కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ నిర్ణయాన్ని ‘వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’గా అభివర్ణించారు. ఈ అంశంపై వారం రోజులుగా అట్టుడుకుతున్న రాజ్యసభలో గురువారం మాజీ ప్రధాని మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2 శాతం తగ్గుతుందన్నారు. ప్రధాని మోదీ సభకు హాజరవటంతో.. ప్రశ్నోత్తరాలను ఎత్తేసి నోట్లరద్దుపై చర్చకు అధికార, విపక్షాలు అంగీకరించాయి. మోదీ కూడా చర్చలో పాల్గొంటారని జైట్లీ సభకు వెల్లడించారు. దీంతో 12 నుంచి ఒంటిగంట మధ్య ప్రశ్నోత్తరాల్లో మన్మోహన్ ప్రసంగించారు.
Nov 25 2016 7:16 AM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement