ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్‌  | Independence Day 2021 SBI CGM Hoist Flag At Hyderabad Circle Office | Sakshi
Sakshi News home page

ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్‌ 

Aug 16 2021 8:13 AM | Updated on Aug 16 2021 8:14 AM

Independence Day 2021 SBI CGM Hoist Flag At Hyderabad Circle Office - Sakshi

జెండా ఎగురవేస్తున్న ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) అమిత్‌ జింగ్రాన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉత్పాదక రంగంలో భారత్‌ అగ్రగామి కానుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) అమిత్‌ జింగ్రాన్‌ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్‌ పవర్‌ నుంచి సోలార్‌ పవర్‌ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు.

రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్‌ అభివృద్ధిలో ఎస్‌బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement