స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు మూడు నెలల గరిష్ట స్ధాయికి చేరాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు 245 రూపాయలు పెరిగి 27,425 రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి సైతం అదే పుంజుకుంది . ప్రస్తుతం కిలో వెండి 150 రూపాయలు దాకా పెరిగి 36,600 గా ఉంది. ఇండస్ట్రీయల్ వినియోగం మరింత పెరగుతుండటంతో వెండికి మరోసారి డిమాండ్ పెరిగిందని నిపుణులు చెపుతున్నారు.