తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు | - | Sakshi
Sakshi News home page

తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు

Published Wed, Feb 19 2025 2:12 AM | Last Updated on Wed, Feb 19 2025 2:12 AM

తలనీలాల వేలం పాట  రూ.5.51 లక్షలు

తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు

సిద్దవటం: నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వంగపాటి మహేంద్ర రూ. 5. 51లక్షలకు దక్కించుకున్నారని ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యపూజ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి సమర్పించుకునే తలనీలాల ప్రోగు కోసం ఈ వేలం పాటను నిర్వహించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement