వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు చక్కటి భోజనం, వసతులు కల్పించాలని ఆదేశించారు.
కాశీబుగ్గలో ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడు రోడ్లు కూడలి వద్ద ఫుట్పాత్పై ఉన్న పూజా సామగ్రి షాపు తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో జేసీబీతో షాపును తొలగిస్తుండగా దుకాణదారుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి దుకాణదారులను అదుపుచేశారు. ఈ క్రమంలో షాపు యజమాని కఠారి శ్యామ్ ఒంటిపై నూనె పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని శ్యామ్ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులను కూడా పోలీసు స్టేషన్కు తరలించారు.
ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం
రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో ఎల్.శ్రీరాములుకు చెందిన ఖాళీ కోళ్ల ఫారం సోమవారం దగ్ధమైంది. మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రణస్థలం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రణస్థలం అగ్నిమాపకాధికారి పైల అశోక్ తెలిపారు.
జర్నలిస్టులపై
దాడులు అమానుషం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని నినదించారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment