
హైదరాబాద్, సాక్షి: మింట్ కాంపౌండ్లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయి. అయితే కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment