food poison
-
కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
-
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
ఘట్కేసర్: ఫుడ్ పాయిజన్తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్లో గోమండి పీహెచ్సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పీహెచ్సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్సీకి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.మాగనూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఐదుగురు మోడల్ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్పహాడ్ మోడల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థు లు గురువారం అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదు వుతున్న ముగ్గురు విద్యార్థి నులు, ఆరో తరగతి చ దువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యా రు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108 వాహనంలో ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందించారు.వారిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతుండగా మరో ముగ్గురు వాంతులు, క డుపునొప్పితో బాధపడుతున్నట్లు దేవరకొండ ఆస్ప త్రి సూపరింటెండెంట్ మంగ్తానాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మాతృనాయక్ ఆస్పత్రికి చేరు కొని విద్యార్థినులను పరామర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలోనే ఇటీవల ఒక మోడల్ స్కూల్ విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారుఓయూలో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కేటగిరీ–1 పీహెచ్డీలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ డీన్లు.. పీహెచ్డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటగిరీ–1 పీహెచ్డీ ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన.. యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్ ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నల్లగొండ జిల్లా పెదఅడిశర్లపల్లి మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్
-
తెలంగాణలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. -
నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్లో ఫుడ్పాయిజన్
-
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (శనివారం) ప్రభుత్వ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
ఫుడ్ పాయిజన్ ఘటనలు.. చర్యలు తప్పవని రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూల్స్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇక, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్కూల్స్, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలి. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లఓ్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి అన్ని వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగనుంది. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
పట్టింపు లేదా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ అంశం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యలు చేసింది.నారాయణపేట జిల్లాలో మాగనూర్లోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ ఘటన విషయంలో బాధులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏఏజీ చెప్పారు. ఈ సందర్భంగా.. సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని న్యాయ స్థానం కోరింది. ఈ ఘటనలపై సోమవారంలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవలే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, అధికారులు రంగంలోకి హెచ్ఎం సహా మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే నిన్న(బుధవారం) మళ్లీ ఫుడ్ పాయిజన్ కారణంగా మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వరుస ఘటనలపైనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. -
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
TG: స్కూళ్లలో ఫుడ్పాయిజన్పై హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో ఫైల్ అయిన పిటిషన్పై హైకోర్టు బుధవారం(నవంబర్ 27) విచారించింది.పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్పాయిజన్ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇదీచదవండి: మాగనూరులో మళ్లీ ఫుడ్పాయిజన్ -
నారాయణపేట జిల్లాలో కలకలం రేపిన ఫుడ్ పాయిజన్ ఘటన
-
మళ్లీ ఫుడ్ పాయిజన్
నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మరోసారి కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉపాధ్యాయులు మొదట మాగనూర్ పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 30 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 9వ తరగతి విద్యార్థులు నేత్ర, దీపిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి తరలించారు. తహసీల్దార్ పర్యవేక్షణలోనే వంట మాగనూర్ ఇన్చార్జి తహసీల్దార్ సురేష్ కుమార్, మధ్యాహ్న భోజనం ఇన్చార్జి, పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవేంద్రచారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం తయారు చేయించారు. అయినప్పటికీ మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంట చేసిన కార్మీకులను స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. బయట చిరుతిళ్లు తిన్నారా? విద్యార్థులు స్కూల్ బయట ఉన్న బేకరీలు, దుకాణాల్లో చిరుతిళ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్ సిక్తా పటా్నయక్ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి మాగనూర్లోని పలు బేకరీలు, దుకాణాల్లో విచారణ చేపట్టారు. సీఎం దృష్టికి వెళ్లినా.. గత బుధవారం కలుషిత ఆహారంతో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరునాడే అన్నంలో మళ్లీ పురుగులు రావడం, అధికారులపై చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు వరుసబెట్టి అస్వస్థతకు గురవుతుండటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే! -
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం
-
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్రావు వివరించారు. -
మళ్లీ పురుగుల అన్నమే!
నారాయణపేట/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మధ్యాహ్న భోజనం విషతుల్యమై ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైనా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం కూడా అదే పురుగుల అన్నం వడ్డించారు. బుధవారం ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రుల్లో చేరిన విద్యార్థులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. ఆ మరుసటి రోజే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. గురువారం ఉదయం నారాయణపేట కలెక్టర్ సిక్తా పటా్నయక్ స్వయంగా పాఠశాలను సందర్శించి వంట గది, స్టాక్ రూమ్లను పరిశీలించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండించా లని డీఈఓ అబ్దుల్ ఘనీ, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమను ఆదేశించారు. దీంతో మాగనూర్లోని ఎస్సీ విద్యార్థుల వసతి గృహం నుంచి వంట మనుషులను పిలిపించి.. అన్నం, సాంబార్, కూరలు వండించి విద్యార్థులకు వడ్డించారు. ఆ అన్నంలో కూడా పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. అదనపు కలెక్టర్ బేన్షాలం (రెవెన్యూ)ను పాఠశాలకు పంపారు. పురుగుల అన్నం వడ్డించింది వాస్తవమేనని అదనపు కలెక్టర్ నిర్ధారించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్.. డీఈఓ అబ్దుల్ఘనీపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతకు ముందే ఎంఈఓ హెచ్ఎం మురళీధర్రెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం బాబురెడ్డిని సస్పెండ్ చేశారు.ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు. విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పరామర్శ ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిపాలైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్గౌడ్ గురువారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. విషాహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఇక్కడ కూడా పురుగులు ఉన్న టిఫిన్ పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. -
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు.. మాగనూర్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. -
మిడ్ డే మీల్స్ తిని 50 మంది పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్..
-
మధ్యాహ్న భోజనం తిని 100 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే సుమారు వందమంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆ విషయం టీచర్లకు చెప్పగా ‘మీరు రోజూ ఇలాగే చెప్తున్నారు’అని బెదిరించినట్లు తెలిసింది. కానీ, కడుపునొప్పి మరింత తీవ్రం కావటంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. దీంతో టీచర్లు స్థానిక ఆస్పత్రికి సమాచారమిచ్చారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు స్కూలుకు వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించినా కొందరి పరిస్థితి మెరుగుపడకపోవటంతో మండల వైద్యాధికారి అఫ్రోజ్కు సమాచారం అందించారు. ఆయన స్కూలుకు వచ్చి విద్యార్థులను పరీక్షించారు. తొలుత 10 మందిని మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ప్రైవేట్ అంబులెన్స్లో మరో 9 మంది విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి పంపించారు. వీరిలో 15 మందిని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, అనిల్, నందిని పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్న ఇతర గ్రామాల విద్యార్థులను టీచర్లు ఇంటికి పంపించివేశారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మొత్తం వందమంది విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అయినట్లు గుర్తించారు. కాగా, కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన కొందరు విద్యార్థులను టీచర్లు కొట్టినట్లు చెపుతున్నారు. ఇక్కడ ఫుడ్పాయిజన్ మొదటిసారి కాదు! విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న డీఈఓ అబ్దుల్ ఘనీ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్ఎం (ఇన్చార్జ్ ఎంఈఓ) నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా పాఠశాలకు చేరుకుని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓను, ఎస్ఐ అశోక్బాబును ఆదేశించారు. ఎమ్మెల్యే తన వాహనంతోపాటు ప్రైవేట్ అంబులెన్స్లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సీఎం సీరియస్: మాగనూర్ ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలియగానే వారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల అస్వస్థతపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు నేర్చుకోవడం కాదు.. ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని ఆరోపించారు. ‘గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్పాయిజన్.. హరీశ్రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
ప్రాణం తీసిన ఫుడ్పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్కు చెందిన ఫూల్కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మయోనైజ్పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన మోమోస్..
-
HYD: బంజారాహిల్స్లో ‘మోమో’ల కలకలం
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్లో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత -
మెక్డొనాల్డ్స్లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్డొనాల్డ్స్లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్డొనాల్డ్స్లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్ దినేశ్కుమార్ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.50 మంది విద్యార్థినులు డిశ్చార్జిరెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలుసాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. ‘పెండింగ్లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్లోకి అనుమతించొద్దు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. -
కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
-
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
అనాథాశ్రమం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
-
అనాధ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ నలుగురు చిన్నారులు మృతి
-
తిరుపతి : బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత (ఫొటోలు)
-
మధ్యాహ్న భోజనంలో బల్లి.. వంద మంది విద్యార్థులకు అస్వస్థత
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు. -
ఆస్పత్రిలో చేరడం మొదటిసారి.. భయంతో వణికిపోయా: జాన్వీ కపూర్
దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్త అధికారి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో అనారోగ్యానికి గురి కావడంపై నోరు విప్పింది. ఫుడ్ పాయిజన్తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను ఆస్పత్రిలో చేరడం ఇదే మొదటిసారి. మూవీ ప్రమోషన్లు, షూటింగ్లతో బాగా అలసిపోయా. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లా. అక్కడ విమానాశ్రయంలో ఫుడ్ తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయా. హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. సాయం లేకుండా వాష్రూమ్కు కూడా వెళ్లలేకపోయానని' తెలిపింది.'కానీ ఆస్పత్రిలో చేరాక వైద్య పరీక్షలు చేశారు. రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు. లివర్ బాగా ఇబ్బందికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో, లేదో అని భయపడ్డా. ప్రస్తుతం మళ్లీ వర్క్లో బిజీ అవుతున్నా' అని తెలిపింది. అయితే ఇప్పుడంతా బాగానే ఉందని వెల్లడించింది. కాగా.. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ఉలజ్ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆస్పత్రిలో జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తినడం వల్ల జాన్వీ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారని, రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అవుతారని జాన్వీ తండ్రి–నిర్మాత బోనీ కపూర్ వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ముందుగా జాన్వీ కపూర్ ఆస్పత్రిపాలయ్యారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. స్వల్ప అస్వస్థత మాత్రమే అని బోనీ కపూర్ పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్తో ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. అలాగే ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం ‘ఉలజ్’ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది. -
ఆస్పత్రిలో చేరిన దేవర హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే జూలై 12న అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన ముద్దుగుమ్మ ఆస్పత్రిలో చేరారు. జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజనింగ్కు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ సైతం కపూర్ ధృవీకరించారు.జాన్వీ అనారోగ్యానికి గురి కావడంతో ఈ వారంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుందని జాన్వీ సన్నిహితులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూలై 12న ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో అభిమానులను అలరించింది. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ఉలజ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్కు జోడీగా కనిపించనుంది. -
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
విజయవాడలోని సింగినగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్
-
ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
ఇటీవలకాలంలో ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్కి ప్రివరెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఈ ఉరుకులు పరుగులు జీవితంతో ఏదో స్పీడ్గా తయారయ్యే ఇన్స్టంట్ రెసిపీలు వండుకుని తినేసి హమ్మయ్యా..! అనుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్నది ముఖ్యం కాదు. కేవలం ఆకలి తీరిపోతే చాలు అన్నట్లుగా రెడీమేడ్ ఫుడ్పై ఆధారపడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఇన్స్టంట్ నూడుల్స్ లాంటివి అయితే ప్రజలు ఎగబడి మరీ తింటున్నారు. కానీ ఇలాంటి నూడుల్స్ మరింత ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారుఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుందా..మాములు న్యూడిల్స్లా కాకుండా దీనిలో ఆయిల్తో సహా అన్ని ఇన్గ్రేడియంట్స్ మిక్స్ చేసి ఉంటాయి. జస్ట్ దాన్ని తీసి గిన్నెలో వేసుకుని వేడి చేసుకుంటే చాలు న్యూడిల్స్ రెడీ అంతే..అయితే దీనిలో అన్ని ఇన్గ్రేడియంట్స్ ఉండటంతో తటస్థ పీహెచ్ స్థాయిలు ఎక్కుకవగా ఉంటాయి. అందువల్ల దీనిలో ఈజీగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజినింగ్ దారితీసే స్థాయికి చేరుకుంటుంది. దీనిలో నీరు, ఉప్పు, మసాలా జత చేసి ఉంటాయి. అందువల్ల తొందరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆల్కలీన్ కూడా జోడించడం జరుగుతుంది. నిజానికి దీనిలో ఫైబర్, విటమిన్ల, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఇన్స్టెంట్ న్యూడిల్స్లో ఎక్కువ సోడియంతో ప్యాక్చేయడం జరుగుతంది. ఇది శరీరానిక అస్సలు మంచిది కాదు. ఇలాంటివి తీసుకుంటే దీర్ఘకాలిక తలనొప్పి, అధిక రక్తపోటు, వికారం, దడ, విరేచనాలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే..ఫుడ్ పాయిజనింగ్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవి లేదా వైరస్ వంటి వాటి వల్ల కలుషితమైన ఆహార తీసుకోవడం వల్ల జరుగుతుంది. దీంతో బాధితుడికి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. నార్మల్గా అయతే రెండు రోజల్లో మెరుగయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోతారు రోగులు. ఒక్కోసారి శరీరం అధిక స్థాయిలో నీటిని కోల్పోయి ఈ ఫుడ్ పాయిజనింగ్ కాస్త ప్రాణాంతకంగా మారుతుంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి అసురక్షిత ఆహారం వల్ల దాదాపు 600 మిలియన్ల మంది ఆహార సంబంధత వ్యాధులు బారినపడుతున్నారని, సుమారు 4 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికల్లో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలో దాదాపు 30%నికి పైగా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోతున్నట్లు పేర్కొంది. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..గర్భిణి స్త్రీలుదీర్ఘకాలిక వ్యాధులతో బాధుపడుతున్న వారు రోగనిరోధక శక్తి తక్కు ఉన్నవారువృద్ధులు, చిన్నపిల్లలుతీసుకోవాల్సిన చర్యలు..ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకోవడం. పాడవ్వకుండా ఉండేలా మంచి పద్ధతిలో నిల్వ చేయడం వంటివి చేయాలి.పచ్చి కూరగాయాలతో చేసే ఆహారపదార్థాలను నిల్వ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలిపచ్చిమాంసం, గుడ్లను, ఒక్కసారి క్రాస్ చెక్చేసుకుని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. అలాగే ఉడికించిన రెండు గంటల్లోపు తయారు చేసుకున్న రెసిపీలను ఫ్రిజ్లో ఉంచుకోండి.(చదవండి: వీల్చైర్కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
Karnataka Temple: ఆలయంలో విషాహారం
బెంగళూరు: బెంగళూరు శివారులోని హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో ప్రసాదం తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఆదివారం ఒక ఆలయంలో అక్కడి భక్తులు ప్రసాదం తిన్నాక వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఒక మహిళ సోమవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. ఫుడ్ పాయిజన్కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఒక ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం చెడిపోయిందని కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఇంకొందరు చెప్పారు! దీనిపై నుంచి నివేదిక రావాల్సి ఉందని పోలీసులన్నారు. -
కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థత
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 5న గ్రామానికి చెందిన ముండే బలిరామ్ ఇంట్లో పెద్దల పేర్లతో పితృపక్ష పూజలు నిర్వహించి అన్నం, పప్పు, బూరెలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం 5గంటల తర్వాత భోజనం చేసిన వారిలో కొందరు శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని మండల కేంద్రంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. పక్క శనివారం తెల్లవారు జాము నుంచి ఒక్కొక్కరిగా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న కనరే రాధాబాయి, ముండే సుగంధ, సింధుబాయి, బలిరామ్, అంజలి, యమునాబాయి, మానే సునీత, ఊర్మిళ, ముండే జ్యోతిలను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కాడే డిగంబర్, కాడే సాక్షి, కాడే అనిత, కాడే కార్తీక్, కాడే నానేశ్వర్, శిరశాట్ ఊర్మిళ, ముండే ఐశ్వర్యం, రాములును అంబులెన్స్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. భోజన కార్యక్రమం నిర్వహించిన ముండే బలిరామ్ ఇంటి బోరు బావి తాగునీరు, అస్వస్థతకు గురైన వారి మూత్రం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు వైద్యుడుశ్రీకాంత్ తెలిపారు. -
మంచాల బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
నిజామాబాద్: భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్ప్రైమ్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు) -
ఆహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
ఆత్మకూర్/అమరచింత/వనపర్తి: ఆహారం విషతు ల్యమై.. 60 మంది విద్యా ర్థినులు అనారోగ్యానికి గురికాగా.. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వనపర్తి జిల్లా అమరచింతలోని కేజీబీవీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే.. శుక్రవా రం ఉదయం వరకు బాధిత విద్యా ర్థినులకు కనీ సం వైద్యం అందించలేకపోయారు. అమరచింతలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 340 మంది విద్యా ర్థినులు చదువుకుంటున్నారు. గురువారం హాజరైన 270 మంది విద్యా ర్థినులు రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పు, సాంబార్, వంకాయకూర, మజ్జిగతో భోజనాలు చేశారు. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఏఎన్ఎం, ఇతర సిబ్బంది లేకపోవడంతో.. కోలుకుంటారని ఉదయం వరకు నిరీక్షించారు. కానీ, ఉదయం విద్యా ర్థినులు హాహాకారాలు చేయడంతో అంబులెన్స్లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మందితో మొదలైన బాధితుల తరలింపు 50 మందికి చేరుకుంది. అమరచింతలోని డీఎంఆర్ ఆస్పత్రిలో మరో 10 మంది విద్యా ర్థినులను చేరి్పంచారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎస్వో తొలగింపు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ అమరచింత కేజీబీవీలో విద్యా ర్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తీవ్రంగా పరిగణించారు. కేజీబీవీ ఎస్వో స్వప్నరాణిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇన్చార్జ్ డీఈవో గోవిందరాజులు, జీసీడీవో సుబ్బలక్ష్మికి శుక్రవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా సాయంత్రం విధులకు హాజరు కాకపోవడం.. పరిశీలనకు వెళ్లిన కలెక్టర్కు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించిన ఏఎస్డబ్ల్యూవో సేవ్యానాయక్ను.. రూరల్ ఎస్ఐ నాగన్నతో డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి సస్పెండ్ చేశారు. కొన్నిరోజులుగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంతో‹Ùను కూడా సస్పెండ్ చేశారు. -
అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) అసలేం జరిగిందంటే.. జూన్ 24న కోజికోడ్లోని ఒక హోటల్లో బైజు పరవూర్ భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) -
ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే..
వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు. అసలు ఫుడ్ పాయిజన్ అయిందీ లేనిదీ ఎలా గుర్తించాలో, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఆహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన అలసట. ఎలా నివారించాలి? అవి తినొద్దు ►పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినకూడదు. ►బాగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ►ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు. ►ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి. ►పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి. ►కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి? ►ఫుడ్ పాయిజన్ అయినట్లయితే, నీరు ఎక్కువగా తాగాలి. ►మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు. ►గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. ►ఓఆర్ఎస్ వినియోగించండి. హోం రెమెడీ ►కప్పు వేడి నీటిలో 2–3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ►గ్లాసు వేడినీటిలో అర చెంచా తాజా అల్లం తురుము లేదా శొంఠి పొడి, తేనె కలిపి తాగాలి. ►కప్పు పెరుగులో చెంచా మెంతులు వేసి తినండి. మెంతులు నమలక్కర్లేదు, మింగేయవచ్చు. ►గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. ►చల్లని పాలకు అసిడిటీని తగ్గించే గుణం ఉంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, గ్లాసుడు చల్లని ΄ాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ►నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2–3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ►ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుణ్ణి సంప్రదించి మందులు తీసుకోవాలి. ►చేతులు తరచు సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించాలి. ►ఫుడ్ పాయిజన్ బారిన పడి కోలుకుంటున్న వారికి తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా? -
పెళ్లి భోజనం కలుషితం... 400 మందికి అస్వస్థత
పూసపాటిరేగ: మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడు వివాహ విందుకు అందరూ సందడిగా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. కాసేపటికి కొందరు వాంతులు, విరేచనాలు, తలతిప్పడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అంతే... విందుకు హాజరైనవారందరిలోనూ అలజడిరేగింది. అస్వస్థతకు గురైన సుమారు వంద మందిని అంబులెన్సుల్లో పూసపాటిరేగ, సుందరపేట పీహెచ్సీలకు తరలించి వైద్యసేవలు అందించారు. సాధారణ స్థితిలో ఉన్న మరో 300 మందికి గ్రామంలోనే వైద్యశిబిరం నిర్వహించి వైద్యాధికారి రాజేష్వర్మ పర్యవేక్షణలో వైద్యబృందాలు వైద్య పరీక్షలు చేశాయి. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పిన్నింటి గోవిందరావు, కోట్ల లక్ష్మణరావు, కోట్ల పవన్, మిరప ఆదిలక్ష్మి, మిరప రోషన్కుమార్, కోట్ల సత్యం, జమ్ము సత్యనారాయణ, అల్లాడ శ్యాం, వాళ్లె భరత్రాజు, వాళ్లె మోక్షిత్, సిమ్మల అప్పయ్యమ్మ, దేబార్కి గౌరి, దేబార్కి బార్గవి, సిమ్మల పైడమ్మ, సిమ్మల పవిత్ర, రవనమ్మ, సుంకర లక్ష్మణరావు, గండ్రేటి ఈశ్వరరావు, దేబార్కి తిరుమల ప్రసాదరావు తదితరులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆహారం కలుషితం కావడంపై ఆరా కొవ్వాడ అగ్రహారంలో వివాహ విందును ఆరగించి అస్వస్థతకు గురైన బాధితులను ఎమ్మెల్సీ సురేష్బాబు, ఆర్డీఓ సూర్యకళ, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు పరామర్శించారు. విందులో బిర్యాని, ఆహార పదార్థాలు ఎవరు తయారు చేశారు.. ఆహార సరుకులు ఎక్కడ నుంచి తెచ్చారు వంటి అంశాలపై ఆరా తీశారు. సమగ్ర నివేదిక అందజేయాలని తహసీల్దార్ ఇ.భాస్కరావును ఆర్డీఓ సూర్యకళ ఆదేశించారు. ఆహార విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బిర్యాని అరగకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఎన్. సత్యనారాయణరాజు, ప్రజాప్రతినిధులు మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్దనరావు, మహంతి లక్ష్మణరావు సహాయక చర్యలు చేపట్టారు. -
చికెన్ కబాబ్ తిని.. ఆస్పత్రిపాలైన నర్సింగ్ విద్యార్థినులు
కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు ఘీ రైస్, చికెన్ కబాబ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి సిటీ నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న 137 మంది విద్యార్థినులు ఆహారం ఆరగించారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వంటల్లో శుభ్రత పాటించకపోవడంతో కలుషితమైనట్లు తెలుస్తోంది. బాధితులను సిబ్బంది సిటీ ఆస్పత్రిలో చేర్చారు. మొత్తం 137 మంది విద్యార్థులను మంగళూరు నగరంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం సోమవారం రాత్రి పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. కాలేజీ యాజమాన్యంపై కద్రి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. హాస్టల్లోని అస్తవ్యస్త పరిస్థితులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చాలా మంది విద్యార్థులు కోలుకున్నారు. కొందరు డిశ్చార్జ్ కాగా 38 మంది విద్యార్థులు ఆస్పత్రిలో ఉన్నారు. -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు. 29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ పిల్లల పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. -
ఫుడ్ పాయిజన్తో నర్సు మృతి.. 429 హోటళ్లపై రైడ్..
తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను మూసివేసింది. కొట్టాయంలో ఓ ఈవెంట్కు హాజరైన నర్సు అక్కడ ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆహార భద్రత శాఖ అప్రమత్తమై హోటళ్లపై మంగళవారం దాడులు చేసింది. మూసివేసిన 43లో 21 హోటళ్లకు లెసెన్సులు లేవని అధికారులు తెలిపారు. మిగతా 22 హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 29న ఓ ఈవెంట్కు హాజరైన 100 మంది అస్వస్థకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. ఓ హోటల్ నుంచి వచ్చిన ఆహారం తిని వీరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని హోటళ్లపై రైడ్లు చేయాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్వి? -
ఆదిలాబాద్: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్కు తరలించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్రాణం తీసిన కోడిగుడ్డు -
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటుండగా, ఉపాధ్యాయులు మాత్రం కాదని చెబుతున్నారు. విద్యార్థినులకు ఆదివారం చికెన్, సోమవారం ఉదయం కిచిడీ, మధ్యాహ్నం దోసకాయ, సాయంత్రం వంకాయ కూరలతో భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 29 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం మరో 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇప్పుడు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ పరిస్థితికి ఫుడ్ పాయిజన్, ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని చెప్పారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం శని, ఆదివారాలు సెలవులు రావడంతో కొందరు పిల్లలు ఇంటికి వెళ్లిరాగా, మరికొందరికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డించారని చెబుతున్నారు. కాగా, పాఠశాలలోని వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో పాఠశాల యాజమాన్యం దినసరి కూలీలతో వంటలు చేయిస్తోంది. సరైన రీతిలో తయారు కాని భోజనం ఆరగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ డీడీ రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థినులు ఉన్నారని, కొందరు జ్వరం, దగ్గు, జలుబు వల్ల బాధపడుతుండటంతో ఈ సమస్య ఎదురై ఉంటుందన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు. దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్ మురళీధర్, ఆర్ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. -
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
మైనారిటీల రెసిడెన్షియల్లో విషాహారంపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మైనారిటీల రెసిడెన్షి యల్ పాఠ శాలలో విషాహారం ప్రభావంతో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల పరిస్థితి గురించి జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవాలని రాజ్భవన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ కోలుకున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారని రాజ్భవన్ అధికారులు గవర్నర్కు నివేదించారు. విద్యార్థులంతా డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకుని గవర్నర్ ఊపిరి పీల్చుకున్నారు. -
తెలంగాణ: కాగజ్నగర్ గురుకులంలో ఫుడ్పాయిజన్
ఆసిఫాబాద్: కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం.