బిహార్ లో విషాదం చోటు చేసుకుంది. మధుబని నుంచి సీతామండికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ లభించలేదు. పాట్నాకు 50 కి.మీ దూరంలో ఉన్న మధుబని జిల్లా బానపట్టి బసాకా చౌక్ లో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.