‘గుడ్‌’మార్నింగ్‌.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు | TS: Afternoon Weather Little Increase In Telangana | Sakshi
Sakshi News home page

‘గుడ్‌’మార్నింగ్‌.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

Published Sun, Dec 26 2021 4:43 AM | Last Updated on Sun, Dec 26 2021 4:43 AM

TS: Afternoon Weather Little Increase In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రానికి దక్షిణ, నైరుతి దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement