
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు పాజిటివ్గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా బారినపడ్డారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియా ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇక, ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.
Congress president #SoniaGandhi tests covid positive.
— Gautam (@GautamIND29) June 2, 2022
I pray for her speedy recovery. pic.twitter.com/uhQnKj9arP