విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం మర్రివలసలో ఓ ఫంక్షన్లో అపశృతి చోటుచేసుకుంది. విందు భోజనం చేసిన సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ మూలంగా అనారోగ్యం పాలైన వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు పరామర్శించారు.