బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత  | Hyderabad: Illness For Ten People Who Ate Biryani | Sakshi
Sakshi News home page

బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత 

Feb 7 2021 7:18 PM | Updated on Feb 7 2021 7:39 PM

Hyderabad: Illness For Ten People Who Ate Biryani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆనంద్‌బాగ్‌లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌బాగ్‌లోని మండిలో చికెన్‌ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్‌ నిర్వాహకులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement