
ఐసీడీఎస్ అధికారుల చెంత మగ శిశువు
షాద్నగర్: రెండు రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లింది.. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండలం విఠ్యాల గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. అయితే వేడి గాలులకు తట్టుకోలేని ఆ శిశువు రోధించడం మొదలు పట్టింది. దీంతో అటుగా వెళుతున్న మహిళలు శిశువు అక్కున చేర్చుకొని పాలు తాపారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శిశువులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో వారు శిశువిహార్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.