Positive
-
వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో ఇళ్లకు (హౌసింగ్) డిమాండ్ను పెంచేందుకు ఆర్బీఐ రెపో రేటును కనీసం 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు అయినా తగ్గించాలని రియల్టర్ల మండలి నరెడ్కో డిమాండ్ చేసింది. ‘‘రియల్టీ రంగం బలమైన వృద్ధి, సానుకూల సెంటిమెంట్ను చూస్తోంది. రెపో రేటును కొంత మేర తగ్గించడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. 25–30 బేసిస్ పాయింట్లను తగ్గించాలి. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా, అనుబంధ రంగాలైన నిర్మాణం, సిమెంట్, స్టీల్కు కూడా ప్రయోజనం కల్పించినట్టు అవుతుంది’’అని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లపై తన నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్న నేపథ్యంలో నరెడ్కో ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘వడ్డీ రేట్ల తగ్గింపుతో టైర్–2, 3 పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది. సమ్మిళిత వృద్ధి, పట్టణాభివృద్ధి పట్ల ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతునిస్తుంది. రేట్ల తగ్గింపుతో డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులకు తోడ్పాటు, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది, లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాన్ని డెవలపర్లు వేగవంతం చేయడంతోపాటు కొత్తవి ప్రారంభించేందుకు ఉత్సాహం వస్తుంది’’అని హరిబాబు తెలిపారు. రెపో రేటు తగ్గింపుతో అన్ని ప్రాంతాల్లో స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుందన్నారు. కచ్చితంగా ప్రయోజనమే.. వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజనం దక్కుతుందని, రుణాల ధరలు దిగొస్తాయని, దిగువ, మధ్యాదాయ వర్గాల్లో సానుకూల సెంటిమెంట్ ఏర్పడుతుందని నైట్ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రేట్ల తగ్గింపుతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో డెవలపర్లు తమ ప్రాజెక్టుల కోసం రుణాలు సులభంగా పొందగలరు’’అని ఆయన చెప్పారు. వినియోగ వృద్ధికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేపట్టిన చర్యలకు మద్దతుగా, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గించాలని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి కోరారు. -
ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా భారత్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది. మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్/సూపర్వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్మెంట్, మేనేజీరియల్/సూపర్వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి. -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
పాకిస్తాన్కు పాకిన మంకీపాక్స్.. ముగ్గురికి పాజిటివ్
ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.పాకిస్థాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్టీఐమైండ్ట్రీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
భారత్ అవుట్లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్లుక్ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్లకు సంబంధించీ ఇదే అవుట్లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్నగర్లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్ల టీకాలు అందించారు. -
నటుడు విజయ్కాంత్కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్కు కొవిడ్ పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
పాలమూరులో 20ఏళ్ల యువకుడికి కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్
పాలమూరు: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడి మొదలైంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాకేంద్రంలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఆర్ఓగా పని చేస్తున్న సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్లో ఉన్నాడని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు. సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రిలోని ల్యాబ్ పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుంటామని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఐదు రోజులుగా 151 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా ఆరోగ్యశాఖతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, పీసీఆర్ కిట్స్, మందుల ఇతరత్రా సామగ్రిని సమకూర్చారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని, జాతర్లు, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లడం, జన సమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్తో గది కార్నర్ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్కు మాత్రం నెగెటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్లోని రెహోబోత్ బీచ్లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా అమ్మొద్దు: అమెరికా అధికారులు
గుజరాత్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తవుతున్న సాంబార్ మసాలా, గరమ్ మసాలాను అమెరికాలో విక్రయించొద్దని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. సల్మొనెల్లా టెస్టులో ఇవి పాజిటివ్గా తేలినట్టు వెల్లడించింది. సాల్మొనెల్లా అనేది.. చిన్నపిల్లలు లేదా వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్న ఇతరులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తుంది. సాల్మొనెల్లా సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా తరచుగా జ్వరం, అతిసారం (రక్తంతో కూడినది కావచ్చు), వికారం, వాంతులు , కడుపు నొప్పి వంటి వాటితో అనారోగ్యం బారిన పడుతుంటారు. అరుదైన పరిస్థితులలో, సాల్మొనెల్లాతో ఇన్ఫెక్షన్ జీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ధమనుల అంటువ్యాధులు (అనగా, సోకిన అనూరిజమ్స్), ఎండోకార్డిటిస్, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. చదవండి: Viral Video: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే! -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. దీంతో, రాజ్నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
డోపింగ్లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్షిప్లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్లో కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్? -
బ్యాంకింగ్ అవుట్లుక్ ‘పాజిటివ్’
ముంబై: బ్యాంకింగ్ రంగం అవుట్లుక్ను దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం ‘పాజిటివ్’కు అప్గ్రేడ్ చేసింది. రుణ నాణ్యత పెరుగుదల, మూలధన పటిష్టతలు తన అవుట్లుక్ పెంపునకు కారణమని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) చివరికల్లా స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) ఈ దశాబ్ద కనిష్ట స్థాయి.. 4 శాతానికి దిగివస్తాయని విశ్వసిస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. ప్రస్తుత 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 15.2 శాతం ఉంటే, 2023–24 నాటికి ఈ రేటు 11 నుంచి 11.6 శాతానికి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వ రంగం బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణవృద్ధి 13.4–14.1 శాతం శ్రేణిలో ఉంటే, 2022–23లో ఈ రేటు 9.5–10.1 శాతం శ్రేణికి దిగివస్తుందని ఇక్రా అంచనావేసింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ విషయంలో ఈ రేటు 14.5–15.5 శాతం శ్రేణి నుంచి 12.6–13.5 శాతం శ్రేణికి దిగివస్తుందని విశ్లేíÙంచింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణంగా పేర్కొంది. 2023–24 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ 1 శాతం లోపునకు దిగివస్తుందని అంచనావేసింది. బ్యాంకింగ్ నికర వడ్డీ మార్జిన్లు 2023–24లో భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి డిపాజిట్ రేటు భారీ పెంపు అవకాశాలను కారణంగా చూపింది. అయితే అధిక రుణ విలువలు బ్యాంకింగ్ పటిష్టతకు దోహదపడుతుందని విశ్లేషించింది. చక్కటి లాభదాయకత ద్వారా బ్యాంకింగ్ స్వయంగా మూలధన అవసరాలను తీర్చుకోగలుగుతాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ప్రధాని మోదీతో భేటీకి ముందు హిమాచల్ సీఎంకు షాక్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ ముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కరోనా బారినపడ్డారు. ఇవాళ(సోమవారం) ఆయన ఢిల్లీలో ప్రధానిని కలవాల్సి ఉంది. కానీ అంతకుముందే నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. అయితే సీఎంకు కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్లోకి వెళ్లారని హిమాచల్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ వాయిదా పడినట్లు చెప్పారు. సీఎం సుఖ్వీందర్, డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ సింగ్తో పాటుు 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో పాటు డిసెంబర్ 16న రాజస్థాన్లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడో రోజే సీఎం వైరస్ బారినపడ్డారు. సుఖ్వీందర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా కలిశారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. After developing flu like symptoms, I got my self tested for COVID-19 and my reports are positive. I request everybody who has come in contact with me in last 48 hours to kindly isolate and get yourself tested, if you develop any symptoms. — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 12, 2022 -
ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ... నమోదైన తొలి కేసు
ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవి ఎటాక్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడ్డాడని వివరించారు. అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్ సబ్వేరియంట్ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్, మంకీపాక్స్ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసు మంకీపాక్స్, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. (చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి) -
మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్బి..
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ.. ఇటీవల తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ కాగా బిగ్బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 14వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన రష్మిక మందన్నాతో గుడ్బై, ఊంచాయి మూవీ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. 2021లో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్లు కూడా కరోనా పాజిటివ్గా పరీక్షించారు. చదవండి: త్రిష పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022 -
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ ... ఎనిమిదికి చేరిన కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా ఎనిమిదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్ఎన్జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అంతకు ముందురోజే యూఏఈ నుంచి కోజీకోడ్ వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వచ్చింది. ప్రస్తుతం అతను మలప్పురంలో చికిత్స పొందుతున్నాడు. అదీగాక ఇటీవలే కేరళలో మంకీపాక్స్తో మరణించిన తొలి కేసును కూడా అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి మంకీపాక్స్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినట్లు కూడా తెలిపారు. దీంతో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నియంత్రణ కోసం, వ్యాక్సిన్ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జాతీయ టాస్క్ఫోర్స్ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాదవియా వెల్లడించారు. ఈ టాస్క్ఫోర్సులో డాక్టర్ వీకే పాల్ తోపాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో ఇతర సభ్యులు ఉన్నారని చెప్పారు. (చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి!) -
దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై ప్రకటన.. పాజిటివ్ అని తెలిసినా గప్చుప్గా భారత్కు!
తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై అనుమానాలు వీడాయి. కేరళ త్రిస్సూర్కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్తోనే మృతి చెందినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో యూఏఈ నుంచి వచ్చిన యువకుడు మృతి చెందాడన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే అతనిలో మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్, రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. యూఏఈ నుంచి జులై 22న సదరు యువకుడు భారత్కు తిరిగి వచ్చాడు. ఆపై తన కుటుంబంతో గడిపాడు. స్నేహితులతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాడు కూడా. నాలుగు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు..అంటే జులై 27న అతను ఆస్పత్రిలో చేరాడు. జులై 28వ తేదీన అతన్ని వెంటిలేటర్ మీదకు షిఫ్ట్ చేశారు. చికిత్స పొందుతూ.. జులై 30వ తేదీన అతను కన్నుమూశాడు అని తెలిపారు మంత్రి వీణాజార్జ్. అయితే.. జులై 19వ తేదీన యూఏఈలోనే అతనికి మంకీపాక్స్ టెస్టులు జరిగాయని, భారత్కు వచ్చే ముందు రోజు అంటే జులై 21వ తేదీనే పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మంత్రి వీణాజార్జ్ తెలిపారు. అయితే ఆ యువకుడు విషయాన్ని దాచిపెట్టి.. మామూలుగానే ఉన్నాడని, భారత్కు చేరుకుని చివరికి వైరస్ ప్రభావంతో మరణించాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైద్యం సమయంలోనూ అతను తన రిపోర్ట్ వివరాలను వెల్లడించాలేదని, చివరకు మృతుడి శాంపిల్స్ను అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా అతనిలో మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు తేలిందని వీణాజార్జ్ వెల్లడించారు. అయితే కేరళ అధికారిక ప్రకటనపై కేంద్రం స్పందించాల్సి ఉంది. అదే సమయంలో అలపుజ్జా వైరాలజీ సెంటర్ నుంచి శాంపిల్స్ను పూణెకు పరీక్షల కోసం పంపింది. A young boy returned from UAE on July 22, he was with his family when on July 26 he developed a fever & was admitted on July 27. On July 28 he was moved to a ventilator. He got tested on July 19 for monkeypox in UAE, the result of which was positive:Kerala Health min Veena George pic.twitter.com/43VGAtkoB5 — ANI (@ANI) August 1, 2022 కాంటాక్ట్ ట్రేసింగ్.. ప్రొటోకాల్ ప్రకారం.. ప్రస్తుతం హై రిస్క్ జోన్లో ఉన్న 20 మందిని ఐసోలేషన్లో ఉంచామని, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మెడికల్ స్టాఫ్ కూడా అందులో ఉన్నట్లు ఆమె తెలిపారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. మంకీపాక్స్ బాధితుడు బయట తిరిగాడు. ఫుట్బాల్ మ్యాచ్లు సైతం ఆడాడు. అంతేకాదు త్రిస్సూర్తో పాటు చావక్కాడ్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ అతన్ని తిప్పారని, ఆ కాంటాక్ట్ లిస్టింగ్ కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని వీణాజార్జ్ వెల్లడించారు. ఆసియాలో మొదటిది ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఆఫ్రికాలోనే మంకీపాక్స్ మరణాలు చోటు చేసుకున్నాయి ఇప్పటిదాకా. తాజాగా ప్రపంచంలో తొలి ఆఫ్రికన్యేతర దేశంగా బ్రెజిల్లో మంకీపాక్స్ మరణం సంభవించింది. ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్న వ్యక్తి మంకీపాక్స్తో చనిపోయాడు కూడా. అలాగే స్పెయిన్లో రెండు మరణాలు వెనువెంటనే సంభవించాయి. తాజాగా కేరళ మరణంతో.. ప్రపంచంలో నాలుగో ఆఫ్రికన్యేతర మంకీపాక్స్ మరణం భారత్లో నమోదు అయ్యింది. అంతేకాదు ఆసియాలోనే తొలి మంకీపాక్స్ మరణానికి భారత్ కేంద్ర బిందువు అయ్యింది. అయితే కేరళ త్రిస్సూర్ యువకుడు కావడం, అతనిలో ఇతర సమస్యలేవీ లేకపోవడం, అంతకు ముందు కూడా వ్యాధులు లేకపోవడంతో కేరళ ఆరోగ్య శాఖతో పాటు కేంద్రమూ అప్రమత్తమైంది. -
డోపింగ్లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్హామ్కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
డైరెక్టర్ మణిరత్నంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ ఈ మూవీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్
Varalaxmi Sarath Kumar Tested Covid 19 Positive: కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మగా, అల్లరి నరేశ్ 'నాంది' మూవీలో లాయర్గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్కు బాధాకరమైన న్యూస్ చెప్పింది. ఆమె కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks.. Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked.. Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022 నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోపై సెలబ్రిటీలు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్' అని స్పందిస్తున్నారు. 'జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని నటి రాధిక కామెంట్ చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత 'యశోద', 'బాలయ్య 107', 'హనుమాన్', 'శబరి' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో.. -
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
‘మహా’లో మరో ట్విస్ట్.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్కు కరోనా పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయన కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. సీఎంకు కరోనా సోకడంతో వర్చువల్గా కేబినెట్ భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు. కాగా, కేబినెట్ భేటీ అనంతర ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు.. రాజీకయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం.. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో గవర్నర్ కోశ్యారీ.. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గోవా గవర్నర్ శ్రీధరణ్ పిళ్లైకి కేంద్రం.. అదనంగా మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పగించింది. #WATCH | Mumbai: "Maharashtra CM Uddhav Thackeray has tested positive for #COVID19," says Congress Observer for the state, Kamal Nath. pic.twitter.com/wl22yJkXXt — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: కీలక పరిణామం అసెంబ్లీ రద్దు.? -
భారత మార్కెట్పై అమెజాన్ బుల్లిష్
న్యూఢిల్లీ: భారత మార్కెట్ పట్ల తాము సానుకూలంగా (బుల్లిష్) ఉన్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు, ఎంఎస్ఎంఈల డిజిటైజేషన్ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘‘వచ్చే ఆరు నెలల్లో మేము ఎంత పెద్ద, మెరుగైన సంస్థో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భారత్లో కొనుగోళ్లు, విక్రయాలను పూర్తిగా మార్చాలన్న మా లక్ష్యం దిశగా పనిచేస్తూనే ఉన్నాం’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (కన్జ్యూమర్ బిజినెస్) మనీష్ తివారీ పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడుల ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధం అంటూ సీసీఐ ఇచ్చిన తీర్పును అమెజాన్ ఎన్సీఎల్టీలో సవాలు చేయగా.. అక్కడ ప్రతికూల తీర్పు రావడం తెలిసిందే. సీసీఐ తీర్పును సమర్థిస్తూ, అమెజాన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ తిరస్కరించడం తెలిసే ఉంటుంది. సీసీఐ రూ.200 కోట్ల పెనాల్టీని కూడా ఎన్సీఎల్టీ సమర్థించింది. దీనిపై మాట్లాడేందుకు తివారీ తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను సంబంధిత వ్యక్తులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వేగంగా వృద్ధి అమెజాన్ 9 ఏళ్ల క్రితం 100 విక్రయదారులు, ఒక గోదాముతో సేవలు మొదలు పెట్టింది. ఇప్పటికి తన ప్లాట్ఫామ్పై విక్రయదారుల సంఖ్యను 11 లక్షలకు పెంచుకుంది. 23 కోట్ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచింది. గోదాములు 60కి చేరాయి. -
కమెడియన్కు రెండోసారి కరోనా.. అభిమానులకు క్షమాపణలు
Comedian Vir Das Test Positive For Covid 19 Second Time: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నట్లుగా ఉన్నాయి కొవిడ్ కేసులు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కత్రీనా కైఫ్తో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు, కమెడియన్ వీర్ దాస్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బుధవారం (జూన్ 15) తెలిపాడు. ఇలా ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. ఇదివరకు ఈ ఏడాది జనవరిలో మహమ్మారి బారిన పడ్డాడు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న దాస్.. తన కామెడీ షోలు వాయిదా పడటంతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రాష్ట్రంలో జరగాల్సిన ఈ కామెడీ షోలు తర్వాతి తేదిలలో నిర్వహిస్తారని పేర్కొన్నాడు. 'మీకు కావాలంటే మీ టికెట్లు వాపసు ఇవ్వబడతాయి. క్షమించండి గుజరాత్. నేను ఈ విషయం గురించి చాలా విచారంగా ఉన్నాను. కానీ తర్వలో మిమ్మల్ని లైవ్లో చూడాలని కోరుకుంటున్నాను. మీరు కొత్త తేదిలలో షోకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.' అని 43 ఏళ్ల వీర్ దాస్ తెలిపాడు. చదవండి:👇 ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
షారుక్కి కరోనా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే. -
సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు పాజిటివ్గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా బారినపడ్డారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియా ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇక, ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. Congress president #SoniaGandhi tests covid positive. I pray for her speedy recovery. pic.twitter.com/uhQnKj9arP — Gautam (@GautamIND29) June 2, 2022 -
బూస్టర్ డోస్ వేసుకున్నా కమలా హారిస్కు కరోనా
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. మంగళవారం చేసిన రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండింట్లోనూ ఆమెకు పాజిటివ్గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేమీ కన్పించలేదు. నెగెటివ్గా తేలేదాకా ఆమె ఐసోలేషన్లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమల నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్యకు కరోనా సోకే ప్రమాదమేమీ లేదని ఆమె ప్రెస్ సెక్రెటరీ కిర్స్టెన్ అలెన్ తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి వారిని ఆమె కలవలేదని వివరించారు. కమల కరోనా రెండు డోసులతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. ఆమె భర్త డగ్ ఎమోఫ్ నెల క్రితమే కరోనా బారిన పడి కోలుకున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు, వైట్హౌస్ ఉన్నతాధికారులకూ కరోనా సోకింది. చదవండి: (4,800 కోట్ల డాలర్లతో జపాన్ అత్యవసర ప్యాకేజీ) -
కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? టెన్షన్ పెడుతున్న రీసెర్చ్!
సాక్షి, ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారిపై చేసిన అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాల తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. ఇక, కొవిడ్కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది చదవండి: భారత్లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు ఇవే.. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్
హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు శ్రుతి ట్వీట్ చేస్తూ.. ‘హాయ్.. నేను ఇస్తోన్న ఈ అప్డేట్ సరదా కోసం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే కలుస్తాను థ్యాంక్యూ’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఇటీవల ఆమె కలిసివారంతా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచిందింది. కాగా శ్రుతి హాసన్ ప్రస్తుతం సలార్, బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ల తెరకెక్కుతోన్న ఎన్బీకే107లో(#NBK107) హీరోయిన్గా నటిస్తోంది. pic.twitter.com/O8ENJ3ZBp5 — shruti haasan (@shrutihaasan) February 27, 2022 -
హోంక్వారంటైన్కు బ్రిటన్ గుడ్బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్లో కయాసన్కి కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
మరోసారి కరోనా బారిన పడ్డ హీరో శరత్ కుమార్
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్ పాజిటివ్గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్ కుమార్ ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సొకింది. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో శరత్ కుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Good evening my near and dear friends relatives and my brothers and sisters In the political party,this evening I have tested positive and have self isolated myself,I humbly request all the dear ones who have been in contact for the past week to test yourself immediately — R Sarath Kumar (@realsarathkumar) February 1, 2022 -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కావున ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 3,37,704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 10,050 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 13వేల 365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా కరోనా డోసుల పంపిణీ జరిగింది. -
ఇదెక్కడి గోస నాయనా! అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు
దేశం కాని దేశంలో ప్రయాణం మధ్యలో చిక్కుకుని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ లేక ఫోన్లు కలవక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా మార్గమధ్యలో వచ్చిన కరోనానే అందుకు కారణం. టొరంటో వెళ్తూ హైదరాబాద్కి చెందిన సయ్యద్ ఓమర్ అజామ్ అనే వ్యక్తి ఇండియా నుంచి కెనడాలోని టోరంటో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అబుదాబి ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అతనికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడున్న గేట్ నంబర్ 28 దగ్గరే అతన్ని గంటల తరబడి ఉంచారు. దీంతో సాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా అతను కోరాడు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని ఐసోలేషన్లో భాగంగా ఆల్ రజీమ్ క్వారంటైన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. లగేజీ ఇతర ముఖ్యమైన వస్తువులు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాయి. అక్కడి అధికారులు ఎవరితో పెద్దగా కలవనివ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశారు అజామ్ I’m traveling from Hyderabad, India to Toronto, Canada via Abu Dhabi (20-Jan-2022). We are struck at Abu Dhabi airport since 18+ hours as some of the passengers including myself were tested positive for COVID19 (did multiple Rapid RT PCR test at airport facility). pic.twitter.com/Gwzx2DOS5h — Syed Omar Azam (@SyedOmarAzam1) January 20, 2022 మరింత మంది అజామ్ ట్వీట్కి క్వారంటైన్ సెంటర్లో ఉన్న మరో భారతీయుడు కూడా స్పందించాడు. మనిద్దరమే కాదు అనేక మంది ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారని.. ఇక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ తెలిపాడు. చివరకు ఆల్ రజీమ్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదా స్వదేశానికి వచ్చే విధంగా సాయం చేయాలంటూ వారు విదేశాంగ మంత్రి జయ్శంకర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా సాయం కోరారు. Dear sir i am also in al razeen camp that because you tested positive i know it is very hard to live here i am also living here with 5 people and there are lot of indians here. So dont loose hope and stay strong. Tell your room number and building number. — Voice of hyderabad (@Voiceofhyderab5) January 21, 2022 సాయం చేయండి ఇండియా నుంచి యూరప్, అమెరికాకు వెళ్లే అనేక మంది దుబాయ్, అబుదాబిలో కనెక్టింగ్ ప్లైట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. విమానం ఎక్కే ముందే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యంలో చేసే పరీక్షల్లో పాజిటివ్గా తేలుతున్నారు. దీంతో అజామ్ తరహాలో అనేక మంది దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వారికి అవసరమైన సాయం అందించే విషయంలో ముందుకు రావాలని కోరుతున్నారు. చదవండి: ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం -
మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్
రామచంద్రపురం(తూర్పుగోదావరి): రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. సంక్రాంతి సంబరాల అనంతరం ఈ నెల 17న ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కేబినెట్ సమావేశం ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురువారం మరోసారి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్గా తేలింది. అయితే సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు -
కరోనా బారినపడిన మరో సీఎం.. హోం ఐసోలేషన్లో..
షిల్లాంగ్: దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కాన్రాడ్ సంగ్మా 2020లోను కరోనా బారిన పడ్డారు. I have tested positive for COVID-19. I am isolating myself for the required time. I have mild symptoms. All those who came into contact with me last few days are requested to observe their symptoms and test if necessary. — Conrad Sangma (@SangmaConrad) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
కరోనా కేసులతో వణికిపోతున్న మేడ్చల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో ఉన్నట్లు లెక్క. కానీ రాష్ట్రంలో గత వారం సరాసరి పాజిటివిటీ రేటు మూడు శాతం నమోదైంది. అయితే ఏడు జిల్లాల్లో మాత్రం ఏకంగా నాలుగు శాతానికి మించడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో 5.65, రంగారెడ్డి జిల్లాలో 4.92, నిజామాబాద్ జిల్లాలో 4.81, కామారెడ్డి జిల్లాలో 4.51, సంగారెడ్డి జిల్లాలో 4.21, మెదక్ జిల్లాలో 4.02 శాతం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 0.25 శాతం, గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 0.29 శాతం చొప్పున పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది. 17 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదైనట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చదవండి: కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా 3.3 శాతానికి పెరిగిన పడకల ఆక్యుపెన్సీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ శాతం కూడా కాస్త పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాంధీ సహా జిల్లా ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు 2.7 శాతం నిండిపోగా, ఈ నెల 12వ తేదీనాటికి 3.3 శాతానికి పెరిగింది. అయితే చాలావరకు కేసులు పెద్దగా సీరియస్ కావడం లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల కోసం 56,036 పడకలు కేటాయించారు. ఇందులో 97 శాతం వరకు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. పెరిగిన పిల్లల పడకలు పద్నాలుగు ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పిల్లల పడకలను పెంచింది. 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలను 6 వేలు చేసింది. అందులో ఆక్సిజన్ పడకలు 4,125 ఉండగా, ఐసీయూ పడకలు 1,875 ఉన్నాయి. అలాగే ఆయా ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 256 మంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. కొనసాగుతున్న ఫీవర్ సర్వే రాష్ట్రంలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం కోసం ఫీవర్ సర్వే జరుగుతోంది. తద్వారా ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్లో ఉంచడం, వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. చాలా మందికి తేలికపాటి లక్షణాలే ఉంటాయి. కొందరికి అసలు లక్షణాలే ఉండటం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 76 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. రోజుకు కనీసం 71,600 టెస్టులు లక్ష్యం ప్రతిరోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. కనీసం 71,600 పరీక్షలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్లో రోజుకు కనీసం 12,300 పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అయితే కనీసం కంటే ఎక్కువగానే కొన్నిసార్లు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు కనీస లక్ష్యానికి మించి టెస్టులు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఏకంగా 90,021 పరీక్షలు చేయగా అంతకుముందు రోజు 83,153 పరీక్షలు చేశారు. మరోవైపు కొందరు సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. అవి రోజుకు దాదాపు 10 వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
-
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర గరిమెళ్ళ ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్గే రెండు డోసులు తీసుకున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకునేందుకు అయన అర్హులు కారు. ఎందుకంటే బూస్టర్ డోసు తీసుకోవాలంటే రెండో డోసు నుంచి కనీసం తొమ్మిది నెలల గ్యాప్ అవసరం. ఢిల్లీలోని ఖర్గే కార్యాలయంలోని గరిమెళ్లతో సహా ఐదుగురు సిబ్బందికి కొద్ది రోజుల క్రితం వైరల్ వ్యాధి సోకింది. ప్రస్తుతం వారందరూ హోమ్ ఐసోలేషన్లో బాగా కోలుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఖర్గేతో పరిచయం ఉన్నవారు తమ లక్షణాలను గమనించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమను తాము పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. -
కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి కోవిడ్ సోకడం తెలిసిందే. ఆయన కుమారుడు భరత్, కోడలుకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. మంత్రి మాధుస్వామి, ఆయన కుమారునికి, అలాగే మరో ఎమ్మెల్యే హెచ్.ఎం.రేవణ్ణ, కాంగ్రెస్ నేత ఇబ్రహీంకి కోవిడ్ నిర్ధారణ అయింది. సీఎం కొడుకు, కోడలు మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు. ఇంట్లోనే సీఎం క్వారంటైన్ సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఇంట్లోనే చికిత్స కొనసాగించాలని సూచించారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ కరోనా లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్టీ నగరలోని నివాసంలోనే వారంరోజులు క్వారంటైన్లో ఉంటారు. అక్కడి నుంచే పరిపాలనా పనులు నిర్వహిస్తారు. చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు -
స్టార్ హీరో మాజీ భార్యకు కరోనా.. పెద్ద మొండిఘటం
Sussanne Khan Test Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజూకీ ఉగ్రరూపం దాల్చుతోంది కొవిడ్ మహమ్మారి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసనే ఖాన్ కొవిడ్ బారిన పడింది. మంగళవారం తన ఇన్స్టా గ్రామ్ ద్వారా కరోనా సోకినట్లు చెప్పుకొచ్చింది. 'కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్న తర్వాత మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.' అని పోస్ట్ పెట్టింది సుసనే. ఈ పోస్ట్కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సుసనే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'త్వరగా కోలుకోండి' అని బ్యూటీ బిపాసా బసు రాయగా, 'మీరు త్వరలో కోలుకుంటారు' అని సుసనే సోదరి ఫరా ఖాన్ అలీ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే జనవరి 10న హృతిక్ బర్త్డే సందర్భంగా సుసనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 'నువ్ చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్ రిడ్జ్ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ హగ్' అని సుసనే విష్ చేసింది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇదీ చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది -
సినీ పరిశ్రమను వణికిస్తోన్న కరోనా, మరో స్టార్ హీరోయిన్కు పాజిటివ్
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమ వణికిస్తోంది. వరసగా సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో రోజురోజుకు పరిశ్రమల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్గా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన హీరో మంచు మనోజ్, లక్ష్మి మంచు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కరోనా రాగా తాజాగా ‘మహానటి’ కీర్తి సూరేశ్ కూడా కరోనా పాజిటివ్గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. ‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది. అంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను’ అని పోస్ట్ చేసింది. pic.twitter.com/YF2lCxotOo — Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022 -
శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది
Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19: బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 10న జాన్వీ కపూర్ ఇన్స్టా గ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్తో వారికి కరోనా సోకిందని అనుమానాలు వచ్చాయి. ఈ పోస్ట్లో జాన్వీ తన నోట్లో థర్మామీటర్ పెట్టుకుని కనిపించింది. ఆమెతోపాటు ఖుషీ కపూర్ కూడా ఉంది. జాన్వీ ఇన్స్టా పోస్ట్ చూసి వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. వీరితో పాటు బోనీ కపూర్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో వారి నివాసాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు (బీఎంసీ) సీల్ వేసి శానిటైజ్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా అర్జున్, అన్షులా, రియాకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా వారు అధికారికంగా వెల్లడించలేదు. బాలీవుడ్ తారలను కరోనా తెగ ఇబ్బందిపెడుతుంది. ఇప్పటికే జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్, మధుర్ భండార్కర్, ప్రేమ్ చోప్రా, అతని భార్య ఉమా చోప్రా, మృణాల్ ఠాకూర్, స్వరా భాస్కర్లకు కొవిడ్ సోకింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తానని -
బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక
Legendary Actor Sathyaraj Hospitalized Suddenly Due To Coronavirus Positive: సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు మనోజ్, లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లకు కరోనా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా లెజండరి నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసిన నితిన్.. కాగా ఇంతకు ముందు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదే విధంగా సండే లాక్డౌన్ను కూడా విధించారు. కరోనా కేసుల తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ -
కరోనా కలకలం: స్టార్ హీరో దంపతులకు కోవిడ్ పాజిటివ్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, నటి నోరా ఫతేహీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుంచల్ కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి ‘కొద్ది రోజుల క్రితం నేను కలిసి ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు, నా భార్య ప్రియకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మేమిద్దరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి’ అని వెల్లడించాడు. అంతేగాక ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో తనని కలిసిన వారు వెంటనే టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్కు వెళ్లాలని జాన్ అబ్రహం సూచించాడు. కాగా ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రాజకీయ నేతలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. -
జెర్సీ హీరోయిన్కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్
Mrunal Thakur Tested Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కలకలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోన రక్కసి తన కోరలు చాస్తూ బీటౌన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవలే హిందీ పాపులర్ స్టార్స్ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కొవిడ్ రావడంతో తన నివాసానికి బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు సీల్ వేసి శానిటైజ్ చేశారు. హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంతో కూడా ఇటీవలే వివరించింది. తాజాగా జెర్సీ హీరోయిన్, బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఈ మహమ్మారి బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది మృణాల్. 'నేను కొవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాను. దానిలో పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. నాకు నేను ఐసోలేట్ అయ్యాను. వైద్యులు సూచించిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారు దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. సురక్షితంగా ఉండండి.' అని మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టా ఖాతాలో స్టోరీ షేర్ చేసింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో కలిసి మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా కలిసి నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఈ మూవీ. ఇదీ చదవండి: అర్జున్ కపూర్కి కరోనా.. ఇల్లుకు సీల్ వేసిన బీఎంసీ -
కరోనా బారిన మరో బాలీవుడ్ బ్యూటీ, కొద్ది రోజులుగా బెడ్కే పరిమితం..
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. చదవండి: మంచు మనోజ్కు కరోనా పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ ఎమోషనల్ ట్వీట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నా. నిజం చెప్పాలంటే ఈ వైరస్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా బెడ్కే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? -
మంత్రి ఎర్రబెల్లికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ధాన్యం సేకరణ విషయమై మంత్రుల బృందంతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో తనను కలిసిన వాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని ఎర్రబెల్లి సూచిస్తున్నారు. -
వివాహ కనీస వయసు.. పాజిటివ్తో పాటు నెగెటివ్ కూడా!
అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం. అనుకూల వాదన ► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది. ► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు. ► లేబర్ ఫోర్స్లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 % ► పోషకాహార స్థాయి పెరుగుతుంది. ► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్ను 70గా నిర్దేశించారు. ప్రతికూల వాదన ► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది. ► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Telangana: మరో నలుగురికి ఒమిక్రాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు మొత్తంగా ఏడుకు చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని.. స్థానికంగా ఒమిక్రాన్ కేసులేవీ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. తాజా కేసుల్లో ఒకరు హైదరాబాదీ: బుధవారం నమోదైన మూడు కేసుల్లో ఒకరు సోమాలియాకు, మరొకరు కెన్యాకు చెందినవారుకాగా.. మరొకరు కెన్యా నుంచి వచ్చిన బెంగాలీ. తాజాగా గురువారం వెలుగు చూసిన నాలుగు కేసుల్లో ఒకరు బ్రిటన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల హైదరాబాద్ వాసి. యూసఫ్గూడ ప్రాంతానికి చెందిన ఆయన.. లండన్ నుంచి దుబాయ్ మీదుగా ఈ నెల 15న హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది. ఇక మిగతా ముగ్గురు కెన్యా దేశస్తులే. వీరిలో ఇద్దరు 24 ఏళ్ల యువతులు, ఒకరు 44 ఏళ్ల పురుషుడు ఉన్నారని.. ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్ మీదుగా హైదరాబాద్కు చేరుకున్నారని అధికారులు చెప్తున్నారు. వారు వైద్య అవసరాల కోసం హైదరాబాద్కు వచ్చారని సమాచారం. అయితే వైద్యారోగ్యశాఖ మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదు. ముప్పున్న దేశాల నుంచి మరో 120 మంది.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న ‘రిస్క్’దేశాల నుంచి వచ్చిన 120 మంది గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారందరికీ పరీక్షలు చేయగా.. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. మొత్తంగా రిస్క్ దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది వచ్చారు. అందులో 21 మందికి సాధారణ కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. ఇక ‘రిస్క్’లేని దేశాల నుంచి వేలాది మంది రాష్ట్రానికి రాగా.. వారిలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. తాజాగా మరో ముగ్గురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 190 కేసులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40,103 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 190 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 6,79,064కి పెరిగాయి. వైరస్ బారినపడి మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాలు 4,012కు చేరాయి. -
భారత్ కార్పొరేట్ అవుట్లుక్... పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ కంపెనీల అవుట్లుక్ పాజిటివ్గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్లుక్కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా. ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్, అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ► వ్యాక్సినేషన్ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సానుకూల క్రెడిట్ ఫండమెంటల్స్ బలాన్ని అందిస్తున్నాయి. ► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి. ► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి. మూడవవేవ్ వస్తే మాత్రం కష్టమే... ఎకానమీకి మూడవ వేవ్ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం సవాళ్లు... ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. -
బిగ్ బాస్కి హోస్ట్గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్హాసన్ హోస్ట్గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
పాపం నటరాజన్కే ఎందుకిలా?
-
గొరిల్లాలకు సోకిన కరోనా
-
తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్
కోల్సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్బాబా, స్టాఫ్నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
పండగలప్పుడు జరభద్రం!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అప్రమత్తత అవసరమనీ, రాబోయే పండుగలను కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జరుపుకోవాలని కోరింది. కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉందన్నారు. పండగల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 41 జిల్లాల్లో కోవిడ్ వీక్లీ పాజిటివ్ రేటు 10% కంటే ఎక్కువగానూ, 27 జిల్లాల్లో 5–10 శాతాల మధ్యలోనూ నమోదవుతోందని వివరించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు భారీగా పెరుగుతాయన్నారు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని నివారించడం చాలా ముఖ్యమని వివరించారు. ఒక్క కేరళలోనే లక్ష యాక్టివ్ కేసులున్నాయనీ, మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 51.19% అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో యాక్టివ్ కేసులు 10 వేల నుంచి 1లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్ రేటు కూడా జూలైలో 43.41 లక్షలుండగా ఆగస్టులో అది 52.16 లక్షల డోసులకు పెరిగిందన్నారు. దేశంలో గత రెండు, మూడు వారాలుగా ఏ రాష్ట్రం నుంచి కూడా కోవిడ్ టీకా కొరత ఉందంటూ ఫిర్యాదులు అందలేదని భూషణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపయోగించని/ నిల్వ ఉన్న టీకా డోసులు 2.5 కోట్లకు తగ్గలేదని తెలిపారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 లక్షల డోసుల టీకా వేసినట్లు తమకు వివరాలందాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉందని వివరించారు. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 50 శాతం మందికి కోవిడ్ టీకా మొదటి డోసు అందగా, వీరిలో 15%మంది రెండో డోసు కూడా వేయించుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు సరిపోను ఉన్నాయని పేర్కొన్నారు. -
ప్రధాని సిబ్బందికి కరోనా.. క్వారెంటైన్ అవసరం లేదంటూ ప్రకటన
లండన్: చట్టం ముందు అందరూ సమానులే, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయంటారు. కానీ ఇవి మాటలకే గానీ ఆచరణలకు కాదనేలా నిరూపిస్తోంది ఈ ఘటన. తాజాగా బ్రిటన్లో ప్రజలకు ఒకలా, ప్రధానికి మరోలా నిబంధనలను అమలుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత వారాల్లో ప్రధాని చేసిన పర్యటనల్లో, ఆయన వెంట వెళ్లిన సిబ్బందిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జాన్సన్కు క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని అధికారిక కార్యాలయం డౌన్ స్ట్రీట్ స్పష్టం చేసింది. జాన్సన్ బుధవారం ఫైఫ్లోని పోలీసు కళాశాలను, అలానే గురువారం అబెర్డీన్షైర్లోని విండ్ఫార్మ్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి తిరిగిన సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఆతనికి స్కాట్లాండ్ ప్రయాణంలో నిబంధనల ప్రకారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఈ ఫలితాల అనంతరం ప్రధానికి ఐసోలేషన్ అక్కర్లేదని డౌన్ స్ట్రీట్ పేర్కొంటూ, అందుకు వివరణగా.. ఇటీవల జాన్స్న్ యూకే అంతటా క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారని, అదే క్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రయాణాలు జరుగుతున్నాయని తెలిపింది. "పరీక్షలో పాజిటివ్గా నిర్థారణ అయిన ఎవరితోనూ ప్రధాని కాంటెక్ట్ కాలేదు, కనుక ఆయన క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే దీనిపై ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రజలను ఫూల్స్ను చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు తమకు ఓ రూల్, దేశ ప్రజలందరీకి ఒక రూల్ను అమలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. -
పీటలపై వధువు.. వరుడికి అప్పుడే చేసిన టెస్ట్లో షాకింగ్ విషయం
లక్నో: పెళ్లంటే ఒక తెలియని ఆనందం. పెళ్లిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ జంట పెళ్లి చేసుకునే వేళ ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. కొన్ని గంటల్లో ఇద్దరు ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడి ఆ పెళ్లి వాయిదా పడింది. వారి పెళ్లికి అడ్డంకిగా నిలిచింది ఏమిటో కాదు మహమ్మారి కరోనా. బాజభజంత్రీలతో ఉత్సాహంగా ఊరేగింపుగా బయల్దేరిన వరుడికి పాజిటివ్ తేలింది. దీంతో మండపంలో ఉండాల్సిన అతడు హోం ఐసోలేషన్కు వెళ్లాడు. ఆగిపోయిన పెళ్లి వార్త విశేషాలు మీరే చదవండి. ఉత్తరాఖండ్లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్కు ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ వధువు గ్రామం చందోయ్కు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దులో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెగటివ్ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారు. ‘సార్ పెళ్లి ఉంది.. వదిలేయండి’ అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు విసుగు చెంది అక్కడే సరిహద్దులో పరీక్షలు చేయించుకున్నారు. 41 మందికి పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్ వచ్చింది. కానీ ఆ ఒకరికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అది కూడా వరుడికి పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు షాక్కు గురయ్యారు. పెళ్లి ఉండడంతో జాలిపడి పోలీసులు మూడుసార్లు పరీక్షలు చేశారు. మూడింటిలోనూ పాజిటివ్ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకిందని నిర్ధారించారు. వెంటనే బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చేరవేశారు. ఈ హఠాత్పరిణామానికి వారు అవాక్కయ్యారు. చివరకు చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మీ పెళ్లి మా సావుకొచ్చింది’ అంటూ కరోనా భయంతో బంధువులు వెనక్కి తగ్గారు. -
ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా
టోక్యో: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా టోక్యో ఒలింపిక్స్ను ఏదో ఒక రూపంలో కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా అథ్లెట్ల ‘క్రీడా గ్రామం’లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరు కోవిడ్–19 పాజిటివ్గా తేలారు. నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరు గేమ్స్ విలేజ్తో సంబంధం లేని మరో ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి భోజనం చేసినట్లుగా సమాచారం. ఒలింపిక్స్ చేరువవుతున్న సమయంలో ఇప్పటికే ఉగాండాకు చెందిన అథ్లెట్, కోచ్... మరో సెర్బియా అథ్లెట్ కూడా కరోనా బారిన పడటంతో కలవరం పెరిగింది. ఈ స్థితిలో తాజా రెండు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పటికే టోక్యోలో ఉన్న ఆస్ట్రేలియా బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వీరిలో 98 శాతం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నా సరే... ఒలింపిక్ నిర్వాహకుల నిబంధనలతో పాటు తమ ఆటగాళ్లు సొంతంగా ఇతర కఠిన నిబంధనలు పాటించాలని ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం సూచించింది. మరోవైపు జపాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్ టార్చ్ రిలేలను దాదాపు అన్ని చోట్లా రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఒక్క చోటకు చేరకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. టోక్యోకు దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న దీవి ‘ఒగాసవారా’లో మాత్రం షెడ్యూల్ ప్రకారం టార్చ్ రిలే కొనసాగుతుంది. -
రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు, మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,028 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3627 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1489 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 6,01,184 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: నేనెట్టా బతకాలి సారూ.. -
టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్ తారుమారు?
కరోనా వైరస్, రెండో దఫా లాక్డౌన్ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్లను ఉపయోగించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది. లండన్: మెర్సెసైడ్లోని బెల్లె వాలేలో ఉన్న గేట్ఎకర్ స్కూల్ యాజమాన్యం తాజాగా పేరెంట్స్కి ఒక మెయిల్ పెట్టింది. ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్లో హెచ్చరించింది. జూన్ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్ పిల్లలకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్ పంపింది స్కూల్. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. అదే టైంలో బ్రిటన్ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్ పంపామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్టాక్లు చేస్తుండడంతో స్టూడెంట్స్పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: వుహాన్ ల్యాబ్కు ఈ ఏడాది నోబెల్!! -
బాబోయ్, ఈ వ్యక్తికి పది నెలలుగా పాజిటివ్.. చివరికి
లండన్: సాధారణంగా కోవిడ్ మహమ్మారి సోకితే రెండు వారాలు క్వారెంటైన్లో ఉండి పౌష్టికాహారం తీసుకోవడంతో వైరస్ను మన శరీరంలోంచి పంపగలమని వైద్యులు చెప్తున్నారు. కానీ బ్రిటన్లో వైద్యులకు సైతం అంతుచిక్కని ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పది నెలలుగా కరోనా తోటి సహజీవనం చేస్తున్నాడు. అతనికి వైరస్ సోకినప్పటి నుంచి మధ్య మధ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటవ్గానే ఫలితాలు వచ్చేవి. కాగా ఈ వైరస్ ఇంత కాలం ఓ వ్యక్తి శరీరంలో కొనసాగడం ఇదే మొదటి సారని ఆ దేశ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పశ్చిమ ఇంగ్లాండ్లోని బ్రిస్టల్కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్ పది నెలల ముందు కరోనా వైరస్ సోకింది. ఇక అప్పటి నుంచి అతనికి చేసిన పరిక్షల్లో 43 సార్లు పాజిటివ్గా ఫలితాలు వచ్చాయని, ఏడుసార్లు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపాడు. ఒకానొక దశలో అతని మరణిస్తాడేమో అతని కుటుంబసభ్యులు తన అంత్యక్రియలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చాడు. అతని భార్య మాట్లాడుతూ .. స్మిత్కు ఎన్ని సార్లు పరిక్షిలు జరిపినా పాజిటివ్ రావడం, మళ్లీ హోం క్వారెంటైన్కు వెళ్లడం గత పది నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఒక్కోసారి స్మిత్ ఆరోగ్యం క్షీణించేది అప్పుడు నాకు చాలా భయమేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత సంవత్సరమంతా మాకు నరకంలా గడిచిందని ఆమె తెలిపింది. ఎట్టికేలకు వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత చివరికి స్మిత్కు నెగటివ్ రావడం అది కూడా దాదాపు 305 రోజుల తరువాత ఇలా జరగడంతో ఆ దంపతులు షాంపైన్ బాటిల్తో ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. స్మిత్ కేసుని అధ్యయనం చేస్తున్న వైద్యుల ప్రకారం.. అతని శరీరంలో వైరస్ ఎక్టివ్గా కొనసాగుతోంది. వైరస్ శరీరంలో ఎక్కడ దాక్కుంటుంది? ఇది నిరంతరం సోకుతూ ఎలా ఉంటుంది? అనే దానిపై అధ్యయనం కొనసాగిస్తున్నామని తెలిపారు. చదవండి: Fact Check: ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా? -
Tokyo Olympics: కరోనా కలకలం.. ఫస్ట్ కేసు గుర్తింపు!
సమ్మర్ ఒలింపిక్స్ 2020(2021)లో కరోనా కలకలం మొదలైంది. వేడుకలకు ఐదు వారాల ముందే ఆటగాళ్లలో మొట్టమొదటి కేసును అధికారులు గుర్తించారు. టోక్యో గడ్డపై అడుగుపెట్టిన ఉగాండాకు చెందిన ఓ అథ్లెట్కు కరోనా పాజిటివ్ సోకడంతో అంతా ఉలిక్కి పడ్డారు. టోక్యో: ఒలింపిక్స్ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా టీం టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఆ ఆటగాడి పేరును వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇక జపాన్లో అంతర్జాతీయ ప్రయాణికులకు రెండువారాల క్వారంటైన్ అమలులో ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్ ప్లేయర్స్ కోసం ఆ నిబంధనను మార్చారు. వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఫర్వాలేదని పేర్కొంటూ.. బయో బబుల్స్, సోషల్ డిస్టెన్స్ పాటించడం, రోజూవారీ పరీక్షల్లో పాల్గొన్నా సరిపోతుందని పేర్కొంది. విమర్శలు.. కరోనా టైంలో ఒలింపిక్స్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వేల మంది ఆటగాళ్ల మధ్య కరోనాను ఎలా కట్టడి చేస్తారని మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామం(ఉగాండా ఆటగాడికి పాజిటివ్)తో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈసారి ఒలింపిక్స్ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం టోక్యో ఒలింపిక్స్ కమిటీ భేటీ కానుంది. చదవండి: కండోమ్లు ఇక ఇంటికి తీసుకెళ్లండి -
ప్రమాదకరం.. ‘ఫాల్స్ నెగిటివ్’.. అంటే ఏంటి?
సాక్షి, కాకినాడ: అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తీరుగా ఉంటోంది. లక్షణాలున్నవారు, ఆరోగ్య పరిస్థితి దిగజారినవారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే కొంతమందికి నెగిటివ్గా.. ఎటువంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్గా ఫలితం వస్తోంది. ఇలాంటివి అరుదుగా ఎదురవుతున్నప్పటికీ ప్రమాదకరంగానే పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా పరీక్షల ఆధారంగా వైద్యం అందించాల్సిన కీలక సమయాల్లో ఇదొక సమస్యగా పరిణమిస్తోందని అంటున్నారు. కాకినాడ జీజీహెచ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మూర్తి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో వీఆర్డీ ల్యాబ్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై డాక్టర్ మూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఫాల్స్ నెగిటివ్ అంటే.. కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలో రిపోర్ట్ నెగిటివ్గా వస్తే దాన్ని వైద్య పరిభాషలో ఫాల్స్ నెగిటివ్ అంటారు. పరీక్షలు చేసేవారికి సరైన శిక్షణ లేకపోవడం, సరైన స్వాబ్ను వాడకపోవడం, శాంపిల్ పరిమాణం తక్కువగా సేకరించడం, సేకరించాక సరిగా భద్రపర్చకపోవడం, శాంపిళ్లను సరైన రీతిలో పరీక్ష కేంద్రాలకు తరలించకపోవడం ఫాల్స్ నెగిటివ్కు కారణాలవుతున్నాయి. ఫాల్స్ పాజిటివ్ కంటే ఫాల్స్ నెగిటివ్ ప్రమాదకరం. ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్ వల్ల బాధితుడు వైద్యానికి దూరమవుతాడు. తద్వారా తన ఆరోగ్యాన్ని ప్రమాదకరస్థితిలోకి నెట్టుకోవడమే కాకుండా వైరస్ వ్యాప్తికి కూడా కారకుడవుతాడు. ఫాల్స్ పాజిటివ్ అంటే.. శాంపిల్స్ తారుమారైనా, వైరస్ తగ్గి 90 రోజులు గడవక ముందు మళ్లీ టెస్ట్ చేయించుకున్నా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. దీనివల్ల బాధితుడి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యాధి లేకున్నా మందులు వేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి వైరస్ నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తోంది. వైరస్ మృతకణాలు సైతం పరీక్షల్లో కనిపించడం వల్ల పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. అందుకే ప్రభుత్వం రీ టెస్ట్ను సిఫార్సు చేయడం లేదు. మ్యుటేషన్ల వల్ల ఫలితాల్లో తేడా పరీక్షకు సేకరించిన నమూనాల్లో మ్యుటేషన్లు (వైరస్ పరివర్తన) చోటు చేసుకుంటే ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. పరీక్షకు ముందు ఆహారం తీసుకున్నా.. ద్రవాలు తాగినా పరీక్ష ఫలితాల ఖచ్చితత్వం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఘన, ద్రవ ఆహారాలు శరీరంలో వివిధ క్రియలపై చూపే ప్రభావమే దీనికి కారణం. నిర్లక్ష్యం వద్దు.. అరుదైన సందర్భాల్లోనే ఫాల్స్ పాజిటివ్, నెగిటివ్లకు అవకాశం ఉంది. అయితే వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే మాత్రం నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో తిరిగి మరోమారు ఆర్టీపీసీఆర్ పరీక్షే చేయించుకోవాలి. అప్పటికీ నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే తప్పకుండా సీటీ స్కాన్ చేయించుకోవాలి. హై రిజల్యూషన్ సీటీ స్కాన్ టెస్ట్ (హెచ్ఆర్సీటీ) రేడియేషన్ కారణంగా అందరికీ సురక్షితం కాదు. గర్భిణులు సీటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తే ఉదరంపై అబ్డామిన్ షీట్ ఉంచుకోవాలి.