గాయత్రి జోడీకి చుక్కెదురు  | Pullela Gayatri Tresa Jolly Jodi Defeat | Sakshi
Sakshi News home page

గాయత్రి జోడీకి చుక్కెదురు 

Mar 27 2024 4:25 AM | Updated on Mar 27 2024 4:25 AM

Pullela Gayatri Tresa Jolly Jodi Defeat - Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో ఐదో సీడ్‌ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 18–21, 22–20, 18–21తో ఆనీ జు–కెర్రీ జు (అమెరికా) జంట చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.

మరోవైపు అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జంటకు తొలి రౌండ్‌లో వాకోవర్‌ లభించడంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ నుంచి మిథున్‌ మంజునాథ్‌ (భారత్‌) మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించగా... సమీర్‌ వర్మకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌ తొలి మ్యాచ్‌లో మిథున్‌ 15–21, 24–22, 21–18తో శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌)పై, రెండో మ్యాచ్‌లో 21–16, 21–12తో లియావో జు ఫు (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement