వాహన యజమానులూ జాగ్రత్త
● మైనర్లు వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా
తిరుపతి క్రైం:వాహన యజమానులు ఇక జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే రహదారి నిబంధ నలు కఠినంగా అమలు చేసేందుకు రవాణా, పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ‘హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనా లు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నా యి. నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదు’ అంటూ పోలీస్, రవాణాశాఖ అధికారులపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఈ క్రమంలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు.
మైనర్లకు వాహనాలిస్తే భారీ జరిమానా
గతంలో మైనర్లు వాహనాలు వాడితే పెద్ద వారికి శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు. అలాగే మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
ఫైన్లు ఇలా..
● లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించే వారు. ఇప్పుడు దాన్ని రూ.5 వేలకు పెంచనున్నారు.
● హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, వెనుక వైపు కూర్చున్నా కూడా రూ.1000 జరిమానా.
● రెడ్ లైట్స్ ఉల్లంఘించి వాహనాలను నడిపితే రూ.500
● అతివేగంగా వాహనాన్ని నడిపితే రూ.1000
● రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపితే రూ.5000
● డ్రంక్ అండ్ డ్రైవ్ గతంలో రూ.2 వేలుగా ఉన్న ఫైన్ను ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పెంచారు.
● రేసింగ్, స్పీడ్ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు
● హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ. వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు.
● అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే రూ.10 వేలు
● ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టు బడితే రూ.1000. మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.
● ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు.
నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నూతన రూల్స్ను పాటించాలి.
– హర్షవర్ధన్రాజు, తిరుపతి జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment