Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్‌ | Womens Asia Cup 2024 Final: India Set 166 Runs Target For Sri Lanka | Sakshi
Sakshi News home page

Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్‌

Published Sun, Jul 28 2024 4:50 PM | Last Updated on Sun, Jul 28 2024 5:47 PM

Womens Asia Cup 2024 Final: India Set 166 Runs Target For Sri Lanka

మహిళల ఆసియా కప్‌ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్‌ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్‌), రిచా ఘోష్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడారు. 

షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్‌ 5, రాధా యాదవ్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్‌ పడగొట్టారు. 

తుది జట్లు..

శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్‌), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్‌), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement