food poison
-
కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
-
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
ఘట్కేసర్: ఫుడ్ పాయిజన్తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్లో గోమండి పీహెచ్సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పీహెచ్సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్సీకి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.మాగనూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఐదుగురు మోడల్ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్పహాడ్ మోడల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థు లు గురువారం అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదు వుతున్న ముగ్గురు విద్యార్థి నులు, ఆరో తరగతి చ దువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యా రు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108 వాహనంలో ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందించారు.వారిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతుండగా మరో ముగ్గురు వాంతులు, క డుపునొప్పితో బాధపడుతున్నట్లు దేవరకొండ ఆస్ప త్రి సూపరింటెండెంట్ మంగ్తానాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మాతృనాయక్ ఆస్పత్రికి చేరు కొని విద్యార్థినులను పరామర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలోనే ఇటీవల ఒక మోడల్ స్కూల్ విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారుఓయూలో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కేటగిరీ–1 పీహెచ్డీలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ డీన్లు.. పీహెచ్డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటగిరీ–1 పీహెచ్డీ ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన.. యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్ ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నల్లగొండ జిల్లా పెదఅడిశర్లపల్లి మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్
-
తెలంగాణలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. -
నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్లో ఫుడ్పాయిజన్
-
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (శనివారం) ప్రభుత్వ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
ఫుడ్ పాయిజన్ ఘటనలు.. చర్యలు తప్పవని రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూల్స్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇక, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్కూల్స్, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలి. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లఓ్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి అన్ని వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగనుంది. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
పట్టింపు లేదా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ అంశం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యలు చేసింది.నారాయణపేట జిల్లాలో మాగనూర్లోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ ఘటన విషయంలో బాధులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏఏజీ చెప్పారు. ఈ సందర్భంగా.. సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని న్యాయ స్థానం కోరింది. ఈ ఘటనలపై సోమవారంలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవలే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, అధికారులు రంగంలోకి హెచ్ఎం సహా మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే నిన్న(బుధవారం) మళ్లీ ఫుడ్ పాయిజన్ కారణంగా మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వరుస ఘటనలపైనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. -
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
TG: స్కూళ్లలో ఫుడ్పాయిజన్పై హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో ఫైల్ అయిన పిటిషన్పై హైకోర్టు బుధవారం(నవంబర్ 27) విచారించింది.పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్పాయిజన్ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇదీచదవండి: మాగనూరులో మళ్లీ ఫుడ్పాయిజన్ -
నారాయణపేట జిల్లాలో కలకలం రేపిన ఫుడ్ పాయిజన్ ఘటన
-
మళ్లీ ఫుడ్ పాయిజన్
నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మరోసారి కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉపాధ్యాయులు మొదట మాగనూర్ పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 30 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 9వ తరగతి విద్యార్థులు నేత్ర, దీపిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి తరలించారు. తహసీల్దార్ పర్యవేక్షణలోనే వంట మాగనూర్ ఇన్చార్జి తహసీల్దార్ సురేష్ కుమార్, మధ్యాహ్న భోజనం ఇన్చార్జి, పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవేంద్రచారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం తయారు చేయించారు. అయినప్పటికీ మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంట చేసిన కార్మీకులను స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. బయట చిరుతిళ్లు తిన్నారా? విద్యార్థులు స్కూల్ బయట ఉన్న బేకరీలు, దుకాణాల్లో చిరుతిళ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్ సిక్తా పటా్నయక్ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి మాగనూర్లోని పలు బేకరీలు, దుకాణాల్లో విచారణ చేపట్టారు. సీఎం దృష్టికి వెళ్లినా.. గత బుధవారం కలుషిత ఆహారంతో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరునాడే అన్నంలో మళ్లీ పురుగులు రావడం, అధికారులపై చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు వరుసబెట్టి అస్వస్థతకు గురవుతుండటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే! -
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం
-
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్రావు వివరించారు. -
మళ్లీ పురుగుల అన్నమే!
నారాయణపేట/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మధ్యాహ్న భోజనం విషతుల్యమై ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైనా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం కూడా అదే పురుగుల అన్నం వడ్డించారు. బుధవారం ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రుల్లో చేరిన విద్యార్థులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. ఆ మరుసటి రోజే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. గురువారం ఉదయం నారాయణపేట కలెక్టర్ సిక్తా పటా్నయక్ స్వయంగా పాఠశాలను సందర్శించి వంట గది, స్టాక్ రూమ్లను పరిశీలించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండించా లని డీఈఓ అబ్దుల్ ఘనీ, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమను ఆదేశించారు. దీంతో మాగనూర్లోని ఎస్సీ విద్యార్థుల వసతి గృహం నుంచి వంట మనుషులను పిలిపించి.. అన్నం, సాంబార్, కూరలు వండించి విద్యార్థులకు వడ్డించారు. ఆ అన్నంలో కూడా పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. అదనపు కలెక్టర్ బేన్షాలం (రెవెన్యూ)ను పాఠశాలకు పంపారు. పురుగుల అన్నం వడ్డించింది వాస్తవమేనని అదనపు కలెక్టర్ నిర్ధారించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్.. డీఈఓ అబ్దుల్ఘనీపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతకు ముందే ఎంఈఓ హెచ్ఎం మురళీధర్రెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం బాబురెడ్డిని సస్పెండ్ చేశారు.ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు. విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పరామర్శ ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిపాలైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్గౌడ్ గురువారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. విషాహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఇక్కడ కూడా పురుగులు ఉన్న టిఫిన్ పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. -
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు.. మాగనూర్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. -
మిడ్ డే మీల్స్ తిని 50 మంది పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్..
-
మధ్యాహ్న భోజనం తిని 100 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే సుమారు వందమంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆ విషయం టీచర్లకు చెప్పగా ‘మీరు రోజూ ఇలాగే చెప్తున్నారు’అని బెదిరించినట్లు తెలిసింది. కానీ, కడుపునొప్పి మరింత తీవ్రం కావటంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. దీంతో టీచర్లు స్థానిక ఆస్పత్రికి సమాచారమిచ్చారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు స్కూలుకు వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించినా కొందరి పరిస్థితి మెరుగుపడకపోవటంతో మండల వైద్యాధికారి అఫ్రోజ్కు సమాచారం అందించారు. ఆయన స్కూలుకు వచ్చి విద్యార్థులను పరీక్షించారు. తొలుత 10 మందిని మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ప్రైవేట్ అంబులెన్స్లో మరో 9 మంది విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి పంపించారు. వీరిలో 15 మందిని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, అనిల్, నందిని పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్న ఇతర గ్రామాల విద్యార్థులను టీచర్లు ఇంటికి పంపించివేశారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మొత్తం వందమంది విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అయినట్లు గుర్తించారు. కాగా, కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన కొందరు విద్యార్థులను టీచర్లు కొట్టినట్లు చెపుతున్నారు. ఇక్కడ ఫుడ్పాయిజన్ మొదటిసారి కాదు! విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న డీఈఓ అబ్దుల్ ఘనీ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్ఎం (ఇన్చార్జ్ ఎంఈఓ) నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా పాఠశాలకు చేరుకుని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓను, ఎస్ఐ అశోక్బాబును ఆదేశించారు. ఎమ్మెల్యే తన వాహనంతోపాటు ప్రైవేట్ అంబులెన్స్లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సీఎం సీరియస్: మాగనూర్ ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలియగానే వారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల అస్వస్థతపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు నేర్చుకోవడం కాదు.. ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని ఆరోపించారు. ‘గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్పాయిజన్.. హరీశ్రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
ప్రాణం తీసిన ఫుడ్పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్కు చెందిన ఫూల్కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మయోనైజ్పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన మోమోస్..
-
HYD: బంజారాహిల్స్లో ‘మోమో’ల కలకలం
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్లో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత -
మెక్డొనాల్డ్స్లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్డొనాల్డ్స్లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్డొనాల్డ్స్లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్ దినేశ్కుమార్ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.50 మంది విద్యార్థినులు డిశ్చార్జిరెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలుసాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. ‘పెండింగ్లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్లోకి అనుమతించొద్దు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. -
కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
-
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
అనాథాశ్రమం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
-
అనాధ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ నలుగురు చిన్నారులు మృతి
-
తిరుపతి : బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత (ఫొటోలు)
-
మధ్యాహ్న భోజనంలో బల్లి.. వంద మంది విద్యార్థులకు అస్వస్థత
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు. -
ఆస్పత్రిలో చేరడం మొదటిసారి.. భయంతో వణికిపోయా: జాన్వీ కపూర్
దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్త అధికారి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో అనారోగ్యానికి గురి కావడంపై నోరు విప్పింది. ఫుడ్ పాయిజన్తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను ఆస్పత్రిలో చేరడం ఇదే మొదటిసారి. మూవీ ప్రమోషన్లు, షూటింగ్లతో బాగా అలసిపోయా. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లా. అక్కడ విమానాశ్రయంలో ఫుడ్ తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయా. హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. సాయం లేకుండా వాష్రూమ్కు కూడా వెళ్లలేకపోయానని' తెలిపింది.'కానీ ఆస్పత్రిలో చేరాక వైద్య పరీక్షలు చేశారు. రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు. లివర్ బాగా ఇబ్బందికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో, లేదో అని భయపడ్డా. ప్రస్తుతం మళ్లీ వర్క్లో బిజీ అవుతున్నా' అని తెలిపింది. అయితే ఇప్పుడంతా బాగానే ఉందని వెల్లడించింది. కాగా.. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ఉలజ్ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆస్పత్రిలో జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తినడం వల్ల జాన్వీ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారని, రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అవుతారని జాన్వీ తండ్రి–నిర్మాత బోనీ కపూర్ వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ముందుగా జాన్వీ కపూర్ ఆస్పత్రిపాలయ్యారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. స్వల్ప అస్వస్థత మాత్రమే అని బోనీ కపూర్ పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్తో ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. అలాగే ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం ‘ఉలజ్’ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది. -
ఆస్పత్రిలో చేరిన దేవర హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే జూలై 12న అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన ముద్దుగుమ్మ ఆస్పత్రిలో చేరారు. జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజనింగ్కు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ సైతం కపూర్ ధృవీకరించారు.జాన్వీ అనారోగ్యానికి గురి కావడంతో ఈ వారంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుందని జాన్వీ సన్నిహితులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూలై 12న ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో అభిమానులను అలరించింది. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ఉలజ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్కు జోడీగా కనిపించనుంది. -
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
విజయవాడలోని సింగినగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్
-
ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
ఇటీవలకాలంలో ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్కి ప్రివరెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఈ ఉరుకులు పరుగులు జీవితంతో ఏదో స్పీడ్గా తయారయ్యే ఇన్స్టంట్ రెసిపీలు వండుకుని తినేసి హమ్మయ్యా..! అనుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్నది ముఖ్యం కాదు. కేవలం ఆకలి తీరిపోతే చాలు అన్నట్లుగా రెడీమేడ్ ఫుడ్పై ఆధారపడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఇన్స్టంట్ నూడుల్స్ లాంటివి అయితే ప్రజలు ఎగబడి మరీ తింటున్నారు. కానీ ఇలాంటి నూడుల్స్ మరింత ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారుఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుందా..మాములు న్యూడిల్స్లా కాకుండా దీనిలో ఆయిల్తో సహా అన్ని ఇన్గ్రేడియంట్స్ మిక్స్ చేసి ఉంటాయి. జస్ట్ దాన్ని తీసి గిన్నెలో వేసుకుని వేడి చేసుకుంటే చాలు న్యూడిల్స్ రెడీ అంతే..అయితే దీనిలో అన్ని ఇన్గ్రేడియంట్స్ ఉండటంతో తటస్థ పీహెచ్ స్థాయిలు ఎక్కుకవగా ఉంటాయి. అందువల్ల దీనిలో ఈజీగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజినింగ్ దారితీసే స్థాయికి చేరుకుంటుంది. దీనిలో నీరు, ఉప్పు, మసాలా జత చేసి ఉంటాయి. అందువల్ల తొందరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆల్కలీన్ కూడా జోడించడం జరుగుతుంది. నిజానికి దీనిలో ఫైబర్, విటమిన్ల, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఇన్స్టెంట్ న్యూడిల్స్లో ఎక్కువ సోడియంతో ప్యాక్చేయడం జరుగుతంది. ఇది శరీరానిక అస్సలు మంచిది కాదు. ఇలాంటివి తీసుకుంటే దీర్ఘకాలిక తలనొప్పి, అధిక రక్తపోటు, వికారం, దడ, విరేచనాలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే..ఫుడ్ పాయిజనింగ్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవి లేదా వైరస్ వంటి వాటి వల్ల కలుషితమైన ఆహార తీసుకోవడం వల్ల జరుగుతుంది. దీంతో బాధితుడికి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. నార్మల్గా అయతే రెండు రోజల్లో మెరుగయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోతారు రోగులు. ఒక్కోసారి శరీరం అధిక స్థాయిలో నీటిని కోల్పోయి ఈ ఫుడ్ పాయిజనింగ్ కాస్త ప్రాణాంతకంగా మారుతుంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి అసురక్షిత ఆహారం వల్ల దాదాపు 600 మిలియన్ల మంది ఆహార సంబంధత వ్యాధులు బారినపడుతున్నారని, సుమారు 4 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికల్లో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలో దాదాపు 30%నికి పైగా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోతున్నట్లు పేర్కొంది. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..గర్భిణి స్త్రీలుదీర్ఘకాలిక వ్యాధులతో బాధుపడుతున్న వారు రోగనిరోధక శక్తి తక్కు ఉన్నవారువృద్ధులు, చిన్నపిల్లలుతీసుకోవాల్సిన చర్యలు..ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకోవడం. పాడవ్వకుండా ఉండేలా మంచి పద్ధతిలో నిల్వ చేయడం వంటివి చేయాలి.పచ్చి కూరగాయాలతో చేసే ఆహారపదార్థాలను నిల్వ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలిపచ్చిమాంసం, గుడ్లను, ఒక్కసారి క్రాస్ చెక్చేసుకుని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. అలాగే ఉడికించిన రెండు గంటల్లోపు తయారు చేసుకున్న రెసిపీలను ఫ్రిజ్లో ఉంచుకోండి.(చదవండి: వీల్చైర్కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
Karnataka Temple: ఆలయంలో విషాహారం
బెంగళూరు: బెంగళూరు శివారులోని హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో ప్రసాదం తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఆదివారం ఒక ఆలయంలో అక్కడి భక్తులు ప్రసాదం తిన్నాక వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఒక మహిళ సోమవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. ఫుడ్ పాయిజన్కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఒక ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం చెడిపోయిందని కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఇంకొందరు చెప్పారు! దీనిపై నుంచి నివేదిక రావాల్సి ఉందని పోలీసులన్నారు. -
కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థత
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 5న గ్రామానికి చెందిన ముండే బలిరామ్ ఇంట్లో పెద్దల పేర్లతో పితృపక్ష పూజలు నిర్వహించి అన్నం, పప్పు, బూరెలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం 5గంటల తర్వాత భోజనం చేసిన వారిలో కొందరు శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని మండల కేంద్రంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. పక్క శనివారం తెల్లవారు జాము నుంచి ఒక్కొక్కరిగా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న కనరే రాధాబాయి, ముండే సుగంధ, సింధుబాయి, బలిరామ్, అంజలి, యమునాబాయి, మానే సునీత, ఊర్మిళ, ముండే జ్యోతిలను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కాడే డిగంబర్, కాడే సాక్షి, కాడే అనిత, కాడే కార్తీక్, కాడే నానేశ్వర్, శిరశాట్ ఊర్మిళ, ముండే ఐశ్వర్యం, రాములును అంబులెన్స్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. భోజన కార్యక్రమం నిర్వహించిన ముండే బలిరామ్ ఇంటి బోరు బావి తాగునీరు, అస్వస్థతకు గురైన వారి మూత్రం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు వైద్యుడుశ్రీకాంత్ తెలిపారు. -
మంచాల బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
నిజామాబాద్: భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్ప్రైమ్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు) -
ఆహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
ఆత్మకూర్/అమరచింత/వనపర్తి: ఆహారం విషతు ల్యమై.. 60 మంది విద్యా ర్థినులు అనారోగ్యానికి గురికాగా.. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వనపర్తి జిల్లా అమరచింతలోని కేజీబీవీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే.. శుక్రవా రం ఉదయం వరకు బాధిత విద్యా ర్థినులకు కనీ సం వైద్యం అందించలేకపోయారు. అమరచింతలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 340 మంది విద్యా ర్థినులు చదువుకుంటున్నారు. గురువారం హాజరైన 270 మంది విద్యా ర్థినులు రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పు, సాంబార్, వంకాయకూర, మజ్జిగతో భోజనాలు చేశారు. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఏఎన్ఎం, ఇతర సిబ్బంది లేకపోవడంతో.. కోలుకుంటారని ఉదయం వరకు నిరీక్షించారు. కానీ, ఉదయం విద్యా ర్థినులు హాహాకారాలు చేయడంతో అంబులెన్స్లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మందితో మొదలైన బాధితుల తరలింపు 50 మందికి చేరుకుంది. అమరచింతలోని డీఎంఆర్ ఆస్పత్రిలో మరో 10 మంది విద్యా ర్థినులను చేరి్పంచారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎస్వో తొలగింపు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ అమరచింత కేజీబీవీలో విద్యా ర్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తీవ్రంగా పరిగణించారు. కేజీబీవీ ఎస్వో స్వప్నరాణిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇన్చార్జ్ డీఈవో గోవిందరాజులు, జీసీడీవో సుబ్బలక్ష్మికి శుక్రవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా సాయంత్రం విధులకు హాజరు కాకపోవడం.. పరిశీలనకు వెళ్లిన కలెక్టర్కు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించిన ఏఎస్డబ్ల్యూవో సేవ్యానాయక్ను.. రూరల్ ఎస్ఐ నాగన్నతో డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి సస్పెండ్ చేశారు. కొన్నిరోజులుగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంతో‹Ùను కూడా సస్పెండ్ చేశారు. -
అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) అసలేం జరిగిందంటే.. జూన్ 24న కోజికోడ్లోని ఒక హోటల్లో బైజు పరవూర్ భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) -
ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే..
వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు. అసలు ఫుడ్ పాయిజన్ అయిందీ లేనిదీ ఎలా గుర్తించాలో, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఆహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన అలసట. ఎలా నివారించాలి? అవి తినొద్దు ►పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినకూడదు. ►బాగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ►ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు. ►ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి. ►పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి. ►కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి? ►ఫుడ్ పాయిజన్ అయినట్లయితే, నీరు ఎక్కువగా తాగాలి. ►మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు. ►గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. ►ఓఆర్ఎస్ వినియోగించండి. హోం రెమెడీ ►కప్పు వేడి నీటిలో 2–3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ►గ్లాసు వేడినీటిలో అర చెంచా తాజా అల్లం తురుము లేదా శొంఠి పొడి, తేనె కలిపి తాగాలి. ►కప్పు పెరుగులో చెంచా మెంతులు వేసి తినండి. మెంతులు నమలక్కర్లేదు, మింగేయవచ్చు. ►గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. ►చల్లని పాలకు అసిడిటీని తగ్గించే గుణం ఉంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, గ్లాసుడు చల్లని ΄ాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ►నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2–3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ►ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుణ్ణి సంప్రదించి మందులు తీసుకోవాలి. ►చేతులు తరచు సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించాలి. ►ఫుడ్ పాయిజన్ బారిన పడి కోలుకుంటున్న వారికి తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా? -
పెళ్లి భోజనం కలుషితం... 400 మందికి అస్వస్థత
పూసపాటిరేగ: మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడు వివాహ విందుకు అందరూ సందడిగా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. కాసేపటికి కొందరు వాంతులు, విరేచనాలు, తలతిప్పడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అంతే... విందుకు హాజరైనవారందరిలోనూ అలజడిరేగింది. అస్వస్థతకు గురైన సుమారు వంద మందిని అంబులెన్సుల్లో పూసపాటిరేగ, సుందరపేట పీహెచ్సీలకు తరలించి వైద్యసేవలు అందించారు. సాధారణ స్థితిలో ఉన్న మరో 300 మందికి గ్రామంలోనే వైద్యశిబిరం నిర్వహించి వైద్యాధికారి రాజేష్వర్మ పర్యవేక్షణలో వైద్యబృందాలు వైద్య పరీక్షలు చేశాయి. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పిన్నింటి గోవిందరావు, కోట్ల లక్ష్మణరావు, కోట్ల పవన్, మిరప ఆదిలక్ష్మి, మిరప రోషన్కుమార్, కోట్ల సత్యం, జమ్ము సత్యనారాయణ, అల్లాడ శ్యాం, వాళ్లె భరత్రాజు, వాళ్లె మోక్షిత్, సిమ్మల అప్పయ్యమ్మ, దేబార్కి గౌరి, దేబార్కి బార్గవి, సిమ్మల పైడమ్మ, సిమ్మల పవిత్ర, రవనమ్మ, సుంకర లక్ష్మణరావు, గండ్రేటి ఈశ్వరరావు, దేబార్కి తిరుమల ప్రసాదరావు తదితరులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆహారం కలుషితం కావడంపై ఆరా కొవ్వాడ అగ్రహారంలో వివాహ విందును ఆరగించి అస్వస్థతకు గురైన బాధితులను ఎమ్మెల్సీ సురేష్బాబు, ఆర్డీఓ సూర్యకళ, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు పరామర్శించారు. విందులో బిర్యాని, ఆహార పదార్థాలు ఎవరు తయారు చేశారు.. ఆహార సరుకులు ఎక్కడ నుంచి తెచ్చారు వంటి అంశాలపై ఆరా తీశారు. సమగ్ర నివేదిక అందజేయాలని తహసీల్దార్ ఇ.భాస్కరావును ఆర్డీఓ సూర్యకళ ఆదేశించారు. ఆహార విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బిర్యాని అరగకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఎన్. సత్యనారాయణరాజు, ప్రజాప్రతినిధులు మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్దనరావు, మహంతి లక్ష్మణరావు సహాయక చర్యలు చేపట్టారు. -
చికెన్ కబాబ్ తిని.. ఆస్పత్రిపాలైన నర్సింగ్ విద్యార్థినులు
కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు ఘీ రైస్, చికెన్ కబాబ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి సిటీ నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న 137 మంది విద్యార్థినులు ఆహారం ఆరగించారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వంటల్లో శుభ్రత పాటించకపోవడంతో కలుషితమైనట్లు తెలుస్తోంది. బాధితులను సిబ్బంది సిటీ ఆస్పత్రిలో చేర్చారు. మొత్తం 137 మంది విద్యార్థులను మంగళూరు నగరంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం సోమవారం రాత్రి పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. కాలేజీ యాజమాన్యంపై కద్రి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. హాస్టల్లోని అస్తవ్యస్త పరిస్థితులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చాలా మంది విద్యార్థులు కోలుకున్నారు. కొందరు డిశ్చార్జ్ కాగా 38 మంది విద్యార్థులు ఆస్పత్రిలో ఉన్నారు. -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు. 29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ పిల్లల పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. -
ఫుడ్ పాయిజన్తో నర్సు మృతి.. 429 హోటళ్లపై రైడ్..
తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను మూసివేసింది. కొట్టాయంలో ఓ ఈవెంట్కు హాజరైన నర్సు అక్కడ ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆహార భద్రత శాఖ అప్రమత్తమై హోటళ్లపై మంగళవారం దాడులు చేసింది. మూసివేసిన 43లో 21 హోటళ్లకు లెసెన్సులు లేవని అధికారులు తెలిపారు. మిగతా 22 హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 29న ఓ ఈవెంట్కు హాజరైన 100 మంది అస్వస్థకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. ఓ హోటల్ నుంచి వచ్చిన ఆహారం తిని వీరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని హోటళ్లపై రైడ్లు చేయాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్వి? -
ఆదిలాబాద్: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్కు తరలించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్రాణం తీసిన కోడిగుడ్డు -
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటుండగా, ఉపాధ్యాయులు మాత్రం కాదని చెబుతున్నారు. విద్యార్థినులకు ఆదివారం చికెన్, సోమవారం ఉదయం కిచిడీ, మధ్యాహ్నం దోసకాయ, సాయంత్రం వంకాయ కూరలతో భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 29 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం మరో 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇప్పుడు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ పరిస్థితికి ఫుడ్ పాయిజన్, ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని చెప్పారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం శని, ఆదివారాలు సెలవులు రావడంతో కొందరు పిల్లలు ఇంటికి వెళ్లిరాగా, మరికొందరికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డించారని చెబుతున్నారు. కాగా, పాఠశాలలోని వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో పాఠశాల యాజమాన్యం దినసరి కూలీలతో వంటలు చేయిస్తోంది. సరైన రీతిలో తయారు కాని భోజనం ఆరగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ డీడీ రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థినులు ఉన్నారని, కొందరు జ్వరం, దగ్గు, జలుబు వల్ల బాధపడుతుండటంతో ఈ సమస్య ఎదురై ఉంటుందన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు. దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్ మురళీధర్, ఆర్ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. -
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
మైనారిటీల రెసిడెన్షియల్లో విషాహారంపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మైనారిటీల రెసిడెన్షి యల్ పాఠ శాలలో విషాహారం ప్రభావంతో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల పరిస్థితి గురించి జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవాలని రాజ్భవన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ కోలుకున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారని రాజ్భవన్ అధికారులు గవర్నర్కు నివేదించారు. విద్యార్థులంతా డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకుని గవర్నర్ ఊపిరి పీల్చుకున్నారు. -
తెలంగాణ: కాగజ్నగర్ గురుకులంలో ఫుడ్పాయిజన్
ఆసిఫాబాద్: కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం. -
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 31 మంది విద్యార్థినులకు అస్వస్థత
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్పాయిజన్ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్ అన్నంలోని బల్లిని తీసివేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ జ్వర సర్వే -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం వండిన పప్పు మిగలడంతో శుక్రవారం ఉదయం వేడిచేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు తాగించారు. కాగా నిత్యం అన్నం పలుకుగానే ఉంటుందని, సరిగా ఉడకడం లేదని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని.. రోజూ అన్నం, పప్పు, సాంబారునే వడ్డించడంతో తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులం వార్డెన్ ఎల్లంను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వండిన పప్పు ఉదయం బాగుందని చెబితేనే వడ్డించామన్నారు. విద్యార్థుల్లో కొందరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్సింగ్ గురుకులాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్లో తిన్న విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది. వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. ‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి. అసలు చర్యలేవి..: ఫుడ్పాయిజన్ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్ఎస్ మెస్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు. కేంద్రీయ భండార్ కాంట్రాక్టర్కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై గవర్నర్ ఆవేదన
-
మూడు రోజులుగా పురుగుల అన్నమే.. 43 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆదిలాబాద్టౌన్/బేల: ఆదిలాబాద్ జిల్లా బేల కేజీబీవీలో సోమవారం 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం చికెన్ అన్నం, రాత్రి ఉల్లిగడ్డ కూరతో భోజనం పెట్టినట్టు విద్యార్థినులు తెలిపారు. అయితే మధ్యాహ్నం, రాత్రి వడ్డించిన పురుగుల అన్నంతోనే అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు. పాఠశాలలో ఆదివారం ఏఎన్ఎం తప్ప ఇతర సిబ్బంది లేరు. సోమవారం ఉదయం వరకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఏఎన్ఎం, వాచ్మన్ కలిసి మొదట అస్వస్థతకు గురైన 28 మందిని బేల పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. మరో 15 మందికి పాఠశాలలోనే పీహెచ్సీ వైద్యాధికారి క్రాంతి వైద్య సేవలందించారు. సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులే వాటిని చేతుల్లో పట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా సాక్షి ఫొటో తీశాకా అక్కడి సిబ్బంది హుటాహుటిన స్టాండ్లు తీసుకువచ్చి ఏర్పాటు చేయడం విశేషం. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మరికొందరు తల్లిదండ్రులు రిమ్స్కు చేరుకున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. కాగా, మూడ్రోజులుగా పురుగుల అన్నమే పెడుతున్నారని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో డీఈవో ప్రణీత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఉదయం ఏఎన్ఎం కావాలనే విద్యార్థులను టిఫిన్ తినకుండా అడ్డుకోవడంతో వారు నిరసించి, అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారి గేడాం నవీన పేర్కొనడం గమనార్హం. ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, అడిషనల్ డీఆర్డీఏ రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్.. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. 13 క్వింటాళ్ల స్టాకు బియ్యంలో 3 క్వింటాళ్లలో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. గుర్తించిన లోటుపాట్లపై కలెక్టర్కు నివేదిస్తామని వారు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో డిన్నర్ బాయ్కాట్
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్ బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈ–1, ఈ–2కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15న ట్రిపుల్ఐటీలో ఫుడ్పాయిజన్ జరిగింది. మెస్లలో నాసిరకం, నాణ్యతలేనివి ఉపయోగించడం వల్లే ఇది జరిగిందని, తమ ప్రాణాల మీదకు వచ్చిందని అదేరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఈనెల 24నాటికి డిమాండ్లు నెరవేరుస్తామని హామీఇచ్చారు. అయితే సదరు హామీలేవీ నెరవేరకపోవడంతో శనివారం మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తరువాత మెస్ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్ సతీశ్ పేరిట ఆ టెండర్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు. -
పప్పులో వానపాములు, జెర్రులు
మహబూబాబాద్ అర్బన్: వానపాములు, జెర్రులను గమనించకుండా వండిన పప్పు తిన్న 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమపాఠశాలలో గురువారం జరగగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం, పప్పుకూరలో వానపా ము, జెర్రి వచ్చింది. అప్పటికే కొంతమంది విద్యార్థినులు భోజనం తిన్నారు. వారిలో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. వార్డెన్, హెచ్ఎం, ఉపాధ్యాయు లు ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా ఆ విద్యార్థినులను హాస్టల్లోనే ఉంచి రాత్రి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇచ్చారు. శుక్రవారం వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి ఆరోగ్యం కుదుటపడగా, మరో ఆరుగురు ఐశ్వర్య, అఖిల, కావ్య, భూమిక, భాను, గౌతమిలను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెనూ ప్రకారం వంట చేయడం లేదని విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక క్యాంపు పెట్టి వైద్యసేవలందించారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, జేసీ, డీడీ అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డీడీ ఎర్రయ్య గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. రాత్రి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి హాస్టల్ను తనిఖీ చేశారు. -
రూ.7.45కే రుచీ, శుచీ ఎలా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యతకు స్కూల్ హెచ్ఎంలనే బాధ్యులను చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు తనిఖీ సమయంలో సరైన లెక్క చెప్పకపోయినా హెచ్ఎంలపైనే చర్య తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హెచ్ఎంల్లో మరింత కంగారు మొదలైంది. మార్కెట్లో నిత్యావసరాలు మండిపోతుంటే, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటితే నిబంధనల ప్రకారం నాణ్యత ఎలా సాధ్యమనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భోజనం ఎంత మందికి పెట్టామనే వివరాలను అధికారులకు పంపాలని కోరడం పెద్ద తలనొప్పి అని చెబుతున్నారు. దీనివల్ల బోధన పర్యవేక్షణ దెబ్బతింటుందని వాపోతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు ►రాష్ట్రవ్యాప్తంగా 24 వేల బడుల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.7.45 మాత్రమే ఇస్తారు. స్థానిక మహిళా సంఘాలకు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే ఇస్తారు. మిగతావన్నీ వాళ్ళే కొని తెచ్చుకోవాలి. ►దీనికి రూ.7.45 ఏమేర సరిపోతాయని మహిళా సంఘాలు అంటున్నాయి. అదీగాక వారానికి మూడు గుడ్లు ఇవ్వాలి. అలాంటప్పుడు కూరలు, ఇతర వంట సామగ్రి ఎలా సమకూర్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పప్పులు, నూనెలు ఏ రోజుకారోజు పెరిగిపోతుంటే, ఆ మొత్తంతో ఎలా సర్దుకోవాలని నిలదీస్తున్నారు. ►తక్కువ ఖర్చుతో తెచ్చే కూరల్లో కొన్ని చెడిపోయి ఉంటే వాటికి తమను ఎలా బాధ్యులను చేస్తారని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ►ప్రతి రోజూ మెనూ వివరాలను స్కూల్ గోడపై రాయాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఈ వివరాలు సరిగా లేకుంటే హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటారు. ఈ మెనూ రాయాలంటే సమయం వృథా అవుతుందని హెచ్ఎంలు అంటున్నారు. ►పాఠశాల విద్యా కమిటీ, విద్యార్థులతో కూడిన కమిటీ సమక్షంలోనూ బియ్యం తూకం వేసి వంట చేసే వారికివ్వాలనే షరతు పెట్టారు. ఈ లెక్కలన్నీ రిజిష్టర్లో పక్కాగా పేర్కొనాలి. వంట పాత్రలు శుభ్రంగా లేకపోయినా, విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు అపరిశుభ్రంగా కన్పించినా దానికీ స్కూల్ హెచ్ఎందే బాధ్యతని నిబంధనల్లో పేర్కొన్నారు. తనిఖీ అధికారులు దీన్ని అడ్డంపెట్టుకుని తమను వేధించే అవకాశముంటుందని హెచ్ఎంలు చెబుతున్నారు. ►ప్రతినెలా 10వ తేదీలోగా వంట ఏజెన్సీకి చెల్లింపులు చేయాలి. నెలలు గడుస్తున్నా బిల్లులే రానప్పుడు చెల్లింపులు ఎలా చేయాలని హెచ్ఎంలు అంటున్నారు. వాస్తవానికి దూరంగా రూల్స్: పి.రాజా భానుచంద్ర ప్రకాశ్, గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి అయ్యే వాస్తవ ఖర్చును అధికారులు గుర్తించాలి. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతున్నాయి. ఇచ్చే మొత్తంలో వీటిని కొనడం సాధ్యం కావడం లేదని వంట చేసే మహిళా సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటికీ హెచ్ఎంలనే బాధ్యులను చేస్తే ఎలా? బోధన వ్యవహారాలు చూసుకునే బాధ్యతల కన్నా, భోజన జమా ఖర్చు వివరాలు రాయడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బోధనలో నాణ్యత తగ్గదా? -
కుళ్లిన గుడ్లు.. పాడైన కూరగాయలు.. మాకు పెడుతున్న భోజనం నాసిరకం
నిర్మల్/బాసర: కుళ్లిన గుడ్లు, పాడైన కూరగాయలు, కాలం చెల్లిన నూనెలు, వస్తుసామగ్రి వాడుతూ మెస్ల నిర్వాహకులు తమకు నాసిరకం భోజనం అందిస్తున్నారని బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి భోజనం అందిస్తున్నందుకే వందలాది మందికి ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. నాసిరకం వస్తుసామగ్రిని చూపుతూ శనివారం స్థానిక అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రే నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్న ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ శనివారం క్యాంపస్కు రావడంతో తమకు ఎలాంటి తిండి పెడుతున్నారో చూడండి అంటూ సగం పగిలిన పప్పు, శుభ్రంగా లేని సామగ్రి, నాసిరకం వంటనూనెలు, కాలంచెల్లిన ఇతర వస్తువులను వెంకటరమణతోపాటు ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్కుమార్కు చూపించారు. ఏప్రిల్లో ఎస్ఎస్ కేటరర్స్లో కాలంచెల్లిన శనగపిండి, ఉప్మారవ్వ, గోధుమ పిండి ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేల మంది విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు ఓ లేఖను అందించారు. మెస్లు, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొనే దాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో డైరెక్టర్ సతీశ్కుమార్ రెండు మెస్లపై కేసులు పెట్టినట్లు పత్రాలను చూపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ►మెస్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. ►రాజకీయ ప్రభావం లేకుండా మెస్ టెండర్లు ఉండాలి. ►ఐఐటీ, నిట్లలో కనీసం పదేళ్లు అనుభవం ఉన్నవారినే టెండర్లకు అనుమతించాలి. ►ఘటనకు కారకులైన సంబంధిత అధికారులను తొలగించాలి. ►మాపై ప్రభావం చూపే ప్రతి విషయంలోనూ మా అభిప్రాయం తీసుకోవాలి. ►గత నెల చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లన్నింటినీ తక్షణమే నెరవేర్చాలి. హెల్ప్లైన్ కేంద్రం, హెల్త్ క్యాంపులు పెడతాం ►ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెల్లడి నిర్మల్ చైన్గేట్: ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ తెలిపారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీతో కలసి ఆయన మాట్లాడారు. కొన్ని అజాగ్రత్తల వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలిసిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సమర్థులైన ఫ్యాకల్టీని నియమించి సోమవారం నుంచి పాలనాపరమైన మార్పులు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్కు ఒక వార్డెన్, ఫిర్యాదుల విభాగం, విద్యార్థులకు హెల్ప్లైన్ సెంటర్, అమ్మాయిల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వివరించారు. నెలకోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు. 60 మంది విద్యార్థినులకు పుడ్పాయిజన్ అయిందని, 21 మంది విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిచ్చార్జి అయ్యారని తెలిపారు. మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి ►బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను శనివారం వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఫుడ్పాయిజన్ ఘటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధ్యురాలిని చేస్తూ ఆమెను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మరణిస్తే కానీ సీఎం ట్రిపుల్ ఐటీని సందర్శించరా అని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులు కాదని, వాటిల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారికి నాణ్యమైన ఆహారం కూడా అందించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్కు సంబంధించిన కాంట్రాక్టర్ కావడంతోనే మెస్ నిర్వాహకుడు విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నాడని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులు
-
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో.. ఫుడ్ పాయిజన్
బాసర/నిజామాబాద్ నాగారం/సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీలోని పీయూసీ–1, పీయూసీ–2 మెస్లలో మధ్యాహ్నం ఎగ్ఫ్రైడ్ రైస్ వడ్డించారు. దీనిని తిన్న ఈ–1, ఈ–2, పీ–2 విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు బాధిత విద్యార్థులకు క్యాంపస్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చికిత్స అందించారు. కాగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కొంత మందిని అంబులెన్స్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ట్రిపుల్ ఐటీ చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. మరో పక్క ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. వీరిలో జిల్లాలో కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. కోమలి, హరిత అనే విద్యార్థినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి హరీశ్రావు ఆరా బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్, వైద్యాధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగించిందని ట్విట్టర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారానికి బాధ్యులనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. -
సిద్ధిపేట: పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 120 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. దాదాపు 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. గోప్యంగా ఉంచిన అధికారులు, కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: భారమైన స్టూడెంట్ బస్పాస్ చార్జీలు.. ఐదు కిలో మీటర్లకు రూ.35, పాత, కొత్త చార్జీలు ఇలా! -
విల్లాలో విందు.. పేదింట విషాదం
రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్తో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు సమాచారం మేరకు... రిచ్మండ్ విల్లాలోని ఓ ఇంట్లో తాండూరు బషీరాబాద్ మండలానికి చెందిన శ్యామలమ్మ పని చేస్తుంది. శ్యామలమ్మ సన్ సిటీ ప్రాంతంలో తన ఇద్దరు కూతుళ్లు, అల్లుడు, కుమారుడితో కలిసి ఉంటుంది. సోమవారం విల్లాలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యాం అనంతరం మిగిలిన చికెన్, బగారా రైస్ను మంగళవారం ఉదయం శ్యామలమ్మ ఇంటికి తీసుకెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో అందరు కలిసి భోజనం చేశారు. గంట అనంతరం విరోచనాలు, వాంతులు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లారు. చిన్న కూతురు భువనేశ్వరి(3)తో పాటు మరో కూతురు పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భువనేశ్వరి గురువారం మృతి చెందింది. మరో కూతురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శ్యామలమ్మతో పాటు మరో ముగ్గురు సన్ సిటీలోని సహారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
మనది కాని వంటకం.. విషంతో సమానమే!
మతం, కులం, ప్రాంతం, భాష, చివరకు తినే తిండి.. ఇలా రాజకీయానికి ఏదీ అతీతం కాదని నిరూపిస్తున్నారు మన నేతలు. ఇదిలా ఉండగా.. ఇక్కడో మంత్రిగారు మాత్రం ‘షవర్మా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యువతి పాడైన షెవర్మా తిని ప్రాణాలు పొగొట్టుకోవడమే అందుకు కారణం. మిడిల్ ఈస్ట్ దేశాల స్ట్రీట్ ఫుడ్ అయిన షవర్మాను.. పాశ్చాత్య దేశాల వంటకంగా సర్టిఫై చేశారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్. అంతేకాదు అసలు భారతీయ వంటకంలో భాగం కానీ షవర్మా ఎట్టిపరిస్థితుల్లో తీసుకూడదంటూ జనాలను కోరుతున్నాడాయన. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలంటూ మాట్లాడిన ఆయన.. షవర్మాను తినొద్దంటూ ప్రజలకు సలహా ఇచ్చారు. ‘‘షవర్మా మన వంటకం కాదు. అది పాశ్చాత్య దేశాల మెనూలోని ఆహారం. అక్కడి వాతావరణానికి తగ్గట్లుగానే అది ఉంటుంది. పాడైపోదు కూడా. ఒకవేళ మాంసానికి సంబంధించిన ఏ ఆహారాన్ని భద్రపర్చాలంటే ఫ్రీజర్లలో ఉంచాలి. సరిగ్గా మెయింటెన్ చేయకపోతే షవర్మా పాడైపోతుంది. తిన్నవాళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంద’’ని వ్యాఖ్యానించారాయన. దేశంలో షవర్మాను అందించే ఏ ఫుడ్ కోర్టుల్లోనూ స్టోరేజ్ సౌకర్యాలు సరిగా లేవని, దుమ్ము ధూళితో రోడ్డు బయటే ఉంచుతున్నారని.. తద్వారా యువతను, ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారని వ్యాఖ్యలు చేశారాయన. మన వాతావరణానికి తగ్గట్లుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే మనకు మంచిది. మనది కానిది.. విషంతోనే సమానం అంటూ ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొన్న మా సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. విశేషం ఏంటంటే.. చాలామంది సోషల్ మీడియాలో సుబ్రమణియన్ ట్రోల్ చేస్తున్నప్పటికీ.. కొంత మంది మాత్రం ఆయన వ్యాఖ్యలతోనే ఏకీభవిస్తున్నారు. కేరళ కాసరగోడ్ జిల్లాలోని ఓ జ్యూస్ సెంటర్లో.. మే 1వ తేదీన ఓ ఫుడ్ కోర్టులో పాడైపోయిన షవర్మా తిని 59 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో దేవానంద అనే అమ్మాయి మృతి చెందింది కూడా. ఈ ఘటన నేపథ్యంలోనే తమిళనాడు మంత్రి పైవ్యాఖ్యలు చేశారు. ఇక ఘటనలో.. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు సాల్మోనెల్లా, షిగెల్లాను ఆ సెంటర్లోని షవర్మా శాంపిల్స్లో గుర్తించినట్లు కేరళ ఆరోగ్య విభాగం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సంబంధిత వార్త: ఐదు నెలల క్రితం తండ్రి! ఇప్పుడేమో కుళ్లిన షవర్మా తిని.. -
ఫుడ్ సెంటర్ నిర్లక్ష్యం.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూత
ఓ ఫుడ్ కోర్టు సెంటర్ నిర్లక్ష్యం.. ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఈ విషాదం నెలకొనగా.. మరికొందరు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పదహారేళ్ల దేవానంద అనే అమ్మాయి.. చెరువథూర్ ఏరియాలో ఉంటోంది. ఏప్రిల్ 29వ తేదీన దగ్గర్లోని ట్యూషన్ సెంటర్కి వెళ్లి.. బ్రేక్ టైంలో అక్కడే ఉన్న జ్యూస్ కమ్ ఫుడ్ కోర్టు సెంటర్లో షవర్మా తినింది. అయితే.. ఆమెతో పాటు ఆ టైంలో షవర్మా తిన్న మరో 15 మంది విద్యార్థులకు వికటించింది. వాంతులు, విరేచనాలతో వాళ్లంతా ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో.. చికిత్స పొందుతున్న దేవానంద పరిస్థితి విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది. మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత చెరువథూర్ ఏరియాలోని జ్యూస్ సెంటర్ని సీజ్ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుళ్లిపోయిన షవర్మా వాళ్లకు సర్వ్ చేయడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఫుడ్ కోర్టుల సేఫ్టీపై దృష్టిసారించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. దేవానంద తండ్రి ఐదు నెలల కిందటే అనారోగ్యం సమస్యతో కన్నుమూశాడు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన ఏడాదిన్నరగా మంచం పట్టి.. అలాగే కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం తమ స్వగ్రామం నుంచి చెరువథూర్కి వలస వచ్చింది. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు దేవానంద.. ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది. చదవండి: సాయిగణేష్తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం -
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకి అస్వస్థత
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలల్లో వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న డెంటల్, నర్సింగ్ కాలేజీల్లో చదువుతోన్న విద్యార్థినులు బుధవారం వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కళాశాలల్లో గ్రాండ్ 9 అనే అవుట్ సోర్స్ ఏజెన్సీ ఇక్కడ మెస్ నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు మెస్లో భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. 30 మంది బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న కొందరిని నుంచి డిశ్చార్జి చేయడంతో తిరిగి హాస్టల్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు. -
ఉపకులపతి.. ఇదేం గతి?
నిర్మల్/బాసర: బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ఏం జరుగుతోంది? పదిరోజులుగా ఎందుకు పతాక శీర్షికలకు ఎక్కుతోంది!? దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈనెల మొదటివారంలో విద్యార్థులు తినే టిఫిన్లో కప్ప రాగా.. ఆపై వరుసగా అన్నంలో తోకపురుగులు, కూరల్లో లైట్పురుగులు వస్తూనే ఉన్నాయి. 8వేల మంది విద్యార్థులు తినే భోజనాల్లో ఇలా కప్పలు, పురుగులు వస్తున్నా.. అటు మెస్ నిర్వహించే వారు.. ఇటు వర్సిటీ వర్గాలు స్పందించింది లేదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ‘మా పిల్లలు బాసర ట్రిపుల్ఐటీలో చదువుతున్నార’ని ఇప్పటివరకు గర్వంగా చెప్పుకున్న తల్లిదండ్రులు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి చదువులపై బెంగలేదు కానీ విద్యార్థులకు పెడుతున్న తిండి గురించే కలవరపడుతున్నామని వారంటున్నారు. గతంలో బాసర వర్సిటీలోకి మీడియాను అనుమతించేవారు. కొన్నేళ్లుగా మీడియాను అనుమతించట్లేదు. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియట్లేదు. వీసీ కోసం ఎదురుచూపు. బాసర ట్రిపుల్ఐటీలో పాలన గాడితప్పడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం. ఏళ్లుగా ఇన్చార్జి వీసీలతోనే సర్కారు వర్సిటీని నెట్టుకొస్తోంది. రెండేళ్లుగా ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్న రాహుల్బొజ్జ.. న్యాక్బృందం వర్సిటీ పరిశీలనకు వచ్చినప్పుడే ఇక్కడికొచ్చారు. తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇటీవల ఘటనలపై స్పందించలేదు. సీఎంఓ కార్యాలయ బాధ్యతల్లోనూ ఉన్న ఆయన హైదరాబాద్ నుంచే వర్సిటీని పర్యవేక్షిస్తున్నట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో వర్సిటీలో స్థానిక అధికారులదే ఇష్టారాజ్యమైంది. మంత్రిని కలిసిన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇక్కడి పరిస్థితుల్ని వివరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. -
అనుమానాస్పదంగా యువకుడి మృతి.. కన్న తల్లే కారణమా?
సాక్షి,చిత్తూరు: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. తల్లి, మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపురం పంచాయతీ, దిగువ మల్లవరానికి చిట్టేటి చంద్రయ్య, లక్ష్మి అలియాస్ యశోదకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు శ్రావణ్కుమార్(24) ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలయ్యాయి. కొన్నేళ్ల కిందట చంద్రయ్య మృతి చెందడంతో ఇంట్లో తల్లీకుమారుడు ఉంటున్నారు. బీటెక్ వరకు చదివిన శ్రావణ్కుమార్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. గత సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన శ్రావణ్కుమార్కు తల్లి యశోద అన్నం పెట్టింది. అది తిన్న కొంత సేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో బంధువులు హుటాహుటిన తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కన్న తల్లే అల్లుళ్లు ప్రసాద్, బాలకృష్ణతో కలసి పథకం ప్రకారం భోజనంలో విషం పెట్టి హతమార్చేందుకు యత్నించిందని మృతుడు తన చిన్నానతో మాట్లాడిన వీడియో సంభాషణలు బయటకు వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు కూడా విషాహారం తినడం వల్లే శ్రావణ్కుమార్ మృతి చెందాడని పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తల్లిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదును మృతుడి చిన్నాన రాధయ్య, పెదనాన్న చెంగయ్య రేణిగుంట పోలీసులకు అందించారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం శ్రావణ్కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
ఫ్రిజ్లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!
Doctors amputate teen's legs, fingers: సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అంటే సాధారణంగా వాంతులవడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్ పాయిజినింగ్ కారణంగా ఒక్కొసారి కొన్ని కేసుల్లో ప్రాణంతకం కూడా కావచ్చు కానీ చాలావరకు సురక్షితంగా బయటపడతారు. కానీ ఇక్కడొక వ్యక్తికి ఫుడ్ పాయిజినింగ్ అతని జీవితాన్ని అత్యంత విషాదమయంలోకి నెట్టేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని వేడిచేసుకుని తినడం అతనికి అలవాటు. ఎప్పటిలాగానే రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఫ్రిజ్లోంచి తీసి వేడిచేసుకుని తిన్నాడు. అయితే అతను తిన్నవెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అశ్వస్థకు గురైయ్యాడు. దీంతో అతని స్నేహితుడు ఆసుపత్రితో జాయిన్ చేశాడు. ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపట్లోనే అతని బీపీ పడిపోయి పరిస్థితి క్రిటికల్ అయిపోయింది. దీంతో వైద్యులు అతనికి వైద్యా పరీక్షలు నిర్వహించారు. కానీ అతనికి ఏమైందో అసలు అర్థం కాలేదు. కాసేపటకికి అతని శరీరం దద్దుర్లుగా మారి ఎర్రగా గాయాలు ఏర్పడటం తీవ్ర నోప్పి రావడం జరిగింది. దీంతో అతన్ని హెలికాప్టర్ సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం యూఎస్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు మెనింగోకాకల్ అనే అంటు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. అయితే మెనింగోకాకల్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ టీకాతో నివారించవచ్చు. మెనింగోకోకల్ వ్యాధిని యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ రోగికి అతని మిడిల్ స్కూల్ వయసులో మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నాడని అయితే అతను 16 ఏళ్ల ప్రాయంలో తీసుకోవల్సిన రెండు డోసుల వ్యాక్సిన్ని తీసుకోలేదని వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కి గురవ్వడంతో కాలి వేళ్లను చేతి వేళ్లను తీసేశారు. ప్రమాదవశాత్తు ఆ ఇన్ఫెక్షన్ మెదడుకి వ్యాపించలేదు. అయితే ఆ టీనేజర్ ఇప్పుడు కోలుకున్నాడు గానీ ఆ వ్యాధి కారణంగా ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్ని సంప్రదించండి. అలాగే ఏదైనా ఫ్రిజ్లో పెట్టిన ఆహారం వేడి చేసితినేటప్పుడూ కాస్త ఆలోచించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!) -
బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..
బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. తెల్లవారు జామున తమ ఇద్దరి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో ఏమైందో తెలియక గందరగోళం ఏర్పడింది. ఆప్తులు ఎవ్వరూ లేకపోయినా చుట్టుపక్కల తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏమైందో ఏమోగానీ పిల్లలు ఒకరితర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఊరుగాని ఊర్లో ఏం చేయాలో తెలియక విలపించింది. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరిలో చూపరులను కంటతడి పెట్టించింది. సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన గురువారం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మర్దన్ జిల్లా, ఆండాళ్ గ్రామానికి చెందిన రమేష్, నీలంకుమారి దంపతులు. రెండేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని రాచగున్నేరికి వచ్చారు. వీరికి కుమార్తె హీనాకుమారి(5), కుమారుడు రోషణ్కుమార్దాస్(2) ఉన్నారు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రయివేటు కర్మాగారంలో రమేష్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఇంటివద్దే ఉంటోంది. రమేష్ బుధవారం విధులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. రాత్రి ఆహారం తిని అందరూ నిద్రకు ఉపక్రమించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హీనాకుమారి అస్వస్థతకు గురైంది. చదవండి: (ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం) తల్లిదండ్రులు తన కుమారుడుని పక్క ఇంట్లో వదిలిపెట్టి కుమార్తెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి కుమారుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారడంతో మళ్లీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోషణ్కుమార్దాస్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదికలను బట్టి కలుషిత ఆహారమా, మరే ఇతర కారణాలా..? తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం చిన్నారులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే ఏరియా ఆస్పత్రి వైద్యులు మరణధ్రువీకర పత్రాలు అందజేశారు. ఆపై పోలీసులు వత్తిడి చేయడంతో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. -
కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే ఆ తల్లి భరించలేకపోయింది..
సాక్షి, మెదక్: ఫుడ్ ఫాయిజన్తో రెండు వారాల వ్యవధిలో కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోవడంతో జీర్ణించుకోలేని ఆ తల్లి.. అటు భర్త.. ఇటు పిల్లలు లేని జీవితం తనకు వద్దనుకుంది. మనోవ్యధతో ఆ తల్లి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన విషాద ఘటన మనోహరాబాద్ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన పోతరాజు అనిత(31) కూలిపని చేసుకుంటూ తన కూతురు లక్ష్మిప్రియ (11), కుమారుడు కిషోర్ (8)లతో కలిసి జీవిస్తోంది. ఇదిలా ఉండగా 18 నెలల క్రితం తన భర్త రాము అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా గత నెల డిసెంబర్ 22న రాత్రి ఇంట్లో చికెన్ వండి ఇద్దరు పిల్లలు సహా తల్లి తిని పడుకున్నారు. మరుసటి రోజు పిల్లలిద్దరికి రక్తపు వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. నీలోఫర్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి కుమారుడు డిసెంబర్ 27న మృతి చెందాడు. కూతరు జనవరి 10న మృతి చెందింది. అప్పటి నుంచి అనిత ఒంటరైంది. దీంతో మనోవేదనకు గురై గురువారం మధాహ్నం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 60 మంది ఆస్పత్రిపాలు
సాక్షి, మైసూరు (కర్ణాటక): చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని వడకెహళ్ళ గ్రామంలో సోమవారం పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనాన్ని తిన్న 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బల్లి పడిన విషయాన్ని చూసుకోకుండా వడ్డించారు. తిన్న వెంటనే బాలలకు వాంతులు, విరేచనాలు కావడంతో కౌదళ్ళి, రామపుర ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స చేయించారు. ఎవరికీ అపాయం లేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పరుగున ఆస్పత్రికి చేరుకున్నారు. వివాహిత అదృశ్యం హోసూరు: హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని చెన్నసంద్రం గ్రామానికి చెందిన శివానందకుమార్ (34). ఇతని భార్య సౌమ్య(29). వీరికి కొడుకు రామ్చరణ్ (10) ఉన్నాడు. 2వ తేదీ సౌమ్య కొడుతో కలిసి బయటకెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో భర్త బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టారు. -
యాపిల్: వివాదాస్పద ఐఫోన్ ప్లాంట్ మళ్లీ ఓపెన్
యాపిల్ కంపెనీ సప్లయిర్గా ఉన్న ఫాక్స్కాన్, తమిళనాడులోని వివాదాస్పద ప్లాంట్ను తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జనవరి 12న ఈ ప్లాంట్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుందని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు అధికారులు సైతం ప్రకటించడం విశేషం. శ్రీ పెరుంబుదూర్లో ఉన్న ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ సెంటర్ బయట ఉన్న ఓ వసతి గృహంలో ఆహారం కల్తీ కావడంతో సుమారు 159 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రోడ్డెక్కిన ఉద్యోగులు భారీ ఎత్తున్న ఆందోళన చేపట్టగా.. ప్లాంట్ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాక్స్కాన్ను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాణాలకు తగ్గట్లు వసతి గృహాలు లేవనే ఆరోపణల్ని సైతం ఒప్పుకుంది. 2021 డిసెంబర్ 18న ఈ ఘటన జరగ్గా.. డిసెంబర్ 30నే తిరిగి ప్లాంట్ను తెరవాల్సి ఉంది. అయితే ప్రమాణాలు మెరుగుపర్చడం అనే కారణంతో నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసింది ఫాక్స్కాన్. ఈ లోపు యాజమాన్యాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు మూతపడిన కాలానికి జీతాలు సైతం చెల్లించింది. ఇదీ చదవండి: ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా! -
వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన నామ్తమిళర్ పార్టీ నేత, ప్రముఖ యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటైమురుగన్పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు అతడిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు 2 వేల మంది యువతులను తిరువళ్లూరులో ఉంచి షిప్ట్ పద్ధతిలో పనిచేయిస్తున్నారు. మూడు వారాల క్రితం కార్మికులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురై ప్రైవేటు వైద్యశాలలో చేరా రు. ఈ సమయంలో సీమాన్ పార్టీ నేత, యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటై మురుగన్ వదంతులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సాటైమురుగన్పై గూండా చట్టా న్ని ప్రయోగించాలని కలెక్టర్ ఆదేశించారు. -
కొంప ముంచిన పెళ్లి భోజనం.. 190 మంది అస్వస్థత
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెళ్లింట భోజనం చేసిన 190 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంఘటన దావణగెరె జిల్లా హోన్నాళి తాలూకా హోసదేవర హొన్నాళి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన వారికి అర్థరాత్రి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారందరినీ సమీప ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 10 మందికి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేసారు. వివాహ వేడుకలో చేసిన ఆహారాన్ని పరీక్షల కోసం దావణగెరెకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
Telangana: చికెన్ తిని ఊరంతా అస్వస్థత...
కడెం: కలుషిత ఆహారం తిని ఊరంతా అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం రానిగూడలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిపేట్ గ్రామంలో దండారీ వేడుకల్లో భాగంగా ఈనెల 6న ఊరంతా కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేశారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనలతో ఊరంతా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని 61 మందికి చికిత్స అందజేశారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆహారంలో తీసుకున్న చికెన్తోనే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. -
మధ్యాహ్న భోజనం వికటించి.. 32 మంది విద్యార్థులకు అస్వస్థత
మామడ(నిర్మల్): నిర్మల్ జిల్లా మామడ మం డలం దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 114 మంది పాఠశాలకు హాజర య్యారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించిన అనంతరం 32 మందికి వాంతుల య్యాయి. ఉపాధ్యాయులు వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, వారు పాఠశాలకు చేరుకుని ప్రాథమిక చికిత్స అం దించారు. 12 మంది అస్వస్థతకు గురవ్వడం తో వారిని అంబులెన్స్లో మండల కేంద్రం లోని పీహెచ్సీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. డీఎంహెచ్వో ధన్రాజ్, డీఈవో రవీందర్రెడ్డి, సర్పంచ్ గీత అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. భోజనంలో అందించిన కోడిగుడ్డు, సాంబార్ అస్వస్థతకు కారణమని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎం సస్పెన్షన్.. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేయాలని, ఎండీఎం ఏజెన్సీ ని విధుల నుంచి తొలగించాలని డీఈవో రవీందర్రెడ్డిని కలెక్టర్ పారూఖీ ఆదేశించారు. హెచ్ఎం వినోద్కుమార్ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500) -
మళ్లీ వికటించిన భోజనం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాన్సువాడ: మధ్యాహ్న భోజనం మళ్లీ వికటించింది. బీర్కూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కుళ్లిన గుడ్లు వడ్డించడంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలో గత గురువారం మధ్యా హ్న భోజనం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా తిరక్కుండానే మళ్లీ మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది బడికి వచ్చారు. రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. పిల్లలకు అన్నం, పప్పుతో పాటు గుడ్డు వడ్డించారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం చేశారు. అయితే, అన్నం తిన్న తర్వాత కొద్ది సేపటికి విద్యార్థులు కడుపు నొప్పితో అల్లాడి పోయారు. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, అలాగే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బీర్కూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి అంబులెన్సులతో పాటు రెండు ప్రైవేటు వాహనాల్లో 70 మందిని చిన్నారులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకలు అందుబాటులో ఉంచారు. చదవండి: హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు కుళ్లిన గుడ్లు..! మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. ఉడికించిన గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు. అయితే, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు: స్పీకర్ బాన్సువాడ టౌన్: విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం అనంతరం గుడ్డు తినడంతోనే కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయని చిన్నారులు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గుడ్డు తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. -
పానీపూరీ తిని 77 మందికి అస్వస్థత.. వాంతులు, కడుపులో తిప్పడంతో..
చంఢీగడ్: బయట దొరికే చిరుతిండిలో ఎక్కువ మంది ఇష్టపడి మరీ తినేది ఏదని అడిగితే టక్కున చెప్పే పేరు పానీపూరీ. అయితే కొందరు మాత్రం నాణ్యత లేకుండా, తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పానీపూరీ తినడం వల్ల కొంత మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్గడ్లోని గటపార్ కాలా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నిర్వహించే మార్కెట్లో పానీపూరీ తినడం వల్ల 77 మంది అనారోగ్యం పాలైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తొలుత వారిని మెడికల్ సెంటర్కు తీసుకెళ్లిన అధికారులు, మెరుగైన చికిత్స కోసం పెండ్రి ప్రాంతంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో 26 మందిని బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయగా, మిగిలిన వారిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. వారిని పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్లే అస్వస్థత పాలైనట్లు అధికారులకు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: Priyanka Gandhi Vadra: అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు -
ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆహారంలో తీసుకున్న చికెన్ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి కుమార్తె విగతజీవులయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలోని తంగప్ప నగర్కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్లో చికెన్ గ్రేవిని బుధవారం కొన్నారు. మధ్యా హ్నం భోజనంలో ఆ చికెన్ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు. అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరి మరణానికి చికెన్ గ్రేవీ లేదా శీతల పానీయం కారణం కావొచ్చని మృతుల బంధువులు ఫిర్యా దు చేయడంతో కోవిల్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. -
పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్కు అస్వస్థత..
Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్కు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ టీ20 కప్ టోర్నీలో సెంట్రల్ పంజాబ్ జట్టుకు హఫీజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆజట్టు స్ధానికంగా ఓ హోటల్లో బస చేస్తుంది. ఈ క్రమంలో హోటల్లో అందించిన ఆహారాన్ని తినడం ద్వారా హఫీజ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. నాణ్యత లేని ఆహారం అందించిన రెస్టారెంట్పై హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. కాగా వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రకటించిన జట్టులో మహ్మద్ హఫీజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆదే విధంగా టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆక్టోబర్ 24న భారత్తో తలపడనుంది. చదవండి: SRH vs PBKS: జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ -
67కు పెరిగిన విషాహార బాధితులు
నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం బండ్లపై గ్రామంలో శుక్రవారం రాత్రి విషాహారం తిని అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్య 67కి చేరుకుంది. ప్రతి మూడేళ్లకోసారి బండ్లపై హరిజనవాడ, దుర్గంవారిపల్లె, బండ్లపై కాలనీ, పారాశివారిపల్లె గ్రామస్తులు ఏకమై గంగజాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా బండ్లపై గ్రామ ప్రజలు గురువారం రాత్రి అమ్మవారిని ఊరేగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు, స్థానికులు సామూహిక భోజనాలు చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత భోజనం చేసినవారు రాత్రి 10 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని 108లో నిమ్మనపల్లె, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్బాషా, సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్రెడ్డి తదితరులు పరామర్శించారు. అంతమంది ఆస్పత్రిలో చేరినా శుక్రవారం రాత్రి విధులకు హాజరుకాకపోవడంతో మెడికల్ ఆఫీసర్ జులేఖబేగంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విష ఆహారం ఘటనపై మదనపల్లె డివిజన్ ఆహార కల్తీ నియంత్రణాధికారి రాముడు విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
విషాదం: ఫుడ్ పాయిజన్తో ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే ఓ కుటుంబం శీతల పానియం తాగి పడుకున్నారు. తల్లి బాలమణి(35)తో పాటు, కూతురు మనీషా(13), కొడుకు కుమార్కు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తండ్రి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కుటుంబీకులుగా గుర్తించారు. -
ఫుడ్ పాయిజన్: రక్తపు వాంతులు.. 28 రోజులు ఆస్పత్రిలోనే
ముంబై: ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాను.. రక్తపు వాంతులయ్యాయి.. దాదాపు 28 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాను అని ప్రముఖ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఓ రెస్టారెంట్ నుంచి తీసుకువచ్చిన ఆహారం తిన్న తర్వాత తనకు రక్తపు వాంతులయ్యాయని.. 28 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను అని బాలీవుడ్ హంగామాకు తెలిపారు. తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి పహ్లాజ్ నిహలానీ వర్ణిస్తూ.. ‘‘నెల రోజుల క్రితం నేను ఒక్కడినే ఇంటిలో ఉన్నాను. నా భార్య వేరే ఊరు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా మహమ్మారి సమయంలో నేను నిర్మించిన ఓ సినిమా యూనిట్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. పిచ్చపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. బాగా ఆలస్యం అయ్యింది. ఆ సమయంలో వారిని ఊరికే పంపిచడం భావ్యం కాదని భావించి తిని వెళ్లమని చెప్పాను. అప్పటికే నా కోసం మా ఇంట్లో ఆహారం తయారు చేశారు. కానీ అది అందరికి సరిపోదు. దాంతో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను’’ అన్నారు. తింటున్నప్పడే తేడా కొట్టింది ‘‘వారి కోరిక మేరకు చికెన్ ఐట్సం ఆర్డర్ చేశాను. ఇక మాంసాహారంలో నేను చికెన్ మాత్రమే తింటాను. దాంతో వారు నన్ను కూడా తమతో జాయిన్ కావాల్సిందిగా కోరారు. వద్దనడం మర్యాద కాదని భావించి సరే అన్నాను. ఆ తర్వాత కొంచెం చికెన్ తీసుకుని తిన్నాను. అప్పుడే ఏదో తేడా కొట్టింది. దాని గురించి వారికి చెప్పాను. వాళ్లు పర్లేదు బాగానే ఉంది.. ఏం కాదు తిను అని హామీ ఇవ్వడంతో తిన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు రక్తపు వాంతులు ‘‘ఆ తర్వాత కాసేపటికే నాకు కాస్త అసౌకర్యంగా అనిపించడమేక కాక వాంతికి అయ్యింది. ఆపై కాస్తా బాగానే అనిపించింది.. నీరసంగా అనిపించడంతో వెంటనే పడుకున్నాను. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాకు మరోసారి వాంతికి అయ్యింది. చాలా రక్తం పోయింది. వెంటనే నా కొడుక్కి కాల్ చేశాను. తను సేమ్ బిల్డింగ్లో ఉంటున్నాడు. తను నన్ను ఆస్పత్రికి తరలించాడు. 28 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను’’ అన్నారు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను ‘‘ఆస్పత్రిలో చేరిన గంటలోనే నాకు అన్ని టెస్ట్లు చేశారు. ఇక 28 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను. మహమ్మారి సమయం కావడంతో నా దగ్గరకు ఎవరిని రాన్వివలేదు. కానీ నేను చాలా అదృష్టవంతుడిననే చెప్పాలా. జాగ్రత్తగా చూడటానికి కుటుంబ సభ్యులు దగ్గర లేరు.. సరైన వైద్య సిబ్బంది కూడా లేరు. మరణం అంచుల వరకు వెళ్లి.. క్షేమంగా తిరిగి వచ్చాను’’ అని తెలిపారు. రెస్టారెంట్పై కేసు పెడతాను ‘‘ఇక నా ఆరోగ్యం ఇంతలా క్షీణించడానికి కారణం అయిన సదరు రెస్టారెంట్ మీద కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నాతోపాటు భోంచేసిన మిగతా వారు అస్వస్థతకు గురయ్యారు. కానీ నా పరిస్థితి తీవ్రంగా మారింది. ఆరోజు తిన్నదే నా చివరి భోజనం అనుకున్నాను. ఈ క్రమంలో నేను మీ అందరిని కోరేది ఒక్కటే. ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. బయట ఫుడ్ తీసుకుని ఇలా ఇబ్బంది పడకండి అన్నారు. పహ్లాజ్ నిహలానీ 29 సంవత్సరాల పాటు పిక్చర్స్ మరియు టీవీ ప్రోగ్రాం నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు మరియు 2009 లో ఈ పదవికి రాజీనామా చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ పదవికి 19 జనవరి 2015 న పదవీవిరమణ చేశారు. 2017లో ఆయన స్థానంలో ప్రసాన్ జోషి నియమితులయ్యారు. చదవండి: ప్రాణాలు తీసిన జొన్నరొట్టె -
ఉస్మానియా వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న19 మంది విద్యార్థులు అస్వసత్థకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడటంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. -
బిర్యానీ ఎఫెక్ట్: 145 మందికి అస్వస్థత
డిస్పూర్: అస్సాంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. వివరాలు.. మంగళవారం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిఫు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 8,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక వీరందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది తిన్న తర్వాత వారిలో పలువురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. వీరిలో 28 మందిని డిశ్చార్జ్ చేయగా.. మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ బాగానే ఉన్నారు’’ అని తెలిపారు. (చదవండి: చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..) ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. -
ఫుడ్ పాయిజన్: జూనియర్ డాక్టర్లకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్లో పుడ్ పాయిజన్ కారణంగా జూనియర్ డాక్టర్లు అస్వస్థతకు గురయ్యారు. ఇరవై మూడు మందికి పుడ్ పాయిజన్తో వాంతులు, విరోచానాలు కావడంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో నాసిరకం బోజనం తిని అస్వస్థత గురయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మెడికోలకు ప్రమాదం లేదని డాక్టర్ చెబుతున్నారు.. జూనియర్ వైద్యులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మెడికోలు చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ డెవిడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుడ్ పాయిజన్ కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థులు తిన్న ఆహారాన్ని ల్యాబ్ పంపించామని అన్నారు. నాణ్యత లోపాలు ఉంటే హస్టల్ నిర్వహకుల పై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. -
అయ్యో.. అనసూజ
సాక్షి, సంగారెడ్డి : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడి తీరనిశోక సంద్రంలో ఉండగానే చికిత్స పొందుతున్న మరొకరు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో చోటుచేసుకుంది. జొన్న రొట్టె తిని మరణించిన విషాద ఘటనలో అనుసూజ మృతి చెందడంతో మృతులసంఖ్య ఐదుకు చేరింది. పల్వట్ల గ్రామంలో మఠం శంకరమ్మ అంత్యక్రియలకు వచ్చిన కొడుకులు, కోడళ్లు ఈ నెల 21న జొన్న రొట్టెలు చేసుకొని తిన్న ఐదుగురిలో చంద్రమౌళి, శ్రీశైలం, సుశీల ముగ్గురు మృతి చెందిన విసయం తెలిసిందే. (చదవండి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి) చికిత్స తీసుకుంటున్న ఇద్దరిలో బీబీఆర్ ఆస్పత్రిలో ఉన్న అనుసూజ(48) గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటంబం మరింత శోకసంద్రంలో మునిపోయింది. సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని, ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దినకార్యం ముగియకముందే.. ఇటీవల మృతి చెందిన ముగ్గురి దినకార్యం కూడా పూర్తి కాకముందే మరో చావు కబురు వినడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటువంటి గోస పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. -
ప్రాణాలు తీసిన జొన్నరొట్టె
సాక్షి, సంగారెడ్డి: జోగిపేట/వట్పల్లి(అందోల్): తల్లి మృతితో అప్పటికే కడుపు నిండా బాధతో ఉన్నారు.. కాస్త కడుపు నింపుకొందామనుకుని తిన్న ఆహారం కాస్తా యమపాశంగా మారింది. తిన్న జొన్న రొట్టెలే ప్రాణాలు హరించాయి. తల్లి 10 రోజుల కింద జొన్న రొట్టె తిని అస్వస్థతకు గురై మరణించింది. ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమారులు, ఒక కోడలు సైతం జొన్న రొట్టెలు తిని విగతజీవులయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుం బంలో నలుగురు మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుం బసభ్యులు తెలిపిన ప్రకారం.. పల్వట్లకి చెందిన మఠం శంకరమ్మ (80) ఈనెల 13న విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె దశదినకర్మ ముగిసిన అనంతరం, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టె లు చేసుకుని శంకరమ్మ కుమారులు చంద్రమౌళి (55), శ్రీశైలం (48), కోడళ్లు సుశీల (60), అనసూజ, సరిత తిన్నారు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న మనవలు, మనవరాళ్లు శిరీష, సంధ్య, సాయి వరుణ్ రొట్టెలు వద్దనడంతో వారికి అన్నం వండి పెట్టారు. రొట్టెలను తిన్న వారికి కొద్ది సేపటికే మత్తు రావడంతో కొద్దిసేపు పడుకున్నా రు. గంట తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో మనవలు, మనవరాళ్లు ఇంటి పక్క వారి సాయంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే చంద్రమౌళి, సుశీ ల మృతి చెందారు. శ్రీశైలం, సరితను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కు, అనసూజను బాలానగర్లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలిం చారు. ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం రాత్రి శ్రీశైలం కూడా మరణించాడు. సరిత, అనసూజ పరిస్థి తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి శంకరమ్మ దహన సంస్కారాలు నిర్వహించిన ఆమె చిన్న కుమారుడు సంతోష్ తన భార్యతో కలసి నారాయణఖేడ్ వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విష పదార్థాలు కలిసుండొచ్చు జొన్నపిండిలో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా.. లేదా అన్నదానిపై మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. పిండి, రొట్టెలను స్వాధీనం చేసుకొని నాచారం వద్ద పరీక్ష కేంద్రానికి పంపించాం. పిండిలో క్రిమి సంహారక మందులు కలిస్తే తప్ప ఇంత ప్రమాదం జరగదు. క్రిమిసంహారక మందు వంటిది ఉంటేనే గంటలోపు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శిరీష అనే అమ్మాయి కొంత భాగమే తినడంతో ప్రమాదం నుంచి బయటపడింది. –మోజీ రాం రాథోడ్, డీఎంహెచ్వో, సంగారెడ్డి జొన్నలు విషపూరితం కావు.. జొన్నలను మరాడించాక 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకుమించి నిల్వ ఉంటే పురుగు పడుతుంది. విషపూరితం మాత్రం కాదు. పురుగులు పట్టిన పిండిని రొట్టె చేసుకొని తింటే స్వల్ప ఆరోగ్య సమస్యలే వస్తాయి. జొన్నలను మర ఆడించేటప్పుడు (గిర్ని) లేదా ఇంట్లో రొట్టెలు చేసుకునే సమయంలో ఇతర పిండి కలిసినట్లయితే కొద్ది గా విషతుల్యం కావచ్చు. జొన్న పిండిని నానబెట్టి కొద్దిగా వాడినట్లయితే కూడా ఫంగస్ వచ్చి విషమమ్యే అవకాశం ఉంది. బల్లి, పాములు, ఇతర విషపూరిత క్రిమికీటకాలు పిండిలో ఎక్కువసేపు ఉన్నా విషపూరితం కావచ్చు – నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి -
మేడ్చల్: తల్లి, సోదరి దారుణ హత్య
-
అన్నంలో విషం: తల్లి, సోదరి దారుణ హత్య
సాక్షి, మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషం హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణ చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లిలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)లకు పెట్టాడు. (విషాదం: హెచ్సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య) పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్ చేసి ఆ తిన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28మ కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. -
కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత
సాక్షి, విశాఖపట్నం: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వివాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. -
కొంపముంచిన నిల్వ మాంసం
పాడేరు: రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందిన మేకను కోసుకుతిన్న గిరిజనులు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురికాగా, వీరిలో ఓ గిరిజనుడు గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. హుకుంపేట మండలంలోని మారుమూల గన్నేరుపుట్టు పంచాయతీ డొంకినవలసలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో రెండు రోజుల కిందట ఓ మేక అనారోగ్యంతో మృతిచెందడంతో బుధవారం దాన్ని కోసి, 15 కుటుంబాల వారు పంచుకుని వండుకుని తిన్నారు. గురువారం ఉదయం నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుడిపల్లి వెంకటరమణ (43) అనే గిరిజనుడు గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గ్రామంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప్ప ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అనూష,ఇతర వైద్యసిబ్బంది సాయంత్రం అక్కడకు చేరుకుని 27 మంది గిరిజనులకు వైద్యసేవలు కలి్పంచారు. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు అంబులెన్స్లను డొంకినవలస గ్రామానికి తరలించి,అక్కడ నుంచి రాత్రి 10గంటల సమయంలో పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు.ఈ 27 మందిలో పరిస్థితి విషమంగా ఉన్న 9 మందికి ఉన్నత వైద్యసేవలు కల్పిస్తున్నారు. మిగిలిన వారిని కూడా రాత్రికి తీసుకువచ్చారు.అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు డీఎస్పీ రాజ్కమల్లు ఆస్పత్రికి చేరుకుని బాధిత గిరిజనులను పరామర్శించారు. బాధిత గిరిజనులకు మెరుగైన వైద్యసేవలకు వైద్యులతో ఎమ్మెల్యే పాల్గుణ సమీక్షించారు. ఎంపీడీవోపై దాడి డొంకినవలస గ్రామంలో బాధిత గిరిజనులకు సహాయ కార్యక్రమాలకు గాను రాత్రి 7.30 గంటల సమయంలో తరలివెళ్లిన హుకుంపేట ఎంపీడీవో ఇమ్మానుయేల్, ఇతర సచివాలయ ఉద్యోగులపై సీపీఎం నేతలు, గిరిజనులు దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు. అధికారుల వాహనాల టైర్లకు గాలి కూడా తీసేసి వాహనాలను కదలనివ్వలేదు. ఈ దాడిలో ఎంపీడీవో ఇమ్మానుయేల్కు కుడిచేయి విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. అతి కష్టం మీద ఎంపీడీవో, ఇతర సిబ్బందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఖండించారు. ఎంపీడీవోను కేజీహెచ్కు తరలించారు. -
బాసుంది వికటించి ..
అమరావతి, తాడేపల్లి రూరల్: బాసుంది తిని ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలో జరిగింది. మండలంలోని చిర్రావూరు గ్రామానికి చెందిన రమేష్ తన ఇద్దరు పిల్లలను తీసుకొని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి ఆదివారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రమేష్ సోదరి తమ ఇంటి పక్కనే ఉన్న డెయిరీ పార్లర్ నుంచి బాసుంది 2 బాక్సులు కొని ఒకటిరమేష్కి ఇచ్చి, రెండోది తాను తీసుకెళ్లింది. రమేష్ సోదరి పిల్లలు, వారి ఇంటి పక్క పిల్లలు నలుగురు రాత్రి బాసుంది తినగా అరగంట వ్యవధిలో విరోచనాలు, వాంతులు అవ్వడంతో వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రమేష్ తన ఇద్దరు పిల్లలతో పాటు పక్క ఇంట్లో పిల్లలకు కూడా ఇవ్వగా, వారికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే తన ఇద్దరు పిల్లలను, ఇంటి పక్క స్నేహితుడి పిల్లవాడిని తాడేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి, విషయాన్ని వివరించాడు. డాక్టర్ కిరణ్ ప్రథమ చికిత్స నిర్వహించి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పానీపూరి తిని చిన్నారులకు అస్వస్థత
-
పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : పానీపూరి తిన్న40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం పట్టణంలోని సుందరయ్య నగర్, ఖుర్షీద్ నగర్లలోకి గప్చూప్ బండి వచ్చింది. దీంతో పలువురు పిల్లలు, పెద్దలు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అందులో చాలా మందికి కడపునొప్పితోపాటు వాంతులు, విరేచనాలు కావడం ప్రారంభమయింది. దీంతో వెంటనే వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంఅండ్హెచ్వో రిమ్స్కు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి రిమ్స్ డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. పానీపూరి తినడం వల్లనే బాధితులు అస్వస్థతకు గురైనట్టుగా భావిస్తున్నామని తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో టెస్ట్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. పిల్లలను బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. 24 గంటల తర్వాత బాధితులను డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. -
పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి
అరక్కోణం: తెలియక చేసిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. రాణిపేట జిల్లా ఎస్ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు పెరియస్వామి (65), భార్య లక్ష్మి (57), కుమారుడు శివకుమార్ (27), కోడలు భారతి (22). పెరయస్వామి మంగళవారం రాత్రి బోండాలు చేసేందుకు మైదాపిండి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అలాగే మిరప తోటకు క్రిమిసంహారక మందు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలియని కోడలు భారతి రెండూ కలిపి బోండాలు వేసింది. నలుగురూ తినడంతో కొంతసేపటికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామస్తులు వారిని షోలింగర్ ప్రభుత్వాస్పత్రికి అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భారతి, శివకుమార్ మృతిచెందారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాదిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఫుడ్ పాయిజన్తో చిన్నారుల అస్వస్థత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలో సోమవారం ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మిగిలిపోయిన మిఠాయిలు తినటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్ధతకు గురైనవారిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయవాడకు తరలించారు. పెళ్లిళ్లలో వంట పనులు చేసే మహిళలు.. వడ్డించిన స్వీట్ కోవా మిగలడంతో ఇంటికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లిన కోవాను వారి పిల్లలు, వారు తినటంతో అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్ధకు గురైనవారు ప్రస్తుతం చికిత్స విజయవాడ పాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు. నాయకుల సందర్శన.. విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్ ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్ నుంచి ఫిల్టర్ వాటర్ తెస్తున్నారు. -
విద్యార్థులకు అస్వస్థత
చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో చికిత్స అందించారు. తూర్పుగోదావరి, చింతూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 360 మంది విద్యార్థులుండగా ఉదయం విద్యార్థులతో ఐరన్(ఫెర్రస్ సల్ఫేట్ అండ్ ఫోలిక్ యాసిడ్) మాత్రలు మింగించారు. అనంతరం కిచిడీ, గుడ్డు, టమాటా పచ్చడితో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. కాగా మూడు గంటల సమయంలో కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు వారికి చికిత్స ప్రారంభించారు. త్వరితగతిన చర్యలు చేపట్టిన పీవో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పద్మజతో పాటు సమీప పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్న వైద్యులను అక్కడికి రప్పించి విద్యార్థులకు త్వరితగతిన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యులతో పాటు స్థానిక ప్రైవేటు వైద్యులు కూడా విద్యార్థులకు వైద్యం అందించేందుకు సాయపడ్డారు. ఈ సందర్భంగా పీవో వెంకటరమణ ప్రతి వార్డుకు వెళ్లి విద్యార్థులకు ధైర్యం చెబుతూ ఆందోళన చెందవద్దంటూ భరోసా కల్పించారు. దీంతో సాయంత్రానికి విద్యార్థులంతా క్రమంగా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకుని వారి యోగక్షేమాలు చూసుకున్నారు. ఒక్కసారిగా చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భయానికి లోనైన విద్యార్థులు ఆసుపత్రిలో బోరున విలపించారు. భోజనం వికటించడమే కారణమా? మద్యాహ్న భోజనం తిన్న అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భోజనం వికటించిన కారణంగానే ఇది జరిగి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెసరపప్పుతో కూడిన కిచిడీతో పాటు గుడ్డు, టమాటా చట్నీ ఇవ్వడంతో అది తిన్న విద్యార్థులకు సరిగా అరగక అస్వస్థకు గురై ఉంటారని వైద్యులు తెలిపారు. కాగా కిచిడీ సరిగా ఉడక లేదని ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా బాగానే ఉడికింది. ఏం ఫర్వాలేదని చెప్పడంతో తామంతా తిన్నామని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, గురువారం రాత్రి వారిని ఆసుపత్రిలోనే పర్యవేక్షణలో ఉంచి శుక్రవారం వైద్యుల సూచనల మేరకు ఇళ్లకు పంపిస్తామని పీవో వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపిస్తున్నామని, వచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరో 12 మంది విద్యార్థులకు.. చింతూరు: మండలంలోని నరసింహాపురం బాలుర ఆశ్రమ పాఠశాలలోని మరో 13 మంది విద్యార్థులు గురువారం రాత్రి ఆస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక వారికి వాంతలు మొదలయ్యాయి. ఏఎన్ఎం మాత్రలు మింగించడంతో వారిలో 10 మంది కొంత వరకు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో వెంటనే ఆ హాస్టల్కు వెళ్లి ఆ 12 మంది విద్యార్థులను వాహనంలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స చేస్తున్నారు. -
భర్తను చంపేందుకు భార్య స్కెచ్
-
మటన్ కూరలో సైనేడ్ కలిపి భర్త హత్యకు స్కెచ్
సాక్షి, భీమడోలు: అనుమానం పెనుభూతమైంది. చంపితే గానీ కథ కొలిక్కిరాదని పక్కా ప్లాన్ వేశారు. ఎలా చంపాలని, ఎలా చంపితే తమ పేర్లు బయటకు రావని ప్రయోగం కూడా చేశారు. అంతా బాగానే ఉంది. సరిగ్గా టైమ్ వచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో చోటుచేసుకుంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యే అతడిని హతమార్చేందుకు పథకం రచించింది. అందుకోసం కన్న కొడుకుతో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుంది. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినా...చివరి నిమిషంలో బాధితుడికి అనుమానం రావడంతో సీన్ రివర్స్ అయింది. బాధితుడి ఫిర్యాదుతో భీమడోలు పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్ గురునాథ్ పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. భర్త గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య రాణి, కుమారుడు..గురునాథ్తో గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు కలిసి గురునాథ్ను చంపాయాలని భావించారు. అదే గ్రామానికి చెందిన ఎ.ధనలక్ష్మి, శ్రీనివాసరావుల సహకారం కోరారు. దీంతో సైనేడ్తో చంపేయాలని నిర్ణయించి ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్ సహకారంతో సైనేడ్ తెచ్చారు. సైనైడ్ను పరీక్షించేందుకు మొదట ఇంట్లోని కోడిపుంజుపై ప్రయోగించారు. సైనైడ్ తిన్న కోడిపుంజు రంగుమారి చనిపోయింది. దీంతో తమ పథకం ఫలిస్తుందని ఆశించారు. కోడిపుంజు వైరస్ తెగులు సోకి చనిపోయిందని గురునాథ్ను నమ్మించారు. పక్కాప్లాన్ వేసి ఆదివారం మటన్ కూరలో సైనేడ్ కలిపి పెట్టారు. మొదటి ముద్ద తిన్న గురునాథ్కు ఆహారం రుచిలో తేడా ఉన్నట్టు అనుమానం వచ్చింది. అక్కడితో ఆహారాన్ని వదిలేశాడు. తనపై జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే పథకం వేసిన వాళ్లంతా ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటుండగా గురునాథ్ గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేందుకు కుట్రపన్నిన ఐదుగురిని కఠినంగా శిక్షించాలని గురునాధ్ కోరుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.... గోవింద్ గురునాథ్ ఇంటిలోని మటన్ కర్రీ, సైనైడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. -
హోటల్లో పుడ్పాయిజన్,బాలుడి మృతి
-
విషాహారం తిని బాలుడి మృతి
సనత్నగర్: యూఎస్కు వెళ్లేందుకు వీసా కోసం వచ్చిన నగరానికి వచ్చిన సాఫ్ట్వేర్ దంపతులకు విషాదం మిగిల్చింది. స్టార్ హోటల్లో బస చేసి అక్కడ విషాహారం తీసుకోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం లింగగూడేనికి చెందిన ఏట్కూరి రవి నారాయణరావు, శ్రీవిద్య భార్యాభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా బెంగళూరులో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి వరుణ్ (7), విహాన్ (ఏడాదిన్నర) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 9న కుటుంబం మొత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్కు యూఎస్ కాన్సులేట్లో వీసా ఫింగర్ ప్రింట్, స్టాంపింగ్ కోసం వచ్చి బేగంపేట మానస సరోవర్ హోటల్లోని 318 గదిలో బస చేశారు. 10వ తేదీ ఉదయం యూఎస్ కాన్సులేట్కు వెళ్లి పనిపూర్తి చేసుకుని హోటల్కు వచ్చారు. ఉదయం, మధ్యాహ్నం అక్కడే అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్, లంచ్ చేశారు. రాత్రి సమయంలో ఇండియన్ బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్ను ఆహారంగా తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు విహాన్ వాంతులు చేసుకోవడం శ్రీవిద్య గమనించింది. అదే సమమంలో రవి నారాయణ కూడా కడుపు నొప్పితో బాధపడ్డారు. కొద్ది సేపటికి పెద్ద కుమారుడు, భార్య కూడా వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని రవి నారాయణ నగరంలోనే ఉండే బంధువు ప్రసాద్కు సమాచారం ఇవ్వడంతో ఆయన తెల్లవారు జామున 3.30గంటల సమయంలో హోటల్కు వచ్చారు. రవి నారాయణకు కడుపులో నొప్పి ఎక్కువ ఉండటం బంధువుతో కలిసి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అదే సమంలో పిల్లలు నిద్రపోతుండగా, భార్య హోటల్లోనే ఉండిపోయింది. ఉదయం 8గంటల సమయంలో ఆస్పత్రి నుంచి హోటల్కు రవినారాయణ రాగా చిన్న కుమారుడు విహాన్ అపస్మారక స్థితిలో ఉండటంతో పాటు పెదవులు నలుపు రంగులోకి మారి, శరీరం మొత్తం చల్లబడిపోయి ఉండటంతో వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బేగంపేట పోలీసులుకు సమాచారం అందించారు. రవి నారాయణరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మానస సరోవర్ హోటల్లో విషాహారం తిని తన కుమారుడు చనిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భోజనం వికటించి 230 మందికి అస్వస్థత
జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు. -
కలుషిత ఆహారంతో 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నిడమనూరు: కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నల్లగొండ జిల్లా నిడమనూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 237 మంది విద్యార్థినులు చదువుతుండగా.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో 140 మంది విద్యార్థినులు ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు. శనివారం విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో బీరకాయ కూరను వడ్డించారు. అయితే భోజనం చేసిన తర్వాత సుమారు 60 మంది విద్యార్థినులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరద్ తెలిపారు. కొందరు పిల్లలు గ్యాస్ ప్రాబ్లమ్తో అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చెప్పారు. -
గురుకులంలో కలకలం
సాక్షి, నిజామాబాద్ : గురుకులాల్లో పెడుతున్న ఆహారం నాణ్యమైనదేనా..? పౌష్టికాహారం పేరుతో నాసిరకం భోజనం పెడుతున్నారా..? అసలు గురుకులాల్లో ఏం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బిచ్కుంద మండలంలోని మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే.. మరో గురుకులంలో అచ్చం ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. నిజామాబాద్ శివారులోని నాగారంలో గల గిరిజన డిగ్రీ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడి పోయారు. దీంతో వారిని హుటాహుటినప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒకే తరహా ఘటనలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజుల్లో రెండు ఘటనలు.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. నిజామాబాద్ నగర శివారులోని గొల్లగుట్ట తండా ప్రాంతంలో గల గిరిజన మహిళా డిగ్రి కళాశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన 62 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాణ్యతపై అనుమానాలు.. నిజామాబాద్ జిల్లాలో ఐదు, కామారెడ్డిలో ఎనిమిది కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 25 మైనార్టీ గురుకులాలలు ఉన్నాయి. ఇందులో బాలుర–13, బాలికల గురుకులాలు–10, రెండు బాలుర ఇంటర్ బాలుర కళాశాలలున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో గురుకులాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. దీంతో గురకులాల్లో పెట్టే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఆహారాన్ని అందించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం వస్తువులు.. గురుకులాల్లో నాసిరకం వస్తువులు వినియోగిస్తున్నాయి. తాజా కూరగాయలు వినియోగించడం లేదు. గిరిజన గురుకులంలోని కిచెన్లో పరిశీలిస్తే ఆలుగడ్డలకు మొలకలు వచ్చి ఉన్నాయి. వీటీతోనే శనివారం ఆలు బజ్జీలు వేయించి విద్యార్థినులకు స్నాక్స్ పెట్టారు. అలాగే, టమాటలు సైతం కుళ్లి పోయి, వాటిపై చిన్నపాటి పురుగులు వాలుతున్నాయి. దోసకాయలు బాగా లేవు. పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. కారం, ఇతర సరుకులు కూడా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు. బిచ్కుంద మైనారిటీ గురుకులంలోనూ కుళ్లిపోయిన గుడ్లను విద్యార్థులకు పెట్టారు. నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు విద్యార్థులే చెబుతున్నారు. గురుకుల్లో నాసిరకమైన ఆహారాన్ని అందించడం వల్లే విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఆందోళన.. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని గురుకులాల్లో అందిస్తారనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. అయితే, రెండు రోజుల వ్యవధిలో రెండు గురుకులాల్లో ఒకే రకమైన ఘటనలు జరగడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు వాంతులు చేసుకున్న వెంటనే ఆస్పత్రులకు తరలించడంతో ఎవరికి ఏం జరగలేదు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. గొల్లగుట్టలోని గిరిజన గురుకులం గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్! నిజామాబాద్ : గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు!. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం గొల్లగుట్ట ప్రాంతంలో గల గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. గొల్లగుట్ట ప్రాంతంలో గిరిజన గురుకుల హాస్టల్లో 292 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్కుమార్ జన్మదినం కావడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యార్థులకు ప్రత్యేకంగా సేమియా చేసి పెట్టారు. అలాగే, పకోడి వడ్డించారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినులు భోజనం చేశారు. అయితే, అరగంట తర్వాత వారికి కడుపు నొప్పి మొదలైంది. 62 మందికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం, అందులో 10 మంది వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది.. హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు భోజనమే కారణమై ఉంటుందని వారు పేర్కొన్నారు. భోజనంపై కలెక్టర్ ఆరా.. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది.. పౌష్టికాహారం పెడుతున్నారా? అని ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులు రాత్రి చేసిన భోజనం శాంపిల్స్ సేకరించాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలి వచ్చారు. -
భోజనం వికటించి 62 మందికి అస్వస్థత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో భోజనం వికటించి 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. భోజనం శాంపిల్స్ సేకరించాలని అధికారులకు సూచించారు. సాయంత్రం విద్యార్థినులను డిశ్చార్జి చేశారు. -
ఫుడ్ పాయిజన్తో 67మందికి అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం!
సాక్షి, గుంటూరు : హాస్టల్ చీఫ్ వార్డెన్, వార్డెన్ల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. గుంటూరు నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఆహారం కల్తీ కారణంగా 75 మంది విద్యార్థినులు సోమవారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు నాజ్ సెంటర్ దగ్గర ఉన్న మహిళా కళాశాలలో ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాలలు ఉంటాయి. డిగ్రీ కళాశాలకు అనుసంధానంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉంది. దీనికి చీఫ్ వార్డెన్గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్గా లెక్చరర్ కమలకరుణ వ్యవహరిస్తున్నారు. హాస్టల్లో 400 మంది డిగ్రీ, 280 మంది ఇంటర్, ఒకేషనల్ విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యారికి హాస్టల్ ఫీజు కింద సుమారు రూ.1700 ఇస్తారు. నాసిరకమైన చికెన్.. హాస్టల్లో వారానికి ఒక్కసారి విద్యార్థినులకు చికెన్ పెడతారు. ఆదివారం రాత్రి విద్యార్థులకు పెట్టిన చికెన్ నాసిరకంగా ఉందని, అందులో గ్రేవీ కోసం శనగపిండి కలిపారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఆదివారం తిన్న నాసిరకం చికెన్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రికి సుమారు 75 మంది విద్యార్థులు జీజీహెచ్లో చేరారు. మధ్యాహ్నం నుంచి అస్వస్తతకు గురైన విద్యార్థులు వస్తుండటంతో వైద్యులు జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వారికి వైద్య చికిత్సలు అందించారు. రాత్రి వండిన ఆహారం కూడా కల్తీ కావడంతో మరో 30 మందికి పైగా విద్యార్థినులు జీజీహెచ్కు వచ్చారు. ఆదివారం రాత్రి మిల్మేకర్, టమాటా కర్రీ, అన్నం తిన్న మరి కొందరు విద్యార్థులు కొద్ది సేపటికే వాంతులు చేసుకుని కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. పట్టించుకోని చీఫ్ వార్డెన్, వార్డెన్ ఆహారం కల్తీ జరిగి విద్యార్థినులు వరుసగా అస్వస్థతకు గురవుతుంటే ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు. నీటి కాలుష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలు రావడంతో నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ఈఈ శాంతరాజు, డీఈ రమణ, ఏఈ పవన్, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి రాత్రి తిన్న ఆహారం కల్తీ అయి విద్యార్థులు వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గుర్తించారు. అక్కడ వారిని పట్టించుకునే వారు ఎవ్వరు లేకపోవడంతో వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ పిలి పించి జీజీహెచ్కు తరలించారు. ఆహారం కల్తీ అయి విద్యార్థులు ఉదయం నుంచి అస్వస్తతకు గురవుతున్న ప్రిన్సిపాల్, విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు. చాలా రోజులుగా ఫిర్యాదులు.. హాస్టల్లో ఆహార కాంట్రాక్టర్ రామకృష్ణ సరిగా ఆహారం పెట్టడం లేదని చాలా రోజులుగా చీఫ్వార్డెన్ అయిన ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్, వార్డెన్లకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నామని విద్యార్థినులు తెలిపారు. తక్కువ రేటుకు వచ్చే నాణ్యత లేని కూరగాయలు, బియ్యం, ఇతర సరుకు, చికెన్తో వంట చేస్తుంటారని, ఈ విషయమై అనేకమార్లు ఫిర్యాదులు చేసినా తనకు సంబంధం లేదని ప్రిన్సిపాల్ సమాధానమిచ్చారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన రామకృష్ణ గత ప్రభుత్వ హయాంలో ఫుడ్ కాంట్రాక్టును దక్కించుకున్నాడని, ఆదివారం కూడా నిల్వ ఉంచిన చికెన్ను తక్కువ ధరకు తీసుకువచ్చి విద్యార్థినులకు వండి వడ్డించారని సమాచారం. మినరల్ వాటర్ ప్లాంట్ను రాత్రి 7 గంటల తర్వాత ఆపి వేస్తారని, దీంతో పైపుల్లో వచ్చే నీటినే తాగుతుంటామని విద్యార్థినులు పేర్కొన్నారు. 15 రకాల శాంపిళ్ల సేకరణ ఆహారం కల్తీపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఆహార నియంత్రణ శాఖ అధికారి ఖాజామోహిద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్కు చేరుకుని 15 రకాల శాంపిళ్లను సేకరించారు. రాత్రి కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో మళ్లీ అక్కడకు చేరుకుని మినరల్ వాటర్, రాత్రి వండిన ఆహార శాంపిల్స్ను సేకరించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు చంద్రగిరి ఏసురత్నం పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా రాత్రంతా ఆస్పత్రిలోనే ఉండి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. -
కలుషితాహారంతో 75 మందికి అస్వస్థత
గుంటూరు ఈస్ట్: గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో కల్తీ ఆహారం తిని సోమవారం 75 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో డిగ్రీ విద్యారి్థనులు 400 మంది, ఇంటర్ విద్యారి్థనులు 283 మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం అన్నం, చికెన్ కూర తిన్నారు. రాత్రికి పదిమంది స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో జీజీహెచ్కు వెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం హాస్టల్కు వచ్చారు. ఉదయం అల్పాహారంగా ఊతప్పం తిన్న అనంతరం విద్యారి్థనులు వరుసగా అస్వస్థతకు గురికావడంతో జీజీహెచ్లో చేరి్పంచారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్.బాబులాల్ మాట్లాడుతూ ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, వైఎస్సార్సీపీ నేతలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్లో విద్యారి్థనులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం హాస్టల్కు వెళ్లి పరిశీలించారు. విద్యారి్థనులతో కలిసి భోజనం చేశారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యారి్థనుల సంఖ్య పెరుగుతూ రాత్రికి 75కు చేరింది. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా మళ్లీ జీజీహెచ్కు చేరుకుని సమీక్షించారు. అత్యవసర విభాగానికి ముందు వైపు ఉన్న హాల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించారు. రాత్రి జీజీహెచ్లోనే బసచేశారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. -
పురుగుల అన్నం పెడుతున్నారు..
సాక్షి, కొమ్మాది(భీమిలి): ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు మంచాన పడ్డారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అదే తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది మైత్రీభవన్లోని శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ నాల్గో వార్డు కొమ్మాదిలోని మైత్రీభవన్లో శ్రీ చైతన్య మహిళా జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో గురువారం రాత్రి విద్యార్థినులు తినే ఆహారం విషతుల్యం కావడంతో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కొంత మందిని, శుక్రవారం మరికొందరిని దగ్గరలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. కళాశాలలో పెడుతున్న భోజనం నాణ్యత లేకపోవడం, పురుగులు పట్టిన అన్నం వండి పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పశ్నిస్తే యాజమాన్యం భయబ్రాంతులకు గురి చేస్తోందని, తప్పని పరిస్థితుల్లో ఈ భోజనం తినడంతో అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు తెలిపారు. ఈ సమాచారాన్ని తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, పిల్లలకు బాగులేకుంటే కనీసం ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పిల్లలు బాగా నీరసించిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారని, వీరికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కళాశాల ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. అన్నంలో పురుగులు.. వినాయకచవితి నుంచి పాఠశాల యాజమాన్యం ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేద ని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల నుంచి తినే అన్నంలో పురుగులు వస్తున్నాయ ని, గురువారం రాత్రి పెట్టిన భోజనంలో కూడా పురుగులు ఉన్నాయన్నారు. ఈ ఆహారం తినే ఫుడ్ పాయిజన్ అయిందని, వీటిని తిన్న 70 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. శుక్రవారం ఉదయం అందరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించి.. వెంటనే కళాశాలకు తీసుకుని వచ్చేసారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే పరీక్షలకు పంపించమని సిబ్బంది బెదిరించారని వాపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం.. తమ పిల్లల భవిష్యత్ కోసం లక్షలు వెచ్చించి ఈ కళాశాలలో చేర్పించామని, తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే 70 మంది అస్వస్థతకు కారణమైందన్నారు. ఇక్కడ తాగేందుకు మంచినీరు కూడా లేదన్నారు. కనీసం తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఇంత నిర్లక్ష్యమా.. మా పిల్లల బంగారు భవిష్యత్ కోసం లక్షల్లో ఫీజులు వెచ్చించి కళాశాలకు పంపిస్తే.. చదువు దేవుడెరుగు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టరా. వారం రోజులుగా పురుగులు అన్నం తిని మా అమ్మాయి అస్వస్థతకు గురైంది. సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. – మధుబాబు, ఓ విద్యార్థిని తండ్రి, శ్రీకాకుళం అన్నం తినలేకపోతున్నాం. ఇక్కడ మాకు పెడుతున్న భోజనం తినలేకపోతున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదని బెదిరిస్తున్నారు. ఇక్కడ భోజనం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యాం. – హేమ, అస్వస్థతకు గురైన విద్యార్ధిని. పునరావృతం కాకుండా చూసుకుంటాం.. కళాశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థత గురికావడం వాస్తవమే. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. – బాలసూర్య, ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల అంతా రహస్యంగానే... నాలుగు రోజుల నుంచి విద్యార్థినులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు తెలిసింది. అయితే గురువారం రాత్రి తిన్న ఆహారం విషతుల్యమై 70 మంది మంచాన పడ్డారు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన యాజమాన్యం.. అందరినీ ఒకే ఆస్పత్రికి కాకుండా పది మంది చొప్పున పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వెంటనే అందరినీ మళ్లీ కళాశాలకు తీసుకొచ్చేసింది. వసూళ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాల వసతిగృహంలో బుధవారం రాత్రి విద్యార్థులకు బెండకాయ కూర, పప్పుతో భోజనం అందించారు. వసతిగృహంలో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో బయట నుంచి నీళ్లు తెప్పిం చారు. భోజనం చేసిన విద్యార్థులు ఆ నీళ్లు తాగారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వసతిగృహ వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆ మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రక్తపు విరేచనాలు.. మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడకపోగా ఒకరిద్దరు రక్తపు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసున్న ఎంఈవో మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవో ముజాఫర్ ఖాద్రి, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఈవోపీఆర్డీ ఎన్.వివేక్రాం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఇందుకు గల కారణాలను ప్రిన్సిపాల్ వేణుగోపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే.. కలుషిత నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కాగా పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో వసతిగృహ అధికారులు పట్టణంలోని ఓ ప్లాంట్ నుంచి మినరల్ వాటర్ తెప్పించారు. మినరల్ వాటర్ తాగినా విద్యార్థులకు ఇలా జరగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని, విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల కోరుతున్నారు. -
కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్, కొండాపూర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ హాస్టల్లో గతవారం కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగర్ కాలనీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ మర్నాడే కలుషిత ఆహారం తిని 32 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థునులు ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో ఉపాధిహామీ కోర్సుల్లో శిక్షణ కోసం చేరిన నిరుద్యోగులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నగరంలో ఇటీవల నగరంలో రోజూ ఏదో ఒక వసతిగృహంలో ఆహారం కలుషితమవుతూనే ఉంది. ఫుడ్కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా తరచూ పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయా వసతి వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల ఏర్పాటుకు స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేని భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం, మార్కెట్లో తక్కువ ధరకు లభించే కూరలు, మాంసం, నూనెలు వినియోగిస్తుండటంతో ఆహారం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వసతి గృహాలపై నియంత్రణ ఏదీ? గ్రేటర్ పరిధిలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, వాటికి చెందిన హాస్టళ్లు 500 పైగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు 100 వరకు ఉన్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అనుబంధంగా మరో 100 హాస్టళ్లు నడుస్తున్నాయి. వీటికితోడు వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధ మవుతున్న అనేక మంది నిరుద్యోగులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్, రామంతాపూర్, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో లెక్కలేనన్ని హాస్టళ్లు ఉన్నాయి. చాలా మంది రద్దీ ప్రాంతాల్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, బోయ్స్, లేడీస్ హాస్టళ్లను ఓపెన్ చేస్తున్నారు. ఒక్కో గదిలో ఐదు నుంచి పది మందికి వసతి కల్పిస్తున్నారు. ఇక హోటళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ గల్లీలోకి చూసినా ఏదో ఒక హో టల్ కన్పిస్తుంది. రుచికరమైన నాణ్యమైన ఆహారంతో పాటు అహ్లాదకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఆయా వసతి గృహాల్లోని వంటగదుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పుచ్చి, పాడైపోయిన కూరగాయలు, కుళ్లిన మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నారు. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని కిచిడీ రూపంలో ఉదయం టిఫిన్గా పెడుతున్నారు. కూరలు, పప్పు, సాంబార్ సహా ఇతర వంటలను వేడిచేసి మళ్లీ వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరంతో తీవ్ర అవస్వస్థతకు గురై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలపై నియంత్రణ లేకపోవడం, అధికారులు వీటిని తనిఖీ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను పరిశీలించకపోవడం వల్ల నిర్వహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అనుకోని విపత్తు లు, అగ్ని ప్రమాదాలు జరిగితే..ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాదు నగరంలోని వసతి గృహాల్లో 90 శాతం భవ నాలకు ఫైర్ సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరంలేదు. పని చేయని ‘మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’.. కల్తీ ఆహార పదార్థాల భారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ఐపీఎంలో మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్ను ప్రారంభిం చింది. నారాయణగూడ పరిసర ప్రాంతాలు సహా కుత్బుల్లాపూర్లో పర్యటించి హోటళ్లలో ఆహార పదార్థాల నమూనాలు సేకరించి...పరీక్షల పేరుతో హడావుడి చేసింది. ఆ తర్వాత విస్మరించింది. ప్రస్తుతం ఈ వాహనం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఐపీఎం అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాల్సిన ఈ మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్ వెహికిల్ ప్రస్తుతం కేవలం పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకే పరిమితమైంది. కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రుల్లో చేసిన బాధితుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప...జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
శ్రీచైతన్యలో పుడ్ పాయిజన్..40మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : శ్రీచైతన్య కళాశాలలో పుడ్ పాయిజన్ జరిగి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కొండాపూర్లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో వంట చేసి అక్కడ నుంచి మాదాపూర్లో ఉన్న హాస్టల్కు తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకొని వెళ్తున్నారు. కాగా పుడ్ పాయిజన్ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చుతుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపిస్తున్నారు. పుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హాస్టల్లోని మిగతా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
కలుషిత ఆహారం తిన్నందుకు....
గచ్చిబౌలి:శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..గత శనివారం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలకు చెందిన మాదాపూర్, కొండాపూర్ బ్రాంచ్లలో పులిహోర, కొబ్బరి రైస్ తిని దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థులను కిమ్స్, తదితర ఆస్పత్రులకు తరలించిన యాజమాన్యం వారికి వైద్య చికిత్సలు అందించినట్లు తెలిసింది. ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కొందరిని ఇళ్లకు పంపించారు. మరికొందరు నీరసంగా ఉండటంతో మంగళవారం కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడినప్పటికీ కొందరు నిలదీయగా విద్యార్థులు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందడంతో శేరిలింగంపల్లి హెల్త్ అసిస్టెంట్ పాండు కొండాపూర్లోని శ్రీచైతన్య కాలేజీని సందర్శించగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని ప్రిన్సిపాల్ శ్రీదేవి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. -
వైఎంసీఏలో ఫుడ్ పాయిజన్
రాంగోపాల్పేట్: కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సికింద్రాబాద్ వైఎంసీఏలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో బ్లూ అనే సంస్థ గత మూడు నెలలుగా నర్సింగ్, సోలార్ కోర్సుల్లో 50 మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. వారికి అక్కడే భోజనం, బస ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పూజా, వంశీ, సరస్వతి, యాదమ్మ, దివ్య, నాగలక్ష్మి, ప్రియదర్శిని, భువనేశ్వరి అనే ఎనిమిది మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో నిర్వాహకులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
కలుషిత కాటు
విజయనగర్ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో సోమవారం ఉదయం కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులంతా కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం లేదా మంచినీళ్లు కలుషితమై ఉండొచ్చని భావిస్తున్నారు. నాంపల్లి: మైనార్టీ గురుకుల విద్యాలయంలో కలుíషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సోమవారం ఉదయం విజయనగర్ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకున్నారు. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. విషయాన్ని తెలుసుకున్న వసతిగృహం సిబ్బంది హుటాహుటిన సమీపంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కోలుకుంటున్నారని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. మరో 36 గంటల పాటు ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు అందజేస్తామన్నారు. విద్యార్థుల వయస్సు 10–12 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పారు. విషయం తెలుసుకున్న నాంపల్లి నియోజకవ్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ నిలోఫర్కు వచ్చివిద్యార్థులను పరామర్శించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నట్లు తెలిపారు.ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని, విద్యార్థులు స్వీకరించిన ఆహారంలో లోపమా లేక మంచినీళ్లలోనా అనే అంశంపై చర్చిస్తామని తెలిపారు.