విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌ | WPL 2023: Delhi Capitals Restricted Mumbai Indians To 109 Runs | Sakshi
Sakshi News home page

WPL 2023: విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌

Published Mon, Mar 20 2023 9:17 PM | Last Updated on Mon, Mar 20 2023 9:17 PM

WPL 2023: Delhi Capitals Restricted Mumbai Indians To 109 Runs - Sakshi

డబ్ల్యూపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (మార్చి 20) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. మారిజన్‌ కాప్‌ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్‌ జొనాస్సెన్‌ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఓ దశలో ముంబై టీమ్‌ కనీసం 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌), ఇస్సీ వాంగ్‌ (24 బంతుల్లో 23, సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్‌ (5), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (0), అమేలియా కెర్‌ (8) విఫలమయ్యారు.

కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-3లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement