భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం

Published Mon, Mar 3 2025 12:50 AM | Last Updated on Mon, Mar 3 2025 12:50 AM

భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం

భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం

తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానం, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశైల పీఠం జగద్గురు డాక్టర్‌ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ, బెంగళూరుకు చెందిన అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థాన్‌ సంయుక్తంగా వర్సిటీ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం శక్తి విశిష్టాద్వైతం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శక్తి విశిష్టాద్వైతం మహత్వాన్ని ఆధునిక దార్శనికులకు అందించడం శుభపరిణామమన్నారు. సంస్కృత భాష ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాశీపీఠం జ్ఞానసింహాసనధీశులు డాక్టర్‌ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి శక్తి విశిష్టాద్వైతం గొప్పతనాన్ని తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇందులో సారాంశాన్ని గ్రహించి ఆధ్యాత్మిక తత్త్వ అన్వేషణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సదుస్సులో వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, డీన్‌ రజనీకాంత్‌శుక్లా, ప్రొఫెసర్‌ గణపతిభట్‌, సతీష్‌, నాగరాజభట్‌, శివరామదాయగుడే, మనోజ్‌షిండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement