రత్యేక తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశంలో వెల్లడించినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శనివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై త్వరలో సీడబ్ల్యూసీ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.