కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు | - | Sakshi
Sakshi News home page

కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు

Published Sun, Mar 2 2025 1:49 AM | Last Updated on Sun, Mar 2 2025 1:48 AM

కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు

కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో విద్యారంగం కుదేలైందని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్‌ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విద్యారంగ అభివృద్ధికి అరకొరగా మాత్రమే పనికొస్తాయన్నారు. గత ప్రభుత్వం పాఠశాలల కోసం నాడు – నేడు పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో పాఠశాలల అభివృద్ధి ఊసెత్తలేదన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయులను ఈ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పీఆర్‌సీ గురించి ప్రకటన చేయకపోవడం దారుణమని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించిందని, ఈ ప్రభుత్వం మధ్యంతర భృతి కూడా ప్రకటించకుండా ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేసిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement