గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం

Published Sun, Feb 16 2025 1:04 AM | Last Updated on Sun, Feb 16 2025 1:03 AM

గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం

గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం

శ్రీకాకుళం కల్చరల్‌: సమాజ చైతన్యానికి గ్రంథాలయాలుతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్‌లో శనివారం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలతోనే మేథావి వర్గం తయారవుతుందన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం రాష్ట్ర కన్వీనర్‌ వల్లూరి శివప్రసాద్‌ మాట్లాడుతూ గ్రంథాలయాల సెస్‌ బకాయిలు రూ.710 కోట్లు ఉన్నట్లు వివరించారు. రచయిత అట్టాడ అప్పలనాయడు మాట్లాడుతూ ఒకప్పుడు పంచాయతీల స్థాయిలో గ్రంథాలయాలు ఉండేవని, ఇప్పుడవి కనుమరుగైపోయాయని చెప్పారు. అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్‌ చంద్ర జ్యోతి మాట్లాడుతూ కొత్త తరాల జ్ఞాన వికాసానికి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం తోడ్పాటునందిస్తుందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్యమానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత జామి భీమశంకర్‌, జీన్‌ గ్రంథాలయ వ్యవస్థాపకులు పత్తి సుమతి, బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూడు సూర్యారావు, సీపీఐ పట్టణ కార్యదర్శి టి.తిరుపతిరావు, విశ్రాంత ఇంజినీర్‌ బి.ఎ. మోహనరావు, ఇస్కాఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి.మల్లేశ్వరరావు, జి.వి.నాగభూషణరావు, పాలకొండ డివిజన్‌ గ్రంథాలయ ఉద్యమ నాయకులు సుబ్బా నానాజీ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement