తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. అమ్మ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తానని, త్వరలోనే కొత్త పార్టీ పెడతానని తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నారు.