నేత్రపర్వం.. త్రిశూల స్నానం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. శుక్రవారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు తీర్ధపు బిందె, నిత్యహోమం, బలిహరణ, గణపతిపూజ అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. ఆ తరువాత ఆల య ఆవరణలో శివయ్యకు త్రిశూల స్నానాన్ని అట్టహాసంగా జరిపారు. అనంతరం గంగా, పార్వతీ సమేత శివదేవుని గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. రాత్రి ఆలయంలో స్వామివారికి 21 చుట్లు పల్లకి సేవ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment