
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 25 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4801 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,00,247 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3085 మంది మృతి చెందారు.
చదవండి: Lockdown: ‘మా కుక్కకు బాలేదు.. వచ్చే నెల నా పెళ్లి’