
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల సాగుదా రుల నుంచి దరఖాస్తుల స్వీకరణకుగాను విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినేట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై త్వరలో జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment