంతరం భారత బృందం శ్రీలంక పర్యటనకు బయల్దేరింది. శ్రీలంకతో టీ20 సిరీస్ జులై 27న మొదలవుతుంది. 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. -
ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!.. ఆ విషయంలో నో క్లారిటీ
భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు పయనమైంది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్, రింకూ సింగ్ తదితరులు సోమవారం ముంబై నుంచి విమానంలో బయల్దేరారు.ఇక లంకకు ప్రయాణమయ్యే ముందు టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోచింగ్ సహాయక సిబ్బంది గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.వారికే పెద్దపీటబ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలకు వేర్వేరు కోచ్లు ఉన్నా.. అన్నింటిలోనూ ప్రావీణ్యం చూపగలిగే సిబ్బందికే తాను పెద్దపీట వేస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటేలను అసిస్టెంట్ కోచ్లుగా శ్రీలంకకు వస్తున్నట్లు గంభీర్ అధికారికంగా వెల్లడించాడు.‘‘నేను కోరుకున్నట్లుగానే బీసీసీఐ చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించినందుకు సంతోషంగా ఉంది. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్లు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే క్లారిటీఅయితే, శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాతే సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అభిషేక్ నాయర్, సాయిరాజ్ బహుతులే, దిలీప్ జట్టుతో పాటు శ్రీలంక వస్తున్నారు.డష్కాటే కొలంబోలో మాతో చేరతాడు. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్లే. వీళ్లిద్దరు నా సహాయకులుగా ఉండటం మంచి విషయం. అయితే, వాళ్లు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారో శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే తేలుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2024లో కోల్కతా మెంటార్గా గౌతం గంభీర్ వ్యవహరించగా.. అభిషేక్ నాయర్, డష్కాటే అసిస్టెంట్ కోచ్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదేళ్ల తర్వాత ఆ జట్టు మరోసారి చాంపియన్గా నిలిచింది.ఈ విజయంలో కీలక పాత్ర గంభీర్దేనంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ను నియమించింది బీసీసీఐ. శ్రీలంకతో జూలై 27న మొదలుకానున్న టీ20 సిరీస్తో కోచ్గా గంభీర్ తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ZmBmBqLasH— ANI (@ANI) July 22, 2024 -
అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. హార్దిక్ మెరుగైన నైపుణ్యాలున్న ఆల్రౌండర్ అని.. అయితే, అతడి ఫిట్నెస్ విషయంలో మాత్రం క్లారిటీ లేదన్నాడు.అలాంటి ఆటగాడిని జట్టుకు ఎంపిక చేసేటపుడే కోచ్, సెలక్టర్ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందన్న అగార్కర్.. మరి ఏకంగా కెప్టెన్గా ఎలా నియమించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా జట్టులో అతడు కీలక ఆటగాడని.. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్కాగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకున్న ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్.. భారత్ ఈ ఐసీసీ టోర్నీలో చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. టీ20 వరల్డ్కప్ జట్టుకు వైస్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకం ఖరారు అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది బీసీసీఐ.శ్రీలంక పర్యటన నుంచి సూర్య పగ్గాలు చేపడతాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో హార్దిక్కు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.కొత్త కోచ్ గౌతం గంభీర్తో కలిసి ముంబైలో సోమవారం ప్రెస్మీట్ నిర్వహించిన అగార్కర్.. ‘‘అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండి.. అన్నింటిలోనూ చురుగ్గా ఆడగల కెప్టెన్ కావాలని మేము కోరుకుంటున్నాం.అలాంటి కెప్టెన్ మాత్రమే మాకు కావాలిహార్దిక్ విషయంలో ఈ అంశంపై స్పష్టత లేదు. అతడి విషయంలో ఫిట్నెస్ అతి పెద్ద సవాలు. అదే కోచ్, సెలక్టర్లను ఇబ్బంది పెడుతోంది. తదుపరి టీ20 ప్రపంచకప్ దాకా మాకు సమయం ఉంది.హార్దిక్ విషయంలో ఫిట్నెస్ ఒక్కటే ప్రామాణికం. జట్టుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కెప్టెన్ మాత్రమే మాకు కావాలి. ఇక సూర్య.. కెప్టెన్ కావడానికి గల అన్ని అర్హతలు, నైపుణ్యాలు అతడికి ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్గా రాణించగల సత్తా సూర్యకు ఉందని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అదే విధంగా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అవసరం జట్టుకు ఎంతగానో ఉందని తెలిపాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. -
కోహ్లి, రోహిత్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. ఓ కండిషన్!
టీమిండియా హెడ్ కోచ్ హోదాలో గౌతం గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటకు వెళ్లనున్న నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడాడు.జై షాతో నా రిలేషన్ బాగుందిఈ సందర్భంగా.. ‘‘టీ20 వరల్డ్ చాంపియన్స్, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్ రన్నరప్స్.. అత్యంత విజయవంతమైన జట్టుకు కోచ్గా నేను బాధ్యతలు స్వీకరించబోతున్నాను.ఆటే ముఖ్యంజై షాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. గౌతం గంభీర్ వ్యక్తిగా మెరుగుపడాలన్నది పెద్ద విషయం కాదు. భారత క్రికెట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం’’ అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.కాగా జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య మొదలుకానున్న టీ20 సిరీస్తో గంభీర్ అధికారికంగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ టూర్ తర్వాత తమకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుందని.. 10 టెస్టు మ్యాచ్ల షెడ్యూల్ ఖరారైందని తెలిపాడు.ఆ పది మ్యాచ్లలోనూ తాము రాణించగలమనే నమ్మకం ఉందని గౌతీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లలో కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.కోహ్లి, రోహిత్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలుఇక స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భవిష్యత్తు గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘‘‘వాళ్లిద్దరిలోనూ ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇటీవలి వన్డే, టీ20 ప్రపంచకప్ ఈవెంట్లలో వాళ్లిద్దరు రాణించారు. చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలోనూ వాళ్లిద్దరు కీలకం. మరికొన్నాళ్లు కొనసాగాలా లేదా అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా జట్టు ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. విరాట్, రోహిత్ ఇప్పటికీ వరల్డ్క్లాస్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్లు ఫిట్గా ఉన్నంత కాలం వాళ్ల సేవలను ఉపయోగించుకుంటాం. ఫిట్గా ఉంటేనేఫిట్నెస్ కాపాడుకుంటే గనుక వరల్డ్కప్-2027 వరకు వాళ్లు ఆడగలరు. జట్టుకు వాళ్లు ఏమేరకు ఉపయోగపడరన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టుల్లో వారు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్గా ఉంటేనే ఆ అవకాశం ఉంటుందని గౌతీ కుండబద్దలు కొట్టాడు. చదవండి: ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
టీమిండియా తాత్కాలిక కోచ్గా సాయిరాజ్ బహుతులే
త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియాకు తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. 51 ఏళ్ల బహుతులే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పని చేస్తున్నాడు. లంక పర్యటనకు రెగ్యులర్ బౌలింగ్ కోచ్ లేకపోవడంతో బీసీసీఐ బహుతులేను తాత్కాలిక ప్రతిపదికన ఎంపిక చేసింది. బహుతులే.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కటే, టి దిలీప్లతో కలిసి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత కోచింగ్ శిబిరంలో జాయిన్ అవుతాడు. బహుతులే.. 1997-2003 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన బహుతులే టీమిండియా తరఫున రెండు టెస్ట్లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. కాగా, టీమిండియా.. శ్రీలంక పర్యటన ఈనెల 27 నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గంభీర్ భారత హెడ్ కోచ్గా తన ప్రస్తానాన్ని మొదలుపెడతాడు. గంభీర్ కోచింగ్ టీమ్లో దిలీప్ తప్పించి మిగతా వారంతా కొత్తవారే. భారత రెగ్యులర్ బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి. అయితే మోర్కెల్ వ్యక్తిగత కారణాల చేత లంక టూర్కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాటు చేసింది. మోర్కెల్.. స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ సమయానికి అందుబాటులోకి రావచ్చు.ఇదిలా ఉంటే, లంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు పల్లెకెలె.. వన్డేలకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇదివరకే ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డే టీమ్కు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. -
గంభీర్ ఎంట్రీ.. రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే ఔననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజాను వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక భారత జట్టులో రవీంద్ర జడేజాకు సెలక్టర్లు చోటివ్వలేదు. గత దశాబ్ద కాలంగా భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న జడేజాను సెలక్టర్లు లంక సిరీస్కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానాన్ని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలకర్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు శ్రీలంకతో వన్డే సిరీస్కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20ల్లో భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వన్డేల్లో కూడా జడ్డూ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో జడేజా ఇకపై టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జడ్డూ అద్బుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్మెంట్ పడింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్టుల్లో మాత్రం జడ్డూ కొనసాగుతాడని పేర్కొన్నారు. కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాను పక్కన పెట్టడంలో భారత కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటివరకు 197 వన్డేలాడిన జడ్డూ 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్కు బీసీసీఐ కండిషన్!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అతడికి కాలం కలిసిరావడం లేదు.భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఇద్దరం సమానంగా బాధ్యత వహిస్తామని.. కో పేరెంటింగ్ చేస్తామని వెల్లడించాడు.కానీ సంయుక్త విడాకుల ప్రకటన అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని తన పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై ఎయిర్పోర్టు నుంచి అక్కడికి బయల్దేరుతున్న సమయంలో అగస్త్య ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఏడ్చేసిన అగస్త్య!తండ్రిని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినా.. తల్లి బలవంతం చేయడంతోనే అగస్త్య ఆమెతో వెళ్లినట్లుగా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో హార్దిక్ సైతం తీవ్రమైన బాధతో కుంగిపోతున్నట్లు సమాచారం.వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు.. టీమిండియాలోనూ కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను బీసీసీఐ పక్కనపెట్టింది.చేజారిన కెప్టెన్సీకొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు కెప్టెన్గా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్గా సూర్యను ప్రకటించి హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా పేర్కొంది.అయితే, ఈ టూర్లో భాగంగా వన్డే సిరీస్ కూడా జరుగనుంది. కానీ జట్టులో హార్దిక్కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మూడు ఫార్మాట్లలో ఆడాలికాగా కోచ్గా ప్రయాణం మొదలుపెట్టకముందే.. గంభీర్ తన వైఖరేంటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫిట్గా ఉండే ఆటగాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలని పేర్కొన్నాడు.గాయాల భయంతో ఆటకు దూరంగా ఉంటే తనకు నచ్చదని పేర్కొన్నాడు. హార్దిక్ విషయానికొస్తే.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ తరచూ గాయాల బారిన పడుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే.అందుకే ఇప్పటికే అతడు టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడిన తర్వాత అతడికి మళ్లీ వన్డే ఆడే అవకాశం రాలేదు.దేశవాళీ క్రికెట్ ఆడితేనే రీఎంట్రీఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని గంభీర్ హార్దిక్కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ(వన్డే)లో ఆడి.. బౌలింగ్లోనూ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే యాభై ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా చెప్పిందిదేఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘వన్డేల్లో హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ అతడికి ఫోన్ కాల్ ద్వారా తెలిపాడు’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాయి.ఇక శ్రీలంక టూర్కు జట్ల ప్రకటన సమయంలో బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్కు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. దేశీ టోర్నీల్లో పాల్గొన్నాలన్న నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. చదవండి: ICC: టీమిండియా మ్యాచ్లు అన్నీ లాహోర్లోనే?! -
Ind vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?
శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో గెలిచింది.ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.సెంచరీలు చేసినా పట్టించుకోరా?అదే విధంగా.. సంజూ శాంసన్కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కూడా పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.ఖేల్ ఖతమేనా?పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం. దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్లతో వన్డే సిరీస్లు ఆడనుంది.చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ! -
టీమిండియా అసిస్టెంట్ కోచ్లు వీరే.. దిలీప్ రీఎంట్రీ!
టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా అతడు భారత జట్టుకు మార్గనిర్దేశనం చేయనున్నాడు.ఈనెల 27 నుంచి ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో గౌతీ సహాయక సిబ్బంది కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్లో గంభీర్తో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డష్కాటే టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.దిలీప్ రీఎంట్రీ!అదే విధంగా.. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన టి.దిలీప్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొలిక్కిరానట్లు సమాచారం.సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిక్బజ్ కథనం ప్రచురించింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.కాగా మోర్నే మోర్కెల్ సైతం గంభీర్తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా గౌతీ రెండేళ్లు సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోర్నే మోర్కెల్ కూడా లక్నో సిబ్బందిలో ఉండటం గమనార్హం.ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుతో గంభీర్తో పాటు దిలీప్, నాయర్ కూడా సోమవారం బయల్దేరనున్నట్లు సమాచారం. టెన్ డష్కాటే మాత్రం తర్వాత జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.ఆరోజే గంభీర్ ప్రెస్మీట్టీ20, వన్డే సిరీస్ల కోసం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి కొలంబోకు సోమవారం పయనం కానున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది. ఈ సిరీస్తో గంభీర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనుండగా.. లంకకు వెళ్లే ముందు అతడు మీడియా ముందుకు రానున్నాడని తెలిపింది.టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా టీమిండియా శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. టీ20 జట్టుకు సూర్య, వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. -
కొలొంబో అంటే కోహ్లికి పిచ్చెక్కిపోద్ది..!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రపంచంలోని కొన్ని మైదానాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. కోహ్లికి మూడ్ వచ్చే మైదానాల్లో కొలొంబోలోని ప్రేమదాస మైదానం ఒకటి. ఇక్కడ టీమిండియా మ్యాచ్ జరిగిందంటే కోహ్లి చెలరేగిపోవడం ఖాయం. కోహ్లి ప్రేమదాసలో ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 107.33 సగటున 98.47 స్ట్రయిక్రేట్తో 644 పరుగులు చేశాడు. కోహ్లి కొలొంబోలో చేసిన నాలుగు సెంచరీలు (128*, 131, 110*, 122*, 3) గత ఐదు ఇన్నింగ్స్ల్లో చేసినవే కావడం విశేషం. కోహ్లికి కొలొంబో అంటే ఎంత పిచ్చో ఈ గణాంకాలు చూస్తే అర్దమవుతుంది.కాగా, కోహ్లి టీమిండియా తరఫున తన తదుపరి మూడు మ్యాచ్లు కొలొంబోని ప్రేమదాస మైదానంలోనే ఆడనున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఇక్కడే మూడు వన్డేలు జరుగనున్నాయి. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డేల్లో రోహిత్.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు సారథ్యం వహించనున్నారు.శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
లంకతో సిరీస్.. రెండు భారీ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లి
త్వరలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్లో రెండు భారీ రికార్డులపై కన్నేశాడు బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లి. ఈ సిరీస్లో విరాట్ మరో 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27000 పరుగులు (మూడు ఫార్మాట్లలో).. మరో 116 పరుగులు చేస్తే వన్డేల్లో 14000 పరుగుల అరుదైన మైలురాళ్లను తాకుతాడు. ప్రస్తుతం విరాట్ 652 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 26884 పరుగులు.. 292 వన్డేల్లో 13848 పరుగులు చేసి ఈ తరం క్రికెటర్లలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (34357), కుమార సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో సచిన్ (18426), సంగక్కర (14234) మాత్రమే కోహ్లి కంటే ఎక్కువ పరుగులు చేశారు. రెండు విభాగాల్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒక్కరు కూడా కోహ్లి దరిదాపుల్లో లేరు. విరాట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో (ప్రస్తుత తరం క్రికెటర్లలో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ ఉన్నాడు. రూట్ 344 మ్యాచ్ల్లో 19219 పరుగులు చేశాడు. వన్డేల్లో విరాట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత తరం ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్.. 262 వన్డేల్లో 10709 పరుగులు చేశాడు.కాగా, శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. కోహ్లి, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 జట్టులో లేరు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. లంకలో పర్యటించే భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్.. టీ20 టీమ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
శ్రేయస్ వచ్చేశాడు.. మరి డబుల్ సెంచరీ వీరుడి సంగతేంటి?
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు 8 నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయ్యర్ను ఎంపిక చేసింది. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించినందు అయ్యర్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అయితే తన తప్పు తెలుసుకున్న అయ్యర్ గత రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ఆడాడు. అంతేకాకుండా జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో అయ్యర్కు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నాయి. గంభీర్కు అయ్యర్కు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్-2024 విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు అయ్యర్ కెప్టెన్ కాగా.. గంభీర్ మెంటార్గా పనిచేశాడు. గంభీర్ సూచనలతోనే అయ్యర్ను మళ్లీ సెలక్టర్లు పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది. అయ్యర్ కాంట్రాక్ట్పై కూడా బీసీసీఐ పునారాలోచనచేయనున్నట్లు సమాచారం. ఇక అయ్యర్తో పాటు బీసీసీఐ అగ్రహానికి గురైన మరో క్రికెటర్ ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి అని క్రీడా వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది.కిషన్ రీ ఎంట్రీ ఎప్పుడు?కాగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్తో ఆడిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు. కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్కు ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి.దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ సీజన్ మొత్తం ఆడాల్సిందే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్డేల్లో అయ్యర్కు డబుల్ సెంచరీ ఉన్న సంగతి తెలిసిందే.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
IND vs SL: 'గంభీర్ భయ్యా వల్లే ఇదంతా.. నేను అతడికి రుణపడి ఉంటా'
ఐపీఎల్ స్టార్, యువ పేసర్ హర్షిత్ రాణా బంపరాఫర్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్కు భారత సెలక్టర్లు హర్షిత్ రాణాకు పిలుపునిచ్చారు. లంకతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కింది. భారత వన్డే జట్టులో రాణాకు చోటు దక్కడం ఇదే తొలిసారి.జింబాబ్వేతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు రాణా ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనైనా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయాలని ఈ ఢిల్లీ యువ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే తను స్దాయికి చేరుకోవడంలో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ది కీలక పాత్ర అని హర్షిత్ తెలిపాడు. కాగా గంభీర్, రాణా ఇద్దరూ ఢిల్లీ క్రికెట్కు ఆడి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా ఐపీఎల్లో గంభీర్ మెంటార్గా పనిచేసిన కేకేఆర్ జట్టులో రాణా సభ్యునిగా ఉన్నాడు."నేను ఎప్పుడూ నా కష్టాన్నే నమ్ముకుంటాను. కానీ కొన్ని సార్లు సీనియర్ జట్లలో చోటుదక్కినప్పడు ఒక్కడినే రూమ్లోని కూర్చోని బాధపడేవాడిని. నా ఈ అద్భుత ప్రయాణంలో నేను ముగ్గురికి కృతజ్ఝతలు తెలపాలనకుంటున్నాను. అందులో ఒకరు మా నాన్న. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగానే కృషి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కోచ్ అమిత్ భండారీ ( ఢిల్లీ మాజీ పేసర్). భండారీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక అందరికంటే గంభీర్ భయ్యాకు నేను రుణపడి ఉంటాను. ఆట పట్ల నా ఆలోచన విధానం గంభీర్ భయ్యా వల్లే మారింది. ఆయనలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటకి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించలగము. గంభీర్ను చూసి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేను నేర్చుకున్నాను. గౌతీ భయ్యా నాతో ఎప్పుడూ చెప్పేది ఒక్కటే విషయం. నేను నిన్ను నమ్ముతున్నాను, కచ్చితంగా నీవు విజయం సాధిస్తావని నాతో చెప్పేవారు" న్యూస్ 18తో మాట్లాడుతూ రాణా పేర్కొన్నాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక శ్రీలంక పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. -
గంభీర్తో గొడవలు.. బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన కోహ్లి!
టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ నియామకం నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భవిష్యత్తు ఏమవుతుందోనంటూ క్రికెట్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ దూకుడు స్వభావం ఉన్నవాళ్లే కావడం.. పైగా గతంలో మైదానంలోనే ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం ఇందుకు కారణం.గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గౌతీ- కోహ్లి కొట్టుకున్నంత పనిచేశారు. నాడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న గంభీర్.. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి మధ్య వివాదానికి అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అన్న సంగతి తెలిసిందే.హోరాహోరీగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో నవీన్- కోహ్లి మధ్య మాటా మాటా పెరగగా.. గంభీర్ జోక్యం చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. ‘మీ ఆటగాళ్లకు ముందుగా బుద్ధి చెప్పండి’ అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.గంభీర్ కూడా ఇందుకు ఘాటుగానే స్పందించాడని వినికిడి. అయితే, ఐపీఎల్-2024లో సీన్ మారింది. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వచ్చిన గౌతీ.. ఆర్సీబీ ఓపెనర్ కోహ్లితో కలిసిపోయాడు.They hugged 😭😭😭Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him.I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb— RanaJi🏹 (@RanaTells) March 29, 2024ఇద్దరూ మైదానంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే, తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పోయినట్లు నటించారని.. లోలోపల పరస్పరం గుర్రుగానే ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.దీంతో గంభీర్, కోహ్లి వాటిని ఖండించారు. అయినా దుష్ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్ కోచ్గా గౌతీ ఎంపికకాగానే.. కోహ్లికి కష్టాలు మొదలు అన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్తో బంధం గురించి కోహ్లి బీసీసీఐకి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.గతంలోని గొడవల తాలూకు ప్రభావం కోచ్- ఆటగాడిగా తమ రిలేషన్పై ఉండబోదని.. భారత జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తామిద్దరం ముందుకు సాగుతామని కోహ్లి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.తమ విషయంలో మేనేజ్మెంట్కు ఎలాంటి తలనొప్పి రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని కోహ్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ అనంతరం సెలవు తీసుకున్న విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరం కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే, హెడ్ కోచ్గా ఈ పర్యటనతో ప్రస్థానం మొదలుపెట్టనున్న గంభీర్.. కోహ్లిని సెలవులు రద్దు చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది.ఇందుకు తగ్గట్లుగానే కోహ్లి శ్రీలంకతో సిరీస్కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఈ క్రమంలో గురువారం ప్రకటించిన జట్టులో అతడి పేరు ఉండటం గమనార్హం. చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని దృష్టిలో పెట్టుకుని గంభీర్ ప్రతిపాదనకు కోహ్లి ఇలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
రుతురాజ్, అభిషేక్లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగనుండగా.. టీ20 జట్టు నూతన కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.ఇరు జట్లకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20 వరల్డ్కప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి వన్డేల్లో కొనసాగనుండగా.. హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.రుతురాజ్, అభిషేక్లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. గత ఏడు టీ20 ఇన్నింగ్స్ల్లో 70కి పైగా సగటుతో పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ రెండు జట్లలో (టీ20, వన్డే) చోటు దక్కించుకోలేకపోయారు. టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. తానాడిన చివరి వన్డేలో (సౌతాఫ్రికా) సెంచరీ చేసిన సంజూ శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
శ్రీలంక సిరీస్లకు భారత జట్ల ప్రకటన.. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్ యాదవ్ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రోహిత్ సారథ్యం వహించనుండగా.. రెండు జట్లకు (టీ20, వన్డే) శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్కు మొండిచెయ్యి ఎదురైంది. వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కోహ్లి కూడా వన్డే జట్టులో ఉన్నాడు. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లకు ఎంపికయ్యారు. హార్దిక్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్లో సూపర్ ఫామ్లో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు రెండు జట్లలో చోటు దక్కలేదు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
కోహ్లి ఆడతాడు..!
శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అందింది. ఈ సిరీస్కు విరాట్ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తొలుత విరాట్ ఈ సిరీస్కు అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు విరాట్ మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది. తాను అందుబాటులో ఉండే విషయాన్ని కోహ్లి.. బీసీసీఐకి కూడా చెప్పేసినట్లు సమాచారం.మరోవైపు లంకతో వన్డే సిరీస్కు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తొలుత రోహిత్ కూడా ఈ సిరీస్ ఆడడని ప్రచారం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.కాగా, శ్రీలంకతో వన్డే సిరీస్ ఆగస్ట్ 2 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్కు ముందు టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం భారత్.. శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. -
భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్
ఐపీఎల్-2024 తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు. క్యాష్ రిచ్ లీగ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు.అయితే, తాజాగా శ్రీలంకతో జరుగనున్న దైప్వాక్షిక సిరీస్తో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు కెప్టెన్గానూ ఈ కర్ణాటక బ్యాటర్ వ్యవహరించనున్నాడు.జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ మొదలుకానుండగా.. తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది భారత్. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంద్రాలో విలాసంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నాడు.ఇందుకోసం రాహుల్- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.ఇక ఇదే అపార్ట్మెంట్లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఫ్లాట్ కలిగి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ నివాసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తన కథనంలో వివరాలను వెల్లడించింది. కాగా భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్-ఏ జాబితాలో ఉన్నాడు.తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్ ఫీజులు ఇందుకు అదనం. అదే విధంగా.. ఐపీఎల్లోనూ కేఎల్ రాహుల్కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా సీజన్కు రూ. 17 కోట్ల మేర అందుకుంటున్నట్లు సమాచారం. ఇక అతియా శెట్టి.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
T20I: భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్..
పొట్టి క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఎదిగాడు.ప్రస్తుతం టీమిండియా తరఫున టీ20లలో అగ్ర బ్యాటర్గా కొనసాగుతున్నాడు సూర్య. అన్నీ కుదిరితే భారత జట్టు కెప్టెన్గానూ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ను చూసే అవకాశం ఉంది.శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా ఇందుకు సంబంధించిన ప్రకటన రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మొదలుకానున్న ఈ సిరీస్తోనే గౌతం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా తన ప్రయాణం మొదలుపెట్టునున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సూర్యకుమార్ యాదవ్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత ద్వితీయ శ్రేణి జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహించాడు. టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు.ఇక ఇప్పుడు లంక టూర్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్న సూర్యకుమార్ యాదవ్ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో గనుక స్కై.. 160 పరుగులు సాధిస్తే అరుదైన జాబితాలో చేరతాడు.టీమిండియా తరఫున టీ20లలో 2500 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్గా నిలుస్తాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించారు.ఇక ఓవరాల్గా కూడా ఇంటర్నేషనల్ టీ20లలో రోహిత్ శర్మ(4231 పరుగులు) అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డులకెక్కగా.. విరాట్ కోహ్లి(4188 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాతి స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(4145 పరుగులు) ఉన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత టీ20 కెప్టెన్గా రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 37 వన్డేలు, 68 టీ20లు, ఒక టెస్టు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 773, 2340, 8 పరుగులు చేశాడు. సూర్య ఖాతాలో నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉండటం విశేషం. -
Ind vs SL: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అందుకు తానే నిదర్శనం అని.. సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని చెబుతున్నాడు.ఎన్నో ఎత్తుపళ్లాలువన్డే వరల్డ్కప్-2023 - టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల మధ్యకాలంలో హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా మార్పులే వచ్చాయి. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాడు ఈ బరోడా క్రికెటర్.సొంతడ్డపై వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో టీమిండియా జోరు మీదున్న తరుణంలో హార్దిక్ పాండ్యా అనూహ్య రీతిలో గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తున్నపుడు రిటర్న్ క్యాచ్కు యత్నించి విఫలమైన ఈ ఆల్రౌండర్.. అదుపుతప్పి పడిపోయాడు.ఈ క్రమంలో కాలు మెలిక పడగా చీలమండ నొప్పి ఎక్కువైంది. ఫలితంగా అతడు మైదానం వీడక తప్పలేదు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రీ ఎంట్రీ ఇచ్చాడు.అక్కడా చేదు అనుభవమేఅయితే, క్యాష్ రిచ్లీగ్లోనూ అతడికి చేదు అనుభవమే మిగిలింది. సొంత జట్టు అభిమానులే సారథిగా హార్దిక్ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మైదానం లోపలా, వెలుపలా ఆగ్రహం వెళ్లగక్కారు.ఈ క్రమంలో కెప్టెన్సీలో తడబడిన హార్దిక్ పాండ్యా తన నిర్ణయాల కారణంగా భారీ మూల్యమే చెల్లించాడు. ఆటగాడిగా, సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. మొట్టమొదటిసారి ముంబై కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిపాడు.దీంతో విమర్శల పదును పెరగడంతో పాటు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ చోటు ఇవ్వకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, అదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో అతడికి స్థానం దక్కింది.ఇక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావించిన హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. మెగా టోర్నీలో తన తాను నిరూపించుకుని.. టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఉత్కంఠతో కూడిన ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు పాండ్యా. తనను ఎక్కడైతే అవమానించారో అదే ముంబై స్టేడియంలో వరల్డ్కప్ హీరోగా నీరాజనాలు అందుకున్నాడు.తాజాగా.. వన్డే వరల్డ్కప్ సమయంలో ఎదురైన గడ్డు పరిస్థితులు, ఫిట్నెస్ విషయంలో తాను పడ్డ శ్రమకు సంబంధించిన విషయాల గురించి హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో షేర్ చేశాడు.ఫిట్నెస్ ముఖ్యం‘‘2023 వరల్డ్కప్.. గాయం కారణంగా అత్యంత కష్టంగా గడిచింది. అయితే, టీ20 ప్రపంచకప్ విజయంతో ఆ బాధను మర్చిపోగలిగాను. ప్రయత్నిస్తే తప్పక ఫలితం దక్కుతుంది. కఠినంగా శ్రమిస్తే తప్పక గుర్తింపు లభిస్తుంది. నా లాగే మీ అందరూ కూడా ఫిట్నెస్కు తగిన ప్రాధాన్యం ఇవ్వండి’’ అంటూ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్గా మారింది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా ఆరు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. అదే విధంగా.. 7.64 ఎకానమీతో 11 వికెట్లు కూడా తీశాడు.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు భార్య నటాషా స్టాంకోవిక్తో విభేదాలు తలెత్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఇప్పటికే విడాకుల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతుండగా.. కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్లడం గమనార్హం.శ్రీలంక పర్యటనకు వెళ్తాడా?జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. అయితే, కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. తరచూ గాయాల బారిన పడుతున్న పాండ్యా కాకుండా సూర్య జట్టును సమర్థవంతంగా ముందుకు నడపగలడని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ జర్నీ పోస్ట్ పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
గంభీర్ కీలక నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్ రీ ఎంట్రీ! ఎవరంటే?
శ్రీలంక పర్యటనకు భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 18 (గురువారం) సాయంత్రం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్గా సమావేశం కానుంది. ఈ మీటింగ్లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాల్గోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లలో తలపడనుంది.ఈ రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను అగార్కర్ అండ్ కో ఎంపికచేయనున్నారు. అయితే లంకతో వన్డేలకు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి . తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు తెలియజేసినట్లు వినికిడి. అదేవిధంగా శ్రీలంకతో టీ20ల్లో భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నవ్దీప్ సైనీ రీ ఎంట్రీశ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనీకి తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లకు గంభీర్ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లంకతో వన్డే జట్టులో సైనీ భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నవ్దీప్ సైనీ చివరగా 2021లో ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత తరపున ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపునివ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. -
హార్దిక్ టీ20లకు మాత్రమే.. రాహుల్, అయ్యర్ రీఎంట్రీ ఖరారు..!
బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న (జులై 16) సెలెక్షన్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేయబోయే భారత జట్టుపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. లంకతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని సమాచారం. తొలుత ఈ సిరీస్లో రోహిత్ ఆడడని ప్రచారం జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు లంకతో వన్డేలకు కోహ్లి, బుమ్రా అందుబాటులో ఉండడం లేదన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. వీరిద్దరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో ముఖ్య అంశాలు..రోహిత్ అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది. హార్దిక్ పాండ్యా కేవలం టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత టీ20 కెప్టెన్సీ రేసులో పాండ్యాతో పాటు సూర్యకుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.కాగా, శ్రీలంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్లో వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. ఈ రెండు సిరీస్ల కోసం భారత జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. -
Ind vs SL: నిర్ణయం మార్చుకున్న రోహిత్!.. మరి కోహ్లి?
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు టీమిండియా కేవలం రెండు వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా తొలుత శ్రీలంక.. తర్వాత ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లలో పాల్గొననుంది.ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఈ రెండు సిరీస్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ వన్డే టోర్నీలో ఆడాలనుకునే సీనియర్లు తప్పకుండా లంక, ఇంగ్లండ్లతో సిరీస్లో పాల్గొనాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.అందుబాటులో ఉండాలిఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో చర్చించిన గంభీర్.. కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఈ రెండు సిరీస్లకు అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కోహ్లి, బుమ్రా మాత్రం శ్రీలంకతో వన్డే సిరీస్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ముగిసిన అనంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.లండన్లో కోహ్లి.. అమెరికాలో రోహిత్స్వదేశానికి తిరిగి వచ్చిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కోహ్లి లండన్కు వెళ్లగా.. రోహిత్ శర్మ అమెరికాకు పయనమయ్యాడు. మరోవైపు.. బుమ్రా కూడా సెలవు తీసుకున్నాడు.ఈ నేపథ్యంలో విశ్రాంతి పేరిట ఈ ముగ్గురు శ్రీలంక సిరీస్కు అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ మాత్రం లంకతో వన్డే సిరీస్ ఆడాల్సిందేనని పట్టుబట్టడంతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.లేదంటే కెప్టెన్ అతడే!ఫలితంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్కు కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఒకవేళ అతడు గనుక సమయానికి అందుబాటులోకి రాకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా శుబ్మన్ గిల్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో యువ భారత జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తదుపరి టీమిండియా జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది.చదవండి: NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం? -
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇందులో.. భారత్కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024 -
Ind vs SL: కోహ్లి, రోహిత్ ఆడాల్సిందే.. గంభీర్ అల్టిమేటం?!
టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే క్రమంలో గౌతం గంభీర్ ఆది నుంచే తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు విశ్రాంతి పేరిట సిరీస్లకు దూరం కావడానికి తాను వ్యతిరేకం అంటూ గౌతీ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.అంతేకాదు ఫిట్గా ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టీ20)నూ ఆడాలని కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన నుంచే తన ప్రణాళికలు అమలు చేసేందుకు గంభీర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడైన మాజీ క్రికెటర్ గంభీర్.. శ్రీలంక టూర్తో శిక్షకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. జూలై 27 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది.అయితే, ఈ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. వన్డే, టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నారు.అందుబాటులో ఉండలేం.. కానీ.. శ్రీలంకతో వన్డే సిరీస్కు మాత్రం తాము అందుబాటులో ఉండలేమని వీరిద్దరు బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. వీరితో పాటు బుమ్రా కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గంభీర్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం.కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం సెలవులను ఆస్వాదిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. స్వదేశంలో సంబరాల అనంతరం ఈ దిగ్గజ బ్యాటర్లు విదేశాలకు చెక్కేశారు.అదేం కుదరదుమరోవైపు.. బుమ్రా వంటి మరికొందరు సీనియర్లు కూడా కుటుంబానికి సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు వీరు అందుబాటులో ఉండేందుకు మొగ్గు చూపడం లేదని బీసీసీఐ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.అయితే, గంభీర్ మాత్రం రోహిత్, విరాట్ సెలవులు ముగించుకుని జట్టుతో చేరాలని కోరినట్లు సమాచారం. బుమ్రా కూడా ఈ సిరీస్లో ఆడాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నద్ధమయ్యే క్రమంలో ఏ ఒక్క సిరీస్కు కూడా విశ్రాంతి పేరిట దూరం కావొద్దని తన మాటగా గంభీర్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి గంభీర్ ఆజ్ఞలను రోహిత్, విరాట్, బుమ్రా పాటిస్తారా? లేదంటే సెలవులను పొడిగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: 'కెప్టెన్ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్ అలా కాదు' -
శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్ దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించకున్నట్లు సమాచారం.ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకు హార్దిక్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంకతో వన్డేలకు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు.ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్లలో భారత జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. కానీ అంతలోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలని సెలక్టర్లు సతమతవుతున్నట్లు వినికిడి. ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశముంది. లంకేయులతో వన్డే సిరీస్లో భారత జట్టు సారథిగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను నియమించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంకతో తలపడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. -
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడే? అతడు రీ ఎంట్రీ ఇస్తాడా?
జింబాబ్వేతో టీ20 సిరీస్ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం(జూలై 16) ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్గా మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఈ జట్టు ఎంపికలో భారత కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా పాల్గోనున్నట్లు సమాచారం. ఇక లంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 క్రికెట్కు ఇప్పటికే గుడ్బై చెప్పిన రోహిత్, విరాట్, జడేజా.. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్కు కూడా దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వినికిడి.అదే విధంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు గంభీర్ రాకతో అతడి ఎంట్రీ సుగమైనట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచిన కోల్కతా నైట్రైడర్స్కు అయ్యర్ సారథ్యం వహించగా.. గంభీర్ మెంటార్గా పనిచేశాడు.