62కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

62కిలోల గంజాయి స్వాధీనం

Published Tue, Feb 25 2025 1:33 AM | Last Updated on Tue, Feb 25 2025 1:34 AM

62కిలోల గంజాయి స్వాధీనం

62కిలోల గంజాయి స్వాధీనం

ఆత్మకూరు: ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమంగా తరలిస్తున్న 62 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్‌ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కన్ష్‌ జాను, అలోక్‌ ప్రధాన్‌, మంగు ప్రధాన్‌లు సూరత్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా గుడెప్పాడ్‌ జంక్షన్‌ వద్ద పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని రూ.30 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించినట్లు సీఐ సంతోష్‌ తెలిపారు. తనిఖీల్లో ఎస్సైలు తిరుపతి, శ్రావణ్‌కుమార్‌, పోలీసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement