వర్దా తుపానుతో ఛిన్నాభిన్నం అయిన తమిళనాడును మరో ముప్పు వెంటాడుతోంది. రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం ఒక్కసారిగా విరుచుకుపడిన వర్దా తుపానుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లను అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ తుపాను దెబ్బకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 మంది ప్రాణాలు విడిచారు. తుపాను దెబ్బకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్ల మీద వాహనాలు గాలిలో గింగిరాలు తిరిగాయి.