Malkajgiri
-
కరెంట్ లేదు.. నీళ్లు రావు
-
మనవరాలి పెళ్లి సంగీత్లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ని ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.మనవరాలి సంగీత్ లో డీజే టిల్లు పాటకు మల్లన్న మాస్ స్టెప్పులు 🕺👌#MallaReddy #Mallareddydance pic.twitter.com/D0tMDpBED6— Pulse News (@PulseNewsTelugu) October 21, 2024 -
HYD: మల్కాజ్గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్బాగ్లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి పదేళ్ల సమయం పడితే.. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘ఈకొద్ది కాలంలోనే ఆయన అబద్ధాల కోరు అని తేలింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదో నాలుగు నెలల్లో తెలిసిపోయింది. సీఎం అయినా భాష మారలేదు..దబాయింపులు మారలేదు. రేవంత్రెడ్డి మతిభ్రమించినట్టు మాట్లాడుతూ దిగజా రుడు రాజకీయాలు చేస్తున్నారు. అబద్ధాల ప్రచారం, వీడియో మార్ఫింగ్లతో రేవంత్రెడ్డి అందరినీ మించిపోయారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. మానవబాంబై పేలుతా.. పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా.. ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. నీ భాష మార్చుకో..సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. చిల్లరమాటలు మానుకోవాలి’అని రేవంత్రెడ్డికి ఈటల హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది›ప్రెస్లో ఈటల రాజేందర్ మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని, మళ్లీ దాన్ని దెబ్బతీస్తే రేవంత్కు కూడా పుట్టగతులుండవు. సీఎం మాటలకు విశ్వసనీయత లేదు. కమిటీల పేరుతో కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. గతప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ట్యాపింగ్లపై ఎలాంటి విచారణ లేదు. నేటికీ ట్యాపింగ్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బిల్లుల కోసం ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు మొదలు అందరూ 7 నుంచి 10 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. 20 ఏళ్లకు పైబడిన నా రాజకీయ జీవితంలో ఇంతటి ‘పొల్యూటెడ్ పాలిటిక్స్’ ను చూడలేదు. పాలించే జాతి మాదే, పాలించే కెపాసిటీ మాకే ఉంది అని అహంకారంతో రేవంత్ మాట్లాడుతున్నారు. అంత జాత్యహంకారం, కులరాజకీయం పని కి రాదు. రద్దు చేయాలనుకుంటే అవన్నీ ఎందుకు చేస్తారు ? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ మార్ఫింగ్ వీడియోలు చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలలో రేవంత్ ప్రమేయముందని ప్రచారం జరుగుతోంది, ప్రధాని మోదీ ఇతర రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే దళితులు, పేదలకు న్యాయం జరగాలని ఏబీసీడీ రిజర్వేషన్ల వర్గీకరణ దిశగా చర్యలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, వంటివి ఎందుకు చే స్తారు. ముస్లింలకు కాదు మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. బీసీలుగా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారని, మళ్లీ మ తప్రాతిపదికన ఎందుకని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మల్కాజ్గిరిలో ఏ సర్వేసంస్థలకు అందని ఫలితాలు ‘మల్కాజ్గిరిలో ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. అన్నివర్గాల మద్దతుతో మంచి మెజారిటీతో గెలుస్తా’అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మల్కాజ్గిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడినట్టు ఓ మార్ఫింగ్ వీడియో సోషల్మీడియాలో ప్రచారం చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాను గెలిస్తే మల్కాజ్గిరికి గుర్తింపుతోపాటు, రోడ్డు వ్యవస్థ, మెట్రోరైలు, ఐటీ. ఇండ్రస్టియల్ కారిడార్లు, మంచి విద్య, వైద్యం వస్తాయని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇక తనపై పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గురించి ఇక్కడి ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు, ప్రధానకార్యదర్శి ఆర్.రవికాంత్రెడ్డి, ఉపాధ్యక్షురాలు వనజ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ దిక్కులేదని విమర్శించారు. ఘట్కేసర్లో బుధవారం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. రేవంత్ బీజేపీలో చేరడం పక్కా ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని. మీ పక్కనే ఉన్నాయన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్నింటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడని జోస్యం చెప్పారు. భద్రాచలానికి బీజేపీ ఒక్క రూపాయైనా ఇచ్చిందా? పదేళ్లు దేశాన్ని నడిపిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడేనని అన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు రాముడితో పంచాయితీ లేదు.. బీజేపీతోనే.. ‘శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్. యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
హోలీ పండగలోపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది’’ అని రేవంత్ పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి’’ అని సీఎం రేవంత్ సూచించారు. -
మోదీ జోష్ షో
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్షో పార్టీ నాయకులు, కేడర్లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు. అబ్కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. నేడు నాగర్కర్నూల్కు మోదీ కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్షో నిర్వహించారు. ఆయన వెంట జీప్లో ఓ వైపు కిషన్రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్షోలో పాల్గొన్నారు. అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్షో ముగియగానే మోదీ రాజ్భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగర్కర్నూల్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. -
మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్షో
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది. సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్షో జరుగుతుంది. దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. నేడు మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. -
పీఎం మోడీ రోడ్ షోకు భారీగా ఏర్పాట్లు
-
PM Modi: నేడు హైదరాబాద్కు ప్రధాని.. మల్కాజ్గిరీ రోడ్షోలో
-
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు రానున్న మోదీ రాత్రికి రాజ్భవన్లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్కర్నూల్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్లో, 5న పటాన్చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్భవన్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్కర్నూల్కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్భవన్, పంజగుట్ట, గ్రీన్ల్యాండ్స్, హెచ్పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్నగర్, సఫిల్గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్కు వచ్చే వాహనదారులు ఆనంద్బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్టీసీ జంక్షన్ నుంచి ఆనంద్బాగ్కు వచ్చే వాహనాలు జెడ్టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్గిరిని పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
తేల్చుకుందాం రా..!
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు. అంత ఉబలాటం, దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే.. పరపతి ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు (రేవంత్) సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్సభ సీట్లోనే తేల్చుకుందాం. అది పోతే ఇది, ఇదిపోతే అది.. అన్నట్టు సేఫ్ గేమ్ ఆడకుండా.. నువ్వు సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఎంపీగా నీ పనితీరు, మున్సిపల్ మంత్రిగా నా పనితీరును ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. రేవంత్ మాటలకు విశ్వసనీయత ఏది? గతంలో జీహెచ్ఎంసీలో, కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రేవంత్రెడ్డి మాటలకు విశ్వసనీయతే లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిస్తే మగాడు.. ఓడితే కాదంటావా? గతంలో కొడంగల్లో ఓడినపుడు నువ్వు కాదా..? ఇదేం లాజిక్? నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గెలిచారో చెప్పలేరు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న రేవంత్ నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడు అని గొంతు చించుకుంటున్నారు. ఏం మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని గుర్తించడం లేదా? మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకంతో పాటు మిగతా 420 హామీలను నెరవేర్చాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డిది పేమెంట్ కోటా.. రాజకీయాల్లో తనది మేనేజ్మెంట్ కోటా అంటున్న రేవంత్.. రాహుల్, ప్రియాంక గాంధీ ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్రెడ్డి పేమెంట్ కోటా కింద మాణిక్యం ఠాగూర్కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని, ఇతరులకు డబ్బులిచ్చి సీఎం పదవి కొనుక్కున్నారు. పేమెంట్ కోటా అభ్యర్థి రేవంత్.. తనను ప్రజలు ఎన్నుకున్నట్టు మాట్లాడితే ఎలా? పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు కోసం ఢిల్లీకి కప్పం కట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీని నడపాలంటే రేవంత్, డీకే శివకుమార్ రోజుకు 18 గంటలు కష్టపడాలి. బిల్డర్లు, కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి, వేధించి డబ్బుల వసూలు దందా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో బిల్డింగ్ అనుమతులను ఎవరిని బెదిరించడం కోసం నిలిపివేశారు. హైదరాబాద్ బిల్డర్లు త్వరలోనే రోడ్డెక్కే పరిస్ధితి ఉంది. కేంద్రంలోని బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటుపోతారో అందరూ చూస్తారు. హిమాచల్ప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయం రంజుగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాయం చేశాడు’’ అని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్గా మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. రాజకీయ పారీ్టల్లో చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటవాదులు పారీ్టతో ఉంటారని, అవకాశవాదులు వదిలివెళ్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సునీత మహేందర్రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లకు టికెట్లు ఇస్తారేమోనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీఆర్ఎస్గా ఉన్నా తమ ఫోకస్ ప్రస్తుతానికి తెలంగాణపైనే ఉందని చెప్పారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితం సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, పగుళ్లు సహజమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏ విచారణలు చేసినా సరే, ఇంజనీరింగ్ నిపుణులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ గత ప్రభుత్వంపై ఆరోపణలు, శ్వేతపత్రాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎలాంటి హైడ్రోలాజికల్ అధ్యయనాలు చేయకుండానే రాజకీయ ప్రేరేపితంతో ఆదరాబాదరాగా నివేదికను విడుదల చేసిందని విమర్శించారు. ఎప్పుడూ కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికలను తప్పుబట్టే కాంగ్రెస్, మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారేమని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు తగిన పరిష్కారం చూపాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘మేం మేడిగడ్డకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టు సందర్శన పేరిట చౌకబారు రాజకీయం చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టి నీరు ఇవ్వకపోవడం వికృత రాజకీయం, నేరపూరిత చర్య. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తిచేశాం. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బ్యారేజీలు, రిజర్వాయర్లతోపాటు తన శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు మానుకుని మేడిగడ్డ వద్ద దిద్దుబాటు పనులు చేపట్టాలి..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుడి మృతి
మల్కాజిగిరి: కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం..అదే గదిలో అతని తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలి్పన వివరాల మేరకు..మౌలాలి ఈస్ట్ ప్రగతినగర్కు చెందిన మెరుగు విజయ (73) భర్త చనిపోవడంతో కుమారుడు శ్రీధర్ గౌడ్(47)తో కలిసి ఉంటుంది. శ్రీధర్ గౌడ్కు భార్య శైలజతో మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వేరే ఇంట్లో ఉంటోంది. కాగా శ్రీధర్ గౌడ్ ప్రస్తుతం జవహర్నగర్లో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణ చూసుకుంటున్నాడు. వారి సంతానంలో కుమారుడు, కూతురు ఇతని వద్ద ఉంటుండగా..మరో కుమారుడితో కలిసి శైలజ కాప్రాలో ఉంటున్నది. బుధవారం ఉదయం శ్రీధర్ కుమార్తె నిద్రలేచి చూసేసరికి తండ్రి బెడ్రూమ్లో ఉరివేసుకొని ఉండగా, అదే రూములో ఆమె నానమ్మ విజయ కిందపడి చనిపోయిఉండడం గమనించింది. వెంటనే బయటకు వచ్చి కేకలు వేయడంతో స్ధానికులు వచి్చ..పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మల్లయ్యలు వారిద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శ్రీధర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కుటుంబ సమస్యలే కారణమా? భిక్షపతి, విజయలకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. శ్రీధర్కు అతని భార్య శైలజకు విభేదాలు ఏర్పడ్డాయి. గతంలో మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో శ్రీధర్పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా..వాదనలు పూర్తయి వచ్చే నెలలో తీర్పు రానున్నట్లు సమాచారం. పోలీసులు శ్రీధర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని ప రిశీలించగా..మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో శ్రీధర్ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పాలు పోసే వ్యక్తి రావడంతో విజయ పాలు పోయించుకున్నట్లు రికార్డు అయింది. విజయ నేల మీద పడి వుండడం, తల వెనుక రక్తం ఉండడాన్ని పోలీసులు గమనించారు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో షాక్కు గురైన ఆమె కింద పడిపోయి చనిపోయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలలో విడాకులకు సంబంధించి తీర్పు రానున్నడంతో శ్రీధర్ ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని భావిస్తు న్నారు. గత కొంత కాలంగా ఆస్తి పంపకాలపై కూడా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. -
మల్కాజిగిరి బరిలో ఈటల?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు. -
మల్కాజిగిరి ఛాన్స్ నాకివ్వండి: ఈటల రాజేందర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని అన్నారు ఈటల. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, అక్యూపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. చదవండి: TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని.. రూ. 6300కోట్ల రూపాయాలతో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. నిజమాబాద్లో పసుపు బోర్డు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారని ప్రస్తావించారు. దక్షిణాన రూ. 26వేల కోట్లతో రిజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారు. కేసీఆర్ లక్ష రూపాయాల రుణమాఫీ ఐదేళ్ళ కాలంలో పూర్తి స్థాయిలో జరగలేదు. రెండు లక్షల రుణ మాఫీ ఒకటే దఫా చేయాలంటే సాధ్యం కానీ పరిస్థితి. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీలను అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. 400లకు పైగా ఉన్న హామీలను మరోసారి కాంగ్రెస్ చదువుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఇండియా కూటమి అతుకుల బొంతగా మారింది. దేశం ఒక్కప్పుడు బాంబుల మోతలు, మత కలహాలు ఉండేది. బీజేపీ పాలనలో దేశమంతా ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి సతీమణి ప్రచారం
-
రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్.
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించినా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్రావు కాంగ్రెస్ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా మైనంపల్లిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా మెదక్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మల్కాజ్గిరి టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతిరెడ్డి మూడ్రోజుల క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని సేవలందిస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడాన్ని అటు తిరుపతిరెడ్డి, ఇటు నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. కాగా, కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్గౌడ్, పిసరి మహిపాల్రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా. హరీష్రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్రావ్కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. మెదక్ లో హారీష్రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్ఎల్ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్రావుపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి. ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్కు మంత్రి హరీష్ క్లాస్ -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికాడు -
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వరంగల్కు చెందిన చందు, యాప్రాల్కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్ను అమర్చారు. లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. (చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. ) -
గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు వివరాల ప్రకారం..లాల్వాణినగర్కు చెందిన యాతం మహేష్యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్దే మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాలెన్నో.. బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది. -
గ్రేటర్ హైదరాబాద్లో భారీ కుంభకోణం?
సాక్షి, హైదరాబాద్: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా గుర్తుందా? అందులో ఊరి నుంచి వచ్చిన బ్రహ్మానందంను నమ్మించి చార్మినార్ను తనికెళ్ల భరిణి విక్రయిస్తాడు. ఈ ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రవేశపెట్టిన స్వీయ మదింపు (సెల్ప్ అసెస్మెంట్)లో ఉన్న లోపాలను, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని బయటపెట్టడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఆస్తి పన్ను స్వయంగా మదింపు చేసుకొని అసెస్మెంట్ నంబర్ పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమాని ఇంటి పన్ను చెల్లించడానికి ముందు ఆస్తి పన్ను మదింపు చేసి ఇంటి నంబరు కేటాయిస్తారు. ఈ విధానంలో అవినీతి ఎక్కువ కావడంతో స్వీయ మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాని ద్వారా ఇంటి యజమానే అన్ని వివరాలు పూర్తి చేసి ఆస్తి పన్ను మదింపు చేసుకోవచ్చు. ఈ విధానంలో కూడా లోపాలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. బయటపెట్టింది ఇలా.. మల్కాజిగిరి కార్పొరేటర్ గీతానగర్లో ఉన్న సర్కిల్ కార్యాలయం భవనాన్ని యాభై గజాలుగా చూపిస్తూ 194 రూపాయలు స్వీయ మదింపు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు. ఆస్తి పన్ను చెల్లించగానే పీటీఐ నంబర్ 1280210792 జనరేట్ అయింది. ఈ విధానంలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు బాధ్యతారాహిత్యం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ మదింపు విధానం పూర్తిగా అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేయడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంతో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ విధానంపై రెవిన్యూ విభాగం అధికారుల తీరు అధ్వానంగా ఉంది. మల్కాజిగిరిలో ఏఎమ్సీలను అడిగితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధానం ద్వారా జరిగిన అన్ని ఆస్తి మదింపు (అసెస్మెంట్ల)పై కమిటీ వేసి విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – శ్రవణ్, కార్పొరేటర్ -
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో BRS ఎమ్మెల్యేల భేటీ
-
అప్పు ఇచ్చిన మహిళ పట్ల దురుసు ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: అప్పిచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన తోట ప్రేమ్కుమార్ (43) 2014లో స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలను అప్పుగా తీసుకుని ఏడాది తర్వాత ఇస్తానన్నారు. ఏడాదైనా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో విచారణ చేసిన న్యాయస్థానం సోమవారం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తనకు, తన భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రాణహాని ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతాశేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ‘నేను కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి మాపై దాడులకు పాల్పడుతున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం ఇవ్వ కుండా ఓడిపోయిన కార్పొరేటర్ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మున్సి పల్ అధికారులు కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. తన క్యారెక్టర్పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్మీడియాలో వైరల్ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచ రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరా రు. మల్కాజ్గిరి పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అందువల్లే సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్ శనివారం వినతిపత్రం అందించారు. దీంతోపాటు తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్డ్రైవ్ను కూడా ఇచ్చారు. గతేడా ది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్ శ్రవణ్పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడు లకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతాశేఖర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు -
మల్కాజిగిరిలో కలకలం.. తల్లి మృతదేహంతో ఇంట్లో మూడురోజులుగా..
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు తల్లి మృతదేహంతో పాటు ముడు రోజులుగా కుమారుడు గడపడం కలకలం రేపింది. కుమారుడు సాయికృష్ణతో కలిసి తల్లి విజయ నివసిస్తుంది. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక పరిస్థితి వల్ల కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మల్కాజ్గిరి మహిళ హత్య కేసులో ట్విస్ట్.. గర్భగుడిలోనే చంపేశాడు
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం చదవండి: వరంగల్లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే... పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు. -
యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్వర్క్లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్పేటలోని ఓ ల్యాండ్మార్క్ను పికప్గా.. వారుండే లొకేషన్ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
ప్రహారీకి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్! జీహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్ కొట్టేసి..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల ఉపయోగార్థం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ మాయమైంది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా, టాయిలెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది. రూ.45 వేలకు విక్రయం ఆనంద్బాగ్ చౌరస్తాలో కొన్నాళ్ల క్రితం ఇనుముతో చేసిన పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఓ కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. దీని ప్రహరీ నిర్మాణానికి సదరు టాయిలెట్ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తొలగించాలని కోరుతూ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ పలుమార్లు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ను తొలగించాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండాలని వాళ్లు తేల్చి చెప్పారు. చదవండి: డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి.. నిర్మాణ సంస్థ సూపర్వైజర్ బిక్షపతికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే అరుణ్కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పబ్లిక్ టాయిలెట్ తొలగించే పని తాను చేస్తానంటూ చెప్పడంతో బిక్షపతి అంగీకరించాడు. టాటా ఏస్ వాహనం డ్రైవర్ చేస్తూ ఫ్లెక్సీ హోర్డింగ్స్ పని చేసే జోగయ్యకు ఆ పని అప్పగించాడు. ఈ నెల 16 ఆ టాయిలెట్ తీసుకెళ్లి ముషీరాబాద్లో రూ.45 వేలకు విక్రయించాడు. ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జి.రాజు ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 17న కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పబ్లిక్ టాయిలెట్ తరలించడానికి వినియోగించిన వాహనాన్ని గుర్తించి జోగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. టాయిలెట్ తొలగింపునకు సంబంధించి బిక్షపతి, అరుణ్కుమార్ మధ్య ఒప్పందం కుదిరిందని, అరుణ్ చెప్పడంతోనే తాను దాన్ని తీసుకుపోయానని విషయం చెప్పడంతో జోగయ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బిక్షపతి, అరుణ్ కోసం గాలిస్తున్నారు. -
పాపం పసివాడు.. కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ
సాక్షి, చిలకలగూడ: వరకట్న వేధింపులు భరించలేక గృహిణి ఏడాది వయసున్న తన కుమారునితో సహా భవనం పైనుంచి దూకింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. నార్త్జోన్ డీసీపీ చందన దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సఫిల్గూడకు చెందిన దివ్యతేజకు, మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్కు 2018 సెప్టెంబర్ 6న వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది మార్చి 3న రిత్విక్ జన్మించాడు. ఈ క్రమంలో మహేందర్తో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం దివ్యతేజను వేధిస్తున్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె సోమవారం ఉదయం తన కుమారునితో కలిసి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి చేరుకుంది. శానిటైజర్ను కుమారునికి తాగించి, తానూ తాగింది. కుమారుని చేతి మణికట్టు, మెడపై కోసి తానూ కోసుకుంది. రక్తస్రావం అవుతుండగా చిన్నారిని పట్టుకుని భవనం పైనుంచి కిందికి దూకింది. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! రోడ్డుపై పడిన చిన్నారి రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్కింగ్ చేసిన వాహనంపై పడిన దివ్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీదాస్, తరుణ లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేందర్తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? -
మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి?
సాక్షి, మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన ప్రసాద్ కుమార్తె చిన్నారి (4)కి వాంతులు కావడంతో సోమవారం మల్కాజిగిరిలోని ఓ మెడికల్ షాపులో క్లినిక్ నిర్వహిస్తున్న మధుసూదన్ వద్దకు తీసుకొచ్చారు. వాంతులు తగ్గకపోవడంతో సాయంత్రం తీసుకెళ్తే చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. చదవండి: వివాహేతర సంబంధం: దూరంగా పెడుతుందనే కోపంతో.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం అనంతరం మంగళవారం మెడికల్ షాపు వద్ద ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. డాక్టర్ మధుసూదన్ పరారీలో ఉన్నాడు. చదవండి: బంజారాహిల్స్: బయటకు వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు -
యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్
సాక్షి, నేరేడ్మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్నగర్ కాలనీలో గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం మల్కాజిగిరి కోర్టులో బాలిక తల్లి సుకన్య కపూరియా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ‘యాక్సిడెంటల్ డెత్’గా నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుమేధ తల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ను వేశారు. చదవండి: జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీఈఈ, ఏఈఈతోపాటు మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అప్పటి మేయర్ బొంతురాంమోహన్ తదితరులపై నేరేడ్మెట్ ఠాణాలో అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్ఐ కోచింగ్ సెంటర్లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి.. -
మల్కాజిగిరి వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ ఏస్సి కమిషన్
-
జాతీయ జెండా సాక్షిగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఘర్షణ
సాక్షి, మల్కాజిగిరి( హైదరాబాద్): మల్కాజిగిరిలో కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న రాజకీయ పరిస్థితులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా సాక్షిగా ఘర్షణకు దారితీసి మల్కాజిగిరిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వివరాలు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మధ్య జరిగిన వాదనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెండా ఆవిష్కరణకు ముందే ఇరువర్గాల నాయకులు గొడవకు దిగడంతో తోపులాట జరిగి గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఈ సందర్భంగా గాయాలైన కార్పొరేటర్ శ్రవణ్ తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి మల్కాజిగిరి చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా చేపట్టడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు కూడా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ చీటీ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు..
సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్): డాక్టర్ ప్రిస్క్రిఫ్షన్ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ తెలిపిన వివరాలు.. మౌలాలి హెచ్బీ కాలనీకి చెందిన భూపతి వెంకటేష్ (32) మల్కాజిగిరిలోని మెడ్ప్లస్ స్టోర్ ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా డాక్టర్ల చీటీలు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, ట్యాబెట్లను కాలేజీ విద్యార్థులతో పాటు రైల్వే స్టేషన్లలో తిరిగే మైనర్లకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద నుంచి 785 ఇంజక్షన్లు, 585 ట్యాబ్లెట్స్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి శనివారం వెంకటేష్ను రిమాండ్కు తరలించామని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు తెలిపారు. -
చిన్నారిని చదివిస్తా.. పెళ్లిచేస్తా: ఎమ్మెల్యే
సాక్షి, జగద్గిరిగుట్ట: తల్లిదండ్రులను కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లు అయ్యేంత వరకు ఆసరాగా ఉంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జగద్గిరిగుట్టకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వెంకటరమణ కుమార్తె వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 సంవత్సరాల కుమార్తె ఉండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపలి హన్మంతరావు ముందుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటరమణ కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చేరుకున్న ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి చదువుతో పాటు పెళ్లి అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, టీఆర్ఎస్ నాయకులు జైహింద్, రాజేష్, సయ్యద్ రషీద్, ఎర్ర యాకయ్య, సాజిద్, మారయ్య, రుద్ర అశోక్, ఇతర కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. -
యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి..
సాక్షి, మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి ఉప్పల్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్నగర్కు చెందిన నాగరాజు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్గా పని చేస్తాడు. ఇతని భార్య సౌజన్య(26) సోమవారం ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి సోదరుడు లింగ స్వామి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నాంపల్లికి చెందిన వారు. 22 రోజుల క్రితమె పెళ్లి జరిగినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు. చదవండి: నాంపల్లిలో బర్త్డే వేడుకపై ఆకతాయిల దాడి ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
రైల్వే ఉద్యోగి దారుణహత్య
మల్కాజిగిరి: రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...న్యూ సంతోష్రెడ్డినగర్ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్కుమార్(30) రైల్వే లోకోషెడ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లక్రితం వైజాగ్కు చెందిన భవ్యతో వివాహం జరగ్గా, పీవీఎన్కాలనీలో నివాసముంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి మహేశ్వరికి కరోనా సోకింది. భార్యను పుట్టింటికి పంపి తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించాడు. రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఉదయం సంతోష్రెడ్డినగర్లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం ఉదయం వైజాగ్లో ఉంటున్న సోదరి ప్రేమలతతో విజయ్కుమార్ మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ప్రేమలత పీవీఎన్కాలనీలో ఉంటున్న మేనత్త శారదకు ఫోన్ చేసి తమ్ముడు ఏడుస్తున్నాడని, ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్రూమ్లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్కుమార్ చేసి కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని ఏసీపీ శ్యామ్ ప్రసాద్రావు, క్లూస్టీం బృందం పరిశీలించింది. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంలాంటి కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇది తెలిసినవారే చేసిన పనిగా అనుమానిస్తున్నారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
మూడు పొరల మాస్కులు ఉచితంగా ఇస్తున్నా
కష్టాలు అడ్డంకులను అధిగమించేలా చేస్తాయి కష్టాలు జీవితం పట్ల అవగాహన పెంచుతాయి కష్టాలు ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్పుతాయి యాభై ఏళ్ల రజితారాజ్ను కలిస్తే సమస్యలను అధిగమించే నేర్పుతో పాటు, ఇతరులకు సాయపడే గుణాలను ఎలా అలవరచుకోవచ్చో తెలుస్తోంది. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న యాభై ఏళ్ల రజితారాజ్ స్వయంగా టైలరింగ్ నేర్చుకుని, దానినే ఉపాధిగా మలుచుకుని, కుటుంబం నిలదొక్కుకునేలా చేసింది. సమస్యలతో పోరాటం చేస్తున్న మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. రోజూ కాస్త తీరిక చేసుకొని వందకు పైగా మాస్కులు కుట్టి, తన బొటిక్లోని టేబుల్ మీద ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకెళ్లచ్చు. బస్తీ వాసులకు, పేదలకు అలా ఉచితంగా మాస్కులు పంచుతూ కరోనా కట్టడికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్న రజితారాజ్ తన స్వయంకృషి ని ఇలా మన ముందుంచారు. స్వీయ శిక్షణ ‘‘మాది వరంగల్. ఇంటర్ఫస్టియర్లో ఉండగానే పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణకు ఏదైనా పనిచేయక తప్పనిస్థితి ఎదురైంది. ఏ పని చేయాలో ముందు దిక్కుతోచలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తుంటే చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. వారపత్రికల్లో వచ్చే డ్రెస్ డిజైన్స్ చూసి, ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏం పని చేయగలనా అని ఆలోచించినప్పుడు మా నాన్నను అడిగితే కుట్టుమిషన్ కొనిచ్చారు. చుట్టుపక్కల వాళ్లకు బ్లౌజులు కుట్టేదాన్ని. అక్కణ్ణుంచి నోటి మాట ద్వారా ‘రజిత బాగా డ్రెస్ డిజైన్ చేస్తుంది’ అనే పేరొచ్చింది. ఇంటి నుంచే చుట్టుపక్కల లేడీస్కి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆన్లైన్ లో నా డ్రెస్ డిజైన్స్ పెట్టాను. అక్కణ్ణుంచి ఆర్డర్స్ పెరిగాయి. ఏడుగురు మహిళలే.. మా కుటుంబసభ్యుల పేర్లలో మొదటి అక్షరం తీసుకొని, వాటిని కలిపి ‘చర్ప్స్’ అని బొటిక్ పెట్టాను. నేను పని నేర్పించిన వారినే ఎంప్లాయీస్గా పెట్టుకున్నాను. ఇప్పుడు పద్నాలుగు మంది పనివారున్నారు. అందులో ఏడుగురు మహిళలే. ముప్పై ఏళ్లు పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. జీవితాల్లో స్థిరపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంత మేలు చేసిందో పిల్లలు చెబుతుంటే సంతోషం గా అనిపిస్తుంటుంది. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆడవారే త్వరగా మేలుకుంటారు. వచ్చిన ఏ చిన్న పని చేసైనా పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలనుకుంటారు. నాకు కొద్దిగా వచ్చిన టైలరింగ్నే ఉపాధిగా మార్చుకున్నాను. ఇప్పుడు కొందరికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న విద్యార్థులూ నా వద్ద వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు నేర్పిస్తాను. అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది స్కూల్గా రిజిస్టర్ కాలేదు. సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్కి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను. ఉచితంగా మాస్కులు.. ఇదో పెద్ద సాయం అనుకోను. వచ్చిన పనే నలుగురికి ఉపయోగపడితే చాలనుకుంటాను. కరోనా మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు ఇచ్చి చేతనైన సాయం చేస్తున్నాను. మాస్కుల తయారీకి కాటన్ పన్నాలు కొనుక్కొచ్చి, మూడు పొరల మాస్కులు తయారు చేసి టేబుల్ మీద పెడుతుంటాను. ఎవరికి అవసరమున్నా అడిగి తీసుకెళుతుంటారు. అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా మాస్కులు ఇచ్చి వస్తుంటాను. ఇప్పుడు వేడుకల సందర్భాల్లో మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ మాస్కులు వాడుతున్నారు. వాటి ఆర్డర్లతో పాటు ఈ ఉచిత మాస్కుల తయారీ కూడా ఉంటుంది’ అని వివరించారు రజితారాజ్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో!
సాక్షి, మల్కాజిగిరి: మౌలాలి ప్రశాంత్నగర్కు చెందిన రాకేష్(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్లో విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్ఫోన్ స్టేటస్లో మరొక అమ్మాయితో ఉన్న ఫొటోను రాకేష్ భార్య అశ్విని గమనించి ఫోన్ చేసింది. ఇంటికి వస్తున్నాని చెప్పిన రాకేష్ రాలేదు. సెల్ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ మిర్జాలగూడకు చెందిన దొడ్డి మల్లేష్ కుమారుడు మహేష్(19) ఈనెల 19వ తేదీ సెలూన్షాపు నిర్వహించే మల్లేష్కు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోతే ఫోన్ చేస్తే ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి నగర్కు చెందిన నటేషన్(39) సాఫ్ట్వేర్ ఉద్యోగి. శనివారం సాయంత్రం తన యాక్టివా మీద ఎలక్ట్రీషియన్తో కలిసి ఎలక్ట్రికల్ సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆర్.కె.నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రం తల మీద వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ఎలక్ట్రీషియన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నటేషన్ భార్య ప్రవీణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చడవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని. ) -
భర్త మందలింపు; టైలరింగ్ షాప్కు వెళ్తున్నానని చెప్పి..
సాక్షి, మల్కాజిగిరి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం... గౌతంనగర్కు చెందిన గడ్డం మహేందర్, అనూష(24) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడడాన్ని గమనించి అనూషను మహేందర్ ప్రశ్నిస్తే సోదరితో మాట్లాడుతున్నానని చెప్పింది. గత నెల 30వ తేదీ ఉదయం ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం అఫ్జల్గంజ్: బంధువులను కలిసేందుకు నగరానికి వచి్చన ఓ బధిర మహిళ అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చంద్రకళ అనే మహిళ గతంలో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాంటీన్లో పని చేస్తూ జీవనం సాగించేది. మూడు నెలల క్రితం పనిమానేసి నల్గొండకు వెళ్లింది. ఈ నెల 27న బంధువులను కలిసేందుకు వచి్చన చంద్రకళ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె కుమార్తె శ్రీలత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రకళ, శైలజ ఇంట్లో చెప్పకుండా.. బహదూర్పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్బాగ్ ఎక్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఏక్నాథ్ కుమార్తె శైలజ గత నెల 31వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆమె తండ్రి ఏక్నాథ్ పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చదువు ఇష్టంలేక ఆత్మహత్య!
మల్కాజిగిరి: చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. వసంతపురి కాలనీకి చెందిన కారింగుల విజయ్కుమార్ కారు డ్రైవర్. ఇతని పెద్ద కుమారుడు అర్జున్కుమార్(14) స్ధానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై ఇష్టం లేకపోవడంతో పలుమార్లు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఈ నెల 6 వ తేదీ ఉదయం ఎయిర్పోర్ట్లో డ్యూటీలో ఉన్న విజయ్కుమార్కు ఫోన్చేసిన అర్జున్ సోదరి మీనాక్షి తమ్ముడు బాత్రూమ్లో టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి సహకారంతో అర్జున్కుమార్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన విజయ్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శుభకార్యాలకు వస్తారు.. విలువైన వస్తువులు కొట్టేస్తారు -
స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి భవానీనగర్కు చెందిన మేఘనాథ్ కూతురు సుమిత (20) ప్రైవేట్ ఉద్యోగి. తరచూ హబ్సిగూడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూవుండేది. ఆమెతో తరచూ వీడియోకాల్ మాట్లాడుతుండడంతో తల్లి మందలించింది.ఈ నెల 1 వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమిత తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిల్ కలెక్టర్ను బెదిరించిన కేసులో.. ఏడాది జైలు నేరేడ్మెట్: విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగిన బిల్ కలెక్టర్ను కత్తితో బెదిరించిన కేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్టు బుధవారం నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....పోలీసుస్టేషన్ పరిధిలోని సంతోషిమానగర్లో నివాసం ఉంటున్న శంకర్రాయ్ ఇంటికి 2018 సంవత్సరం సెపె్టంబర్ 29న బిల్ కలెక్టర్ శ్రీశైలం పెండింగ్ విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లాడు. బిల్లు చెల్లించాలని కోరగా నిందితుడు కత్తితో బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే బిల్ కలెక్టర్ ఏఈ రవీందర్కు సమాచారం ఇచ్చాడు. ఏఈ వచ్చి బిల్లు చెల్లించాలని లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయగా, నిందితుడు ఆయన్ని బెదిరించాడు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిïÙటు దాఖలు చేశారు. బుధవారం తుది విచారణ పూర్తి కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వివరించారు. -
మల్కాజిగిరిలో వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే(40) మల్కాజిగిరి సాయి నగర్లో నివాసముంటూ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేసి నిందితురాలిని రిమాండ్కు, ఆమెతో పాటు ఉన్న యువతిని హోంకు తరలించారు. మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ -
బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ఆనంద్బాగ్లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్బాగ్లోని మండిలో చికెన్ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ బి.శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సర్దార్ పటేల్నగర్కు చెందిన ఎల్లేష్,చంద్రకళ భార్యాభర్తలు. వీరికి కుమారుడు పవన్కుమార్, కూతురు తనూష(17) ఉన్నారు. తనూష ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రజ్ఞాపూర్లోని గురుకుల్ కాలేజీలో చదువుతోంది. లాక్డౌన్ సందర్భంగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 14న ఎల్లేష్ , చంద్రకళల, పవన్కుమార్లు పనిమీద బయటకు వెళ్లారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చంద్రకళ బాత్రూమ్లో కాలిన గాయాలతో ఉన్న తనూషను గమనించింది. భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసి 108 కు సమాచారం అందించింది. సంఘటనా స్ధలానికి వచ్చిన సిబ్బంది అప్పటికే తనూష మృతి చెందినట్లు తెలిపారు. తన చావుకు తల్లితండ్రులు కారణం కాదని, జీవితం మీద విరక్తితో కిరోసిన్ పోసుకొని చనిపోదామనుకుంటున్న అని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. చదవండి: (దారుణం: మైనర్పై అత్యాచారం చేసిన ఏఎస్సై) -
దారుణం: మైనర్పై అత్యాచారం చేసిన ఏఎస్సై
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?) -
మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారం పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ విచారించింది. కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , బినామీలను ఏసీబీ విచారించింది. నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో సర్వే నెంబర్ 64లో ఉన్న 2వేల గజాల భూమిని తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నట్లు విచారణలో తేలింది. 2 వేల గజాల భూమిని ఏసీబీ ప్రభుత్వ భూమిగా తేల్చింది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను ఏసీబీ విచారించింది. తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు పలు హోటల్ బిజినెస్లలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. చదవండి: అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి! -
మేరే పీచే బాస్ హై!
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూముల వివాదాలే కారణమా? పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్లోని అసైన్డ్ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్ సమీ పంలోని యమ్నంపేట్లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్లోని సైబర్టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. మేరే పీచే బాస్ హై! సాక్షి, హైదరాదాబాద్: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్ఫాదర్’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. బినామీగా బార్ ఓనర్! ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్పాటిల్ అనే ఓ బార్ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్పాటిల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ తహసీల్దార్ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. -
ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: మల్కాస్గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్ మౌలాలిలో దారుణం
-
భర్త ప్రభాకరన్ను హతమార్చిన సుకన్య
సాక్షి, మల్కాజిగిరి : వారిద్దరూ పాత నేరస్తులే... భర్త బయట, భార్య జైలులో ఉండేది. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక అతనినే కడతేర్చింది. పోలీసులకు అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించింది. వివరాలు.. చెన్నైకి చెందిన ప్రభాకరన్, సుకన్య(32) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. చెన్నైలో మనీ బ్యాక్ స్కీమ్ ప్రారంభించిన ప్రభాకరన్ 2012లో ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రభాకరన్ భార్య సుకన్య కూడా అదే కేసులో ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్లి వచ్చింది. భర్త సమాచారం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరిలో బంధువుల వద్ద పిల్లలతో కలిసి ఉంటోంది. జైలు నుంచి వచ్చిన ప్రభాకరన్ మౌలాలి ఆండాళ్ నగర్లో నివాసముంటున్నాడు. చర్చి పాస్టర్గా, సంఘ సేవకుడిగా పనిచేసేవాడు. రెండేళ్ల కిత్రం పక్షవాతం రావడంతో తనకు తోడుగా ఒక మహిళను కేర్ టేకర్గా ఏర్పాటు చేసుకున్నాడు. భర్త సమాచారం తెలుసుకున్న సుకన్య పది రోజుల కిత్రం భర్త వద్దకు పిల్లలతో కలిసి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత భర్తతో పాటు మరో మహిళ (కేర్ టేకర్) ఉండటంతో భర్త మీద అనుమానం వచ్చింది. దీంతో కేర్టేకర్ను మాన్పించింది. కేర్ టేకర్ను రప్పించాలని భార్యతో ప్రభాకరన్ గొడవపడుతున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను, పిల్లలను చంపుతానని ప్రభాకరన్ బెదిరిస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి కేర్టేకర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య దిండుతో భర్త మొహం మీద ఒత్తి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి మరుసటి రోజు ఉదయం ఆమెనే 100 నంబర్కు కాల్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి సుకన్య నిరాకరించడం, సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో సుకన్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెను రిమాండ్కు తరలించాము’ అని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్ఐ వెంకట్రెడ్డి వెల్లడించారు. -
వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..!
సాక్షి, కామారెడ్డి: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మాసాయిపేట బంగారమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరి మధురానగర్ కాలనీలో నివాసముండే సంగరాజు వెంకటయ్య కుమారుడు రవికుమార్ (30), లాలగూడా ప్రాతంలో ఉండే సంతోష (29)కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే.. సంతోషకు 9 సంవత్సరాల క్రితం శంకర్ యాదవ్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు కుమారులు ఉన్నారు. రవికుమార్కు సైతం వేరే మహిళతో వివాహం జరిగింది. కాగా.. వీరిమధ్య నడుస్తున్న అక్రమ సంబంధం విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో బైక్పై మాసాయిపేటకు వచ్చిన జంట.. రోడ్ పక్కన బైక్ నిలిపి రైలు పట్టాలపై పడుకోగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొనడంతో వారు మృతి చెందారు. కామారెడ్డి రైల్వే ఎస్సై తవు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించారు. చదవండి: అక్క భర్తతో చనువు.. గర్భవతిగా మారి చివరకు..! -
మలక్పేట్ మార్కెట్లో పాటించని జాగ్రత్తలు
-
రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. విడుదలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసింది. ఇదిలావుండగానే పీటీ వారెంట్పై విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరా కేసులో రేవంత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టీఆర్ఎస్ లోక్సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనితో స్థానిక వ్యవహారం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తూ.. సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న పెండింగ్ కేసులో త్వరగతిన విచారణ జరిపించాలని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. (భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!) రేవంత్పై నమోదైన కేసుల చిట్టా.. ఆర్వోసీ, సీబీఐతో పాటు ఎన్నికల కమిషన్ వద్ద పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటికితోడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఓటుకు నోటు కేసుతో సహా, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటి కేసులు ప్రస్తుతం విచారణలో విచారణ ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. 32కేసులు ఇప్పటికే ఆయనపై నమోదై ఉన్నాయి. జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్ కేసులు, ట్రెస్పాస్, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్పై ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్3, బంజారాహిల్స్ 3, అబిడ్స్ 3, సుల్తాన్ బజార్ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్ స్టేషన్లో మరో కేసు రేవంత్పై నమోదై విచారణ దశలో ఉన్నాయి. (రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత) దీంతో రేవంత్రెడ్డిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ జరపాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో ఏ కేసులో అయినా నేరం రుజువై.. శిక్ష పడితే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలై.. బలమైన సాక్షాధారాలు ఉన్నందున ఈ కేసు నుంచి రేవంత్ తప్పించుకోవడం అంత సులభంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన గోపనపల్లి భూకబ్జా కేసులో అనేక అక్రమాలతో పాటు వాటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడం తెలిసిందే. మరోవైపు రేవంత్రెడ్డి అరెస్టుపై లోక్సభ జీరో అవర్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మాణికం ఠాగోర్ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, మేడ్చల్జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అధికారులు తుది ఓటర్ల జాబితాను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారిగా వెల్లడించారు. డిసెంబర్ 30న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా కలెక్టరేట్లతో(జిల్లా కేంద్రాల్లో) పాటు మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి..జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పొప్పులపై చర్చించారు. అలాగే, ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఆయా మార్పులతో శనివారం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్లు ఎంతమందో ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశముంది. కాగా, శనివారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో 115 డివిజన్లు, 189 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 5,90,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,895 మంది, మహిళలు 2,82,541 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 100 డివిజన్లు, 151 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,40,366 ఉండగా, వీరిలో 3,29,261 మంది పురుషులు, 3,11,037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారు. -
ప్రేమ పేరుతో వేధింపులు..
సాక్షి, మల్కాజిగిరి: ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వాణీనగర్కు చెందిన సాయిప్రసాద్(35) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి తండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం దయానంద్నగర్ స్టేషన్ వద్ద సాయిప్రసాద్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మరదలితో అసభ్య ప్రవర్తన; బావకు బేడీలు
సాక్షి, హైదరాబాద్: మరదలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరెడ్మెట్, ఓల్డ్ సఫిల్గూడకు చెందిన శ్రీనివాసులు(38) కారు డ్రైవర్గా పని చేసేవాడు. అతడికి మరదలి వరుసయ్యే ఓ మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో ఉత్తంనగర్ ప్రాంతంలో తల్లితో కలిసి ఉంటోంది. నెల రోజులుగా శ్రీనివాసులు సదరు మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమను తిరస్కరించినందుకు పరువు తీశాడు ప్రేమను తిరస్కరించిందనే కోపంతో క్లాస్మేట్ వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్లకు చెందిన మేడిశెట్టి శ్రీకాంత్ బాధితురాలితో పాఠశాల స్థాయి నుంచి కలిసి చదువుకున్నాడు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె ఫొటోలు, ఆమె వ్యక్తిగత ఫొటోలను తీశాడు. అయితే కొంతకాలంగా అమె బిజీగా ఉండటంతో శ్రీకాంత్తో మాట్లాడం మానేసింది. తన ఫోన్కాల్స్కు స్పందించకపోవడంతో గత నెలలో వనస్థలిపురంలోని ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. తనతో పెళ్లి చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఆ తర్వాత బాధితురాలు అతడి ఫోన్ ఎత్తకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో తన కెమెరాతో తీసిన పాత ఫొటోలను బయటికి తీసి తన ఫేస్బుక్ స్టేటస్లో పెట్టడమేగాక కామెంట్లు పెడుతూ ఆమె వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
మూడు గంటల్లో.. 14.93 కుండపోత
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని వర్షం హడలెత్తించింది. పలు ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్ కావటంతో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన అతిభారీ వర్షంతో నగరంలో పలు కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. గుడిమల్కాపూర్లో 3 గం టల వ్యవధిలో 14.93 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. శివరాంపల్లిలో 14.05, మోండాలో 13.95, రెడ్హిల్స్లో 13.53 విజయనగర్కాలనీలో 13.2, తిరుమలగిరిలో 12.48, ముషీరాబాద్లో 11.98, శ్రీనగర్కాలనీలో 11.73 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరమంతటా సగటున 8.97 సెం.మీ. వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు నీటముని గాయి. కార్వాన్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో శుక్రవారం మధ్యాహ్నం దాకా సాధారణ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడిమల్కాపూర్, నానల్నగర్, టోలిచౌకి ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది. కార్వాన్, గోల్కొండ డివిజన్లలోడ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. మల్కాజిగిరిలో అవే అవస్థలు మల్కాజిగిరి, ఉప్పల్లో పలు కాలనీలు జలమయం కావటం, నాలాలు ఉప్పొంగటంతో జనాలు అవస్థల పాలయ్యారు. మల్కాజిగిరిలో బండచెరువు పరిసరాల్లోని కాలనీలు వరదనీటిలో మునిగిపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నాచారం హెచ్ఎంటీ నాలా ఉధృతంగా ప్రవహించటంతో ఉప్పల్– చిలుకానగర్, ఉప్పల్ –స్వరూప్నగర్లో రాకపోకలు మధ్యాహ్నం వరకూ నిలిచిపోయాయి. ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని కాలనీల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మల్కాజిగిరి వర్షమే రికార్డ్ నగరంలో ఇప్పటివరకు మల్కాజిగిరిలోనే రికార్డు వర్షం కురిసింది. 2017 సెప్టెంబర్ 14న మల్కాజిగిరిలో కురిసిన 20.15 సెం.మీ. వర్షపాతమే ఇప్పటివరకు అత్యధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. కూలిన గోల్కొండ సెంట్రీ గది గోల్కొండ: భారీ వర్షాలకు చారిత్రక గోల్కొండ కోట మోతీ దర్వాజాను ఆనుకొని ఉన్న సెంట్రీ గది కూలింది. కోట నిర్మించిన అనంతరం నయాఖిల్లా నిర్మాణ సమయంలో మోతీదర్వా జా వద్ద ఈ గదిని నిర్మించారు. దర్వాజా వద్ద కాపలా ఉండే సైనికులు దీనిని రెస్ట్రూంగా ఉపయోగించేవారు. ఈ గదిలో ఫిరంగిగుండ్లు, విషసర్పాలు, తేళ్లను కూడా ఉంచేవారు. శత్రువులు కోటపైకి దండెత్తినప్పుడు దర్వాజా బయట కందకాలలో విషసర్పాలు, తేళ్లను వదిలేవారు. శత్రువులు కందకాల నుంచి ఈదుకుంటూ లోపలికి రాకుండా ఈ విధంగా చేసేవారు. కాగా, కూలే సమయంలో గదిలో ఒక ఎద్దు, 3 ఆవులు ఉన్నాయి. కూలిన తర్వాత రెండు ఆవులు, ఎద్దును బయటకు తీశారని కోట పరిరక్షణాధికారి ఎ.భానుప్రకాష్ వర్మ తెలిపారు. -
మల్కాజిగిరి గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
-
గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్గిరిలోని ఓ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక విఫ్ణుపురి కాలనీలోని మైత్రీనివాస్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఏర్పాటు చేసిన మండలంలో మంటలు చెలరేగడంతో రెండు కార్లు, పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సహాయంతో మిగితా వాహనాలను అపార్ట్మెంట్ వాసులు బయటకు తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా ప్రాణ నష్టం తప్పడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
మరో 'లవ్ జిహాదీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో లవ్ జిహాదీ వ్యవహారం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో రఫిక్ అనే యువకుడు ఓ దళిత యువతిని మోసం చేసిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. రఫిక్.. తనను బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గర్భం దాల్చిన తర్వాత తనను మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. వరంగల్కి చెందిన రఫిక్ .. 6 ఏళ్ల క్రితం క్రిష్ణవేణితో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. మలక్పేటలో ఉద్యోగం చేస్తూ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణవేణి బలవంతంగా మతం మార్చుకుని షబానా గా మారింది. పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్ అప్పటినుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటినుంచి డబ్బులు తేవాలని హింసించడం ప్రారంభించాడు. దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతోఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం పేరిట మోసం..
సాక్షి, హైదరాబాద్ : వర్క్ ఫ్రమ్ హోం పేరిట నిరుద్యోగులకు ఓ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఈ సంఘటనపై బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం ఎస్ వర్క్ ఫ్రమ్ హోం పేరిట కార్ఖానాలో ఉన్న ఓ సంస్థ వారం క్రితం మల్కాజిగిరి శివపురికాలనీలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సంస్థలో చేరడానికి రూ.2,500, దరఖాస్తుకు రూ.500, పని చేయడానికి ఉపయోగించే షీట్స్ కోసం మరో రూ.2,500 చెల్లిస్తే నెలకు ఎనిమిది వేలు సంపాదించుకోవచ్చని నిరుద్యోగులను నమ్మించింది. దీంతో నాచారం, మల్కాజిగిరి, మౌలాలి, ఈసీఐఎల్ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, విద్యార్థులు సుమారు నలభైమంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఉద్యోగంలో చేరారు. ఎంతమందిని చేర్పిస్తే వారికి ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున అందజేస్తామని చెప్పడంతో చాలామంది చేరారు. సంస్థ అందచేసే షీట్స్లో వారు పంపించిన క్రమ సంఖ్యలో నింపి వారానికి ఒకసారి అందచేయాలి. అలా అందచేసిన షీట్లను బట్టి వారికి నగదు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే వారం దాటినా నగదు చెల్లించకపోవడంతో బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సెక్టార్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
మల్కాజ్గిరి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ : తల్లిదండ్రులను వేధించే పిలల్లకు గుణపాఠంగా మల్కాజ్గిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి మరణాంతరం తల్లి ఆలనపాలన చూడాల్సిన కొడుకే కర్కశంగా మారడంతో ఆ అభాగ్యురాలు పోలీసులు, కోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ఆస్తి కోసం తల్లిని వేధించిన కొడుకుతో పాటు కోడలికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల జరిమానా విధించింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి (70)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2013లో భర్త చనిపోయాడు. భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ తన భార్యతో సహా తల్లి ఉండే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమే కాకుండా ఆమెను బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి... 2015లో పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా విచారణ జరిగిన ఈ కేసు తుదితీర్పు నేడు(సోమవారం) వెలువడింది. పెద్ద కుమారుడు అమిత్ కుమార్, కోడలు శోభిత లావణ్యలకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు చేరో పదివేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతోనైనా సమాజంలో మార్పురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఇక్కడ పని జరగాలంటే ముందు పైసలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్గిరిలో ఓ మహిళ నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారి ఫులూ నాయక్ ఏసీబీ అధికారులకు దొరికాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్గిరి పెన్షన్ కార్యాలయంలో ఫులూ నాయక్ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓమహిళ తన పెన్షన్ డబ్బులు తీసుకోడానికి కార్యాలయానికి వెళ్లింది. పెన్షన్ డబ్బులు కావాలంటే తనకు కొంత ముట్ట చెప్పాలని ఫులూ నాయక్ ఆమహిళను డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఫులూ నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
నేను పార్టీ మారను : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారుతానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం, మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజిగిరిలో ప్రజలు తనని ఆశీర్వదించారన్నారు. కొడంగల్లో కేసీఆర్, హరీష్ రావు తనపై కుట్రలు చేసి ఓడించారని, కానీ ప్రశ్నించేవారు ఉండాలని రేవంత్ రెండ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటానని, వారికిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను తిప్పి కొడతామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వల్ల గెలిచిన బీజేపీని పార్లమెంట్లో నిలువరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. -
ప్రజలకు రుణపడి ఉంటాను
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను అవుతానని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఎనుగుల రేవంత్రెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కేసీఆర్ రాజ్యం అనుకుంటున్నారని, తండ్రీ కొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ ఫలితాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్ వర్సిటీలను సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్లకు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసే వరకు పోరాడతానని చెప్పారు. మల్కాజిగిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎత్తేసి, గ్రేటర్ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మిలటరీ అధీనంలోని రోడ్లపై ప్రజలకు స్వేచ్ఛ ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. -
మల్కాజ్గిరిలో రేవంత్ విజయం
సాక్షి, హైదరాబాద్ : మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాయం పాలైన రేవంత్కు ఈ ఫలితం ఊరట నిచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు చోట్ల విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగానే వచ్చాయి. కానీ ఈ రోజు వెలువడిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. రేవంత్ రెడ్డితో పాటు నల్గొండలో ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. -
చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!
సాక్షి, హైదరాబాద్ : చెక్బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి మల్కాజిగిరి ఫస్ట్ సెషన్స్ కోర్టు కోటి రూపాయల జరిమానా విధించింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో నిందితుడికి జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. దాంతోపాటు బాధితుడికి అసలు రూ.55 లక్షలు, నష్టపరిహారంగా మరో రూ.20 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది టి.నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్పురి నివాసి గూడూరు సంజీవరెడ్డి (సాయి రత్న) వ్యాపార నిమిత్తం సాకేత్ మిథిలాలో నివాసముండే మొగుల్ల విజయభాస్కర్ రెడ్డి (42) కి రూ.55 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చేందుకు డెక్కన్ గ్రామీణ బ్యాంక్ (ఎస్సార్ నగర్ బ్రాంచ్)కు సంబంధించిన రు.25 లక్షల రూపాయల చెక్కును 2015, నవంబర్ 23న, రూ.30 లక్షల చెక్కును 2015, డిసెంబర్ 1న విజయభాస్కర్ రెడ్డి సంజీవరెడ్డికి ఇచ్చారు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా ఫెయిల్ అయ్యాయి. దీంతో సంజీవ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం ఇరువురి వాదనలు విన్న జడ్జి సాంబశివ మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు విజయ భాస్కర్ రెడ్డిపై వచ్చిన చెక్బౌన్స్ ఆరోపణలు రుజువైనందున రూ.కోటి జరిమానాతోపాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితుడికి అసలు 55 లక్షల రూపాయలతో పాటు 20 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు మాసాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు అనంతరం విజయ భాస్కర్ రెడ్డి ని కుషాయిగూడ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
కనకారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
-
మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి (68) మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం కన్నుమూశారు. కనకారెడ్డి 2014లో మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. 2008లో తొలిసారి ప్రజారాజ్యంలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2013లో టీఆర్ఎస్లో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1951లో సికింద్రాబాద్లో జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటల సంతాపం మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేగా కనకారెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కనకారెడ్డి మృతిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషనన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. -
నైట్డ్యూటీ కావడం, పాస్ అవుతానోలేదోననే బెంగతో..
మల్కాజిగిరి: మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిసిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హరిబాబు, జగదీశ్వరిలు మల్కాజిగిరి దయానంద్నగర్లో నివాసముంటున్నారు. వారి రెండో కుమారుడు అయ్యప్ప శ్రీనిధి(21) డిగ్రీ తప్పడంతో తిరిగి పరీక్షలు రాశాడు. కాల్ సెంటర్లో కూడా పనిచేస్తున్నాడు. తను చేస్తున్న ఉద్యోగం నైట్డ్యూటీకావడం, మళ్లీ పాస్ అవుతానోలేదో బెంగతో కొన్ని రోజులుగా ఇంట్లో ముభావంగా ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం అయ్యప్ప శ్రీనిధి అన్న వాచస్పతి ఉద్యోగానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కొక్కికి ఉరివేసుకొని ఉన్న అయ్యప్ప శ్రీనీధి కనిపించాడు. గమనించగా అప్పటికే మృతి చెందాడు.మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘స్థానిక’ సమరానికి సన్నద్ధం
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 42 ఎంపీటీసీ, నాలుగు ఎంపీపీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ స్థానానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై మరో సమరానికి సన్నద్ధమవుతోంది. మే నెలలో మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీలు, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీ స్థానాలు మాత్రమే ఉండటంతో మొదటి దశలోనే స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు నివేదించింది. ఈ నెల 18న జరిగే కలెక్టర్ల సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం ఫైనల్ కానున్నట్లు సమాచారం. జిల్లాలోని శామీర్పేట్ మండలంలో కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి రెవెన్యూ మండలంగా మాత్రమే కొనసాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మండల పరిషత్ విషయానికి వస్తే మూడు చింతలపల్లి ఉమ్మడి శామీర్పేట్ మండలం పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీ స్థానాల్లో 1.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 297 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన యంత్రాంగం అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.39 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోనుంది. 4 మండలాలతో మేడ్చల్ జెడ్పీ సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ)నాలుగు మండలాలకు మాత్రమే పరిమితమైంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. దీంతో మేడ్చల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, 61 గ్రామ పంచాయతీలు, 42 ఎంపీటీసీ స్థానాలతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు ఇలా.. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ కేటగిరికి రిజర్ చేశారు. దీంతో నాలుగు మండలాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 61 గ్రామ పంచాయతీలు ఉండగా, 42 ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఘట్కేసర్ మండలంలో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, కీసర మండలంలో 11 గ్రామ పంచాయతీల పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు, శామీర్పేట్ మండలంలో 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 ఎంపీటీసీ స్థానాలు, మేడ్చల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి 10 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఘట్కేసర్ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీకి రెండు రిజర్వు చేయగా, ఇందులో ఒకటి ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీకి రెండు స్థానాలు రిజర్వు చేయగా ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో మహిళలకు రెండు , జనరల్కు మూడు కేటాయించారు. ♦ కీసర మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించారు. ఇందులో రెండు స్థానాలు బీసీ జనరల్కు కేటాయించగా, ఒక స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇతరులకు నాలుగు స్థానాలు కేటాయించారు. వీటి రెండు స్థానాలు మహిళలకు, రెండు స్థానాలు జనరల్కు రిజర్వు చేశారు. ♦ మేడ్చల్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒకటి ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీలకు సంబంధించి ఒకటి మాత్రమే కేటాయించగా మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించగా ఇందులో ఒకటి మహిళలకు, రెండు స్థానాలు బీసీ జనరల్కు రిజర్వు చేశారు. ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేశారు. ఇందులో మహిళలకు రెండు స్థానాలు, జనరల్కు మూడు స్థానాలు కేటాయించారు. ♦ శామీర్పేట్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో ఎస్టీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. ఎస్సీలకు మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో ఒకటి మహిళకు, రెండింటిని జనరల్ (ఎస్సీ)కు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి మహిళ, రెండు జనరల్కు కేటాయించారు. ఇతరులకు ఎనిమిది స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో నాలుగు మహిళ, నాలుగు జనరల్కు కేటాయించారు. ఎంపీపీ ఇలా.. జిల్లాలో నాలుగు మండలాలు ఉన్నాయి. శామీర్పేట్ ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ జనరల్కు రిజర్వు చేశారు. కీసర ఎంపీపీ స్థానం బీసీ జనరల్, ఘట్కేసర్ ఎంపీపీ స్థానాన్ని ఆన్రిజర్వుడ్కు కేటాయించారు. మేడ్చల్ ఎంపీపీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేశారు. జెడ్పీటీసీ ఇలా.. శామీర్పేట్ జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. కీసర జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ జనరల్కు, ఘట్కేసర్ స్థానాన్ని అన్రిజర్వుడ్కు కేటాయించారు. మేడ్చల్ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేశారు. -
సర్వం సిద్ధం
సాక్షి,మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీసెగ్మెంట్లలో 31,49,710 మంది ఓటర్లు ఉండగా, 2,982 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 3,430 ఈవీఎంలతోపాటు 3,707 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి బస్తీలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలు, గ్రామాల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించామన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి..ఓటేయగానే ఇంటికి తరలించే విధంగా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 51.68 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 55.88 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన కార్యక్రమాన్ని రెండు విడతలుగా చేపట్టామని, వారి సమక్షంలోనే ఈ యంత్రాల పనితీరును మాక్ పోలింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఎన్నికల విధుల్లో 20 వేల సిబ్బంది ఎన్నికల విధినిర్వహణలో 12 వేల మంది ఉద్యోగులు, ఎనిమిది వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లలో ఉంటారని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా మైక్రో అబ్జర్వర్లగా 130 మంది, ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 2,444 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 2,444 మంది, పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 4,890 మందిని నియమించామన్నారు. రూ.5.16 కోట్ల నగదు సీజ్ మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో తరలిస్తున్న రూ.5,16,52,500 సీజ్ చేయటంతోపాటు ఆరు కేసులు నమోదు చేసినట్లు ఎంవీరెడ్డి తెలిపారు. 1335 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు ఠాణాల్లో డిపాజిట్ చేయగా, 650 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. 19,889 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. -
‘డబుల్’పై శ్రద్ధ చూపండి
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నత్తలకే నడక నేర్పిస్తోంది. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో రూ.150 కోట్ల వ్యయంతో 2840 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 12 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1050 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా 1790 ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఇందులో 40 శాతం ఇళ్లు మాత్రం టెండర్లు, బేసిమెంట్ దశలకే పరిమితమైంది. ఇళ్ల పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం జిల్లాలో గృహ నిర్మాణ శాఖను రద్దు చేయటంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ, పీఆర్ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం ఇలా .. జిల్లాలో ఆర్అండ్బీ శాఖ అధ్వర్యంలో 12 ప్రాంతాల్లో 1050 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు 560 ఇళ్లు మాత్రమే సత్వరమే లబ్దిదారులకు కేటాయించేందుకు వీలుగా ఉన్నాయి. మిగతా ఇళ్లకు సంబందించి కరెంటు, రోడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కీసరలో 50 ఇళ్లు, యాద్గార్పల్లిలో 40, పీర్జాదిగూడలో 74, పర్వతాపూర్లో 40, చెంగిచర్లలో 40 , తుర్కపల్లిలో 40 ఇళ్లు ,కిష్టాపూర్లో 80, సోమారంలో 30 , చీర్యాలలో 40, బోడుప్పల్లో 74, ఘట్కేసర్లో 50 ఇళ్లు, కొర్రెములలో ఒకటి ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 490 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఆయా ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. జిల్లాలో పంచాయతీ రాజ్ (పీఆర్) శాఖ అధ్వర్యంలో 33 ప్రాంతాల్లో 1790 డబుల్బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పీఆర్ అధ్వర్యంలో శ్రీరంగవరం, గిర్మాపూర్, గౌడవెళ్లి, రాజబోల్లారం, పూడుర్, నారాయణపూర్, అనంతారం, జగ్గంగూడ, తుర్కపల్లి, అలియాబాద్, కీసర, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, చీర్యాల, యాద్గార్పల్లి, కేశవపూర్, చౌదరిగూడ, నారపల్లి, అవుషాపూర్, పోచారం, ప్రతాప్సింగారం, మేడిపల్లి, బోడుప్పల్, పర్వాతాపూర్, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరం, యాడారం, ఉప్పరపల్లి, డబీల్పూర్, ఏదులాబాద్, శామీర్పేట్ ప్రాంతాల్లో 1790 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. -
లష్కర్లో ముగ్గురూ ముగ్గురే!
కీలకమైన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకూ ఈ లోక్సభ పరిధిలో బలం ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పూర్తిగా సిటీ ఓటర్లున్న ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఇక్కడ పోటీ కొనసాగుతోంది. కానీ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. సెగ్మెంట్ల వారీగా..ముషీరాబాద్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఠా గోపాల్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 51.18 శాతం ఆయనకు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్పై 36,888 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంబర్పేట మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి టీఆర్ఎస్ తరపున కాలేరు వెంకటేశ్ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 45.6 శాతం వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డిపై 1,016 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఖైరతాబాద్ దానం నాగేందర్ (టీఆర్ఎస్) గెలిచారు. పోలైన ఓట్లలో 53.66 శాతం ఆయనకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 43.1 శాతం వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్రెడ్డిపై 16,011 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సనత్నగర్ ఇక్కడ తలసాని శ్రీనివాసయాదవ్ (టీఆర్ఎస్)కు.. 55.2 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గమిది. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు విజయం సాధించారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్కు పట్టుంది. నాంపల్లి ఇక్కడ నుంచి మజ్లిస్ అభ్యర్థి హుస్సేన్ 43.4 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్పై 9,675 ఓట్ల తేడాతో గెలిచారు. బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్లో గెలుపు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సికింద్రాబాద్ లోక్సభ.. బీజేపీకి సిట్టింగ్ స్థానం. సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయను పక్కన పెట్టి ఆ పార్టీ కిషన్రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన గత అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ మరోసారి మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ను రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ మాత్రం ప్రయోగం చేసింది. మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ను పోటీకి దించింది. ఇది సిట్టింగ్ సీటు కావడం, మోదీ చరిష్మాపై కిషన్రెడ్డి ధీమా పెట్టుకోగా, అంజన్కుమార్ యాదవ్ తన పరిచయాలు, కాంగ్రెస్ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ పూర్తిగా కొత్త. తండ్రి తలసాని శ్రీనివాసయాదవ్పైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్ పరిధిలో టీఆర్ఎస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీ ఫలితాలే పునరావృతమైతే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లే. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్థానం నుంచి గెలుపొందని టీఆర్ఎస్, ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. పైగా లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేల అండతో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు తలపోస్తున్నారు. జనసేన తరపున శంకర్గౌడ్ రంగంలో ఉన్నారు. మొత్తం ఈ స్థానం నుంచి 28 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్– కాంగ్రెస్– బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా గత లోక్సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పెద్దగా పట్టులేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంతో పరిస్థితి మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ లోక్సభ స్థానం పరిధిలో ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తంగా ఈ లోక్సభ పరిధిలోని ఇటీవలి అసెంబ్లీ ఓట్ల తీరును పరిశీలిస్తే... టీఆర్ఎస్కు 4,29,390 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 2,44,789, బీజేపీకి 1,72,188 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో గెలిచిన ఎంఐఎంకు 52 వేల ఓట్లు వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ సీటును కచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గుబాళించాలని గులాబీ.. ఇప్పటివరకు గెలవని చోట బోణీ కొట్టాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ పరిధిలోని నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 2018లో అన్నింటినీ టీఆర్ఎస్ గెలుచుకోవడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాతో ఉంది. పైగా సాయికిరణ్ను గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకే అప్పగించారు. ప్రస్తుతం వారంతా ప్రచారంలో ఉన్నారు. పైగా మంత్రి తలసానికి ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. బలమైన సామాజిక వర్గమైన బీసీ ఓటర్ల అండ ఉంది. అయితే అభ్యర్థి సాయికిరణ్ యాదవ్.. అనుభవజ్ఞులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో తలపడటం ఆసక్తి కలిగిస్తోంది. ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్.. అంజన్కుమార్ యాదవ్ను మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 2004 నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసిన ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తిరిగి బరిలో ఉన్నారు. ఆ విధంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్కు మంచి పట్టు ఉండేది. పైగా ఈ స్థానం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ ఎంపీలే గెలిచారు. ఈ ఎన్నికల ద్వారా పూర్వ వైభవాన్ని చాటాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. గెలుపు కోసం ఆ పార్టీ నేతలు శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకుంటున్నారు. అయితే కీలకమైన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిపోతుండటంతో కాంగ్రెస్కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కాంగ్రెస్ నాయకులు కోరారు. పైగా బీసీ సామాజికవర్గ ఓట్లున్నాయి. అయితే ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయం ఆయనకు మైనస్గా చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల్లో పార్టీకి నాయకుల కొరత ఉంది. సీటు నిలబెట్టుకోవాలని బీజేపీ.. తమకు గట్టి పట్టున్న సికింద్రాబాద్ సిట్టింగ్ సీటును మరోసారి దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి పట్టుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని 3 సెగ్మెంట్లలో గెలుపొందిన బీజేపీ 2018 ఎన్నికల్లో ఒక్కచోటా గెలుపొందలేకపోయింది. అంబర్పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన కిషన్రెడ్డిని ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. కిషన్రెడ్డిపై ఓటర్లలో సానుకూల వైఖరి ఉందని, దీనికితోడు మోదీ అనుకూల పవనాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక్కడి నుంచి గెలిపిస్తే కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని, అభివృద్ధి చేయడానికి వీలుంటుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్లే అండదండ చిన్న వయసులోనే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు. నాకు అనుభవం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు.. కేసీఆర్ విధానాలే నన్ను గెలిపిస్తాయి. పైగా మా నాన్న మంత్రి. ఆయనకు ఇక్కడ కార్యకర్తలు, ప్రజాబలం ఉంది. ఇవన్నీ నాకు కలిసొచ్చేవే. బీజేపీ, కాంగ్రెస్ గెలిచినా ప్రయోజనం లేదు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంటే అధికారంలోకి వస్తుంది. నా గెలుపు నల్లేరుపై నడకే.. బీజేపీ.. బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించి బీసీలను అవమానించింది. ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఫెడరల్ ఫ్రంట్ను అధికారంలోకి తెస్తారు.– తలసాని సాయికిరణ్ యాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి కేంద్రంలోఅధికారం మాదే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. పైగా నేను ఎంపీగా గతంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. బడుగు, బలహీన వర్గాల కోసం కష్టపడ్డాను. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారు. రాహుల్ ప్రధానైతే రాష్ట్రానికి నిధులొస్తాయి. వాటి సాయంతో అభివృద్ధికి పాటుపడతాను. – అంజన్కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నా గెలుపు ఖాయం ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునేవి కాబట్టి ఇందులో టీఆర్ఎస్ ఎంపీలు ఓడినా, గెలిచినా ప్రజలకు లాభం లేదు. మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణ ప్రజలు మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. కేసీఆర్ అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ లోనే ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ కాలేదు. రేపు కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా టీఆర్ఎస్లోకి వెళ్లిపోవడం ఖాయం. సికింద్రాబాద్లో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది.– కిషన్రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనం మాట... కేసీఆర్ని గెలిపించాల్సిందే.. మోదీకి బీజేపీని, రాహుల్కు కాంగ్రెస్ను గెలిపించాలని ఉంటుంది. కానీ తెలంగాణ గెలవాలంటే కేసీఆర్ను గెలిపించాలి. ఎందుకంటే జాతీయ పార్టీల దృష్టి ఒకలా ఉం టుంది. ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఆ ప్రాంతం అభివృద్ధి, వనరుల సృష్టి కోసం ఉంటుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ప్రాచుర్యం పొందాయి. టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. – శంకర్, సినీ డైరెక్టర్ మంచి అభ్యర్థికి ఓటేయండి మంచి అభ్యర్థిని గుర్తించి ఎంచుకోవాలి. పొరపాటున డబ్బు తీసుకొని కానీ, ఇతరత్రా ప్రలోభాలకు గురై కానీ ఓటేయకూడదు. రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. కానీ కొందరు ఓటేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటేయాలని నా విన్నపం. మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే.– హేమ, సినీనటి మోదీతోనే దేశాభివృద్ధి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే పార్టీ, అభ్యర్థికి ఓటేస్తాను. ప్రస్తుతం జరిగే ఎన్నికలు కేవలం పార్లమెంటుకు సంబంధించినవి. అంటే ప్రధాని ఎవరో నిర్ణయించేవి. మోదీతోనే దేశంలో అభివృద్ధి జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటకు వచ్చింది. కాబట్టి బీజేపీకి మద్దతివ్వాలనుకుంటున్నా.– జి.ఆనంద్, నగల వ్యాపారి, ముషీరాబాద్ ఫ్రంట్తోనే దేశం ముందుకు.. టీఆర్ఎస్కే ఓటేస్తా. కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే దేశంలో చక్రం తిప్పుతానని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే టీఆర్ఎస్కు ఓటేస్తాను. కేంద్రంలో జాతీయ పార్టీలుంటే రాష్ట్రాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరిన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందడం ఖాయం. కె.శ్రీకాంత్ నా చెల్లి పెళ్లికి సాయం షాదీ ముబారక్ పథకం కింద నా చెల్లి పెళ్లికి ప్రభుత్వంరూ. 50 వేలు ఇచ్చింది. కాబట్టి నేను టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తాను.– రహీమ్, కూరగాయల వ్యాపారి, విజయనగర్ కాలనీ పురుషులు 10,24,917 స్త్రీలు 9,43,171 ఇతరులు 59 మొత్తం 19,68,147 సికింద్రాబాద్లోక్సభలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు ♦ సికింద్రాబాద్ ♦ ముషీరాబాద్ ♦ ఖైరతాబాద్ ♦ జూబ్లీహిల్స్ ♦ నాంపల్లి ♦ సనత్నగర్ ♦ అంబర్పేట సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం -
మల్కాజిగిరి 31,49,710 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2,96,97,279 మంది ఓటర్లు ఓటేయనున్నారు. అందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అత్యధికంగా 31,49,710 మంది ఓటర్లుండగా, మహబూబాబాద్ స్థానంలో అత్యల్పంగా 14,23,351 మంది ఓటర్లున్నారు. -
అతి పెద్ద స్థానం.. తీర్పు విలక్షణం..
చింతకింది గణేశ్, సాక్షి– హైదరాబాద్ :అనేక ప్రాంతాల ప్రజలు.. భిన్న సంస్కృతుల నెలవు.. పారిశ్రామికరంగానికి రాజధాని.. మల్కాజిగిరి. జీవనోపాధి కోసం వచ్చే వలస కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కలిగిన అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమిది. రాష్ట్రానికే తలమానికమైన రక్షణ రంగ సంస్థలు, ఐటీ కంపెనీలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, వైద్య, వ్యాపార రంగాల పురోగతితో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ నియోజకవర్గంలోని ప్రజలకు సామాజిక, రాజకీయ చైతన్యం ఎక్కువే. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు పట్టం కట్టిన ఇక్కడి ఓటర్లు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి (ప్రస్తుతం ఈయన టీఆర్ఎస్లో ఉన్నారు) గెలిపించారు. 2009 ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం మూడోసారి జరగబోతోన్న ఈ ఎన్నికల్లో ముఖ్యనేతలు పోటీ పడుతుండటంతో అంతటా ఆసక్తి కలిగిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు 2008లో ఆవిర్భవించాయి. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 30,98,816 మంది ఓటర్లు ఉన్నారు. పరిశ్రమల కేంద్రానికి రాజధానిగా విరాజిల్లుతున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఉద్యోగులు, వ్యాపార వర్గాలతోపాటు రోజువారీ కూలీలు, కుటీర పరిశ్రమలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు జీవనం సాగిస్తున్నారు. అక్షరాస్యతలో ముందంజలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది నివసిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత వాతావరణాన్ని కలబోసుకున్న ఈ నియోజకవర్గంలో వివిధ వర్గాల ఓటర్లే గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఓటరు తీర్పు విలక్షణం మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానుండగా, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉంది. మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ 93,226 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయనకు 3,88, 368 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భీమ్సేన్కు 2,95, 042 ఓట్లు లభించాయి. ఇక పీఆర్పీ అభ్యర్థి దేవేందర్గౌడ్ 2,38,886 ఓట్లతో మూడో స్థానంలో నిలి చారు. బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1,30,206 ఓట్లు లభించాయి. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మల్లారెడ్డి 28,371 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పు డు ఆయనకు 5,23,336 ఓట్లు లభించగా, టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు 4,94,965 ఓట్లు వచ్చాయి. సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్)కు 2,33,711 ఓట్లు లభిం చాయి. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి చామకూర మల్లారెడ్డి, సర్వే సత్యనారాయణ, మైనంపల్లి హనుమంతరావు, లోక్సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ్, వైఎస్సార్సీపీ నుంచి మాజీ డీజీపీ దినేశ్రెడ్డి పోటీ చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే.. ఇక్కడ గెలిచిన మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందటంతోపాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నీ టీఆర్ఎస్వే! ప్రస్తుత ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు పోటీకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో, ఓటరు విలక్షణ తీర్పు ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. గెలుపు విషయంలో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా ఒక్క ఎల్బీనగర్ నుంచి మాత్రం సుధీర్రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. అయితే ఆయన కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడంతో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్కు చెందిన వారే కానున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లుఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో టీడీపీలో పని చేసినందున ఈ నియోజకవర్గంలోని సెటిలర్లు, టీడీపీ ఓట్లు కూడా తనకే వస్తాయన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తమకు ఓటుబ్యాంకు, ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మా, కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో ప్రజలు తమకే ఓటు వేస్తారని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల్లో ప్రభావంచూపే అంశాలు ♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు పథకాల ప్రభావంటీఆర్ఎస్కు అనుకూలం కానుంది. ♦ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లక్షల్లో నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పటికైనా ఇళ్లు రాకపోతాయా అన్న ఆశతో వీరంతా ఉన్నారు. ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వీరంతా ఇళ్ల విషయాన్ని ప్రధాన సమస్యగా భావించడం లేదని తెలుస్తోంది. ♦ రోడ్ల మరమ్మతులు, స్కైవ్ వే (ఫ్లైఓవర్లు) మార్గాలకు ప్రతిపాదనలతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ♦ చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, మల్కాజిగిరి అండర్ బ్రిడ్జి పనులు మరింత వేగం పుంజుకోవాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్ ప్రాంతంలోని హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారివిస్తరణ పనులుచేపట్టాలని ప్రజలుకోరుతున్నారు. కబ్జాల నుంచి చెరువులను పరిరక్షించేందుకుతీసుకుంటున్న చర్యలు మరింత కఠినంగాఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మౌలాలి కమాన్నుంచి బస్సులువెళ్లక ఏళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఇక్కడి స్థానికులుల్లో ఉంది. హైదరాబాద్ నగరంలోని మూడో వంతు జనాభా ఇక్కడే ఉంటారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక మాస్టర్ప్లాన్తో స్మార్ట్ సిటీచేయాలన్న డిమాండ్ ఉంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం ప్రతిపాదనలకు మోక్షం కలగాల్సి ఉంది. బోడుప్పల్లో 360 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీఐఆర్ పనులకు శ్రీకారం చుట్టాలి. మల్కాజిగిరి లోక్సభ ఓటర్లు పురుషులు 16,13,001 మహిళలు 14,85,504 ఇతరులు 311 మొత్తం 30,98,816 మల్కాజిగిరి లోక్సభలో అసెంబ్లీ సెగ్మెంట్లుమేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్,కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్. -
ఇవి పీఎంను నిర్ణయించే ఎన్నికలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈ ఎన్నికలు ముఖ్య మంత్రి కుర్చీ కోసం కాదని, ప్రధానమంత్రిని నిర్ణయించేందుకు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయటానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లా డారు. తాను పోటీలో ఉన్నానంటే సీఎం కేసీ ఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నా రు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని, ఉప ప్రాంతీయ పార్టీల మధ్య కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఏఐసీసీ అధినేత రాహుగాంధీ ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని గాలికి వదిలేసి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచి ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసేవారికే కేసీఆర్ టికెట్లు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, సుఖేందర్రెడ్డి, సీతారాంనాయక్, వివేక్లకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని, వారిప్పుడు బావిలో దూకాలా.. అని అన్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ టికెట్ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి వేలంపాటలో కేటాయించారని, ఇలాంటి వాళ్లు ప్రజాసమస్యలపై ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని, తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ బలహీనపరుస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షం ఉండొ ద్దని చంద్రబాబు అనుకుంటే వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉండేవారా... రాజశేఖర్రెడ్డి వద్దనుకుంటే.. చంద్రశేఖర్రావు ఉండేవారా... ఇందిరాగాంధీ అనుకుంటే.. వాజ్పేయి, అద్వానీ లాం టి వారు ఉండేవారా.. అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, నేతలు తోటకూరి జంగయ్యయాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ కలెక్టరేట్ వరకు రేవంత్ పార్టీ శ్రేణులతో భారీర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవీరెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నా గెలుపుకు సహకరించండి: రేవంత్ సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. తన గెలుపుకు సహకరించాలని ప్రజాగాయకుడు గద్దర్ను కోరారు. ఆయన విజ్ఞప్తికి గద్దర్ కూడా సానుకూలంగా స్పందించారు. రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం గద్దర్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దరన్న ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతు లేకపోతే పేదలకు న్యాయం జరగదని, రాష్ట్రంలో అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. సీపీఐ, టీజేఎస్, గద్దర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సికింద్రాబాద్ బరిలో కిషన్రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై దిగ్భ్రాంతికి గురైన తెలంగాణ బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై ఆశగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా ఏడు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి సిట్టింగ్ సీటైన సికింద్రాబాద్తోపాటు నగర ఓటర్లున్న మల్కాజిగిరి స్థానంపై ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది.సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తాను బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే, మంగళవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2004లో హిమాయత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత 2009, 2014లో అంబర్పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోయిన ముఖ్యమైన నేతలలో ఆయన కూడా ఒకరు. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో నిలవాలని గతంలోనే కిషన్రెడ్డి ప్రణాళిక రచించుకున్నప్పటికీ శాసనసభ ఎన్నికలు ముందస్తుగా రావడంతో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్పేయి, మోదీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ దత్తాత్రేయకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చని, కిషన్రెడ్డి వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇతర పార్టీల నేతలకు స్వాగతం..! ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు కూడా బీజేపీ స్వాగతం పలుకుతోంది. మహబూబ్నగర్ నుంచి టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత ఏపీ జితేందర్రెడ్డికి ఆ పార్టీ టికెట్ దొరక్కపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. పెద్దపల్లి నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ నేతకు టికెట్ దక్కనిపక్షంలో తమ వద్దకే చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్ తదితర స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ప్రముఖులెవరూ ఆసక్తి కనబరచడం లేదు. మల్కాజిగిరి నుంచి రాంచందర్రావు మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి న్యాయవాది, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావును పోటీ చేయించేందుకు బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. రాంచందర్రావు 2018 శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ జంటనగరాల పరిధిలో ఉండడంతో అర్బన్ ఓటర్లు మోదీ నాయకత్వంపై సానుకూల దృక్పథంతో ఓటు వేస్తారని బీజేపీ ఆశిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి జనార్దన్రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, జహీరాబాద్ నుంచి సోమాయప్ప స్వామీజీ, మహబూబ్నగర్ నుంచి శాంతికుమార్ పేర్లు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. -
ఉత్తమ్ పోటీచేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: సర్వే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు, కీలకనేతలంతా పార్టీని వీడుతుంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, నాయకత్వం మార్పు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రక్షాళన జరిగిననాడే తిరిగి గాంధీ భవన్లో ఆడుగుపెడతానని స్పష్టంచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడేదిలేదని, ఉత్తమ్ ఎంపీగా పోటీచేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సర్వే తెలిపారు. రేవంత్కు సీపీఐ మద్దతు కాగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఆయన ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్వే సత్యనారాయణతో భేటీ అయ్యి మద్దతు కోరారు. మాల్కాజ్గిరి అంటే సర్వే సొంత ఇల్లు లాంటిదని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా రేవంత్ కోరారు. కాగా ఎంపీగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ప్రకటించాల్సిందిగా నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కూడా రేవంత్ భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో ‘సర్వే’ దుమారం -
అడుగంటిపోతున్నాయి
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరంలో భాగమైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ఫిబ్రవరి‡లో జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 9.88 కాగా, ఈ ఏడాది భూగర్భ జల మట్టంతో పోలిస్తే 4.44 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. ఈ సారి పాతాళ గంగ 14.32 మీటర్లు లోతుకు పడిపోయింది. నగరానికి నీటిని అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవటంతో తాగునీటికి ఇబ్బందులు తçప్పక పోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణ రహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవసరమైన ప్రాంతాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్ భగీరథ పనులు పూర్తవటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్యలకు ఇబ్బందులు ఉండకపోవచ్చునని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. రోజూ భారీగా తాగునీటి ఖర్చు మేడిపల్లి మండలంలో గత ఫిబ్రవరితో పోల్చితే ఈ ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం 6.48 మీటర్ల లోతుకు పడిపోగా, మల్కాజిగిరిలో 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. అలాగే, కుత్బుల్లాపూర్లో 9.08 మీటర్లు, కాప్రాలో 6.76 మీటర్లు, దుండిగల్లో 8.22 మీటర్లు, మేడ్చల్లో 3.88 మీటర్లు, కీసరలో 3.87 మీటర్లు, అల్వాల్లో 3.65 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీరందించే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కాకపోవటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లోని పలు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు రోజు వారీ అవసరాలకు వినియోగించే వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో 120 అపార్టుమెంట్లు ఉండగా, ఒక్కొక్క అపార్టుమెంట్కు రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున నీటి వినియోగం అవసరం. ఈ లెక్కన ఒక ట్యాంకర్ నీటికి రూ.500 చొప్పున రెండు ట్యాంకర్లకు రూ.1,000 ప్రతి రోజు ఒక అపార్టు మెంట్ వాసులు వెచ్చిస్తున్నారు. 120 అపార్టుమెంట్స్ వారు తాగునీరు కాకుండానే ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం రోజుకు రూ.1.20 లక్షల చొప్పున నెలకు రూ.36 లక్షలు వెచ్చిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన నాగారం, జవహర్నగర్, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది. -
వాట్సాప్లో పోస్ట్.. గ్రూప్ అడ్మిన్తోపాటూ ఒకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్(మల్కాజ్గిరీ): వాట్సాప్ గ్రూప్లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు గ్రూప్ అడ్మిన్తోపాటూ, పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి లాయల్ పార్ట్నర్స్ ఎమర్జెన్సీ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. గత నెల26న గ్రూప్ సభ్యుడైన మొహమ్మద్ మునీర్ జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అదే గ్రుప్ సభ్యుడైన వెంకట రామ రెడ్డి అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రూపు అడ్మిన్ వెంకటేష్, మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి మొహమ్మద్ మునీర్పై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఔటర్లో గెలిచేదెవరు?
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ఈసారి సార్వత్రిక పోరు హోరాహోరీగా సాగనుంది. ఉత్తర,దక్షిణ భారత దేశానికి చెందిన ఓటర్లు, విద్య,ఉద్యోగం,వ్యాపారం కోసం నగరానికి వచ్చి స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల వారితో మినీ ఇండియాను తలపిస్తోన్న శివార్లలో పలు నియోజకవర్గాల్లో గెలుగు గుర్రాలేవన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆకాశహారŠామ్యలు ఒకవైపు..నిరుపేదల గుడిసెలు మరోవైపు..పారిశ్రామిక వాడలు ఒకవైపు...వాణిజ్య భవనాలు మరోవైపు..నాణేనికి రెండు పార్శ్వల్లా ఉన్న ఈ నియోజకవర్గాల్లో పేదాగొప్ప తారతమ్యం సుస్పష్టం అధ్వాన అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల సౌకర్యాల లేమి, ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి సమస్య,పారిశ్రామిక కాలుష్యంతో సతమతమౌతున్నాయి.సమస్యలతో సహవాసం చేస్తున్న పలు కీలక శివారు నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారిన ఎన్నికల పోరుపై ’సాక్షి’ అందిస్తోన్న గ్రౌండ్రిపోర్ట్... ఎల్బీనగర్లో నువ్వా..నేనా.. ఏపీ నుంచి రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రవేశించే గేట్వేలా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి,టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్గౌడ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ తరఫున బరిలోకి దిగిన పేరాల శేఖర్రావు కూడా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,నియోజకవర్గంలో 11 మంది కార్పొరేటర్లు తమ పార్టీ వారే కావడంతో తన గెలుపు ఖాయమని రామ్మోహన్ గౌడ్ భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ నుంచి పూర్తిసహకారం లభిస్తుండడం,గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి,అన్ని వర్గాలతో ఉన్న సత్సంబంధాలు తన గెలుపునకు దోహదం చేస్తాయని సుధీర్రెడ్డి విశ్వసిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్రావు భూత్,డివిజన్స్థాయి క్యాడర్పై ఆశలు పెట్టుకున్నారు. లింగోజిగూడా,నాగోలు,హయత్నగర్ సహా అన్ని డివిజన్లలో నెలకొన్న ముంపు సమస్యలు,ట్రాఫిక్ ఇక్కట్లు,కాలనీలకు మినీ బస్సు సర్వీసులు లేక ప్రజారవాణా అస్తవ్యస్తంగా మారడం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేయనున్నాయి. ఉప్పల్ బరిలో గెలుపు ఎవరిదో.... పాతకొత్తల సమ్మేళనంగా నిలిచిన ఉప్పల్ నియోజకవర్గంలో ఈ సారి కీలక పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న భేతి సుభాష్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బోలెడు ఆశలుపెట్టుకున్నారు. కూటమి పార్టీలో అనైక్యత, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి వీరేందర్గౌడ్ గతంలో తన తండ్రి దేవేందర్గౌడ్ చేపట్టిన అభివృద్ధి పథకాలు,బీసీ ఓట్లు తనవైపేనని భావిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సెటిలర్స్ ఓట్లతోపాటు తాను వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. గత పదేళ్లుగా టీడీపీ క్యాడర్నిర్వీర్యంకావడం,కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండడం వీరేందర్గౌడ్కు ఇబ్బంది కరంగా మారింది. కుత్బుల్లాపూర్లో ద్విముఖ పోటీ.. పారిశ్రామికవాడలు.. రసాయన బల్క్ డ్రగ్ కాలుష్యం,రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల నిలయం కుత్బుల్లాపూర్. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి కూన వివేక్గౌడ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఉన్న సెటిలర్స్ ఓట్లపై ఇద్దరు నేతలు బోలెడు ఆశలుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండడం, సౌమ్యునిగా పేరొందిన టీఆర్ఎస్ అభ్యర్థి వివేక్ తన గెలుపును ఆకాంక్షిస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బల్క్డ్రగ్ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న కాలుష్యంతో అవçస్తలు పడుతున్న జనం, ఓపెన్నాలాలు, 450 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు ఏర్పాటుచేసినప్పటికీ సగం పైపులైన్లలో తాగునీటి జాడలు లేకపోవడం,నీటినిల్వలు లేక అలంకార ప్రాయంగా మారిన రిజర్వాయర్లపై జనం అసంతృప్తిగా ఉన్నారు. ఐటీ అడ్డాలో పాగా ఎవరిదో.. దేశ,విదేశాలకు చెందిన దిగ్గజ ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలు,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా,దేశ,విదేశీ అతిథులు,సెటిలర్స్తో మినీ ఇండియాగా..ఐటీఅడ్డాగా..సైబరాబాద్గా పేరొందింది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. తమ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండడం,పార్టీకి ఉన్న పది మంది కార్పొరేటర్ల సహకారంతో ప్రచారపర్వంలో ముందున్నారు. కూటమిలో కుమ్ములాటలు టీడీపీ అభ్యర్థి ఆనంద్ప్రసాద్కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించడంలేదు.రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గజ్జెల యోగానంద్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సెటిలర్స్ ఓట్లు,విద్యాధికుల ఓట్లు తనకేనన్న ధీమాతో ఉన్నారు. కూకట్పల్లిలో ముగ్గురి యుద్ధం... సెటిలర్స్ ఎక్కువ గా ఉండే∙ కూకట్పల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు,ప్రజాకూటమి తరఫున చుండ్రు సుహాసిని,బీఎస్పీ తరఫున హరీష్రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు తనకు వరంగా మారతాయని టీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ క్యాడర్,నేతల నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కూటమి అభ్యర్థి చుండ్రు సుహాసిని అగ్రనేతల రోడ్షోలతో ప్రచార పర్వంలో ముందున్నప్పటికీ భూత్,డివిజన్ స్థాయిలో బలంగా లేకపోవడం ఇబ్బంది క రం. ఇక బీఎస్పీ అభ్యర్థి హరీష్రెడ్డి గత రెండునెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడం,టీఆర్ఎస్పార్టీలో అసంతృప్తులు తనకు సహకరిస్తారన్న ధీమాతో ఉన్నారు. రాజేంద్రనగర్లో త్రిముఖ పోరు.. కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు,కాటేదాన్ పారిశ్రామిక వాడ,చారిత్రక జంటజలాశయాలు నెలకొన్న ఈ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్,బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తోకల శ్రీనివాస్ రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ప్రకాశ్గౌడ్ భావిస్తున్నారు. పార్టీలో ఆయన అభ్యర్థిత్వంపై అసంతృప్తులు,క్యాడర్కు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఆయనపై ఉ¯న్నాయి. బీజేపీ సీనియర్నేత బద్దం బాల్రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తోపాటు యూపీ,బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల సెటిలర్స్ ఓట్లపై విశ్వాసం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ రెబెల్గా బరిలో ఉన్న తోకల శ్రీనివాస్రెడ్డి క్యాడర్లో ఉన్న సానుభూతి తనకు కలిసివస్తుంద ని భావిస్తున్నారు. ఈనియోజకవర్గంలో ప్రధానంగా జి.ఓ.111 ఎత్తివేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి..రాజ్ ఎవరో.. ఉత్తర,దక్షిణభారత రాష్ట్రాలు,తెలుగురాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి వలసవచ్చినవారితో నిండిన ఈ నియోజకవర్గం మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు,టీజేఎస్ అభ్యర్థి దిలీప్కుమార్,బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సంస్థాగతంగా టీఆర్ఎస్పార్టీ బలంగా ఉండడం,క్యాడర్ మద్దతు,గత నాలుగేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పార్టీ కార్యకలాపాలు తన గెలుపును నల్లేరుమీద నడకప్రాయంగా మారుస్తాయని మైనంపల్లి హనుమంతరావు భావిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తారన్న విమర్శకూడా ఉంది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విద్యాధికుడు,గతంలో ఓడిపోయారన్న సానుభూతి,ఉత్తరాది సెటిలర్స్ ఓట్లు తనకు కలిసివస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్కుమార్ చివరిక్షణంలో ప్రచారంలో పుంజుకున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్,టీడీపీ శ్రేణులు ఆయనకు సహకరిస్తున్నాయి. అయితే ఆయన పార్టీ గుర్తుకు సరైన ఆదరణ లేకపోవడం ,పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం ఆయనకు మైనస్పాయింట్గా మారింది. -
119 నియోజకవర్గాలు.. 1821 అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 119 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 23తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులే పోటీలో నిలిచారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో అత్యధికంగా అభ్యర్థులు రేస్లో నిలవగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో అతి తక్కువగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. మల్కాజ్గిరి తర్వాత ఉప్పల్, ఎల్బీనగర్లో 35 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. నగరం బయట అత్యధికంగా మిర్యాలగూడలో 29 మంది, సూర్యపేటలో 25 మంది ఈ ఎన్నికల బరిలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. బాన్సువాడ తర్వాత అతి తక్కువగా జుక్కల్, బోత్ నియోజకవర్గాల్లో ఏడుగురు.. ఎల్లారెడ్డి, నిర్మల్ల్లో 8 మంది పోటీపడుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి 119 మంది బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ 118, సీపీఐ 3, టీడీపీ 13, ఎంఐఎం 8, సీపీఐ(ఎం) 26, బీఎస్పీ 107, ఎన్నికల కమిషన్చే గుర్తింపు పొందిన ఆయా పార్టీల నుంచి 515, స్వతంత్ర్య అభ్యర్థులుగా 1306 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతుండగా..ఫలితాలు 11న వెలువడనున్న విషయం తెలిసిందే. -
‘మినీ భారత్’మహాన్
భిన్న సంస్కృతులు, భాషలు, మతాలకు నిలయమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగేతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు (సెటిలర్స్)కీలక భూమిక పోషించనున్నారు. ఐటీ, బీపీఓ, కేపీఓ, నిర్మాణరంగంతోపాటు హార్డ్వేర్, ఫార్మా, బల్క్డ్రగ్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు హబ్గా మారిన గ్రేటర్ హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో తెలుగేతర భాషలు మాట్లాడే వారి ఓట్లే అభ్యర్థుల గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా దశాబ్దాల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడిన వీరంతా ఇక్కడి వ్యాపార, వాణిజ్య, సేవా రంగాలతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ తమదైన పాత్రపోషిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన సెటిలర్స్ ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్కు చెందినవారు నగరంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గోషామహల్, అంబర్పేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో తెలుగేతర భాషలు మాట్లాడే సెటిలర్స్ జనాభా, ఓట్లు అధికంగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం ఓటర్లు 76 లక్షల మంది కాగా.. ఇందులో సెటిలర్స్ ఓట్లు 13 శాతం.. అంటే పది లక్షల మేర ఉన్నట్లు అంచనా. వీరిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. గోషామహల్: ‘ఉత్తరాది’ హల్చల్ నగరంలో వ్యాపార, వాణిజ్యాలకు ప్రసిద్ధి చెందిన బేగంబజార్, సుల్తాన్బజార్, గోషామహల్ ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోనివే. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల వారు ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరపడ్డారు. ఇక ధూల్పేట్, మంగళ్హాట్, గన్ఫౌండ్రీ, గౌలిగూడ ప్రాంతాల్లో పంజాబీలు, కన్నడిగులు, మహారాష్ట్రీయులు అత్యధికంగా నివసిస్తున్నారు. నియోజకవర్గంలో 2.29 లక్షల ఓట్లుండగా.. 30 వేల మంది ఇతర రాష్ట్రాల మూలాలున్న వారే. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి ముఖేశ్గౌడ్ గెలవగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ నేత రాజాసింగ్ లోథ్ ఎన్నికయ్యారు. రాజాసింగ్ లోథ్ ఉత్తర్ప్రదేశ్ మూలాలున్న వ్యక్తి. ఆ ఎన్నికల్లో ఆయనతో తలపడిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూత్ కొన్నేళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందినవారే. స్వతంత్రుడిగా బరిలో దిగిన మరో అభ్యర్థి నందకిశోర్ వ్యాస్ కూడా రాజస్తాన్ నుంచి సుదీర్ఘకాలం కిందట వచ్చి స్థిరపడిన వారే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందున్న మహరాజ్గంజ్ నియోజకవర్గం కూడా రాష్ట్రేతరులను ఆదరించింది. రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన ప్రేమ్సింగ్ రాథోడ్ 1999లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి గెలుపొందారు. అంబర్పేట: అందరి కోట అంబర్పేట నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు ఉన్న హిమాయత్నగర్ నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు దీని పరిధిలోకి వచ్చాయి. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నేత కిషన్రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లి, బర్కత్పుర, నింబోలీ అడ్డా, మోతీ మార్కెట్, నల్లకుంట, కాచిగూడ, పుత్లిగూడ, విద్యానగర్ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వారున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.35 లక్షల మంది కాగా, ఇందులో సెటిలర్స్ ఓట్లు 20 వేల వరకు ఉన్నాయి. 1978 నుంచి 2004 వరకు హిమాయత్నగర్ నియోజకవర్గం నుంచి కానీ, 2004, 2014ల్లో అంబర్పేట నుంచి కానీ రాష్ట్రేతరులెవరూ ఎన్నిక కాలేదు. కానీ ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో మాత్రం వీరి ఓట్లున్నాయి. కంటోన్మెంట్: ‘దక్షిణాది’ ఎఫెక్ట్ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సైనిక స్థావరాలు ఏర్పాటైన ప్రాంతమిది. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నా.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ జనాభా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. వీరితో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలవారూ ఉన్నారు. తిరుమలగిరి, లాల్బజార్, కార్ఖానా, బొల్లారం, బోయినపల్లి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 2.35 లక్షల మంది ఓటర్లుండగా, 30 వేల మంది వరకు సెటిలర్స్ ఉన్నారు. మల్కాజ్గిరి: తమిళనాడు ప్రాబల్యం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 4 లక్షల మంది ఓటర్లుండగా.. నేరేడ్మెట్, యాప్రాల్, అల్వాల్ ప్రాంతాల్లో తమిళనాడుకి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువ. వీరి ఓట్లు 20 వేల వరకు ఉన్నట్లు అంచనా. గతేడాది ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలోనూ విజేతను నిర్ణయించడంలో సెటిలర్స్ ఓట్లే కీలకం కానున్నాయి. -ఏసిరెడ్డి రంగారెడ్డి పోలింగ్ సరంజామా సాధారణంగా పోలింగ్ కేంద్రానికి ఓటు వెయ్యడానికి వెళ్లినపుడు ఈవీఎం, సిరా.. మరికొంత సామగ్రి మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ, పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో అవసరమైన సామగ్రి.. మనకు కనిపించనిది, తెలియనిదీ చాలా ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఏయే రకాల సామగ్రి ఎంతెంత ఉండాలో, ఏ పరిమాణంలో ఎంత మేరకు ఉండాలో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓటరు స్లిప్, ఓటురు కార్డు, బ్యాలెట్, ఈవీఎం.. ఇవి అందరికీ తెలిసున్నవే. ఇవికాక.. ఓటరు జాబితా, వర్కింగ్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, సర్వీస్ ఓటర్ల సీఎస్వీ జాబితా, టెండర్ ఓట్ల కోసం 20 బ్యాలెట్ పేపర్లు, రెండు ఇండెలిబుల్ ఇంక్ బాటిల్స్, ఐదు సీయూ, అడ్రస్ ట్యాగులు, నాలుగు బీయూ అడ్రస్ ట్యాగులు, మూడు స్పెషల్ ట్యాగులు, ఈవీఎం కోసం నాలుగు గ్రీన్ సీల్స్, ఔటర్ పేపర్ కోసం మూడు సీల్స్, రబ్బర్ స్టాంపు, క్రాస్ మార్క్ స్టాంప్, ఒకటి వంకాయ రంగు స్టాంపు ప్యాడ్, ప్రిసైడింగ్ అధికారి వాడటానికి మెటల్ సీల్, ప్రిసైడింగ్ అధికారి డైరీ, మార్కు రబ్బరు స్టాంపు, పోలింగ్ సామగ్రి పెట్టడానికి స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ కవర్లు.. ఇవన్నీ ఉండాలి. పోలింగ్ జరగడానికి ముందే.. ఆ పోలింగ్ కేంద్రానికి కేటాయించిన ఎన్నికల సిబ్బంది పైన పేర్కొన్న సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. అమ్మో.. నామినేషన్! ఆదిలాబాద్ డెస్క్: ఎన్నికల సమయంలో సమస్యలను ఎలుగెత్తడానికి కొందరు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటారు. అత్యధిక మంది పోటీకి నిలవడం ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులను హడలెత్తి్తస్తుంటారు. 1996 ఎన్నికల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్.. ప్రస్తుత తెలంగాణలోని నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ల వర్షం కురిసింది. ఆ లోక్సభ ఎన్నికల్లో 480 మంది నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి వీరంతా పోటీకి దిగారు. వీరిలో 477 మంది డిపాజిట్ కోల్పోయారు. రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల సంఘాన్ని ఆలోచింపజేసింది. వీరందరి కోసం ప్రత్యేక బ్యాలెట్ రూపొందించడానికి నాడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. తరువాత కాలంలో ‘అత్యధిక నామినేషన్ల’ పర్వాన్ని నిలువరించేందుకు పలు చర్యలు తీసుకుంది. 1996 ఎన్నికల తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ను అమాంతం పెంచేసింది. 1996 ఎన్నికలకు ముందు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.500 డిపాజిట్, అసెంబ్లీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పార్లమెంటుకు పోటీ చేస్తే రూ.250, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రూ.125 డిపాజిట్ చెల్లించాల్సి ఉండేది. 1996 ఎన్నికల తర్వాత.. పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.25,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500, అసెంబ్లీకి పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.5,000 చొప్పున డిపాజిట్ మొత్తాన్ని పెంచింది. -
టీజేఎస్ని ఓడిస్తాం : కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజక వర్గం అసెంబ్లీ టికెట్ను కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్కే కేటాయించాలంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మల్కాజిగిరి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెబ్లీ టికెట్ను స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాదని ఈ టికెట్ని టీజేఎస్కు ఇస్తే అందరం కలిసి మల్కాజిగిరిలో టీజేఎస్ను చిత్తుగా ఒడిస్తామని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న కార్యకర్తలు ఎవరు టీజేఎస్కు ఓటు వేయరని తెలిపారు. అసలు క్యాడరే లేని టీజేఎస్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసి తమ డిమాండ్ను తెలుపుతామని చెప్పారు. -
వైరల్ వీడియో: ఎంపీ మల్లన్నను పాలతో ముంచెత్తారు!!
తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల వేళ ఎన్ని కళలు, మరెన్ని విచిత్రాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకోవడానికి నాయకులు చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. మరోవైపు అభిమానులు కూడా తమకు ఇష్టమైన నాయకులపై తమ ప్రేమను అమాంతం చాటుకుంటారు. ఇదేవిధంగా విద్యాసంస్థల అధిపతి, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డిపై ఆయన అభిమానులు బోలెడంతా ప్రేమను చాటారు. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి ఏకంగా పాలాభిషేకం చేశారు. బకెట్ నిండా పాలు తెచ్చి.. చెంబులతో ఆయనపై పోస్తూ.. నిండా తడిపేశారు. అనంతరం పూజారి ఆయనపై అక్షంతలు చల్లి.. ఆశీర్వదించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ విధంగా పాలాభిషేకం చేసి.. తమ అభిమానంతో తడిపేసినట్టు తెలుస్తోంది. ఏమైనా మల్లన్నకు ఇలా పాలాభిషేకం చేయడంపై సోషల్ మీడియాలో భిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. -
ఎంపీ మల్లారెడ్డికి పాలాభిషేకం
-
ఫస్ట్ బ్యాచ్
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత శాసనభ రద్దుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న పార్టీ, తాజా పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనలకు తెరలేపుతోంది. తాము ఏకాభిప్రాయం వ్యక్తమైన స్థానాల్లో వారికే నేరుగా ఫోన్ చేసి ‘పని చేసుకోవాల్సింది’గా పార్టీ ముఖ్యనేతలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ప్రగతిభవన్ నుంచి నగరానికి చెందిన పలువురు అభ్యర్థులకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సనత్నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, వివేకానంద్, కృష్ణారావు, సాయన్నతో పాటు సికింద్రాబాద్ నుంచి మరోసారి మంత్రి పద్మారావుకు నియోకజవర్గంలో ఎన్నికల మైక్పట్టుకోమంటూ ప్రధాన నేతలు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలపై కొద్ది రోజులుగా జరుగుతున్న తర్జనభర్జనల అనంతరం మంగళవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సూచనప్రాయంగా అభ్యర్థుల స్థానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతి పేరుపై వాడీవేడిగా చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఐతే ఈ మారు కూడా తానే పోటీ చేసేందుకు కనకారెడ్డి మొగ్గు చూపుతున్న దృష్ట్యా, ఆయనతో చర్చించిన తర్వాత విజయశాంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇదే నియోకజవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సైతం ఈసారి ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెంచుకున్నారు. మంగళవారం జరిగిన సమావేశానికి హన్మంతరావు హాజరు కాలేదు. ఇక మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాలపై కూడా చర్చ జరిగినప్పుటికీ అధికారిక ప్రకటనకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మేడ్చల్ లేదా ఉప్పల్ స్థానాలపై ఎంపీ మల్లారెడ్డి లేదా ఆయన సమీప బంధువు మర్రి రాజశేఖర్రెడ్డి అభ్యర్థిత్వాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఈ రెండు స్థానాలను ఇప్పటికిప్పుడు పేర్లను ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకోవాలని, మరో సర్వే నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. మేడ్చల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటు ఎంపీ మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి పేర్లపైనా చర్చించినట్టు తెలిసింది. ఎల్బీనగర్ నియోకజవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వీరిద్దరి అభ్యర్థిత్వాలపైనా చర్చింది. అయితే, చివరకు రామ్మోహన్గౌడ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉప్పల్ నియోకజవర్గానికి సంబంధించి మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు. -
కూతురిపై లైంగికదాడికి యత్నం
మల్కాజిగిరి : కన్న కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించిన తండ్రిని మల్కాజిగిరి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. జేఎల్ఎస్నగర్కు చెందిన కూకట్ల నాగరాజు(33), చంద్రకళ దంపతులు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యను వేధించేవాడు. కూతురు నగరంలోని ఓ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఐదో తరగతి చదువుకుంటోంది. ఈ నెల 2న తాగిన మైకంలో నాగరాజు కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసుకొని నాగరాజును అరెస్ట్ చేశారు. -
పగలు డ్రైవర్..రాత్రి డేంజర్
సాక్షి, సిటీబ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఠాణాలోని కాలనీలనే టార్గెట్గా చేసుకుని కారులో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ప్రజాపత్ సురేష్ను మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు గడిచిన ఐదు నెలల్లో ఆరు చోరీలు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన సురేష్ బతుకుతెరువు కోసం 1996లో నగరానికి వలసవచ్చాడు. చెంగిచెర్ల, మాణికేశ్వర్నగర్ ప్రాంతాల్లో స్వీట్షాప్లు ఏర్పాటు చేశాడు. మద్యం సహా అనేక వ్యసనాలకు బానిసైన సురేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. వీటి నుంచి బయటపడటంతో పాటు జల్సాల కోసం స్వీట్షాపులను అమ్మేశాడు. ఆపై ఓ కారు కొనుక్కుని డ్రైవర్గా మారినప్పటికీ ఆ ఆదాయంతో సంతృప్తి చెందలేదు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేడిపల్లిలోని పీర్జాదిగూడలో నివసించే ఇతగాడు ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లో ఆరు నేరాలు చేశాడు. అర్ధరాత్రి వేళ తన కారులో తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను గుర్తించేవాడు. తన వాహనాన్ని ఆ ఇంటికి కొంతదూరంలో ఆపి వచ్చేవాడు. ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగులకొట్టడం ద్వారా లోపలికి ప్రవేశించి అందినకాడికి ఎత్తుకుపోయేవాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి 21.5 తులాల బంగారు, 18.5 తులాల వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, ట్యాబ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఘరానా దొంగపై పీడీ యాక్ట్ రాచకొండ కమిషనరేట్ పరిధికి చెందిన ఘరానా దొంగ ఆవుల గిడ్డయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చి మల్కాజ్గిరి ప్రాంతంలో స్ధిరపడిన గిడ్డయ్య వరుస నేరాలు చేస్తున్నాడు. 2017–18ల్లోనే 28 చోరీలు చేశాడు. నేరేడ్మెట్, మల్కాజ్గిరి, కీసర, మేడిపల్లిల్లో పంజా విసిరాడు. గత నెలలో నేరేడ్మెట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
ప్రాణంతీసిన స్థలవివాదం
మల్కాజిగిరి : ఇంటి స్థల వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వారాసిగూడకు చెందిన జగన్మోహన్ పదేళ్ల క్రితం సత్తిరెడ్డి నగర్కు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి నర్సయ్య భార్య భారతమ్మ పేరున ఉన్న ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ఇళ్లు ఖాళీ చేసే విషయమై ఇరువురి మద్య విదాదం నడుస్తోంది. జగన్మోహన్ కోర్టుకు వెళ్లగా అతని అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అతను ఇళ్లు ఖాళీచేయించేందుకు తరచూ మల్కాజిగిరికి వచ్చి పోతున్నాడు. మంగళవారం మల్కాజిగిరి వచ్చిన జగన్మోహన్ హత్యకు గురయ్యాడు. పరారీలో భారతమ్మ కుటుంబ సభ్యులు హత్య జరిగిన సమయంలో భారతమ్మ ఇంటి పోర్షన్లోనే అద్దెకు ఉంటున్న మహిళకు భారతమ్మ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో బయటికి వచ్చి చూడగా ఎదురుగా ఖాళీస్థలంలో ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ కొమురయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. నర్సయ్య, భారతమ్మ, ఆమె కుమారులు వెంకటేష్, గోవిదరాజులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ ఎక్కడికెళ్లాడు ?
సాక్షి హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ మల్కాజిగిరి జోన్ పరిధిలోని నేరేడ్మెట్ ఎస్ఐ నాగరాజు ఏమయ్యాడో అంతుపట్టడం లేదు. ఆయన కనిపించకుండాపోయి దాదాపు మూడు రోజులవుతున్నా ఆచూకీ లభించడంలేదు. క్రైం మీటింగ్ మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయిన ఎస్ఐ తరువాత నుంచి ఠాణాకు అందుబాటులో లేకపోవడం పోలీసు శాఖలో కలకలం రేగింది. కొందరు పైఅధికారుల వేధింపులే వల్లనే ఎస్ఐ అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జోరుగా సాగుతోంది. పని భారం కూడా మరో కారణమనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పుల్లం నాగరాజు మొదటి పోస్టింగ్గా ఏడాదిన్నర క్రితం నేరేడ్మెట్ ఠాణాలో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహారిస్తాడని ఆయనకు పేరుంది. ఇటీవల ఆయనపై పనిభారం పెరిగినట్టు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాలను చక్కదిద్దాలని, అందుకు అంగీకరించకపోవడంతో ఓ అధికారి తరుచూ ఎస్ఐని వేధింపులకు గురి చేసేవాడని తెలిసింది. దాంతో కేసులు పెండింగ్లో ఉన్నాయనే సాకుతో ఎస్ఐ పనితీరును సదరు అధికారి తప్పుబట్టేవాడని తెలుస్తోంది. ఈ వేధింపులు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఎస్ఐకి బాలాపూర్కు బదిలీ అయ్యాడని పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. బాలాపూర్కు వెళ్లడం ఎస్ఐకి ఆసక్తి లేదని, అందుకే ఇలా చేసిఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలోనే ఈనెల 22వతేదీన జవహర్నగర్లో సీఐ,ఎస్ఐలతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం సుమారు 10గంటలకు ఈ సమావేశానికి హాజరైన ఎస్ఐ నాగరాజు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. మరో ఎస్ఐ వెంకట్రెడ్డి ద్విచక్రవాహనం తీసుకొని ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్లో తన ఇంటికి వెళ్లినట్టు,అక్కడి నుంచి ఎస్ఐ నాగరాజు అందుబాటులో లేకుండా పోయారు. అధికారిక సెల్ఫోన్ స్విచాఫ్లో ఉంది. మొత్తమ్మీద అధికారుల వేధింపులు, పనిభారం కారణం ఏదైనా ఎస్ఐ అదికారులకు అందుబాటులో లేకపోవడం పోలీసు వర్గాలను కలవరపరుస్తోంది. ఎస్ఐ కోసం పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తుంది. ఆరోపణల్లో నిజం లేదు.. ఎస్ఐ నాగరాజు అదుబాటులో లేకపోవడం విషయంలో వేధింపులకు గురిచేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నేరేడ్మెట్ సీఐ జగదీశ్ చందర్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గురువారం ఎస్ఐల సమావేశం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నాగరాజు వెళ్లిపోయాడని, అప్పటినుండి ఆయన అందుబాటులో లేరని సిఐ చెప్పారు. ఎస్ఐ కోసం సమాచారం సేకరిస్తున్నామని సీఐ తెలిపారు. వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లారు.. ఎస్ఐ నాగరాజు వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లినట్లు ఎస్ఐ మామ అనంతయ్య సాక్షికి ఫోన్లో వివరణ ఇచ్చారు. ఎస్ఐ మిస్సింగ్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
లవర్తో వీడియో కాల్, లైవ్ లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : క్షణికావేశంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయంతో నిండు జీవితాం అర్థాంతరంగా ముగిసింది. ప్రేమికురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల అజ్మీర్ సాగర్ మల్కాజ్గిరిలోని వినాయక్ నగర్లో తన సోదరితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సాగర్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆ యువతి బంధువులతోపాటు, ఇంట్లోవాళ్లు కూడా ఈ ప్రేమ వ్యవహరంలో సాగర్ని హెచ్చరించారు. సాగర్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె నువ్వు చనిపోతే నీ మీద కోపం పోతుంది అంటూ సాగర్కు వాట్సాప్లో సందేశం పంపింది. ఈ విషయంపై మాట్లాడాలంటూ సాగర్ గురువారం ఉదయం ఆమెకు మెసేజ్ చేశాడు. తాను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని కోరాడు. ఆ యువతి వీడియో కాల్ చేయగానే.. సాగర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అయితే సాగర్ సీరియస్గా చెప్పినప్పుటికీ ఆ విషయాన్ని ఆమె సరదాగా తీసుకోవడంతో సాగర్ ... వీడియో కాల్ మాట్లాడుతూనే సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకుని తనువు చాలించాడు. -
మల్కాజిగిరిలో మరో లవ్ జిహాదీ
-
దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనవరి 26న ఫిలించాంబర్లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్పేట్లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ట్రాప్ చేసిన ఎస్ఐ
-
జల్సాలకు అలవాటు పడి.. చోరీల బాట
మల్లాపూర్: చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. బాలానగర్ ఫిష్ మార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ జునీత్గౌస్,, సంతోష్నగర్ ప్రాంతానికి మహ్మద్ ఫరాఆహ్మద్ తరచూ పార్కు చేసిన బైక్లను దొంగిలించేవారు. వచ్చిన డబ్బుతో బైక్ రేసింగ్లకు పాల్పడుతూ జల్సా చేసేవారు. గురువారం నాచారం పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ దొంగలు అరెస్టు హయత్నగర్కు చెందిన వేముల గోపీ, భాగ్యనగర్ కాలనీకి చెందిన గణేష్ బస్టాప్, మార్కెట్లలో ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న వారి వద్ద నుండి సెల్ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 20 స్మార్ట్ ఫోన్లను దొంగిలించారు. మరో ఇద్దరితో కలిసి బైక్ల చోరీలకు కూడా పాల్పడేవారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్కే.సలీమా, సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన సంఘటన రాచకొండ నేరేడ్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విడాకుల కేసు విచారణ నిమిత్తం మల్కాజ్గిరి కోర్టుకు హాజరైన శ్రీధర్ అనే వ్యక్తిని అతని బావమరుదులు నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపారు. మూడేళ్ల క్రితం శ్రీధర్ కు మల్కాజ్గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో సుహాసిని తన భర్త శ్రీధర్పై కేసు పెట్టడంతో విడాకుల వివాదం కోర్టులో నడుస్తోంది. ఇవాళ ఉదయం కోర్టుకు హాజరై కారులో వెళ్తుండగా శ్రీధర్పై నలుగురు వ్యక్తులు దాడి చేసి, కత్తితో నరికి చంపారు. కాగా తన కుమారుడి బావమరుదులైన వినయ్, విగ్నేష్ లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా తన కొడుకును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ తండ్రి అన్నారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
మల్కాజిగిరి(హైదరాబాద్): మెట్టినింటి వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం..వెంకటేశ్వరనగర్కు చెందిన బాలరాజ్ గౌడ్ కుమార్తె రోజా(30) టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 2012లో మల్కాజిగిరి జ్యోతినగర్కు చెందిన రంగ శ్రీకాంత్తో వివాహమైంది. లాంకోహిల్స్లోని సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్ధలో సాప్ట్వేర్ ఉద్యోగిగా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. వీరికి రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.పెళ్లి అయిన కొద్ది రోజులు కాపురం సజావుగా జరిగినా చీటికిమాటికి రోజాను భర్త శ్రీకాంత్ అత్త మామలు ధనలక్ష్మి, రాములు వేధించేవారు. గురువారం ఉదయం బాలరాజ్గౌడ్కు శ్రీకాంత్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన బాలరాజ్కు రోజా ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు శ్రీకాంత్ ఇంటి ఇరుగుపొరుగు వారు చెప్పారు. వెంటనే స్టోరూమ్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రోజాను తలుపు పగులగొట్టి బయటకు తీసుకు వచ్చారు. రోజాను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కూతురు మృతికి భర్త అత్తమామలే కారణమని కట్నకానుకల క్రింద పెళ్లి సమయంలో రూ.20 లక్షలు అప్పచెప్పామని బాలరాజ్గౌడ్ తెలిపారు. తరచూ వేధించేవారని కొడుకు పుట్టిన తర్వాత కూడా మారలేదని అల్లారుముద్గుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు దూరమైందని ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాలరాజ్గౌడ్ డిమాండ్ చేశారు. -
ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఆదేశించింది. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడినందుకు నిరసనగా నాగరాజు అనే దళిత యువకుడు మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు కంచ ఐలయ్యపై సెక్షన్ 153ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వచ్చే నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులను ఆదేశించింది. కాగా కంచ ఐలయ్య వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్న విషయం తెలిసిందే. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
మల్కాజిగిరి(హైదరాబాద్సిటీ): పెళ్లి చేసుకుంటానని దళిత యువతిని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీరును మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరా నెహ్రూనగర్లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీరు జోగు శ్రీనివాస్(29)కు మరో సాఫ్ట్వేర్ ఇంజినీరైన యువతి (27)తో పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ముఖం చాటేశాడు. ఈ విషయమై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దళిత మహిళను మోసం చేసినందుకు అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
-
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
బంగ్లాదేశ్ యువతి అరెస్ట్ మౌలాలి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా తప్పుడు ధృవ పత్రాలతో అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేశారు. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపి ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లికి చెందిన కుమార రామలింగ అనే వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన యువతి, కుకట్పల్లికి చెందిన మధు,, అమీర్పేట్కు చెందిన రమేష్, గుంటూరుకు చెందిన బొమ్మ ముని ముఠాగా ఏర్పడి locanto. com అనే వెబ్సైడ్ను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతుల ఫొటోలను అప్లోడ్ చేస్తూ విటులకు వలవేసేవారు. దీనిపై సమాచారం అందడంతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ ద్వారా వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5,960 నగదు, ఒక బైక్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రామలింగ పరారీలో ఉండగా మిగితా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావే«శంలో ఎస్ఓటిసీఐ నవీన్కుమార్, ఎస్ఐ హఫీజ్, సిబ్బంది పాల్గొన్నారు. మరో సంఘటనలో... వెస్ట్ బెంగాల్కు చెందిన సంజయ్, రాహుల్ అనే వ్యక్తులు దుండిగల్కు చెందిన ప్రవీణ్కుమార్ అనే యువకుడితో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాలకు యువతులను సరఫరా చేసేవారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఉప్పల్లోని వ్యభిచార కేంద్రంపై దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా ప్రధాన సుత్రధారి సంజయ్ గత కొంత కాలంగా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యిందన్నారు. ప్రవీణ్ సహా ఇద్దరు యువతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంజయ్, రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మాయ లేడి రూ.20 కోట్లకు టోకరా
హైదరాబాద్: అధిక వడ్డీ వస్తుందని ఎర వేసింది. కోట్ల రూపాయలు దోచేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. అధిక వడ్డీల పేరుతో వివిధ ప్రాంతాలలో ప్రజలకు కోట్ల రూపాయలు మోసగించిన మాయ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డి చాలా మందికి అధిక వడ్డీలు ఇస్తామంటూ, మరికొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసులు చేసింది. మరికొందిరికి సగం ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఇలా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసింది. తిరిగి చెల్లించమని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరుణారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. విచారణలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ కేసులు ఉన్నాయని తెలసుకున్నపోలీసులు అరుణారెడ్డిని 3 రోజుల కస్టడీకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మల్కాజిగిరి సీఐ ను ఆశ్రయించారు. -
కొడుకా..? అల్లుడా..?
కుత్బుల్లాపూర్ : మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో తన దూకుడు పెంచారు. గత ఆరు నెలలుగా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతూ తనదైన శైలిలో ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ తరఫున 2014లో ఎంపీగా పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావుకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ టికెట్ విషయంలో మల్లారెడ్డికి పోటీ లేకుండా పోయింది. దీంతో అల్లుడు, కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరికి అసెంబ్లీ సీటు ఇప్పించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఎంపీ. అధిష్టానంతో ఇప్పటికే ఓ నిర్దిష్టమైన హామీ తీసుకొని, అప్పుడే తన అనుచరులతో ప్రచారం ముమ్మరం చేశారు. మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపారు. అంతే కాకుండా.. ఇటీవల సుచిత్రలోని ఓ ఐస్క్రీమ్ పార్లర్లో మంత్రి కేటీఆర్ తయారు చేసిన ఐస్క్రీమ్ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ ఫండ్కు రూ.కోటి చెక్కు అందజేసి హాట్టాపిక్గా మారారు. ఇవ్వన్నీ పార్టీ అ«ధిష్టానాన్ని ఆకట్టుకునేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బావా.. బామ్మర్దుల హల్చల్... ఎంపీ మల్లారెడ్డి దత్తత తీసుకున్న దుండిగల్ గ్రామంలో అల్లుడు రాజశేఖర్రెడ్డి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇటీవల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎంఎల్ఆర్ఐటీలో చదువుతున్న విద్యార్థులతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో మార్చి 20న మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి నుంచి మేడ్చల్ నియోజకవర్గం వరకు భారీ ఎత్తున ప్రధాన రోడ్ల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించారు. అధికారికంగా వీరిద్దరికి టీఆర్ఎస్లో ఎలాంటి పదవులు లేకున్నా పార్టీ కండువాలు కప్పుకుని ఫ్లెక్సీల్లో దర్శనమివ్వడం విశేషం. అంతే కాకుండా ఈ నెల 21న కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకొని కార్యకర్తలతో కలిసి హడావిడి చేశారు. ఏది ఏమైనా ఎంపీగా మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహ పడుతున్న మల్లారెడ్డి తన వారసుడిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా బిజీగా ఉన్నారనే చెప్పొచ్చు. -
హైదరాబాద్లో ఫేక్నోట్ల కలకలం
మల్కాజిగిరి(హైదరాబాద్): మల్కాజిగిరి అలహాబాద్ బ్యాంకులో నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రితమైన రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్లు రూ.9.19 లక్షలను డిపాజిట్ చేసేందుకు యూసుఫ్ షేక్ అనే వ్యక్తి యత్నించగా బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడ పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఏసీపీ రంగంలోకి నిందితుడిని విచారిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. కాగా, అసలు నోటుకు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏ మాత్రం తేడా లేదని, గుర్తించడం అసాధ్యమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. నోట్ల మార్పిడి చేస్తున్న 15మంది ముఠా అరెస్ట్ మరో ఘటనలో పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాగా చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి లక్ష రూపాయలకు పైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవాది అనుమానస్పద మృతి
-
న్యాయవాది ఆత్మహత్య
మల్కాజిగిరి: న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్ఐ రమణ్గౌడ్ కథనం ప్రకారం..శనివారం మౌలాలి రైల్వేస్టేషన్ కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు. సంఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా అతను ఉప్పరిబస్తీకి చెందిన నిరంజన్ రావు(28) గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సికింద్రాబాద్ పారడైజ్ సమీపంలోని ఇండస్ఇంద్ బ్యాంక్లో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న నిరంజన్ రావు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జన పథం - మల్కాజ్గిరి
-
ఏటీఎం చోరీకి విఫలయత్నం
-
ఏటీఎం చోరీకి విఫలయత్నం
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరి దయానందనగర్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. గురువారం రాత్రి రాళ్లు, ఇనుప రాడ్లతో ఏటీఎమ్ మిషన్ను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లడానికి యత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎంలోని సీసీ ఫూటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బస్టాప్లో చిన్నారులను వదిలేసిన తల్లి
- చేరదీసిన ఆటోవాలా - పాఠశాలను గుర్తుపట్టిన చిన్నారులు మల్కాజిగిరి: పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను ఒక తల్లి నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్లో వదిలిపెట్టింది. బస్టాప్లో ఒంటరిగా ఉన్న చిన్నారులను చేరదీసిన ఆటోవాలా వారిని వారు చదివే పాఠశాల వద్దకు తీసుకొచ్చాడు. వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లబస్తీకి చెందిన అనిత తన పిల్లలు పుణ్యమ్మ(7), దీపిక(6)లతో కలిసి నివాసముంటున్నది. వేరే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కుత్బుల్లాపూర్ బస్టాప్లో మంగళవారం వదిలిపెట్టి కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ శివాజీ మంగళవారం బస్టాప్లో ఉన్న చిన్నారులను గమనించి ఆరాతీశాడు. కేవలం వారి పేర్లు, మల్కాజిగిరి అని చెప్పడంతో వారిని ఆటోలో మల్కాజిగిరికి తీసుకొని వచ్చాడు. తన ఆటోలో గ్యాస్ అయిపోవడంతో గ్యాస్ నింపుకోవడానికి మౌలాలికి వెళ్లుతుండగా చిన్నారులు తాము చదివే తాళ్లబస్తీలోని ప్రాధమిక పాఠశాలను గుర్తుపట్టారు. దీనితో ప్రధానోపాధ్యాయుడు హనుమంతరెడ్డి వారిని గుర్తించి వాళ్ల అమ్మ గురించి వాకబు చేయడంతో ఖాళీ చేశారని తెలియడంతో ఆల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి భవానీకి సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం సహకారంతో చిన్నారులను తీసుకొని వచ్చి ఆల్వాల్లోని లోని చిల్డన్ర్హోంలో రక్షణ కల్పించామని తెలిపారు. -
ప్రేమ వేధింపులు: బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ముత్యాల సోనీ(17) అనే మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన సూరజ్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో అతని ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో.. బాలిక మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సూరజ్ వల్ల తనకు, తన కుంటుంబానికి ప్రాణహాని ఉందని భావించిన బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు బాలిక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా వారి వాదన వేరే విధంగా ఉంది. బాలిక ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దాడి కేసులో ముగ్గురు అరెస్ట్
మల్కాజిగిరి: దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ సైదులు కథనం ప్రకారం... కర్నాటకకు చెందిన కె.చింటూ(19), చిన్నా(19), బీజెఆర్ నగర్కు చెందిన జి.నరేష్(21)లు ముగ్గురూ పీవీఎన్ కాలనీలోని వర్షిణి వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి బీజెఆర్ నగర్ గుట్ట మీదకు వెళ్లే పైపులైన్ను బండరాయితో పగులగొట్టడానికి ప్రయత్నించడంతో స్ధానికంగా ఉన్న ఖలీల్ ప్రశ్నించడంతో అతని మీద దాడి చేశారు. ఈ సంఘటనలో ఖలీల్కు గాయాలయ్యాయి. ఖలీల్ ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరొకరు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. -
‘స్థిరాస్తి’ రంగం జోరు!
సాక్షి, సిటీబ్యూరో: మహానగర శివార్లలో కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో స్థిరాస్తి రంగం జోరందుకుంటోంది. ఒకేసారి క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. కేవలం ఆరు మాసాల్లో రెండు లక్షలకు పైగా స్థిరాస్తుల దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు వెంచర్లుగా మారుతున్నాయి. వాస్తవంగా రాష్ట్ర విభజన అనంతరం స్థిరాస్తి రంగం జీవం పోసుకుంది. అప్పటివరకు నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు. కార్యాలయాలు తరలి రావడం స్థిరాస్తి రంగానికి మరింత కలిసి వచ్చినట్లయింది. తాజాగా నగర శివారులో శంషాబాద్(రంగారెడ్డి), మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లా కేంద్రాల ఏర్పాటు దృష్ట్యా రహదారులు, ఇతర మౌళిక వసతులు అభివృద్ధికి అస్కారం ఉండటంతో భూములు, ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్లయింది. కాసుల పంట.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు కాసుల పంట పండుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరం..మొదటి ఆరు మాసాల్లో రాష్ట్రం మొత్తం మీద రూ.1935.30 కోట్ల ఆదాయం లభించగా, అందులో రూ.1359 కోట్లు మహానగరం నుంచే రాబడిగా నమోదు కావడం విశేషం. గత ఆరు మాసాల నుంచి వరుసగా నెలసరి ఆదాయం రెండువందల కోట్లకు తగ్గడం లేదు. గతేడాదితో పోల్చితే ఈసారి 35 శాతం పైగా ఆదాయం వృద్ధి పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలోని ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్, కీసర, నాగారం, షామీర్పేట, మేడ్చల్, మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రాహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూములపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో క్రయవిక్రయాలు పెరగడంతోపాటు ధరలు సైతం రెట్టింపయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాబడి పరిస్థితి జిల్లా 2014–15 2015–16 2016–17 ఆదాయం ఆదాయం ఆదాయం (రూ.కోట్లలో) హైదరాబాద్ రూ.359.77 రూ. 327.49 రూ.445.77 రంగారెడ్డి రూ.479.53 రూ.714.34 రూ.953.71 -
బతుకమ్మ సంబరాల్లో ఎంపీ మల్లారెడ్డి ఫుల్ జోష్
-
విచారణకు తీసుకెళ్లబోతే దాడి చేశారు
మల్కాజిగిరి: కేసు విచారణ నిమిత్తం పాతనేరస్తుడిని తీసుకెళ్లేందుకు వచ్చిన కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. బాధిత కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదుచేశారు. అయితే, తన భర్త కోసం వచ్చిన పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని పాతనేరస్తుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్పెక్టర్ జానకిరెడ్డి, ఎస్ఐ జేమ్స్బాబు కథనం ప్రకారం...ఉప్పరిగూడ పార్దిబస్తీకి చెందిన మహేష్సింగ్ అలియాస్ మహేష్ పాతనేరస్తుడు. ఇతనిపై గతంలో మల్కాజిగిరి ఠాణాలో పలు కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్స్టేషన్ పరిధిలో కేసుకు సంబంధించి మహేష్ను తీసుకెళ్లడానికి ఆదివారం ఉదయం కానిస్టేబుళ్లు ఎలిజాతో పాటు మఫ్టీ పోలీసులు రాకేష్, జగదీష్ కలిసి మహేష్ ఇంటికి వచ్చారు. అతడిని తీసుకెళ్లే క్రమంలో భార్య పూనమ్, సోదరులు బాబూసింగ్, ఉమేష్సింగ్ అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ జగదీష్ చేతి వేలికి గాయమైంది. దీంతో కానిస్టేబుల్ ఎలిజా.. మహేష్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... మహేష్ అక్కను దూషించడంతో పాటు తనతో కానిస్టేబుళ్లు అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారని మహేష్ భార్య పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మహేష్ను రక్తం వచ్చేలా పోలీసులు గాయపర్చారని పేర్కొంది. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
‘మేడ్చల్’గా మల్కాజ్గిరి
ప్రజల విజ్ఞప్తుల దృష్ట్యా జిల్లా పేరు మార్పునకు సీఎం నిర్ణయం హన్మకొండ జిల్లాపైనే ఉత్కంఠ కొత్తగా నాలుగు డివిజన్లు.. 44 మండలాలు తాజా నిర్ణయాలకు సీఎం ఆమోదం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాలో ప్రతిపాదించిన మల్కాజ్గిరి జిల్లాకు మేడ్చల్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల విజ్ఞప్తులతో పాటు చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా ఈ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు. కీసర పేరును కూడా తీవ్రంగా పరిశీలించినప్పటికీ, చివరకు మేడ్చల్ వైపు మొగ్గుచూపారు. ఈ మేరకు పేరు మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావుకు లేఖ రాశారు. ముసాయిదాలో ప్రతిపాదించిన 27 జిల్లాలకు గాను 26 జిల్లాలపై అభ్యంతరాలేమీ లేవని సీఎం తేల్చేశారు. తదుపరి ఏర్పాట్లలో నిమగ్నం కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతిపాదిత హన్మకొండ జిల్లాపైనే మరింత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హన్మకొండ జిల్లాను కొనసాగిస్తారా.. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లాను మనుగడలోకి తెస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలపై ఎప్పటికప్పుడు సాధ్యాసాధ్యాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న తొర్రూరు, కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, మహబూబ్నగర్లోని కల్వకుర్తిలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలో వైరా కేంద్రంగా ప్రతిపాదించిన రెవెన్యూ డివిజన్ను కల్లూరు కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పుచేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు. ఇప్పటికే నోటిఫై చేసిన మండలాలకు అదనంగా రంగారెడ్డి జిల్లాలో కోటపల్లి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో గుండాల, పినపాక మండలాలను రెండుగా విభజిస్తారు. ఆల్లపల్లి, కరకగూడెం కేంద్రాలుగా రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తారు. పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 45 మండలాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రజల డిమాండ్లను పరిశీలించిన సీఎం, మరిన్ని కొత్త మండలాలకు ఆమోదం తెలిపారు. ప్రతిపాదనల మేరకు కొత్తగా మరో 44 మండలాల ఏర్పాటు జాబితా సిద్ధమైంది. ప్రతిపాదిత కొత్త డివిజన్లు: తొర్రూరు, హుస్నాబాద్, కల్వకుర్తి, వైరాకు బదులు కల్లూరు ప్రతిపాదిత కొత్త మండలాలు (మొత్తం 44): ఆదిలాబాద్(3): పెంచికల్పేట, ఆదిలాబాద్ రూరల్, చింతమానుపల్లి నిజామాబాద్(7): బీబీపేట, చందూరు, ఎరగట్ల, ఆర్మూర్ రూరల్, దేవక్కపేట, పెద్దకొడపగల్, రెంజెర్ల మహబూబ్నగర్(5): సిద్ధాపూర్, వంకేశ్వర్, చారకొండ, చండూరు, మోపల్ నల్లగొండ (4): నేరెడుగొమ్మ, అడవిదేవులపల్లి, నాగార్జునసాగర్, మద్దిరాల మెదక్(7): నాగల్గిద్డ, హవేలీ ఘన్పూర్, మొగుడంపల్లి, కంది, వట్పల్లి, నార్సింగి, రాయిపోల్ కరీంనగర్(10): జగిత్యాల రూరల్, బసంత్నగర్, వీర్నపల్లి, బీర్పూర్, రుద్రంగి, కట్కూరు, బుగ్గారం, సిరిసిల్ల రూరల్, పంకెన, వేములవాడ రూరల్ ఖమ్మం(4): ఆల్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి, కరకుగూడెం రంగారెడ్డి(2): కోటిపల్లి, మేడిపల్లి వరంగల్(2): టేకుమట్ల, చిన్నగూడూరు -
అన్నీ తానై... భారీ మోసాలకు స్కెచ్ !
సాక్షి, సిటీబ్యూరో: నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్, అభయబీ4యూ ఛానల్స్ న్యూస్ ఇన్చార్జ్, సీఐడీ డీఎస్పీ... ఇన్ని అవతారాలు ఎత్తి భారీ మోసానికి కుట్న పన్నిన ఓ వ్యక్తిని సైబరాబాద్ ఈస్ట్ పరిధిలోని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఎంవీఎల్ నాగేశ్వరరావు మల్కాజిగిరిలోని శివపురికాలనీలో స్థిరపడ్డాడు. రూ.5 వేలు వెచ్చించి న్యూఢిల్లీలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్ పేర్లతో రెండు సంస్థల్ని ఎన్జీఓల పేరుతో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, అధికారుల అవినీతిపై ప్రచారం చేస్తామని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఆ రెండు సంస్థలకూ తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న నాగేశ్వరరావు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోస్టులు ఇస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఎర వేశాడు. సాధారణ సభ్యత్వానికి రూ.1500 ధర నిర్ణయించాడు. తన సంస్థల్లో రెండేళ్ల కాలపరిమితో ఉండే వివిధ హోదాల్లో పోస్టులు ఇవ్వడానికి రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు రేట్లు నిర్ణయించాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ సభ్యుల్ని నియమించడం ద్వారా ప్రతి రెండేళ్లకూ రూ.5 కోట్లు చొప్పున దండుకోవాలని పథకం వేశాడు. అలాగే యాంటీ కరెప్షన్ కమిషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బు దండుకోవాలని కుట్రపన్నాడు. దీంతో పాటు ‘తెలుగు ప్రపంచం’ పేరుతో మరో సంస్థను రిజిస్టర్ చేయించిన నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల్లోనూ దుకాణాలు, వ్యాపార సంస్థలకు తెలుగు బోర్డులు ఏర్పాటు చేసే బాధ్యతల్ని ప్రభుత్వాలు తనకు ఇచ్చాయని ప్రచారం చేసుకున్నాడు. అలానే అలిండియా కన్జ్యూమర్ రైట్స్ పేరుతో మాస పత్రికను ముద్రించాలని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. తన వద్ద సభ్యులుగా, వివిధ హోదాల్లో చేరిన వారికి తన రెండు సంస్థల పేర్లతో ఉన్న స్టిక్కర్లను రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయించే వాడు. అభయ ఛానల్ న్యూస్ ఇన్ చార్జీ బీ4యూ న్యూస్ ఛానల్ హెడ్గా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ బోర్డ్ కోశాధికారిగా, సీఐడీలో డీఎస్పీగా... ఇలా వివిధ రకాలైన నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్న నాగేశ్వరరావు వీటిని వినియోగించి బెదిరించడం ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
చెవి కమ్మలు ఇవ్వలేదని భార్యను హత్య..
మల్కాజిగిరి: చెవికమ్మలు అమ్ముకొని మద్యం తాగుతానంటే భార్య నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడో తాగుబోతు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి, మృతురాలి తమ్ముడు నరేష్ కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్తో షాబాద్ మండలానికి చెందిన యశోద(32)కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు మల్కాజిగిరి వీణాపాణినగర్లో ఉంటున్నారు. యశోద తమ్ముడు నరేష్ అక్కకు తోడుగా ఉంటూ స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. క్యాటరింగ్ పనిచేసే ప్రభాకర్ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. తాగుడుకు కూడా బానిసై తరచూ భార్యను వేధించేవాడు. చిత్తూర్ వెళ్లిన ప్రభాకర్ ఈనెల 2వ తేదీ రాత్రి ఇంటికి వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు లేవని చెప్పడంతో చెవి కమ్మలు ఇస్తే అమ్ముకొని మందు తాగుతానని అన్నాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు బావమరిది పని చేసే దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పాడు. దీంతో నరేష్ బంధువులకు సమాచారం ఇవ్వగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ అక్కను బావ వేధించేవాడని, తన అక్క చావుకు అతనే కారణమని నరేష్ పేర్కొన్నాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని, పోస్ట్మార్టం నివేదిక అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఎలుక మరణం,రికార్డుల దహనం.. అసలు కథ ఏంటి!
► ‘రికార్డుల దహనం’పై విచారణకు ఆదేశం? మల్కాజిగిరి: ఎలుక చనిపోయిందని రికార్డులను తగులబెట్టిన ఘటనపై మల్కాజిగిరి సర్కిల్ ఇన్చార్జి ఉప కమిషనర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన రికార్డులను మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని ఆవరణలో ఈనెల 16న కుప్పగా పోసి తగులబెట్టారు. ఎంతో ముఖ్యమైన ఈ రికార్డులను ఎలుక చనిపోయిందనే సాకుతో తగులబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’.. ‘ఎలుక చనిపోయిందని రికార్డులు తగులబెట్టారు’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఇన్చార్జి ఉప కమిషనర్ రమేష్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో భద్రంగా ఉండాల్సిన రికార్డులు ఎలా బయటకు వచ్చాయి? వీటిని తగులబెట్టేందుకు పారిశుద్ధకార్మికులను ఎవరు పిలిచారు అనే కోణాల్లో దర్యాప్తు చేయమని ఏఎంహెచ్ఓకు ఆదేశించినట్లు తెలిసింది. -
జనపథం - హరిత హరం
-
వివాహిత అదృశ్యం
మల్కాజిగిరి (హైదరాబాద్) : వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రమణ్గౌడ్ కథనం ప్రకారం.. మల్కాజిగిరి విష్ణుపురికాలనీకి చెందిన వెంకటసుబ్బారావు, సత్యవాణి(25) ఇద్దరూ భార్యాభర్తలు. శుక్రవారం ఉదయం సత్యవాణి తన కొడుకును పాఠశాలలో వదిలి ఇంటికి తిరిగిరాలేదు. ఆమె సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సత్యవాణి అత్త కాత్యాయిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నగరంలోని మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లీలావతి అనే యువతికి 8 నెలల క్రితం శశికిరణ్కు వివాహమైంది. లీలావతి సోమవారం రాత్రి అనూహ్యంగా ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు శశికిరణ్ చెబుతున్నాడు. వరకట్న వేధింపులే కారణమని, భర్తే హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మల్కాజ్ గిరిలోని అతని ఇంటి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ : విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. స్థానిక ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. జేఎల్ఎస్ నగర్కు చెందిన కృష్ణగౌడ్ కుమార్తె ఉషారాణి (22) సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న కాలేజీకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆచూకీ కూడా తెలియలేదు. ఆదివారం విద్యార్థిని తండ్రి కృష్ణగౌడ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారెక్కనున్న మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. మల్లారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆయన సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ల పేర్లతో అనేక ఇంజనీరింగ్, మెడికల్, దంతవైద్య కళాశాలలు నిర్వహిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారే విషయంలో తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ చర్చలు మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున (జూన్ 2 న) ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రముఖులతో చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. మల్లారెడ్డి తో పాటు ఆయన అనుచరులైన మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ శైలజ, కండ్లకోయ గ్రామ సర్పంచు నరేందర్ రెడ్డి, ఇతర సన్నిహితులు, ఆయా గ్రామాల సర్పంచులు ఇతర నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఖాళీ కానున్న టీడీపీ ఎంపీ మల్లా రెడ్డితో కలిసి పలు మండలాలకు చెందిన నేతలు కూడా కారెక్కనుండటంతో జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలిపోనుంది. పలు మండలాల్లో టీడీపీ పూర్తిగా ఖాళీకానుంది. -
వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న ఓ వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు శనివారం మధ్యాహ్నం మెరుపు దాడికు దిగారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మల్కాజిగిరి పరిధిలోని శివనగర్లోని ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్టేషన్కు తరలించారు. -
ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మల్కాజిగిరి : ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరసయ్య కథనం ప్రకారం...మౌలాలి గణేష్నగర్కు చెందిన రాములు కూతురు మాధవి(14) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడవతరగతి చదువుతోంది. గత కొద్ది కాలంగా ఆమె ఆర్యోగం బాగాలేదు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
మల్కాజిగిరి : విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్లోర్ ఇన్చార్జిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరసయ్య కథనం ప్రకారం... విజయనగరం జిల్లా రావికర్రవలస గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ పులి(29) మౌలాలిలోని డాక్టర్ కెకెఆర్ గౌతం పాఠశాలలో నాలుగు సంవత్సరాల నుంచి ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని పట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థిని ఈ నెల 11వ తేదీన కుటుంబసభ్యులకు విషయం తెలియజేయడంతో ఆమె తండ్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పాఠశాల వద్దకు వెళ్లి వెంకటరమణను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. -
విద్యార్థిని అదృశ్యం
మల్కాజిగిరి : ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన ఎం.నరేందర్ కూతురు యమునా వాణి(22) నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 13న ప్రాజెక్ట్ వర్క్ కోసం బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి నరేందర్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం మంటగలిసింది!
నడవలేని వృద్ధురాలి గొలుసు స్నాచింగ్ మల్కాజిగిరి: మానవత్వానికే మచ్చతెచ్చే సంఘటన ఇది... డబ్బు ముందు మనిషిలోని జాలి, దయ కనుమరుగయ్యాయి. నడవలేని అవ్వ మెడలో గొలుసును ఓ ప్రబుద్ధుడు లాక్కెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. వివరాలు... మీర్జాలగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ అన్నమ్మ (75) భర్త చనిపోవడంతో ఆటో డ్రైవర్గా పని చేసే కుమారుడు శ్రీను వద్ద ఉంటోంది. వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉండే అన్నమ్మ బయటకు రావాలంటే నేల మీద పాకుతూ రావాల్సిందే. ప్రతి రోజూ ఇంటికి సమీపంలో అరుగు మీద కాసేపు కూర్చొని తిరిగి ఇంటికి వెళ్లేది. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటికి పాకుతూ వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని తులంపావు బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేయిలేదని తెలిసింది. ఫిర్యాదు చేస్తే కోర్టుకు రావాల్సి ఉంటుందని, ఖాళీ కాగితంపై సంతకం పెట్టమని పోలీసులు చెప్పగా పెట్టలేదని బాధితురాలి బంధువులు ‘సాక్షి’కి తెలిపారు. కష్టపడి కూడబెట్టుకున్న గొలుసు పోయిందని బెంగతో అన్నమ్మ భోజనం తినడం లేదని ఆమె మనుమరాలు తెలిపింది. గొలుసు గురించి అడిగితే అన్నమ్మ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకోవడం కలిచివేసింది. -
నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో ప్రతి నల్లాకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకంలో ఈ మీటర్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. సర్కిల్ పరిధిలో సుమారు 25 వేల గృహవినియోగ నల్లాలకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఆటోమేటిక్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రపంచబ్యాంకు మంజూరు చేయనుంది. మీటర్ల ఏర్పాటుతోపాటు నీటి సరఫరాను ఆన్లైన్లో పక్కాగా పర్యవేక్షించేందుకు స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనుంది. కాగా మల్కాజ్గిరి మంచినీటి సరఫరా పథకంతో ఈ ప్రాంత దాహార్తి తీరనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి 262 కి.మీ మార్గంలో ప్రధాన పైపులైన్లు, మరో 376 కి.మీ మార్గంలో పంపిణీ పైపులైన్ల ద్వారా ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు వారం, పదిరోజులకోమారు నీటిసరఫరా జరుగుతోంది. ఈపథకం పూర్తితో కృష్ణా, గోదావరి జలాలను సర్కి ల్ వ్యాప్తంగా సరఫరా చేసే అవకాశం ఉంటుం దని, ఆటోమేటిక్ నీటిమీటర్ల ఏర్పాటుతో భవిష్యత్లో 24 గంటలపాటు నీటిసరఫరా చేసినప్పటికీ నీటి లెక్కలు పక్కాగా లెక్కగట్టడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. మీటర్ల ఎంపిక వినియోగదారులదే..! గ్రేటర్వ్యాప్తంగా ఆటోమేటిక్ మీటర్ల విధానాన్ని అమలు చేసేందుకు రూ.1600 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని ఎవరు భరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా మహానగరంలో 8.65 లక్షల నల్లాలుండగా..ప్రస్తుతం సగం నల్లాలకే నీటి మీటర్లున్నాయి. దీంతో ప్రతి నల్లాకు నీటి మీటరు ఏర్పాటు చేసుకునే బాధ్యతను జలమండలి వినియోగదారులకే అప్పజెప్పింది. గతంలో యూరో ప్రమాణాల ప్రకారం ఎంపికచేసిన తొమ్మిది మీటర్ కంపెనీలకు చెందిన మీటర్లనే విధిగా కొనుగోలు చేయాలన్న షరతు విధించింది. వీటి ధరలు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉన్నాయి. దీంతో కొందరు వినియోగదారులు ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్పందించింది. వినియోగదారులు తమ ఇష్టానుసారం మీటర్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండాలని వ్యాఖ్యానించింది. కాగా బహిరంగ మార్కెట్లో మెకానికల్ నీటిమీటర్లు రూ.500 నుంచి రూ.750కు మాత్రమే లభ్యమవుతున్నాయి. కోర్టు వ్యాఖ్యలతో జలమండలి అధికారులు వెసులుబాటు కల్పించక తప్పనిపరిస్థితి ఏర్పడినప్పటికీ ఈవిషయంలో తుదినిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం. -
మల్కాజ్గిరిలో టీడీపీ ర్యాలీ ఉద్రిక్తం
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆదివారం అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. మల్కాజ్గిరిలో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ నిర్వహిస్తున్న ర్యాలీకి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
మల్కాజ్గిరిలో రూ.4 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫీల్గూడ క్రాస్రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 4.10 లక్షలను గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
మల్కాజ్ గిరిలో కార్డన్ సెర్చ్:భారీగా వాహనాల పట్టివేత
హైదరాబాద్: అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు, నేరాల నియంత్రణకు సిటీ పోలీసులు తలపెట్టిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం.. మల్కాజ్ గిరిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగింది. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఈ క్రమంలో 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు పరారీలో ఉన్న నేరస్తులు కావడంతో అరెస్టుచేశారు. ఎలాంటి ఆధారపత్రాలు లేని 141 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 110 బైక్స్, 27 కార్లు, 4 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. -
రైలుపట్టాలపై విద్యార్థిని మృతదేహం
మల్కాజ్గిరి (హైదరాబాద్) : నగరంలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ ఇంటర్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి దగ్గర లభించిన ఐడీ కార్డు ఆధారంగా... రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం బీజేఆర్ నగర్కు చెందిన నవ్యగా మృతురాలిని గుర్తించారు. ఈసీఐఎల్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న నవ్య పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : ఓ వ్యక్తి స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్గిరిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్యామ్యూల్, చంద్రశేఖర్లు ప్రైవేట్ ఉద్యోగులు. వీరు కొన్నాళ్లుగా చనువుగా ఉంటున్నారు. అయితే శ్యామ్యూల్.. చంద్రశేఖర్ భార్యా, పిల్లలతో అసభ్యంగా మాట్లాడటంతో ఆగ్రహం చెందిన చంద్రశేఖర్ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో శ్యామ్యూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
మద్యం మత్తులో స్నేహితుడిని హత్య
-
'మత్తులో స్నేహితుడి హత్య'
హైదరాబాద్: మల్కాజ్గిరిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో సామ్యూల్(30) అనే వ్యక్తి మరో వ్యక్తి నివాసం ఉంటున్నారు. వీరద్దరికి తాగిన మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పరస్పరం దాడి చేసుకోగా సామ్యూల్ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.