ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. శ్రీనివాసన్కు ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే నమ్మేదెలాగని ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారని.. ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఫ్రాంచైజీకి ప్రిన్సిపల్గా ఉన్నారని తెలిపింది. ఇలాంటి శ్రీనివాసన్.. అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని, ఆట స్వచ్ఛతను కాపాడాల్సింది ఆయనేనని సుప్రీంకోర్టు తెలిపింది.